Wednesday 27 July 2022

ఒకే వస్తువే ఒకరికి మేలు ఒకరికి కీడు

 

ఒకే వస్తువే ఒకరికి మేలు ఒకరికి కీడు

ఆయుర్వేద వైద్యశాస్త్రమున తెల్పిన కొన్ని చెట్టు దినుసులు, కొందరికి మంచిని చేకూర్చితే కొందరికి చెడుగును చేకూర్చుతుంది ప్రభుత్వమూ కొన్ని ప్రజోపయోగాకరమగు కార్యక్రమములు చేపట్టితే  ప్రతిపక్షములకది మింగుడు పడదు. పూర్వము ప్రతిపక్షములు కూడా దేశ ప్రగతికి భిన్నముగా ప్రభుత్వము నడచుకొంటే తమ సుతర్కముతో వారి ఆలోచనలను నియంత్రించేవారు. నేడు ఆ స్థితి లేదు. కరడు కప్పిన స్వార్థమే కరాళ నృత్యము చేయుచున్నది. నేను వ్రాసిన ఈ పద్యమును గమనించండి.

మంచిని ఎంచలేరు మది, మానక గాంతురు లేని తప్పులన్

కొంచెము కూడయున్ మదిన కోరరు దేశ ప్రయోజనమ్ములన్

ముంచగా చూచుటే తమకు ముఖ్య ప్రణాళిక యంచు ఎప్పుడున్

వంచన తప్ప దేశమును వర్ధిల జేయరు శత్రు పక్షముల్

ఇది నేటి రాజకీయ స్థితికి దర్పణముగా .భావించుకొనవచ్చును. అన్వయము పాఠకుల ఊహకు వదలి పెడుతున్నాను. నాకు వలసిన మూలమును సౌమిత్రి జటప్రోలు గారు పంపిన సందేశము నుండి గ్రహించి అందజేయుచున్నాను. వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు ఇందుమూలముగా తెలుపుకొనుచున్నాను.

ఆయుర్వేద వైద్య శాస్త్రములో, #తేనెను ఔషధంగా భావిస్తారు. నేను సేకరించినది ఈ దిగువన మీముందు ఉంచుచున్నాను.

అయితే ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే #కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది!

అంటే మనుషులకు ఔషధము అయిన తేనె కుక్కలకు విషమవుతుంది.

ఆయుర్వేద వైద్య శాస్త్రములో స్వచ్ఛమైన #దేశీయ ఆవునెయ్యిని  ఔషధ లక్షణాల సమాహారముగా పరిగణిస్తారు!

కానీ ఆశ్చర్యకర విషయమేమిటంటే, మురికిలో సంతోషంగా ఉండే #ఈగ ఎన్నటికీ స్వచ్ఛమైన దేశీయ నెయ్యిని రుచి చూడదు!పొరపాటున, రుచి చూసిందా, అది వెంటనే అక్కడే ప్రాణాలను వదులుతుంది.

 ఆయుర్వేదములో, #మిశ్రి అంటే కండచక్కెర ఔషధంగా మరియు ఉత్తమ మిఠాయిగా కూడా పరిగణించబడుతుంది.

 అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కండ చక్కెర #గాడిదకు తినిపిస్తే, దానికది ప్రాణాంతకమౌతుంది.  

అందుకే కండచక్కెర తినుబండారములు గాడిద  ఎన్నటికీ తినదు.

 వేప చెట్టుపై గల వేప పండ్లతో అందలి విత్తనములతో అనేక వ్యాధులను నయము చేయ వచ్చును.  ఆయుర్వేదం దీనిని ఉత్తమ ఔషధముగా పరిగణించుతారు..

 అయితే వేప చెట్టు మీద నివసించే కాకి పగలయినా, రాత్రయినా వేపపళ్ళను  తింటే, దాని మరణం ఖాయం.!అంటే ఈ భూమిపై ఒకరికి మంచి అయినది వేరొకరికి చెడుగు కావచ్చును. ఈ భూమిపై ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ సందర్భములో ఒక 40 సంవత్సరముల క్రితము వ్రాసిన పాట గుర్తుకొస్తున్నది.

ఎవరు నీవారు ఎవరు పెరవారు

తెలుసుకొవాలిరా తెలిసీ మసలుకోవాలిరా

వీడన తోడౌ నీడకు కూడా

వెలుగంటేనే వెరపు కదా

చీకటిలో మతుమాయము కాదా

నీచేవయె నీ చెలువు కదా

నెత్తురు పంచుకు పుట్టిన నలతే

చెరూపు చేయగా నీకెపుడు

కోడల కోణాల పండిన మాకుల

మూలికలే నీ అండకదా

అమరుల జేసే అమృతమే మరి

రాహువు పాలిటి మిత్తి కదా

హాలాహలమే ఆభారణముగా

శివుని గళములో నిలచె కదా

స్వస్తి

Tuesday 26 July 2022

నా మనోగతము

 

నా మనోగతము

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post_26.html

ఒక విషయమును క్షుణ్ణముగా పరిశీలించి సాటి సహజాతులకు తెలుపుట నాలాంటివానికి సామాన్యమైన పని కాదు. తెలిసినది తెలుపక పోవుట కూడా పాపమే! అసలు 'పాపము' అన్న మాటను ప్రక్కన పెట్టినా విజ్ఞానము అన్నది వీధి దీపము వంటిది. వెలిగించిన వానికి ఆ వీధితోను దీపము తోనూ పని ఉండదు. అయినా వెలిగించి తన బాధ్యత నిర్వర్తించుతాడు. ఆ వెలుతురును సాటి మనుషులు ఉపయోగించుకొంటే అతడు సంతోషించుతాడు. నిజానికి వారిద్వారా అతనికి ఏమీ ఒరగదు.

స్థూలముగా నేటి సమాజ తత్వమును నేను వ్రాసిన ఈ రెండు పద్యములలో మీ ముందుంచుచున్నాను.

ఊరక ఏది వచ్చినను ఒక్కరు కూడను లేక్కచేయరా

కారణ మేమిటన్న తమ కైనటువంటిది సొమ్ము సుంతయున్

చేరదు ఇచ్చువానికిని చింతన చేయరు అందుచేతనే

తేరగ ఏమి ఇచ్చినను తీసుకు పోవక గౌరవింతురే

విత్తమెవ్విధి తనదైన విలువ మార్చు

విద్య అటుగాక వ్యక్తికి విలువ పెంచు

నేరమిని వీడి నేర్మితో నిపుణ మతులు

నిజము నరయంగ గలరులే నిక్కముగను

 నిజానికి ఆస్యగ్రంధి లోని నా వ్రాతలకు మీ Likes కాదు కావలసినది. దానిని నిర్లక్ష్యము చేయక చదవటం కావాలి. మీరు చదివినట్లు గుర్తుగా ఒక చిన్నమాట Comment Box లో వ్రాస్తే చదివిన వ్యక్తి ఎవరు అని తెలుసుకొనే అవకాశముంటుంది.  యువత ఈ దేశము పై, ఈ దేశ చరిత్రపై, అనుపమ మేదావులగు మన పూర్వీకులపై అవగాహన పెంచుకోవలెనన్నదే నా తపన అంతా!

చదివిన పిదప 'బాగుంది' అని ఒక్కమాట వ్రాసినా అది మిగతవారి కళ్ళలో పడుతుంది. వారుకూడా చదివే అవకాశము ఏర్పడుతుంది. Comment అన్నది హనుమంతుని తోక లాంటిది . అది ఎంతయినా పెరుగుతుంది తానూ కాలకుండా శత్రువుల రాజదానికేనిప్పుపెట్టగలుగుతుంది. సంపూర్ణ విషయావగాహన కలిగినవాడే తన వాడముతో శత్రువుల అపప్రథలను ఖండించగలడు.

నేర్చినట్టివాడు నెగడు పోలిక జూడ

ధర్మ మార్గ గతుల దారి జూపు

దానినార్పజూచు దాష్టీకులను గాల్చు

రామమొహనుక్తి రమ్య సూక్తి

అందువల్ల నేర్చుకొనుట అంటే ‘జ్ఞానము’ మన సందర్భములో విషయ పరిజ్ఞానము కలిగినపుడే మన ధర్మమును తెగడే వారి నోరు, మన వాదముతో మూయించగలము.

పూనుకొనితెచ్చెదము పునర్వైభవము

పూనికన తెలుసుకొని పూర్వ వైభవము

హిమనగధృవముపై ఎగురవేసేదము

జాతీయ ధ్వజ యుక్త జయకేతనమ్ము

స్వస్తి.

Thursday 21 July 2022

కొనకుండా నవ్వుకొనండి - Irritating Questions and Intelligent Answers తెలివయిన ప్రశ్నలు - తేలిక సమాధానాలు

 

Irritating Questions and Intelligent Answers

https://cherukuramamohan.blogspot.com/2022/07/irritating-questions-and-intelligent.html

Question : How can you drop a raw egg onto a concrete floor

Without cracking it?

Answer: Concrete floors are very hard to crack

Q: If it took 8 men 10 hours to build a wall, how long would it take,

4 men to build it.

A: No time at all as it was already built.

Q: If you had three apples and four oranges in one hand and

4 apples and 3 oranges in the other hand. What would you have ?

A: Very large hands.

Q: How can you lift elephant with one hand?

A: No need to lift as Elephants do not have hands.

Q: How can a man be without sleep for 8 days?\

A: No problem at all. He sleeps in the nights.

Q: If you throw a red stone in the blue sea, what it will become?

A: It will get wet and sink into the sea.

Q: What is always coming but never arrives?

A: Tomorrow.

What can you never eat for breakfast?

A; Dinner

Q: What happened when wheel was invented?

A: A revolution.

Q: Bay of Bengal is in which state?

A: Liquid State.

Q: What can one catch that is not thrown?

A: A cold

Q: Well now I ask you 10 easy questions

or one difficult one. Which will you choose?

A: One difficult one Sir.

Q; OK. Then tell me which comes first ‘Day’ or ‘Night”

A: Day Sir.

Q: How?

A: I don’t have any obligation to answer as you promised me to ask only one question which is over.

I conclude this interview with a thought provoking message,

'Don’t ever be angry with your friends, for, at the last moment of our life we remember not the words of our enemies but the silence of our Friends.

కొనకుండా నవ్వుకొనండి.

తెలివయిన ప్రశ్నలు - తేలిక  సమాధానాలు

1.పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు?

 కొత్తల్లుడు ఇంటికి వచ్చినప్పుడు

2.మనము ఎంత ప్రయత్నించి  చదువలేక పోయినా భద్రంగా  దాచుకునేది ఏది?

  డాక్టర్ రాసిచ్చిన ప్రిస్ప్రిక్షన్.

3.”డాక్టర్,డ్రైవర్ “కామెంట్ ప్లీజ్?

  డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే, డ్రైవర్ చేతిలో బస్సెక్కిన అందరి ప్రాణాలు ఉంటాయి.

4.సన్యాసికి,సంసారికి తేడా ఏమిటి?

 ఒకరు పులి చర్మం పై పడుకుంటారు..ఇంకొకరు పులి తోనే పడుకుంటారు.

5.భర్తను భార్య 'మావారు' అని అంటుంది ఎందుకు?

మరి అప్పుడప్పుడు వార్(యుద్ధం) జరిగేది అతని తోనే కాబట్టి.

6.పొలాలు అభివృద్ధి తోబాటూ ఏమవుతాయి?

 ప్లాట్లు అవుతాయి.

7.డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?

 రోగం ఇంత ముదిరిపోయే దాకా ఎందుకున్నారని అడిగితే 'ఆరోగ్య శ్రీ' వర్తిస్తుందని పేషంట్ చెప్పినప్పుడు.

 

SORRY “ అనే పదము చాలా చిత్రంగా  ఉంటుంది...

మనము చెబితే మన వాళ్ళు దగ్గరౌతారు.

అదే  డాక్టర్  చెబితే మనవాళ్ళు మనకు దూరమౌతారు.

 ప్రపంచంలో రెండు అతి ప్రమాదకరమైన మారణాయుధాలు!

1. భార్య కన్నీరు

2. పక్కింటి అమ్మాయి చిరునవ్వు!

మనం తినే ప్రతి మెతుకునూ భగవంతుడు నిర్ణయిస్తాడు . . .

కానీ ఆ మెతుకు. ... బిర్యానీయా.సద్దికూడా అనేది భార్య నిర్ణయిస్తుంది.

ఎన్ని జీయో లాంటి నెట్వర్క్ లు  వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు, బ్రాడ్బాండ్ లు వచ్చినా నలుగురు ఆడవాళ్లు కూర్చొని మాట్లాడుకొంటే generate అయ్యే Data  Transmission Speed.  అందుకోవడం చాల కష్టం.

 

 

 

 

 

 

 

 


Wednesday 6 July 2022

నేటి బ్రాహ్మణ యువత పోకడ

 

నేటి బ్రాహ్మణ యువత పోకడ

https://cherukuramamohan.blogspot.com/2022/07/blog-post.html

నేటి బ్రాహ్మణ యువత పోకడను గూర్చి వ్రాసిన ఈ పద్యమును ఒకసారి చదివి మీ బాధను తెలియబరచేది. తల్లిదండ్రులకు పెంచే తీరుబాటులేదు. పిల్లలకు వినే అలవాటూ లేదు. దిశా నిర్దేశము చేసే నాటి పండితులు నేడు లేరు. సినిమాలు, క్లబ్బులు, పబ్బులు, internet, restaurants, ఆడమగ తేడాలేని friendships, junk food, ఒకటేమిటి బలహీనమైన మనసును ప్రతియోక్కటీ తనవైపు లాగెదే. బ్రాహ్మణుడు రుజువర్తన కలిగినవాడయితే సాటి మనుషులకు, సమాజానికీ చెప్పగలుగుతాడు.

నాకు తెలుసు. వెంటనే 'ఆఁ ఈ కాలము చెబితే ఎవరు వింటారండీ' అన్న మాట వస్తుంది. మనము చెప్పకుండానే 'ఎవరు వింటారు అంటే ఎవరు వింటారు. 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ' ఆరంభింపరు నీచమానవులు...'అన్న నానుడులు మీకు తెలిసినవే కదా!

ఒకరి గుర్తింపు మనకు అవసరములేదు. ఆత్మ తృప్తి ఒకటి కలిగితే ఆరోగ్యముగా ఉండవచ్చును.

ఈ వాస్తవమును నీళ్ళు నిండిన కళ్ళతో మీ ముందుంచుచున్నాను.

ఉపనైన కార్యమ్ములొనరించుటయెగాని

జంధ్యముల్ గూటమ్ము జతను గూడె

భుజము పై జంధ్యంపు ప్రోవులుండినగూడ

సంధ్య వార్చుట మలి సంధ్య జేరె

మంత్రముల్ గొణుగుట మాత్రముండినగూడ

మనసంత మగువలే మసలుచుండె

తర్పణంబులకెల్ల తర్పణము గావించి

తనదైన సుఖముకై తపన బడియెఁ

        రెంటికింజెడు రేవడ రీతి గాను

        నడచుచుండగ బ్రాహ్మణ నవత యువత

         నలువ తలలకు నెనరుతో నయముగాను

         అమృతాంజన మునుబూని యలదె వాణి

 

ఉపనయనమయ్యీ జంధ్యములను గూటాలకు తగిలించినారు. ఒకవేళ అది వున్నా సంధ్యచేయుట మరచినారు. అది చేస్తూవున్నా మనసు మాత్రము మగువలపైనే తిరుగుతూ వుంటుంది. ఇక పితృ తర్పనముల విషయమునకు వస్తే తర్పణాలకే తర్పణము వదలినారు. అంటే అట్లాంటిది ఒకటి ఉందని కూడా మరచిపోయినారు.

ఈ విధముగా వుండే బ్రాహ్మణ యువతను చూసి బ్రహ్మదేవునికి తల నొస్తూవుంటే సరస్వతీ దేవి

తప్పు ఎవరిది అంటే

నరవరా నీచే నాచే

వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్

ధర చేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

ఏనాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మా పని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగంభట్టూ

ఈ రెండు పద్యముల భావమే సమాధానము.

ఒక జాడ్యానికి పల్లెటూరు, పట్టణము అన్న తేడా ఉండదు. అది అంటుకొన్నదంటే వదిలించే మార్గము తప్ప అన్యదా ఆలోచించి ప్రయోజనము లేదు. కారణాలేవయినా దానిని రూపు మాపే ప్రయత్నమూ ఇపుడు చేయవలసినది.

ఇక Time లేదు అన్నది తర్కమునకు నిలువదు. మనము దానిని అనుసరించవలసిందే. అది మనలను అనుసరించదు. మనకు పురీష శౌచములకు, ఇష్టపడితే దంత దావనమునకు, స్నానమునకు, తప్పనిసరిగా భోజనమునకు, సినిమాలు షికార్లు అన్నింటికీ Time వుంటుంది. సంధ్యావందనమునకు మాత్రము ఉండదు. Sonti Ganesh చెప్పినట్లు ముంద్ఫ్హు పర్షేచనము, (ఆపోశనము - పూర్వ ఉత్తర) చేయుట తో మొదలు పెట్టవచ్చును. కనీసము అర్ఘ్యము వదలి గాయత్రీ మంత్రమును ఉపాసించవచ్చును. సూర్యని కిరణము భూమిని చేరుటకు 8ని.20 సె. పడుతుంది. మరి గాయత్రీ మాత వెలుగు మనపై ఎంతకాలము పడుతుందో గమనించండి. అసలు వెలుగు పడాలంటే మాతను అనుష్టించి ప్రసన్నము చేసుకొంటేనే కదా! మంత్రజపము ఒక నిర్ణీత ప్రదేశమునకు ప్రయాణము వంటిది. మనము ఎంత దూరము నడుస్తామో ఆ దూరము మొదటినుండి తిరిగీ నడుబ్వనవసరము ఉండదని ఆర్యవాక్కు'శ్రేయాంసి బహు విఘ్నాని' అంటారు మరి దానిని త్రోసి రాజని 'కృషితో నాస్తి దుర్భిక్షం...' ను ఆశ్రయించవలసి వస్తుంది.

స్వస్తి.