Monday 4 July 2016

విభాత మిత్ర


తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడము

కింది పాత ఇంగ్లీషు సామెత తెలియని వారెవ్వరు ?
" డబ్బు పోతే ఏమీ పోయినట్లు కాదు ! ఆరోగ్యం పోతే ఏదో కొంత పోయినట్లు !! శీలము పోతే సర్వమూ 

పోయినట్లే!!!"

కొన్ని వందల యేళ్ళ కిందట , పరదేశస్తులు భారత్ పై దాడులు చేసీ , ఇక్కడ దొంగ వర్తకము చేసీ ఎంత


దోచుకోవాలో అంతా దోచుకున్నారు.



కాన భారతీయుల మనో స్థైర్యాన్నీ , వారి ఆత్మ సౌందర్యాన్నీ , చిత్త ప్రశాంతతనీ ఏ మాత్రమూ దోచుకోలేక 
పోయినారు.
చూచుటకు కంటికింపుగా ఉన్న భారతీయుల సంస్కృతి వారికి కంటగింపుగా తయారైంది. భారతీయుల

మనోదార్ఢ్యానికీ , వారి గొప్ప శీల సంపదకూ 
కారణాలను వెదకుట మొదలు పెట్టినారు. వారికి తేలినదేమంటే , అటువంటి గొప్ప వ్యక్తిత్వాలు కలుగుటకు

కారణము , వారి విద్యా విధానమే ,ఆనాటి 
యూరోపులోని స్కూళ్ళ కన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో భారత్ లో గురుకులాలున్నాయనీ , వాటిలో


వేదాధ్యయనము విజృంభించి నడుస్తుండడమే ననీ! 
ఎప్పుడైతే వారికి ఇది అర్థమైనదో , ఆ గురుకులములను మూయించి , వాటి స్థానములోనే ఇంగ్లీషు విద్యా

విధానము మొదలుపెట్టినారు. సనాతన 
ధర్మానికి గొప్ప గ్లాని అక్కడే మొదలయింది. భారతీయులు తమ భారతీయతను కోల్పోవడము మొదలు

పెట్టినారు. ధర్మహాని ఇతరులు మొదలు పెట్టితే , 
దానిని ఎదుర్కొనుట పోయి , మనలోనే దారితప్పిన కొందరుదానిని పెంచి పోషిస్తున్నారు.
ఒక్క సనాతన ధర్మములోనే అంత గొప్పదనముందా ? అది లేకపోతే నాశనము తప్పదా ? దీనికి సమాధానము ’

అవును ’ అని కేవలము భారతీయులు 
మాత్రమే చెప్పలేదు , విదేశీయులు కూడా అనేకులు చెప్పారు. అది కూడా వారు సనాతన ధర్మాన్ని

బలపరుస్తున్నాము అనే స్పృహ ఉండి చెప్పలేదు. 
తమ పరిశోధనల ఫలితాన్ని తామేదో సాధించినట్లు భావించి చెప్పినారు. వారు చేసిన పరిశోధనలేమిటి ? వారు

చెప్పిందేమిటి ?
మంత్రాలకు చింతకాయలు రాలతాయా ? అనేది పాత మాట. చింతకాయలే కాదు , కావలసినవన్నీ రాలతాయి అనేది ఇప్పటి మాట. " ఏదీ , 
చింతకాయలు రాల్చి చూపండి ? " అని అడిగే వారు , మంత్రాలంటే ఏవో రాళ్ళు అనో , కత్తులూ కఠార్లు అనో

అనుకొనే మూర్ఖత్వం లో ఉంటారు. మంత్రాలు 
పని చేసే పద్దతి వేరే.
కొన్ని ఉదాహరణలు చెపుతాను
ఇవి కొందరి జీవితములో జరిగినవి
మా గురువుగారు , కొత్తగా శృంగేరీ వేదపాఠశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడు , జగద్గురువులు గా ఉన్నవారు


శ్రీ శ్రీ అభినవ విద్యా తీర్థులవారు. వారు 
ఒకసారి హిమాలయ యాత్ర చేసివచ్చి అస్వస్థులైనారు. అప్పుడు , అక్కడే ఉన్న ఇప్పటి జగద్గురువులు , శ్రీ శ్రీ

భారతీ తీర్థ స్వామివారు , ఇప్పటి మా 
గురువుగారిని , " ఇరవై ఒక్క రోజులు జగద్గురువుల వద్ద కూర్చొని మంత్రపఠనము చెయ్యి " అని కొన్ని

మంత్రాలను సూచించినారు. జగద్గురువుల 
నియమాల ప్రకారము , వారు అన్ని సమయాలలోనూ , అందరికీ కనపడరు. వారొక మెట్లపై కూర్చుంటే , పక్కనే

ఉన్న గది లోని కిటికీ వద్ద కూర్చొని మా 
గురువుగారు మంత్రపఠనము చేసేవారు. చూస్తూ ఉండగానే జగద్గురువుల ఆరోగ్యం పూర్తిగా బాగైంది. అప్పుడు , శ్రీ
శ్రీ భారతీ తీర్థుల వారు , మా 
గురువుగారితో , " వేదాన్ని ఒక్కదాన్నీ నమ్ముకో , ఏదైనా సాధించ వచ్చు " అని చెప్పినారు. అప్పటికి మా

గురువుగారు పేదరికములో ఉన్నారు. అంతే 
గాక , పాఠము కూడా పెద్దగా కాలేదు. జీవితములో సాధించవలసిన ఆశయాలైతే చాలా ఉన్నాయి. వారు ఆ ఒక్క

మాటను గట్టిగా పట్టుకున్నారు
ఈనాడు వారికి ప్రపంచమంతా శిష్యులున్నారు. ఒక ట్రస్టును మొదలుపెట్టి , గొప్ప కార్యాలను సాధిస్తున్నారు.

ఆయనకు గౌరవము ఇవ్వనివారు లేరు. ఏ 
కార్యమైనా సాధించి పెట్టే శిష్యులున్నారు.
ఇక రెండో ఉదాహరణ , ఇక్కడ బెంగుళూరిలో శ్రీ బి ఎన్ వి సుబ్రహ్మణ్యం గారని , గొప్ప ధర్మ ప్రచారకులున్నారు.

వారు బెంగుళూరికి వచ్చినపుడు ఖాళీ 
చేతులతో వచ్చినారు. ఇప్పుడు ఒక వేద పాఠశాలను ఎప్పుడూ యాభై మందికి తగ్గని విద్యార్థులతో , గత ముప్ఫై

అయిదేళ్ళనుండీ నడుపుతున్నారు. 
విద్యార్థుల సర్వ ఖర్చులూ వీరే భరిస్తారు. ఒక ఇంజనీరింగు కళాశాల , కొన్ని ఫ్యాక్టరీలు ఇలాగ ఎన్నెన్నో

ఉన్నాయి. వారికి రాష్ట్రం లోనూ , దేశంలోనూ 
గొప్పపేరే గాక , ఆ ప్రభుత్వాలనుండీ ఎన్నో బిరుదులు , పురస్కారాలు అందినాయి. ఈ మధ్యనే జగద్గురువులు

వారిని " ధర్మ ప్రవర " బిరుదుతో 
సత్కరించారు. వారు అఖిల కర్నాటక బ్రాహ్మణ మహాసభ కు కొన్నేళ్ళనుండీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా

ఎన్నికవుతూనే ఉన్నారు. వారి మంత్రం ఏమిటంటే ,
" ఏ పని చేసినా తప్పక విజయము సాధించుటకు ఒక సులువైన చిట్కా ఉంది. చేసేపని ధర్మబద్ధము ,

నిస్వార్థమైనదీ అయితే చాలు " ఎంత చిన్న 
మాటలో ఎంత శక్తి ఉంది !!
ఇంకా అంటారు , " డబ్బుకోసము మనము వెతుక్కుంటూ పోవడము కాదు , డబ్బే మనల్ని వెతుక్కుంటూ

రావాలి. ఇది ,తపస్సు , అనుష్ఠానములు , 
స్వాధ్యాయములతోనే సాధ్యము. ధర్మ బద్ధమైన ఒక చట్రాన్ని నీ చుట్టూ నిర్మించుకో , దాన్ని ఎప్పటికీ దాటి

రావద్దు. విజయము నీదే "
లెక్కలేనన్ని విజయాలను సాధించిన వారు చెప్పిన మాటకు విలువ చాలా ఎక్కువ కదా !
సరే , ఇవి కేవలము వ్యక్తిగత విజయాలు , ఉదాహరణలూ అనుకుందాము
శాస్త్రజ్ఞుల పరిశోధనలో ’ ఓజోన్ లేయర్ ’ కరగిపోయిన చోట మరలా అది మునుపటి వలె కప్పి ఉండాలంటే ఒక్క

మంత్రపఠనము చేతనే అది సాధ్యము. 
మంత్రపఠనమున్న చోట ఈ సమస్య కనిపించుటలేదు ’ అని శెలవిచ్చినారు. ఇది చాలామందికి తెలిసియే

ఉండును. నెట్ లో వెతికితే దొరకును. అంతేగాక , 
మొన్న నేను చెప్పినట్లు , ’ ఔపాసనా హోమ ధూమము ’ వలన పర్యావరణము క్షేమముగా ఉండుననీ , భోపాల్

గ్యాస్ వంటి దుర్ఘటనలు కూడా ఏమీ 
చేయలేవనీ ఋజువైంది. యజ్ఞములూ యాగములూ చేయగనే వర్షములు కురియుట మనకు కొత్తేమీ కాదు.
ఇన్నిన్ని ప్రయోజనాలను చేకూర్చే సనాతన ధర్మము అనే చెట్టుకిందికి చేరినవారు ఎంతటి అదృష్టవంతులు !!

చెట్టుకింద చేరగనే సరికాదు , అనుసరించి 
పాటించాలి. ఇతరమతాల వారి దాడికి వన్నె తగ్గుతున్న సనాతన ధర్మాని తిరిగి పూర్వపు స్థితికి తేవడానికి

నడుము బిగించాలి . కొందరు ఏవోకొన్ని 
సమస్యల వల్ల , ’ కంటిలో నలుసు పడితే కనుగుడ్డునే పీకివేసుకొన్నట్లు " , అపోహల మూలముగా ధర్మాన్ని

విడచి వెళ్ళినారు.
సనాతన ధర్మపు గొప్పదనము , ఇతర ధర్మములను గౌరవించుట , సహించుట లోనే తెలుస్తున్నది. ఈనాడు

భారత దేశములో సర్వ మతములవారు 
ఇతర "" దేశములతో పోలిస్తే "" చాలా భాగ్యవంతులు. చీకూ చింతలు లేకుండా ఉన్నారు. కానీ మత మౌఢ్యము

తో కొందరు సనాతన ధర్మపు వేళ్ళను 
పీకివేయాలని కంకణ బద్ధులై ఉన్నారు. అదే జరిగితే , వారి ఉనికికే ముప్పు. వారి పరిస్థితి ఆ తర్వాత ఏమిటో ,

కొన్ని దేశాలను చూస్తే ఇప్పుడే 
తెలుస్తుంది. కాబట్టి , ఇతర మతాలకు చెందిన మిత్రులారా , మీరు కూర్చున్న కొమ్మను మీరే నరికే ప్రయత్నము

చేయకండి. మీ వేలితో మీకంటిని 
పొడుచుకోకండి. దారితప్పిన వారు మరలా సరైన దారికి రండి. ఔనన్నా కాదన్నా అందులోనే మీ అభ్యుదయము.

No comments:

Post a Comment