Sunday 25 September 2016

లౌకిక వాదము (Secularism)

లౌకిక వాదము (Secularism)

లౌకికము అంటే లోకమునకు సంబంధించినది అని నాకు తెలిసిన అర్థము. మన వేదశాస్త్రపురాణేతిహాసాల ప్రకారము మనకు భూలోకముతో కలిపి  14 లోకములున్నాయి. అందులో 7 అధోలోకములు. మనమున్న భూలోకమునకు పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము మరియు సత్యలోకములు, భూలోకముతో చేర్చి సప్త (7) లోకములౌతాయి. అదేవిధముగా భూలోకమునకు క్రింద అతలలోకము, వితలలోకము, సుతలలోకము, రసాతలలోకము, తలాతలలోకము, మహాతలలోకము, పాతాళములని సప్త (7) అధో లోకములు వున్నాయి. ఇవి కాక లోకము యొక్క దక్షిణ దిశలో మృత్యు (యమ) లోకము, ప్రేతలోకము, నరకలోకము, పిత్రులోకములనే 4 భాగములు వున్నాయని శాస్త్ర వచనము.

అసలు ఈ మాట ఎందుకు చెప్ప వలసి వచ్చినదంటే ఇవి కూడా లోకములే కాబట్టి. మన పురాణాలలో మన పూర్వులు ఇక్కడకు గూడా పోయి వచ్చిన దాఖలాలున్నాయి కాబట్టి. ఇప్పుడిప్పుడే ఈ విషయములను మనము నమ్ముతున్నాము కూడా కాబట్టి. ఇప్పుడు విషయానికొస్తే మన భూలోకమున తప్పించి ఈ లౌకిక వాదము వేరు లోకాలలో వున్నట్లు మన పురాణాలలో చదువము. మన భూలోకమున వున్న ఈ వాదము దేశాలను బట్టి మారుతూ వుంటుంది, పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి అన్నట్లు.

ప్రపంచములో అతి పెద్దవయిన రెండు మతములున్నాయి. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క సృష్టికర్త ఉన్నారు. ఇటు మన ధర్మము నందు గానీ అటు వారి మతములందు గానీ ఈన లౌకిక వాదము యొక్క ప్రస్తాపన రాలేదు. మనది ధర్మము వారిది మతము. పైపెచ్చు ఇది ఎంతో పురాతనమైనది కావున మన పూర్వులు లోకహితమును ఆదర్శముగా గొని ఏ పనినైనా ఏ నియమమునైనా తలపెట్టే వారు. ఈ ధర్మమునందు వెలసిన నీతి మార్గములను తెలిపే ఇన్ని శాస్త్రములు వేరు ఏ దేశములోనూ 20౦౦ సంవత్సరముల క్రితము నుండి ఏర్పడిన మతములలోనూ లేవు. వారి మత గ్రంధమే వారి సర్వస్వము. అందులోని ఏ విషయమును కూడా ఎవరూ ఎదిరించరాదు. మనది ధర్మము అని చెప్పుకొన్నాము కదా!  మరి ధర్మమూ అంటే ఏమిటి? ధర్మము అన్న మాటకు ఈ సందర్భమున ఆచరించు విధానము అన్న అర్థమును తీసుకొనవచ్చును. ఈ ఆచరణ ఒక వ్యక్తి దర్శకత్వములో నడుపబడుతూ లేదు. మిగత రెండు మతములలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవక్త వున్నాడు. వారి నిర్దేశమే వీరికి ఆదేశము. మరి మన ధర్మములో దేవుడే భూమి పైకి దిగి వచ్చి  చెప్పిన భగవద్గీతలో ఈ లౌకిక వాదము లేదు. ఆ రెండు మతములలోనూ వారి, వారి ప్రవక్తలు చెప్పలేదు. వారి ఉపదేశ సారము ఒకటే. దయతో నైనా, ధనముతో దానముతో నైనా సాధ్యము కాకుంటే  లాగున నిర్దాక్షిణ్యముగా వారిని నిర్మూలించు. ఏది ఎట్లయితేనేమి ఈ లౌకిక వాదమును గూర్చి మాత్రము వారు చెప్పలేదు. మరి ఎవరు చెప్పినట్లు?

పై ప్రశ్నకు జవాబు చెప్పుటకు ముందు అసలు SECULAR అంటే అర్థమేమిటో తెలుసుకొందాము. ఈ పదము SAECULUM అన్న LATIN పద జన్యము. ఈ లాటిన్ మాటకు అర్థము ఏమిటంటే ‘ ఒక నిర్ణీత లేక నిర్దేశిత సమయము’ అని అర్థము. కాలాంతరమున దీనిని పారమార్థిక మరియు ప్రాపంచిక తారతమ్యముగా ఒక నూతన నిర్వచనమును ఇచ్చినారు అప్రాచ్యులు. అంటే చర్చికి సంబంధించిన విధివిధానముల నుండి ప్రజా కార్యకలాపములను

వేరుపరచి, ఈ ప్రజలు కొనసాగించే ప్రవృత్తి పరమైన విధులను SECULAR అన్నారు. 19 వ శతాబ్దములో ఈ శబ్దము యొక్క అర్థమును, పాశ్చాత్య విజ్ఞులు మార్చి ధనిక శ్రామిక వర్గ సమన్వయముగా ఒక క్రొత్త భాష్యమును చెప్పినారు. రానురాను ఈ పదము యొక్క అర్థము దేశమును బట్టి, దేశ నాయకుల నిర్దేశమును బట్టి  మారిపోతూ వచ్చింది. ఆ విధముగా మన దేశపు ప్రప్రధమ ప్రధాన మంత్రి యగు , మన ప్రియతమ జవాహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు అల్ప సంఖ్యాకులకు అందులోనూ ముఖ్యముగా క్రైస్తవ ముస్లిం వర్గీయులకు అతిథి సత్కారముల చేయుట అన్న అంతర్లీనమైన భావన మన మనసులలో పాదుకొనునట్లు ఒక నిర్వచనమునిచ్చి, ఒక క్రొత్త అర్థమును ఏర్పరచి, తాను మనకు చేసిన మేలును కలకాలమూ గుర్తుంచుకొను  లాగున చేసి పోయినారు. బహుశా వారిలో వైదిక రక్తము లేదేమో! నిజము దేవునికి ఎరుక. పైన తెలిపిన పదమునకు  మన ప్రియతమ ప్రధాని నెహ్రూ గారు ఆచరణలో చూపించిన అన్వయమునకు ‘అబ్దుల్ ఖాదరు కు అమావాస్య కు’ మరియు ‘తాతాచార్లకు పీర్ల పండుగకు’ ఉన్న సంబంధము వంటిదే!. అంటే సంబంధము లేదు అని అంతరార్థము.

నెహ్రూ గారు ప్రధానిగా వున్నా కాలములో వారిది అంతరంగిక లౌకికము అంటే అది అపారదర్శకము.. అంటే లౌకికము అన్న ముసుగులోపల వారికున్న ఆలోచనలు. అప్పటి దేశ ఉపప్రధాని గృహ మంత్రి అయిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారిది బహిరంగ లౌకికము అంటే పారదర్శక లౌకికము. అందుకే జమ్మూ కాశ్మీరుకు Article 370 పటేలుగారు ఎంత ప్రతిఘటించినా నెహ్రు గారు అమలు పరిపించటము.

అందుకే 1950 లో కాంగ్రెస్ అధ్యక్షా పదవికి పటేల్ పురుషోత్తం దాస్ టాండన్ గారిని నిలబెడితే నెహ్రూ గారు వారికి పోటీగా ఆచార్య కృపలానీ గారిని నిలబెట్టినారు. నెహ్రూ గారు విశ్వ ప్రయత్నము చేసినా టాండన్ గారే గెలిచినారు .భారతీయ సంస్కారము కలిగిన వారు కావున వారు కార్యవర్గములో నెహ్రూ గారికి కమిటీ సభ్యునిగా స్థానమిచ్చినారు.  అటు పిదప ౩ సంవత్సరములకే పటేలుగారు మరణించుటతో నెహ్రూ గారు తమ మానసిక మంత్రం దండము త్రిప్పి టాండన్ వర్గము చేత తమ, తమ పదవులకు రాజీనామా ఇప్పించ గలిగినారు.

ఆంగ్లములోని ఈ వ్యాఖ్యను గమనించండి.

Nehru was considered by the international media as a person who, to quote the words of the Gettysburg Times, “suffered from a monumental inferiority complex.” This resulted in Nehru claiming he was an Englishman, and he displayed the same kind of disdain towards Indian people and culture that the English rulers had displayed.

‘ఏకమేవాద్వితీయంబ్రహ్మ’  అన్న సిద్ధాంతమునకు కట్టుబడి ఇటలీ లోనే సచ్చితానంద మిషన్ స్థాపించిన   Father Anthony Elenjimittam గారు, 1951లో Libertarian అన్న పత్రికకు   editor గా పని చేస్తూ వుండిన వారు తాము 1951లో తాము వ్రాసిన పుస్తకములో ఏమి వ్రాసినారో చూడండి.

Elenjimittam also decried the hypocrisy of Nehru when he wrote that “the veteran Congress leaders, with Pandit Nehru at the top, continue to shout from the housetops in and out of time about their new fad of pseudo-secularism.” This was possibly the first usage of the term ‘pseudo-secularism’ in the context of Indian politics.

1962 చైనా యుద్ధములో భయంకర ఓటమిని మన దేశము చవిజూచుటకు వారు, వారి అనుచరుడు, అంతేవాసి  మరియు నాటి రక్షణ శాఖ మంత్రి కృష్ణమీనన్ గారలు కాదా!      

ఈనాటికీ దేశము దరిద్ర రేఖ వద్ద కొట్టుమిట్టాడుట వారి ఆంతరంగిక అపారదర్శక (అపార+దర్శక అని విడదీయవద్దు,) విధానములవల్ల కాదా!

(ఈ విషయములను అరవింద కుమార్ గారి రచనల నుండి సేకరించినాను.)

స్వతంత్రము వచ్చి 70 సంవత్సరములు కావచ్చినవి. 1947 నాటి నుండి నేటి వరకు ఈ సనాతన ధర్మావలంబుల జననములు ఎంత శాతము తగ్గినవి అల్పసంఖ్యాకుల జననములు ఎంత శాతము పెరిగినవి ఒకసారి గణనాంకములను పరిశీలించితే అర్థమౌతుంది. మరి అల్పసంఖ్యాకులకు ఇచ్చే వసతులు వారి జనాభా పెరుగుదల కోసమా! మరి పేదరికము కోసము అనుకొంటే ఈ దేశమును, ఈదేశ ధర్మమును, ఈ దేశపు మహనీయులను వారి ఆవిష్కరణలను నమ్ముకొని  యున్న వారిలో పేదలు లేరా! మరి ఈ వివక్ష లౌకికమా లేక మాయాలౌకికమా?

తమ పుణ్య క్షేత్రములకు ఆ మతస్తులు పోవుటకు, ఇప్పటి వరకు ముస్లీములకు మాత్రమె వుంది, రాయితీలున్నాయి మరి అత్యంత నిరుపేదలైన మన వారికి ఏ కేదారనాథ్ ,బదరీనాథ్ యాత్రలకు అటువంటి రాయితీలివ్వవచ్చు కదా!

క్రైస్తవులకు వాటికన్, ముస్లీములకు మక్కా వున్నవి కదా! మరి ఆ స్థలములకు హిందువుల ప్రవేశమును అనుమతిస్తారా! అటువంటప్పుడు తిరుమల కొండపై అన్యమతస్థులు ఏ విధముగా ప్రవేశించ గలుగుతూ వున్నారు? కారణము నేను చెప్పగలను. ఆ పోయే వారి పూర్వులు ఈ భూమి పై జన్మించిన వారే! ఈ వైదిక మతమును అవలంబించిన వారే! అందువల్ల  వారి సంతతిని  పరమతస్తులు అని గుర్తించుట కష్టము. అబద్ధములు చెప్పి నమ్మించి, వారు సులభముగా తిరుమల చేరనూవచ్చును. తలచినది చేయనూ వచ్చును.

ఇక ఈ దేశము SECULAR దేశము అని అంటారు. అది ఆవిధముగా ఒకరి చేత ఏదో విధముగా చేయబడినది కానీ ప్రజల అభిమతముతో కాదు. సహనానికి ప్రతీకలైన ఈ సనాతన ధర్మపరులు పోనీ పాపమని అనుకొన్నారు కానీ, తమ చాప క్రిందికే నీళ్ళు వస్తాయని ఊహించనే లేదు.

లౌకిక వాదము-2వ భాగము

‘కులము’ అన్న మాట ఉపయోగించుట నేటి కాలమున వేదికలెక్కి మాట్లాడే పెద్దలకు, పెద్ద నేరమైపోయింది. అది ‘అలౌకికమైన’ మాట అయిపోయినది. దీనికన్నా ముందు ఈ విషయము, క్రైస్తవ, ఇస్లాం మతములందు అసలు వున్నదా లేదా చూద్దాము. నేను Google search లో చదివి తెలుసుకొన్న మేరకు  క్రైస్తవములో 30,000 కు మించిన వర్గములున్నవి. నిర్దారిత సంఖ్యా మనకవసరము లేదు కానీ వారిలోని విభాగములు మాత్రము ఇంతకన్నా కొంచెము ఎక్కువే వుంటాయి. వీరిలో చాలా వర్గములు, ఒక వర్గము వేరొక వర్గములో వారిని పెళ్లి చేసుకొనరు. ఒక క్యాథలిక్ అమ్మాయి  ( Syro Malabar Church Kerala, India ) ఒక Malankara orthodox చర్చి అబ్బాయిని ప్రేమించింది. రెండు కుటుంబముల మధ్య చర్చల తరువాత ఇరు వర్గాలూ పెళ్ళికి ఒప్పుకొనుట జరిగింది. ఇక్కడ అమ్మాయికి సంబంధించిన క్యాథలిక్ చర్చ్ వారు దీనికి ఒప్పుకోలేదు. వారు ఏమన్నారు అన్నది ఆ అమ్మాయి మాటలలోనే చదవండి:  “The catholic church (my parish) intervenes and says 'we will not allow this" as in they can’t allow their sheep to be stolen by other churches.” మరి మిగతా 30,000 పై చిలుకు చర్చిల మాటేమిటి? మరి వీరిలో ‘Sheep Stealing’ కు ఒప్పుకొనేవెన్ని? ఒప్పుకొననివెన్ని?

ఇక ఇస్లాం విషయానికి వస్తే అక్కడి పరిస్థితి ఒక్క సారి చూడండి : (గూగుల్ సౌజన్యము)

The fact that the Ashraf belonged to the dominant political elites, while the bulk of the

Ajlaf remained associated with ancestral professions as artisans and peasants who were looked down upon as inferior and demeaning.

 

మరి ఈ మతాలలో లౌకికత ఎంత మాత్రము వుంది. వీరి చర్చిలకు మసీదులకు డబ్బు వరద లాగా ప్రవహించుతూ వుంటుంది. మరి ప్రభుత్వమునకు ఈ నిధుల పై నియంత్రణ వున్నదా! మరి మన ధర్మము పైనే ఎందుకు? ఇది ఏ విధమైన లౌకిక వాదము.

జన బాహుళ్యములో విరివిగా ‘కుల ప్రస్తాపన’ ఎక్కువగా వస్తుంది.

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం

నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత’ సృష్టించబడింది ; ఈ రకమైన సృష్టి రచనకు కర్తను ‘ నేనే ’ అయినప్పటికీ నాశరహితమైన ‘నన్ను’ ‘ అకర్త ’ గానే నువ్వు తెలుసుకో. ఇక్కడ గుణ కర్మల చేతనే పై నాలుగు వర్ణములలోని ఎదో ఒక వర్ణములో మానవుడు పుట్టుట జరుగుతూ వుంది. మరి ఇది దేనిననుసరించి జరుగుతూ వుంది. ‘గుణ కర్మ విభాగశః’ వారి, వారి గుణ కర్మల ననుసరించి ఈ విభాగము జరుగుతూ వుందని పరమాత్ముడే చేబుతున్నాడు. చాలామంది పుట్టినంత మాత్రాన ఎవడూ బ్రాహ్మణుడైపోడు అంటూ వుంటారు. ఇది ఎట్లు సమంజసము? ఒక వ్యక్తి యొక్క పుట్టుక పూర్వజన్మ కర్మఫలానుసారముగా జరుగుతూవుంది అని పరమాత్మనే చెప్పినాడు. మరి ఏ వర్ణములో పుట్టినవారు ఆ వర్ణస్తులు ఎట్లు కాకుండా పోతారు. కానీ వారు ఈ జన్మలో తమ కర్మ విధి విధాన రహితముగా చేస్తే మరు జన్మలో ఏ పేడ పురుగు నైనా కూడా పుట్టవచ్చు. ఈ జన్మలో శూద్రునిగా పుట్టిన వ్యక్తి తన విధి విధానమును పాటించుతూ పరమేశ్వరారాధన చేస్తే ఈ జన్మ లోనే బ్రహ్మత్వమును పొందవచ్చు. మాతా నామదేవ, భక్త కుమ్భార్, భక్త నందనార్, అమృతానందమయి, సత్యసాయిబాబా మొదలయిన వారెందరో, బ్రాహ్మణత్వమును పొంది ప్రపంచముచేత ఆరాధింప బడలేదా!

ఒక ఆచార్యుడు(Professor), కొన్ని వేదికలు ముఖ్యముగా బ్రాహ్మణుల పైన ఈ ప్రశ్న ఎక్కువగా సంధిస్తుంటారు.

‘ఈ బ్రాహ్మలు’ హరిజనుల ఇండ్లలో భోంచేస్తారా!’ అని. నేటి కాలానుగుణముగా బ్రాహ్మణులు హోటళ్ళలో  భోజనము చేస్తూ వున్నారు. శాఖాహార మాంసాహార సంయుక్త భోజన శాలలలో! అసలు శాఖాహారపు హోటలులోనే ఒక బ్రాహ్మణుడు ఒకవేళ భోజనము చేసినాడు అనుకొన్నా ఆ వడ్డించినవాడు హరిజనుడు కాదు అని చెప్పగలరా! భోజనము చేయ ఆ హోటలుకు పోయిన బ్రాహ్మణుడు ఇటువంటి అనుమానములు తనకు కలిగినా పోవుట లేదా! ఇక్కడ, తినుటకు వెళ్ళేవాడు శుభ్రత చూస్తున్నాడు కానీ కులము కాదు. అసలు చేసేవాడు హరిజనుడైనా తినబోయే వాడు అభ్యంతరముగా భావించుట లేదు. నేను చూసిన ఒక వాస్తవమును తెలుపుకుంటున్నాను. ఇది చాలా కాలము క్రిందటి మాట. తన కర్మను నమ్మిన ఒక చర్మకారుడు తన కొడుకును B.Tech, చదివించినాడు. భార్యతో గూడా తానుండేది ఒక గుడిశె లో. కొడుకు US   వెళ్లి ఒక విదేశీ యువతినే, తల్లిదండ్రులను తలపోయకనే కట్టుకొని అక్కడే వుండిపోయినాడు. భార్య బలవంతము పై ఒక సారి తల్లిదండ్రుల చూడ తన వూరికి వచ్చినాడు.  అమ్మ అన్నము తినండి అని ఆప్యాయముగా అడిగితే వద్దు మేము హోటల్లో తింటామని చెప్పినాడట. ఇది ఆ తండ్రి నాతో చెప్పిన మాట. ఛత్రపతి శివాజీ కుమారునితో బాటూ, ఆ బాలుని ఎంగిలి తిని ఔరంగజేబు బారినుండి ఆ బాలుని ప్రాణములు రక్షించినాడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవము. మరి ఈ ఉదాహరణలు ఏవిధమైన లౌకిక వాదమును బలపరుస్తున్నాయి? లోక రక్షణకు కావలసినది ఆప్యాయత అనురాగము ఐకమత్యము, అంతేకానీ అన్నము తినుట కాదు. ఇక అన్య వర్ణస్థులను పౌరోహితులుగా మార్చుట. ఆంగ్లేయుల ఆగమనముతో అన్నీ తలక్రిందులైనాయి గానీ అంతకు మునుపు బ్రాహ్మణులు తమ వృత్తిని నియమ నిష్ఠలతో చేసేవారు. వేదాధ్యయనము, నియమ నిష్ఠల పాలనము, మంత్రోచ్ఛారణ సులభమైన పనులు కావు. వారికి నియమము ఎంత ముఖ్యమో సంఘ శ్రేయస్సు అంతకన్నా ముఖ్యము. ఇక ఖ్యాతికి కులముతో సంబంధము లేదు. నిజానికి బాబాసాహేబ్ భీమ్ రావు  అమబెవాడేకర్ అన్నది అంబేద్కర్ అసలు పేరు. ఆయనను చేరదీసి తన ఇంటి పేరిచ్చిన వాడు  మహదేవ్ అంబేద్కర్ బ్రాహ్మణుడు. ఆయన చదువుకు సాయపడినది అప్పటి బరోడా మహారాజయిన సాయాజీ రావు గైక్వాడ్. ఈ విషయాల ప్రస్తాపన ఈ కుహనా లౌకిక వాదులు ఎప్పుడూ తెలియజేయరు కదా! ఇక 

మిగిలినది రేపు....

లౌకిక వాదము-3వ భాగము

Reservations ను గూర్చి ఒక్క మాట:

When the constitution was first introduced on 26th November 1949, article 334 titled “Reservation of seats and special representation to cease after twenty years” stated

Notwithstanding anything in the foregoing provisions of this Part, the provisions of this Constitution relating to

(a) The reservation of seats for the Scheduled Castes and the Scheduled Tribes in the House of the People and in the Legislative Assemblies of the States.

This meant that, reservation of SC/STs in House of the People and in Legislative Assemblies of the states should not be in effect post 1970.

ఇవి కొనసాగునట్లు సంవిధానమును మారుస్తూ వస్తూనే వున్నారు. ఇప్పటికి 2020 వరకు ఈ విధానము కొనసాగుతుంది. అంటే సంవిధాన కర్త గా చెప్పబడే అంబేద్కర్ గారు  నిజానికి Drafting Committee Chairman మాత్రమే!

Committee on the Rules of               Rajendra Prasad

Procedure

Steering Committee                           Rajendra Prasad

Finance and Staff Committee             Rajendra Prasad

Credential Committee                    Alladi Krishnaswami Aiyar

House Committee                         B. Pattabhi Sitaramayya

Order of Business Committee             K.M. Munshi

Ad hoc Committee on the                 Rajendra Prasad

National Flag

Committee on the Functions of           G.V. Mavalankar

The Constituent Assembly

States Committee                        Jawaharlal Nehru

Advisory Committee on                   Vallabhbhai Patel

Fundamental Rights, Minorities

And Tribal and Excluded Areas

Minorities Sub-Committee                H.C. Mukherjee

Fundamental Rights                      J.B. Kripalani

Sub-Committee

North-East Frontier Tribal Areas        Gopinath Bardoloi

And Assam Excluded & Partially

Excluded Areas Sub-Committee

Excluded and Partially Excluded         A.V. Thakkar

Areas (Other than those in Assam)

Sub-Committee

Union Powers Committee                  Jawaharlal Nehru

Union Constitution Committee            Jawaharlal Nehru

Drafting Committee                      B.R. Ambedkar

 

Sir Benegal Narsing Rau was appointed as the constitutional advisor. He later became First Indian Judge in International Court of Justice in 1950.

In Ambedkar’s own words

The Draft Constitution as prepared by the Constitutional Adviser as a text for the Drafting Committee to work upon, consisted of 243 articles and 13 Schedules. The first Draft Constitution as presented by the Drafting Committee to the Constituent Assembly contained 315 articles and 8 Schedules.

మరి నల్ల సూట్ తో నల్ల రాజ్యాంగ పొత్తమును బట్టి నిలచిన అంబేద్కర్ గారి విగ్రహములకు అర్థమేమి?

The Assembly then appointed the Drafting Committee which worked on the original draft prepared by Mr. B. N. Rau and produced the Draft Constitution which was considered by the Assembly at great length at the second reading stage.”

http://parliamentofindia.nic.in/ls/debates/vol11p12.html

Gandhiji never believed in superficial measures Reservations being one of them. Some of his views are:

 

So far, as the Reservation in Government Departments is concerned, I think, it will be fatal to a good Government, if we introduce there the communal spirit. For administration to be efficient, it must be always in the hands of the fittest. There should certainly be no favoritism. If we want five engineers, we must not take one from each community, but we must take the fittest of five, even if they were all Muslims or all Parsis. The lowest poor must, if need be, filled by examination by an impartial board consisting of men belonging to different communities.” (Google Search)

నిజానికి ఇప్పుడు ఏ వెసలుబాటు ఉన్నదో అది కొన్ని రూపాంతరములు చెందిన బెనెగళ్ళ నరసింగ్ రావు గారి చిత్తజము(Brain Child) గానీ అంబేద్కర్ గారిది కాదు.  గాంధీజీ గారితో బాటూ ఈ సూత్రమును అంబేద్కర్ గారు కూడా వ్యతిరేకించినారు. ఈ విషయమై గాంధీ గారు నిరాహార దీక్ష కూడా చేసినారు.

ఇంకొక విషయమేమిటంటే దళిత వర్గముల నాయికునిగా ఎవరిని చేస్తే బాగుంటుందన్న మీమాంస వచ్చినపుడు దేశ నేతల మదిన మెదలిన రెండు పేర్లు అంబేద్కర్ మరియు జగ్ జీవన్ రాం. జగ్ జీవన్ రాం గారు, ఆదాయపు పన్ను ఎందు కట్టలేదంటే మరచిపోయినానని కొంత అపఖ్యాతి మూట కట్టుకొనుటవల్ల అంబేద్కర్ గారికివ్వటము జరిగింది. ఇదంతా నేతలాడిన నాటకము ప్రజకు జూపిన బూటకము. ఇదియంతా కుటిల లౌకిక వాదమే! ఈ నిమ్న జాతి అన్న పేరుతో చేయుచున్న ఆరక్షణవల్ల మనలో ఒకరి మధ్య నొకరికి  అగాథము పెరుగుటయే తప్ప తరిగినది తరుగునది లేదు. మానసిక యోగ్యత ను బట్టి విద్యాఉద్యోగావకాశములు వుంటే దేశము ప్రగతి సాధించగలదు కానీ అన్యథా కాదు.

మిగిలినది రేపు........

లౌకిక వాదము-4వ భాగము

ఇక వర్ణముకులము ను గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందాము.

కులము అన్న మాటకు అర్థము కొరకు నేను  3 భాషా నిఘంటువు లను  పరిశీలించితే మూడింటి లోనూ ఈ విధమైన అన్వయము చూచుట జరిగినది .

[తెలుఁగు]వంశము, జాతి, తెగ, ఇల్లు, శరీరము, అంతఃపురము

[తమిళము]కులమ్‌, వంశమ్‌, జాతి, ఇనం, ఉడల్‌, వీడు, అరమనై, కుడి.

[కన్నడము]వంశము, మనె, తెగె, వంగడ, శరీర.

ఈ మూడింటి లోనూ వంశము జాతి తెగ అని చెప్పినారే గానీ వేరేమీ తెలుపలేదు. ఇప్పుడు కులము అన్నది చెడ్డ మాట అనుకొందాము,అప్పుడు వంశము ,తెగ , జాతి అన్న మాటలు కూడా తప్పే కదా! కులము సంస్కృత పదమే అయినా వర్ణం అన్న పదాన్ని నాకు తెలిసినంత వరకూ ఆ భాషా సాహిత్యంలో ఎక్కువగా ఉపయోగించినారు. గీతాచార్యులు కూడా 'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః

తస్య కర్తారమపిమాం విధ్యకర్తారమవ్యయః' అని చెప్పినారు. అంటే వారి, వారి గుణాలు కర్మల ననుసరించి తగిన విధంగా నేనే ఈ నాల్గు వర్ణములను సృజించినాను అని అన్నారు. వర్ణము అన్న మాటకు బంగారు అన్న అర్థము కూడా వుంది. మరి నాల్గు వర్ణములలో ఏది మేలిమి బంగారము, ఏది కాదు అని మనము నిర్ణయించ గలమా ! ఈ విషయమై సమగ్రముగా చదువ వలెనంటే ఈ దిగువ లంకె లో చదువవచ్చు.

http://cherukurammohan.blogspot.in/

'క్యాస్ట్' అనేది ఆంగ్ల పదము కాదు అది 'పుర్తగల్లు' పదము. (From Portuguese Casta meaning race, breed, ancestry). Breed అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ’A group of organisms having common ancestors and certain distinguishable characteristics, especially a group within a species developed by artificial selection and maintained by controlled propagation.' అని యున్నది. అదే విధముగా Race అంటే 'A local geographic or global human population distinguished as a more or less distinct group by genetically transmitted physical characteristics.' అని వుంది. మరి మన 'వర్ణం' 'కులం' అన్న మాటలకివి సమానార్థకాలౌతాయా? ఇక 'ancestry' అన్న పదాన్ని మన 'కులము' నకు జత కలుపలేము. కమ్మరి,కుమ్మరి,చాకలి,మంగలి (మంగళకరమైన ప్రతి పనికీ ముందుండేవాడు) అని వాడితే తప్పా.

క్రైస్తవములో ఈ విచక్షణ లేదా. వాళ్ళూ 'బ్లాక్ స్మిత్' 'పోట్టరర్' 'వీవెర్' మొదలగు పదాలను వాడుతారు కదా. అదేవిధంగా అరబ్బీ,ఫార్సీ, గ్రీకు, లాటిన్లలో కూడా ఆయా పనులకు సంబంధించిన పేర్లు ఆయా పనులు చేసే వారికున్నాయి. ఈ నాటికీ బ్రిటీషు పార్లమెంటు లోని విభాగాలను 'హౌస్ ఆఫ్ లార్డ్స్' హౌస్ ఆఫ్ కామన్స్' అంటారు. 'లార్డు' 'కామన్' అన్న అంతరాలు వాళ్ళలో ఈ నాటికీ లేవా! మనమెంత కాదనుకొన్నా ఇవి ప్రకృతి జన్యములు. ఇది భగవత్ సృష్టి. మనము లేదనుకొన్నంత మాత్రాన అవి లేకుండా పోవు. కులాన్ని గురించి మాట్లాడే గుణవంతుని ఇంట్లో పని మనుషు లెందుకు. అంతా సమమే అయితే ఎవరి పని వారే చేసుకోవచ్చు కదా.

స్థావరముల విషయానికొస్తే వెంపలి మఱ్ఱి రెండూ చెట్లే. ఏ జాతి చెట్టును ఆ పేరు తోనే పిలుస్తాము. కానీ దేని విలువ దానిదే. భగవంతుని సృష్టి లో ఏదీ ఎక్కువ కాదు ఏదీ తక్కువ కాదు. రెండూ పండ్లే యని 'మామిడి పండుకు' బదులు 'ఊస్తిపండు' ను తినగల్గుతామా! అట్లని అమిత చేదైన ఊస్తిని వాడనే వాడమా! మధు మేహమునకది అత్త్యుత్తమ ఔషధము. ఆకాశములో ఎగిరేవి అన్నీ పక్షులే. గండభేరుండాలు గ్రద్దలు కాకులు పిచ్చుకలు రామ చిలుకలు, దేని ప్రత్యేకత దానిదే. అట్లే జలచరాలలో గూడా. భగవంతుని సృష్టి అంతా 'భిన్నత్వములో ఏకత్వమే. '

ఇది మరి లౌకిక వాదమా లేక కుహనా లౌకిక వాదమా! పూర్వులు చెప్పినది అనుసరించి ఆచరించే వారు కొందరైతే అవమాన పరచి  అగౌరవ పరచే వారు కొందఱు. మహమ్మదీయ దండయాత్రలకు పూర్వము  వరకు సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో భాసించిన ఈ దేశమునకు హీనత దీనత నాపాదించిన వారు ముస్లిములు క్రైస్తవులు కాదా! మరి వారిని ద్వేషించుటకు బదులు మనలను మనమే ఎందుకు ద్వేషించుకొంటున్నాము. ఆధునికుడు మహనీయుడైన వివేకానందులవారు తమ భాషణలలో ఎప్పుడూ కుల దూషణ చేసియుండుట నేను వారి రచనలలో చదువుట తటస్థించలేదు.

వర్ణ వ్యవస్థను పాటించని వారి వలె పాటించే వారు కూడా వుంటారు. ఈ వాస్తవాన్ని గమనించండి.  హిందు ముస్లిం సిఖ్ ఈసాయి అంటే అందరూ భాయీ, భాయీ అనేవారే!  మరి అదే విధముగా కుల వ్యవస్థను పాటించే వారు పాటించని వారూ విద్వేషములు లేకుండా ఎవరి దారి వారిది గా వుంచుకొంటూ కూడా కలిసి మెలిసి ఉండవచ్చు కదా! తమ పంథా మాత్రమే సరియైనదనుట పిడి వాదము కాదా!

దేశమంతా కొనియాడిన సింధు అనబడు పూసర్ల వెంకట సింధు బాడ్మింటన్ రజతము Olimpics లో గెలిస్తే వైశ్య వర్గము తమ వర్గపు ఆడపడచు అన్న మాటలో తప్పేమిటో నాకు తెలిసి రాలేదు. వేరొక వర్గము వారు కూడా తమ ఆడుబిడ్డ అన్నారు. బహుశ అది అంత ప్రాచుర్యమునకు వచ్చినట్లు లేదు. అసలు వైదిక వ్యవస్థకు పట్టుగొమ్మలు వైశ్యులు. భగవంతునిచే ఆర్ధిక శక్తి వారికి నిర్దేశింపబడినది. నిజమైన వైశ్యధర్మావలంబి తన ఆదాయమునందు కొంత శాతము ప్రజా ప్రయోజనములకే ఖర్చు పెడతాడు. ఇది కూడా శాస్త్ర నిర్ణయము. తమ వర్ణము కాని వాడినైన నా చదువుకు ధన సహాయము వారు చేసియుండి యుండకపోతే నేను ఈ మాత్రము చదువగలిగే వాడినే కాదు. అంతటి వదాన్యులు, ఏ రోజూ తమ గొప్ప తాము ప్రకటించుకొననివారు ప్రపంచమునకు తమ వర్గమునుండి వచ్చిన ఒక ఆడుబిడ్డ దేశమునకు ఇంత ఎనలేని ఖ్యాతి తెస్తే మా బిడ్డ అనుట అంత తప్పయిన విషయమా! తమ బిడ్డ అని వారు చెప్పుకొన్నంత మాత్రాన ఆమె ఈ దేశపు బిడ్డ, మన అందరి బిడ్డ కాకపోతుందా! ఎక్కడో అక్కగారి ఆడుబిడ్డ కొడుకు కు 1st. Class వస్తే ఫోటోలు పెట్టి అటు వార్తాపత్రికలలో ఇటు గ్రంధముఖి లేక ఆస్య గ్రంధి లో (Facebook) ప్రచారము చేసుకొనుట లేదా! ఎవరి సంతోషము వారిది. పైగా అది అభ్యంతరకరమైనది కాదు. మరి ఎందుకీ విద్వేషము.

ఆనోభద్రాః క్రతవో యత్ను విశ్వతో వి దభ్దాసో అపరితాస ఉద్బితఃl

దేవానో యథా సదమిధృతే అసన్నప్రాయువో రిక్షితారో దివేదివేll  ఋగ్వేదము25-14.

దశ దిశలనుండి ఉదాత్త భావములే ప్రసరించు గాక అన్న ఇంతటి ఉదాత్తములగు ఆలోచనములు వేదములు, ఉపనిషత్తులు, భారత సాహిత్యముకాక వేరు ఏ సాహిత్యమున కూడా ఆలోచనకే అందని విషయము.

ఇక మన దేవాలయములు మాత్రమే ప్రభుత్వపు అదుపాజ్ఞలలో పనిచేస్తాయి. పైగా దేవాలయముల నుండి వారి రాబడి రెండు విధములు. 1. దేవాదాయము 2. ధర్మాదాయము. ఈ రెండు సమాసములకూ విగ్రహము దేవుని వలన ఆదాయము, ధర్మమూ వలన ఆదాయము అని చెప్పుకోవలసి వస్తుంది. అంటే పంచమీ తత్పురుష  సమామౌతుంది. వెనకటి కొక ఇల్లాలు చనిపోయిన తన సవతి పిల్లలతో ‘ప్రేమ మీయమ్మ వలె, పెట్టుబడి పిన్నమ్మవలె చూపిస్తాను’ అన్నదట. అది నేటి పరిస్థితి. ఈ కుహనా లౌకిక వాదులు మనలను దైవసమానులను చేసి ‘చూపు మనది, మేపు వారిది’ చేసినారు. మసీదులను చర్చిలను ఈ ఆదాయపు పరిధి లోనికి ఎందుకు తెచ్చుట లేదు. మరి వేలాంగణ్ణి గుడి కదా! అక్కడి ఆదాయమునకు ఎందుకు పరిధి లేదు. నాగూర్ దర్గా ఎందుకు ప్రభుత్వపు పరిధి లోనికి వచ్చుట లేదు.

ఈ నాడు ముద్రణా మాధ్యమము (Print Media), ప్రసార మాధ్యమములు (Broadcast and Telecast Media) హిందువుల చేయి దాటినాయన్నది ఒక కనిపించని యథార్థము. Steering చేతిలో వున్నవాడు తన ఇష్ట ప్రకారమే కదా బండి నడుపుతాడు. అందుకే తప్పు ఉన్నదా లేదా  అన్నది పూర్తిగా తెలుసుకోకనే   హిందూ గురువులను దుయ్యబడతారు బాబాలను మాటల తూటాలతో చిత్రహింస చేస్తారు. నా ఉద్దేశ్యము బాబాలలో చెడ్డ వాళ్ళు లేరని కాదు. మరి మిగతా రెండు మతాలలో మాట పెద్దలు లేక కుహనా బాబాలు, లేక Holistic Healings పేర్లతో ఎంత విపరీతముగా మభ్యపెడుతున్నారో? మరి అటువంటి వారిని వలసిన మేరకు ఎండగడుతూ వున్నారా! మరి దీనిని లౌకిక వాదము అనగలుగుతామా! ***(**

ఈ విధముగా చెప్పుకొంటూ పోతే ఎంతయినా చెప్పవచ్చు. నేను ఎంతో విధేయతతో మీకు విన్నవించుకొనేది ఏమిటంటే దయతో సనాతన ధర్మ పారాయణులైన మీరు సక్రమమైన రీతిలో ఆలోచించి ఈ Secularism పేరుతో జరుగుతూ వుండే వాస్తవాలను ఎండగట్టి, మన దేశములోనే మనము రెండవ తరగతి పౌరులుగా జీవించే ఈ దౌర్భాగ్యము నుండి విముక్తి పొందె మార్గమును మనసారా యోచించి తగిన ప్రణాళికను అనుసరించి ఈ ధర్మమునకు ఈ ధర్మావలముబులకు  కుహనా లోకిక వాదము నుండి విముక్తి లభింపజేస్తారని ఆశిస్తూ శెలవు తీసుకొను చున్నాను.

స్వస్తి.

 

 

                        

Wednesday 21 September 2016

రైలు ప్రయాణము -జీవన యానము 


వచ్చునెప్పుడని యన్నది తెలుసు 
పోవు నెప్పుడని యన్నది తెలుసు 
వచ్చి పోవు ఆ బండి కొరకు నీ 
తపన దెందుకో ఎవరికి తెలుసు 

రాకపోకలకు నడుమన మనము 
రాద్ధాంతములను చేయుచుందుము
జీవితమే ఒక రైలు ప్రయాణము 
మేటి విల్తుడది వదలిన బాణము

రెండిటి నడుమన యున్నభేదము 
ఏమిటన్నయది ఇపుడే చూతము 
రైలుయానమున గాంచెదమంతము 
జీవయానమది చూడుమనంతము 

ఖర్చులు మనవి  కష్టము మనది 
సంపాదించే సౌఖ్యము మనది
పంచిన ధనము,పెంచును ఘనము
రైలు యాత్రలో ధన మింధనము

ప్రయాణ వేదిక ప్రవేశ మందిన        (ప్రయాణ వేదిక = railway platform)
మరునిముసమ్మే మొదలుబలాటము
ఎప్పుడు వచ్చును ఎక్కడికొచ్చును
అన్నది పెంచును మన  ఆరాటము

గమనాగమనపు సూచికలున్నా
సేద తీర్చుటకు వీచికలున్నా
సహన మన్నదే కనబడదన్నా
ఎండమావి యది ఎటుల గాంచినా

వచ్చునంతలో తిండి తినెదము
అంతలోపలే నిదురపోయెదము
పిల్లల పాపల నరచికరిచెదము
మనుషులన్నదే మరచిపోయెదము

జీవ యానమున డబ్బు చెల్లదు
మిత్ర బాంధవుల తోడు నొల్లదు
త్రికరణ శుద్ధిని బుద్ధిగ పెంచిన
చిత్తము ఈశుని వీడి వెళ్ళదు

పునరపి జననం పునరపి మరణం
చావు పుట్టుకలు వలయ తోరణం
మన  చేతలు మన  జన్మ కారణం 
నీతి మాలితే బ్రతుకు దారుణం 

అనుబంధాలు ఆత్మీయతలు
అన్నవేవి మనమొచ్చేటప్పుడు
మనవనుకొన్నవి మనతోనున్నవి
మనతోడేవీ !పోయేటప్పుడు

 పోవురైలు మన  కమితోల్లాసము
తిరుగు యానమున ఉదాసీనము
జీవికి ఏడుపు, వచ్చునప్పుడు
ఏడిపించు తా పోవునప్పుడు

వచ్చుటకేడ్చిన జీవి తాను మరి
మోహము కోపము లోభము వంచన
ఐశ్వర్యమ్మును అక్కున చేర్చును
అహంకారమును ఔదల దాల్చును

పోవునప్పుడో పూచికపుల్లయు
కోరుకున్ననూ కొనిపోలేమను
నిజమును మరచి నీల్గుచుందుము
బట్ట లేకయే వచ్చిపోయదము 

తృటిలో మనసులు కలుపుకొందుము 
తృటిలో మమతలు పెంచుకొందుము
ఎవరిది వారిదె గమనము గమ్యము
అంతలోపలే ఈ అనుబంధము

అంతము లేనిది అంతు తెలియనిది
ఆలోచింపగ ఆత్మ ప్రయాణము
అవసరాలకు ఆనందాలకు
ఆలవాలమది రైలు ప్రయాణము 

ఒక్కసారి యోచించ దలచితే 
ఒక్క మాటలో చెప్పదలచితే
పోయి వచ్చుటే రైలు ప్రయాణము
వచ్చిపోవుటే జీవన యానము

శుభం భూయాత్ 















రైలు ప్రయాణము -జీవన యానము 


వచ్చునెప్పుడని యన్నది తెలుసు 
పోవు నెప్పుడని యన్నది తెలుసు 
వచ్చి పోవు ఆ బండి కొరకు నీ 
తపన దెందుకో ఎవరికి తెలుసు 

రాకపోకలకు నడుమన మనము 
రాద్ధాంతములను చేయుచుందుము
జీవితమే ఒక రైలు ప్రయాణము 
మేటి విల్తుడది వదలిన బాణము

రెండిటి నడుమన యున్నభేదము 
ఏమిటన్నయది ఇపుడే చూతము 
రైలుయానమున గాంచెదమంతము 
జీవయానమది చూడుమనంతము 

ఖర్చులు మనవి  కష్టము మనది 
సంపాదించే సౌఖ్యము మనది
పంచిన ధనము,పెంచును ఘనము
రైలు యాత్రలో ధన మింధనము

ప్రయాణ వేదిక ప్రవేశ మందిన        (ప్రయాణ వేదిక = railway platform)
మరునిముసమ్మే మొదలుబలాటము
ఎప్పుడు వచ్చును ఎక్కడికొచ్చును
అన్నది పెంచును మన  ఆరాటము

గమనాగమనపు సూచికలున్నా
సేద తీర్చుటకు వీచికలున్నా
సహన మన్నదే కనబడదన్నా
ఎండమావి యది ఎటుల గాంచినా

వచ్చునంతలో తిండి తినెదము
అంతలోపలే నిదురపోయెదము
పిల్లల పాపల నరచికరిచెదము
మనుషులన్నదే మరచిపోయెదము

జీవ యానమున డబ్బు చెల్లదు
మిత్ర బాంధవుల తోడు నొల్లదు
త్రికరణ శుద్ధిని బుద్ధిగ పెంచిన
చిత్తము ఈశుని వీడి వెళ్ళదు

పునరపి జననం పునరపి మరణం
చావు పుట్టుకలు వలయ తోరణం
మన  చేతలు మన  జన్మ కారణం 
నీతి మాలితే బ్రతుకు దారుణం 

అనుబంధాలు ఆత్మీయతలు
అన్నవేవి మనమొచ్చేటప్పుడు
మనవనుకొన్నవి మనతోనున్నవి
మనతోడేవీ పోయేటప్పుడు

 పోవురైలు మన  కమితోల్లాసము
తిరుగు యానమున ఉదాసీనము
జీవికి ఏడుపు, వచ్చునప్పుడు
ఏడిపించు తా పోవునప్పుడు

వచ్చుటకేడ్చిన జీవి తాను మరి
మోహము కోపము లోభము వంచన
ఐశ్వర్యమ్మును అక్కున చేర్చును
అహంకారమును ఔదల దాల్చును

పోవునప్పుడో పూచికపుల్లయు
కోరుకున్ననూ కొనిపోలేమను
నిజమును మరచి నీల్గుచుందుము
బట్ట లేకయే వచ్చిపోయదము 

తృటిలో మనసులు కలుపుకొందుము 
తృటిలో మమతలు పెంచుకొందుము
ఎవరిది వారిదె గమనము గమ్యము
అంతలోపలే ఈ అనుబంధము

అంతము లేనిది అంతు తెలియనిది
ఆలోచింపగ ఆత్మ ప్రయాణము
అవసరాలకు ఆనందాలకు
ఆలవాలమది రైలు ప్రయాణము 

ఒక్కసారి యోచించ దలచితే 
ఒక్క మాటలో చెప్పదలచితే
పోయి వచ్చుటే రైలు ప్రయాణము
వచ్చిపోవుటే జీవన యానము

శుభం భూయాత్ 


























































హితునిగా మారె విధి తాను హిట్లరునకు

హితునిగా మారె 

విధి తాను హిట్లరునకు

https://cherukuramamohan.blogspot.com/2016/09/blog-post_77.html

 

ఈ భర్తృహరి సుభాషితమును ఒక సారి గమనించండి.

భగ్నాశస్య కరండ పిండిత తనో ర్మ్లానేంద్రియస్యక్షుదా

కృత్వాఖుర్వి స్వయం పరం నిపతితో నక్తం ముఖే భోగినః

త్రుప్తస్తత్పిశితేన సత్వరమసౌ తేనైవ యాతః పథా

స్వస్తాస్తిష్ఠత దైవమేవ హి పరం వృద్ధౌః క్షయే కారణం

ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవిగారి చక్కని ఈ అనువాద పద్యమును చూడండి.

రాతిరి మూషకంబు వివరంబొనరించి కరండ బద్ధమై

భీతిలి చిక్కి యాశ చెడి పెద్దయు డస్సిన  పాము వాత సం

పాతము చెందె దాని తిని పాము తొలంగె బిలంబు త్రోవనే

ఏతరి హాని వృద్ధులకు నెక్కుడు దైవము కారణమ్మగున్

 

పాముల బుట్ట లేక పెట్టెలో బంధింపబడి ప్రాణము పోవుట తథ్యమని భావించిన 

పామునకు, ఆహారము లోన ఉంటుందని భ్రమసి , ఆ పెట్టె లేక బుట్టకు బోరియచేసి 

లోనికి వెళ్ళిన ఎలుక పాముకు విందై కూర్చుంది. దానిని తిన్న పామునకు అన్నము 

మరియు కన్నము దొరుకుటచే   హాయిగా అన్నము తిని  ఆ కన్నముగుండా బయటకు 

వచ్చినది. ఇదే కదా ఘటన కర్మ విధి అంటే! ఇటువంటి అనుభవాలు హిట్లరు 

జీవితములో ఎన్ని వచ్చినవో చూడండి.

అసలు హిట్లర్ అన్న పదమును విడదీస్తే మనకు రెండు పదాలు వస్తాయి. హిట్ మరియు 

టల్. హిట్ అనే ఆంగ్ల పదమునకు అర్థము వేగముగా తాకుట. టల్ అనే హిందీ 

పదమునకు అర్థము నిలువరించుట.  అంటే ప్రమాదాలనుండి తప్పించుకునే అదృష్టము 

కలిగినవాడేమో హిట్లర్ అంటే!

అందుకే తనను తానే చంపుకోన్నాడేమో! తన పేరునకు అర్థము మారకుండా!

హిట్లర్‌ నియంత అన్నది అందరికీ తెలిసిన విషయమే!. దాదాపు 6 కోట్లమంది 

యూదుల మారణహోమానికి ఆతడు సూత్రధారి. ఇప్పటికీ పోలెండు, జర్మనీ, లాంటి 

దేశాలలో సామూహిక మారణ శాలలు ఉండేవట. అందుకే అతని మరణాన్ని ఎందఱో 

కోరుకున్నారు. ఎంతోమంది ఆయనను  చంపుటకు ఎన్నో కుట్రలు పన్నినారు. కాని 

అన్నిటి నుండి ఆయనను విధి కాపాడుతూ వచ్చింది.

విషయమును తెలుసుకొనుటకు ముందు పైన శీర్షికలో వున్న పద్య పాదముతో 

పూరింపబడిన ఈ పూర్తి పద్యమును చదవండి.

హతుని జేయగ తనవైరులాత్రపడుచు

హత్య మార్గమ్ములెన్నియో అమలు పరచ

హంతకుల కుట్రల న్నింటి నణచివేసి

హితునిగా మారె విధి తాను హిట్లరునకు

ఇప్పుడు ఆయనను చంప బూనిన కొన్ని వింతయైన వాస్తవాలను చూస్తాము . మొదటి 

ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండు యోధుడు హెన్రీ టాండీకి యుద్ధభూమిలో పీలగా

విసురుగా ఉన్న ఒక జర్మన్‌ సైనికుడు ఎదిరించ వస్తే, అతన్ని చంపాలనిపించక 

వదిలివేయటం జరిగింది. ఆ పొరపాటు -ప్రపంచ చరిత్రను దారుణంగా ప్రభావితం 

చేస్తుందని అతను అప్పట్లో ఊహించలేదన్న విషయం మనకు ఈ విషయాలు చదివితే 

తెలియ వస్తుంది. ఆ విధముగా వదిలివేయబడిన బక్క ప్రాణియే  అడోల్ఫ్‌ హిట్లర్‌. తన 

తప్పిదానికి టాండీ తన 86 సంవత్సరాల జీవిత కాలమూ  పశ్చాత్తాప పడుతూ 

ఉండిపొయినాడు.

హిట్లర్‌ను హత్య చేయాలన్న కుట్రలు ఎన్నో జరిగినాయి. వీటి నుండి ప్రాణాలతో బయట 

పడినపుడల్లా హిట్లరు ''విధి నా పక్షము వహించి  నేను సాధించవలసిన కార్యమునకు 

దోహదము చేస్తూ వున్నాడు'' అని అనేవాడు. ''మృత్యువు వేదన నుండి, వత్తిడి నుండి

విముక్తి'' అని కూడా అనేవాడు. కొన్ని కోట్ల మంది మృత్యువునకు కారణమయిన ఓ 

నియంతలో ఈ ధోరణి గమనించితే మనకు విడ్డూరముగా గోచరిస్తుంది.

అసలతనికి భవిష్యత్తు ముందే తెలుసునా అనిపిస్తుంది, ఆతను నొకప్పుడు ఒక 

మిత్రునితో అన్న మాటలు వింటే : నాతో ఎప్పుడూ ఒక పిస్తోలు ఉంటుంది. నా ముగింపు 

దగ్గర పడినప్పుడు ఇది ఒక్కటే  నన్ను కాపాడేది'' అని గుండె చూపించినాడట.

మిలటరీ యోధుల సమావేశంలో ప్రసంగించడానికి 1939 నవంబరు 9న హిట్లరు 

మ్యూనిచ్ వెళ్ళటము జరిగింది. ఆ రోజు ఎందుకనో అతని మనస్సు కీడుని 

శంకిస్తోంది.'ఇవాళ నా ధోరణి మార్చాలి' అని అనుకొన్నాడట. జార్జ్‌ అల్సన్‌ అనే ఒక 

వడ్రంగి సమావేశానికి ముందుగానే వేదిక పక్కన ఉన్న ఒక స్తంభమునకు ఒక  దొంగ 

అర తయారు చేసి ఉంచినాడు. సభ జరిగే రోజున ఒక పక్క పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు 

చేస్తూండగా, తాను సిద్ధం చేసిన అర లో బాంబును ఉంచి సరిగ్గా 11 -20 కి ప్రేలే 

విధముగా ఏర్పాటు చేసి యుంచినాడు. పది గంటలకు హిట్లర్‌ ప్రసంగం 

ప్రారంభమవుతుంది. ఆవేశంగా ఊగిపోతూ గంటల కొద్దీ మాటలాడే హిట్లర్‌ యొక్క 

ప్రసంగం మధ్యలోనే బాంబు పేలుతుంది. అంతటితో సభ, హిట్లర్‌ జీవితం 

అర్ధాంతరంగా ముగుస్తాయి. అదీ ఆయన విరోధులు పన్నిన పన్నాగము. విచిత్రంగా 

ఆనాడు 11 -07 నిముషాలకి హిట్లర్‌ తన ప్రసంగాన్ని ముగించినాడు. మామూలుగానైతే 

ప్రసంగం ముగిసిన పిదప కనీసం ఓ అరగంట కార్యకర్తలతో మాట్లాడుతూ గడపడం 

హిట్లర్‌ యొక్క అలవాటు. కాని ఆనాడు అందుకు భిన్నంగా ప్రసంగం ముగియగానే 

హిట్లర్‌ బయటకి వెళ్లిపోవటం జరిగింది. సరిగా విరోధులు అనుకొన్న విధముగానే 8 

నిముషాల తర్వాత బాంబు పేలింది!

ఈ విషయము గమనించండి. నాజీ సైన్యంలో పనిచేసే ఓ సైనికోద్యోగి తన కారణాలేమో 

తెలియవు కానీ హిట్లర్‌ ను మాత్రము హత్య చెయ్యడానికి సంకల్పించి ఒక ప్రణాళిక 

రచించినాడు. ఆ రోజు హిట్లర్‌ ప్రసంగించే వేదిక క్రిందనే బాంబును ఏర్పాటు చేసినాడు. 

అంతా పకడ్బందీగా జరిగిపోయింది. ఇక ప్రేలడమే తరువాయి. హిట్లర్‌ ప్రసంగం 

ప్రారంభమయింది. ఈ లోపల శౌచానికి వెళ్లవలసిన అగత్యం ఏర్పడింది ఆ ఉద్యోగికి. 

శౌచాలయము లోనికైతే వెళ్ళినాడు గానీ  విచిత్రంగా బయటి గడియ పడుటతో అతను 

లోపలే ఉండిపోవలసి వచ్చింది. హిట్లర్‌ ప్రసంగం ముగిసింది. బాంబు ప్రేలే అవకాశమే 

లేకుండా పోయింది.

హిట్లర్‌ శత్రువులు అతణ్ణి అంతమొందించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా విధి ఆయన్ని 

కాపాడుతూనే వచ్చింది.

ఇది ఇంకా విచిత్రమయిన సందర్భం. నెపోలియన్‌ కు వ్యతిరేక పోరాటములో 

ప్రధానపాత్ర వహించిన ఒక యోధుడి మునిమనుమడు క్లౌస్‌ షాంక్‌ వాన్‌ స్టాఫెన్‌ బర్గ్‌

హిట్లరు యొక్క నాజీ సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌. హిట్లర్‌ ను హతమార్చాలనే వర్గంలో 

సభ్యుడు. చాలా సమర్ధుడు. సైనిక శాఖలో చాలా పరపతి ఉన్నవాడు. అయితే ఆయన ఆ 

ప్రయత్నమును చేసే లోపుగానే చుక్కెదురయింది. ఆయన కారు ఒక లాండ్‌ మైన్‌ 

(భూమిలో పాతిపెట్టిన బాంబు) మీద నడిచి పేలింది. అతను ఒక కన్ను, ఒక చెయ్యి

రెండో చేతికి మూడు వ్రేళ్లు పోగొట్టుకున్నాడు. అయినా హిట్లర్‌ని చంపే ఆలోచన 

మాత్రము అతను వదులుకోలేదు. ఒకానొక సమావేశంలో హిట్లర్‌తో పాటు గోరింగ్‌

హిల్మర్‌ అనే ఇద్దరు ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారు. ఆ సమావేశంలో స్టాఫెన్‌బర్గ్‌ 

అన్న అతడు గూడా పాల్గొన వలసి వుంది. ఈ ముగ్గురినీ ఒకే బాంబుతో 

హతమార్చవలెనన్నది శత్రువుల ఆలోచన. ఒక ఎర్ర బ్రీఫ్‌ కేసులో అధికార పత్రాలతోపాటు 

ఒక బాంబుని పెట్టుకుని కార్యాలయానికి స్టాఫెన్‌ బర్గ్ వచ్చినాడు.

సమావేశం జరిగే హాలులో పెద్ద బల్ల ముందు అనుకొన్న ప్రకారము హిట్లరు కూర్చుని 

వుంటాడు. హిట్లర్‌ కు వీలయినంత దగ్గరగా తానూ కూర్చొనుటకు ఏర్పాటు 

చెయ్యమన్నాడు అక్కడున్న ఒక తన నౌకరుకు. తనకు చెవి సరిగ్గా వినబడదు అందువల్ల 

దగ్గరగా కూర్చోవలసి వస్తూ వుందని కూడా నమ్మబలికినాడు. అతను అనుకొన్న 

విధముగానే ఏర్పాటు జరిగింది. హిట్లరు కుర్చీకి దగ్గరగా టేబిలు కింద బాంబు ఉన్న బ్రీఫ్‌ 

కేసును కూడా  తాననుకొన్న రీతిగానే వుంచినాడు.  తన పని ముగిసిన పిదప  మెల్లగా 

జారుకున్నాడు. సమావేశంలో ఒక ఆఫీసరు, హిట్లరు చూపించే పఠమును చూచుటకు  

ఆ మేజా మీదికి వంగబోయినాడు. కాలికి ఏదో తగులుచున్నట్లనిపించిన కారణముగా 

వంగ లేక పోయినాడు. గమనిస్తే అది ఒక బ్రీఫ్‌ కేసు. కాలితో పక్కకు త్రోయబోయినాడు.

అది కదలలేదు. సరే అతను క్రిందికి వంగి దానిని  టేబులుకు మరోప్రక్క పక్క- హిట్లరు కుర్చీకి దూరంగా వుంచేసి పఠాన్ని చూస్తూ నిలబడినాడు.

12 -42 నిముషాలకు భయంకరమైన శబ్దంతో బాంబు పేలింది. అందరూ 

తుళ్లిపడినారు. కుర్చీలు గాలిలోనికి లేచినాయి. కాని బాంబు దూరంగా పేలిన కారణంగా 

హిట్లరుకు కనీసం గాయము కూడా కాలేదు. హిట్లరు పాంటు పీలికలయింది. 

ముఖమంతా నల్లగా బూడిద అలుముకొనింది. మిగతా వారికి గాయాలయినాయి. 

పీలికలయిన పాంటుని గర్వంగా చూపిస్తూ: ''నాకెప్పుడూ అనిపిస్తూంటుంది. యిలాంటి 

అనర్థం ఏదో జరుగుతుందని'' అని నవ్వినాడట హిట్లర్‌.

కానీ ఎందరో చంపడానికి ప్రయత్నాలు చేసినా తప్పించుకొని బ్రతికి బట్టగట్టిన  హిట్లరు 

-1945 ఏప్రిల్‌ 30న ఒక మిలటరీ బంకర్‌లో చావుకి కొన్ని నిముషాల ముందు తనతో 

జీవితమంతా కలిసి ఉన్న ఈవా ను పెళ్లిచేసుకుని తన 7.65 కాలిబర్‌ వాల్టర్‌ పిస్తోలుతో 

తనను తాను కాల్చుకుని చనిపోయినాడు.

ఇదీ విధి విధానమంటే!

స్వస్తి.