Tuesday 25 July 2017

శ్రీకృష్ణ

శ్రీకృష్ణ
కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి  వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చుఇవికాక 'అంటే బ్రహ్మ. 'అంటే అనంతుడు. 'అంటే శివుడు. 'అంటే ధర్మము. 'అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉందిఆకర్షణ ఉందిసంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.
కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నదినేను చదివి తెలుసుకొన్నదినాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణముహరివంషమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.
మస్త్య కూర్మ వరాహస్య నారశిమ్హస్య వామనః
రామో రామస్య రామస్య బుద్ధః కల్కి రేవచ
అన్న ప్రచారములోనుండే శ్లోకములో శ్రీకృష్ణ అవతారము కనిపించదుకానీ రామావతారము వుంది. రాముడు పరోఖముగామనము ఎటువంటి నీతి నియమములను పాటించవలెను అని తానే ఆదర్శముగా నిలిచి మనలను అనుసరించమన్నాడు. తన భగవత్తత్వమును ప్రదర్శించలేదు. పైగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులుగా తానే ఉద్భవించుతాడుకాకపోతే నిష్పత్తులు మారుతాయి.  అంటే పైన తెలిపినవి అన్నీ అంశలే. ఈ కృష్ణావతారము అలాంటిది కాదు. విష్ణువు దశావతారములలోని ఒక్కొక్క  అవతారములో ఒక్కొక్క దుష్టశక్తిని దునుమాడుతూ వచ్చినాడు. ద్వాపరములో త్రుణావర్తుడుశకటాసురుడుపూతన వంటి రాక్షసులు వున్నా వారు కంసజరాసంధాది మానవ రాజన్యులకు లోబడి పనిచేసినవారే! అంటే ద్వాపరము లో అసుర గణములకు బదులుగా అసుర గుణములు భూమిపై వ్యాప్తిలోనికి వచ్చినాయి. అధర్మము ప్రబలిందిఅజ్ఞానము వ్యాపించింది. అందువల్ల శ్రీకృష్ణుడు భూమిపై అవతరించవలసివచ్చినది. అసలు వ్యాసులవారే 'కృష్ణస్తు భగవాన్ స్వయం' - అని  అన్నారు. వాల్మీకి ఆ మాట అనలేదు. రాముడూ ఆమాట చెప్పలేదు. అందుకే పైన తెలిపిన శ్లోకములో శ్రీకృష్ణుడు లేడు. శ్రీకృష్ణుడికి కంస జరాసంధ శిశుపాలనరకాసురాదులందరూ ఒక విధముగా బంధువులే!  అయినా ధర్మ సంస్థాపన కొరకుసాధువులను రక్షించుట కొరకు ఆయన ఉద్భవించినాడు. మిగతా ఎవతారములలోలేని విశిష్ఠత ఈ అవతారమునకు మాత్రమే వుంది. ఈ అవతారములో మాత్రమె 'కృష్ణం వందే జగద్గురుంఅన్నారు. ఈ కృష్ణుడు త్రిమూర్తులలో విష్ణువు కాదు. పరాశక్తిశివుడుసుబ్రహ్మణ్యుడు ఇలా అనేక దేవతల సంగమం ఆయన. ఆయనే భగవద్గీతలో చేబుతాడు 'యోగక్షేమం వహామ్యహంఅని. యోగం అంటే లేనిదీ లభించుట క్షేమం అంటే ఉన్నది నిలుపుకొనుట. ఇటువంటి ఉపదేశాలు మనకు విష్ణువు బోధించినట్లు ఇతర అవతారములలో అగుపించవు. ఆసలు ఈ విహయమును గమనించండి. విష్ణు సహస్ర నామమావళిని భీష్ముడు ధర్మజునకు బోధించితే శ్రీకృష్ణుడే స్వయంగా  ధర్మ రాజునకు శివసహస్రనామావళిని బోధించుతాడు. ప్రభాస తీర్థములో (నేటి సోమనాథ్)శివ దీక్ష శివ పూజ నిర్వహించుతాడు. శివ పూజా ప్రాశస్త్యం బోధించాడు. పైగా ప్రభాస తీర్థంలో (సోమనాథ క్షేత్రం)శివ దీక్షశివ పూజా నిర్వహించుతాడు. అర్జునుని శివునికై తపస్సుచేసి పాశుపతం పొందమని చెబుతాడు. శివుని బోధరూపం దక్షిణామూర్తి. అంతేకాక శ్రీకృష్ణుని భంగిమ, ముఖ్యముగా మోవికి మురళిని ఆనించియుండేది, నటరాజ తాండవము లోని పాద భంగిమ యొక్క కుంచిత పాదమును గుర్తుకు తెస్తుంది. ఆయన వేణువు శివుడే. కృష్ణుడు వంశీ మోహనుడైతేశివుడు వంశ మోహనుడు (శివసహస్ర నామాలలో ఒకపేరు).
సుబ్రహ్మణ్యుని శివగురువు అంటారు. ఆయన వాహనం నెమలి. అందుకే కృష్ణుడు శిఖిపింఛమౌళి. కృష్ణునిబోధలు భగవద్గీతఉత్తర గీతఉద్ధవ గీతలు భ్రమర గీతలు. కృష్ణుని భంగిమ విష్ణువు ఆవాసము క్షీరసముద్రమని మనము వింటాము,అంటాము. క్షీర సముద్రముఇక్షుసముద్రముఅన్న పేర్లు సంకేతములు. రంగు మాత్రమే పరిగణనలోనికి తీసుకోవలెను కానీ రుచికాదు. ఆవిధముగా క్షీరసముద్రమును మనము ఆధునిక పరిభాషలోని Milky Way గా తీసుకొనవచ్చు. ఆయన సృష్టికోసం  విశ్వాన్ని సృష్టించినాడు. ఆది బ్రహ్మాండము. దీనిలో భూమితొ సహా భూభువసువమహజనతపసత్య - అనే 7 ఊర్ధ్వలోకాలు అతలవితల,సుతలతలాతలరసాతల  పాతాళ మనే 7అధోలోకాలు సృష్టించినాడు. సృష్టి కొనసాగింపునకు సత్యలోకములో  బ్రహ్మను సృష్టించినాడు. ఇక్కడ మనము తెలుకొనవలసిన ముఖ్యమగు విషయము ఒకటి వుంది. ఈ బ్రహ్మలోకంపైన వైకుంఠంకైలాసంగోలోకంమణిద్వీపం ఉంటాయి. అక్కడ లక్ష్మీనారాయణులుశివపార్వతులూరాధాకృష్ణులూలలితా పరమేశ్వరి వరుసగా వారి వారి లోకాలలో ఉంటారు. సంఖ్యులు ప్రకృతి పురుషుడు అని చేసిన ప్రతిపాదనకు పుష్టిని కూర్చుటయే సరస్వతీబ్రహ్మలక్ష్మీనారాయణసాంబశివ ( స+అంబ+శివ) తత్వము. ఆవిధముగా గోలోక నివాసులు రాధా కృష్ణులు. 'గొఅన్న శబ్దమునకు గల అనేకార్థములలో కిరణములువేదములువృషభ జాతి అన్న అర్థములు వున్నాయి. అందుకే కృష్ణ పరమాత్ముడు భూమిపైన గోలోకమునే   ప్రతిష్ఠించినాడు. రేపల్లెలో ఆలమందలతోనే కదా ఆయన అనుబంధము. బ్రహ్మవైవర్త పురాణములోని కృష్ణ ఖండములో ఈ వివరాలను మనమ తెలుసుకొనగలము.
శ్రీ కృష్ణునికి మానినీ చిత్తచోరుడనే ఒక ప్రథ అన వచ్చు అపప్రథ అనవచ్చు. మగవారికనా ఆడువారిలో చంచల స్వభావమేక్కువ అని పెద్దలు చెబుతారు. అందుకే స్త్రీ కి చంచల అన్నపేరు కూడా వుంది. ఈ చంచల స్వభావము కలిగినది చిత్తము అంటే మనసు. శ్రీకృష్ణుడు మనసు దొంగాలించినాడు అంటే వేరెవ్వరికీ అణుమాత్రముకూడా చోటు లేక తానె నిండియున్నాడని అర్థము. మరి వారే అట్లుంటే ఇక మగవారిని గూర్చి తలువనే అక్కరలేదు. గోకులము వదలి అన్న బలరామునితో కూడి, అక్రూనితో మధుర వేడలినతరువాత ఆయన కార్యకలాపములు మారిపొయినాయి.  పైగా గోకులములో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు తక్కిన వారంతా స్త్రీలే! బృందావనములో వల్లభాచార్యుల వారిని చూడ దలచి సాధ్వి మీరాబాయి సందేశమునంపితే ఆయన ఆడువారిని చూడనంటాడు. అప్పుడు ఆమె జవాబుగా బృందావనములో కృష్ణుడు ఒక్కడే పురుషుడు అని పంపుతుంది. తన తప్పు తెలుసుకొని వల్లభులవారు మీరాబాయిని కలుస్తారు.
ఈ విధముగా ఆయన మానినీ చిత్తచోతుడైపోయినాడు.
ఇంకొక విచిత్రమైన విషయము ఏమిటంటే అసలాయనకు కృష్ణ అన్న నామకరణము ఎవరు చేసినట్లు? చెరసాలలో బారసాల జరుగలేదు కదా! నందవ్రజములో గర్గమహాముని వస్తే ఆయనకు బాలుని చూపితే ఆయన ఈ బాలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఈతనిని కృష్ణ అన్న పేరుతో పిలవండి అనిచేప్పినారు. ఈ ప్రకారముగా ఆయన గూర్చి ఏమి చెప్పుకొన్నా విచిత్రమే! పైగా అతిచిన్నవయసులోనే మహాబలవంతులగు రాక్షసులను చంపడము వేరు ఏ అవతారమునందునూ జరుగలేదు.
కృష్ణునికీ కాత్యాయనీ వ్రతానికీ గోపికావస్త్రాపహరణానికీ సంబంధం ఏమిటి అన్నది ఒకసారి చూస్తాము. వ్రజభూమిలోగోపికలు నందకిశోరుడే భర్తకావాలని కాత్యాయనీవ్రతంచేస్తారు. కాళిందిలో(యమునలో) స్నానంచేసి అమ్మవారిని పూజిస్తారు. తమ వస్త్రాలు ఒడ్డునే ఉంచి నదిలోదిగుతారు. స్నానంచేస్తూండగా కృష్ణుడు వచ్చిఆ వస్త్రములు అపహరించి ఆప్రక్కన ఉన్న వృక్షంపైన ఎక్కి వాళ్ళను పిలుస్తాడు. మీరు వస్త్రాలు లేకుండా వ్రతభంగం చేసినారు. (నదీ స్నానమునాచారించునపుడు వస్త్ర ఆచ్చాదన లేకుండా స్నానము చేయకూడదు.) పైకి వచ్చి నమస్కారంచేయండి. అనిచెబుతాడు. కథ తెలిసినదే. గోపికలు జీవాత్మలు. అజ్ఞానం వస్త్ర రూపంలో వారిని కప్పి యుంచింది. అజ్ఞానపు తెరతొలగిస్తే అంతా పరమాత్మస్వరూపమే. చెట్టుపైనా క్రిందనూ ఉన్న వస్తువు ఒకటే. వ్రతఫలం అప్పటికప్పుడు పురుషరూపంలో కాత్యాయనియే ఐన కృష్ణ దర్శనం లభించింది. వారి అజ్ఞానపు తెరలు తొలగినవి.
పైన తెలిపిన విషయములనుబట్టి శ్రీకృష్ణుడు సకలదేవతా స్వరూపమని, కేవలము విష్ణ్వంష కాదని తెలియవస్తుంది. ఈపరమాత్మ తత్వము ఎతయినా చెప్పుకొంటూ పోవచ్చు. అసలు గోలోక వాసి మరియు రాదా సమేతుడగు  శ్రీ కృష్ణుని ఎతోమంది ఎన్నోవిధములుగా తమ మతమునకు మూలపురుషునిగా చేకొన్నారు.
మహారాష్ట్రమున జ్ఞానేశ్వర్, నామదేవ్, జనాబాయి, ఏక్ నాథ్, మరియు తుకారాం తతతమ పంథాలో శ్రీకృష్ణుని సాధించిన మహాభక్తులు. మీరాబాయి సరేసరి.  చైతన్య మహాప్రభు యొక్క గౌడీయ సాంప్రదాయమును ISCON వారు ప్రపంచాదేశాలలోనే ఎంతో ప్రాచుర్యమునకు తెచ్చినారు. కలిసంతారణ ఉపనిషత్తు లోని హరే కృష్ణ (1) హరేకృష్ణ(2) కృష్ణ కృష్ణ హరే హరే(3) హరేరామ(4) హరేరామ(5) రామరామ హరే హరే(6) ’ అన్నది వీరి మహా మంత్రము. వియత్నాం, కంబోడియ, థాయ్ లాండ్ లో కృష్ణభక్తిని విస్తారముగా మనము చూడవచ్చు.
ఈ విధముగా శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపునిగా కాకుండా గోలోక వాసియగుచు కృష్ణునిగానే కొలువబడినాడు.





దేవుడు ఎక్కడున్నాడు

దేవుడు ఎక్కడున్నాడు

ఒకసారి మీర్జా ఘాలిబ్ మసీదులో కూర్చొని తాగుతున్నాడట. ఎవరో ఆయనని మందలించారట: ఏమిటయ్యా, దేముడి చోటనా నీ తాగుడు అని. దానికి ఘాలిబ్ సమాధానం:
జాహిద్, శరాబ్ పీనేదే మస్జీద్ మే బైఠ్ కర్
యా, వో జగా బతాదే జహాన్ పర్ ఖుదాహ్ నహీ
(బాబూ, మసీదులో కూర్చోని నన్ను సారాయితాగనివ్వు. లేకపోతే ఎక్కడ దేముడు ఉండడో ఆ చోటు చూపించు.)
దానికి ఇఖ్బాల్ తరువాత ఎప్పుడో ఇచ్చిన జవాబు:
మస్జిద్ ఖుదా కా ఘర్ హై, పీనే కీ జగాహ్ నహీ
కాఫిర్ కే దిల్ మేజా, వహా ఖుదాహ్ నహీ
(మసీదు దేముడి ఆలయం, తాగే చోటు కాదు
నాస్తికుడి బుర్రలోకి పో, అక్కడ దేముడు వుండడు)
చివరకి ఫరాజ్ కొట్టిన దెబ్బ:
కాఫిర్ కే దిల్ సే ఆయాహూన్ మై, ఏ దేఖ్ కర్ ఫరాజ్
ఖుదాహ్ మౌజూద్ హై వహాన్, పర్ ఉసే పతా నహీ
(ఫరాజ్, నాస్తికుడి బుర్రలోకి వెళ్ళే చూసి వచ్చాను
దేముడు అక్కడా వున్నాడు, కాని (మత్తులో) వాడికి అది తెలియదు.)

Sunday 23 July 2017

భారవి – సహసా విదధీత నక్రియా

భారవి – సహసా విదధీత నక్రియా

https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_23.html
భారవి దక్షిణభారత దేశానికి చెందినవాడు. పశ్చిమ గంగ సామ్రాజ్యము నకు చెందిన దుర్వినిత మరియు పల్లవ రాజైన సింహవిష్ణు కాలంలో ఈ కావ్యరచన గావించినట్లు తెలియవస్తూ వుంది. చాలా మంది సంస్కృత కవులవలెనే  భారవి జీవిత విశేషాల గురించి కూడా చాలా కొద్ది సమాచారం మాత్రమే లభ్యమవుతోంది. క్రీ.పూ 634 సంవత్సరానికి చెందిన చాళుక్యుల శాసనంలో కాళిదాసు మరియు భారవి పేరు పొందిన కవులుగా పేర్కొన్నారు. 8వ శతాబ్దానికి చెందిన మాఘ కవి, భారవిచే ప్రభావితుడయినాడని ప్రతీతి. దురద్ర్ష్టకరమగు విషయమేమిటంటే భారవి  రచనల్లో మనకు కిరాతార్జునీయం మాత్రమే లభ్యమవుతూ వుంది. 'ఏకోపి గుణవాన్ పుత్రః నిర్గుణైన శతిరపి' అన్నట్లు భారవి ఒక్క కావ్యంతోనే ప్రఖ్యాతి గాంచినాడు.
కిరాతార్జునీయమునకు తెలఘాణ్యమునకు చెందిన మల్లినాథ సూరి గారు ఘంటాపథ వ్యాఖ్యానము వ్రాసినారు.
కిరాతార్జునీయమునండలి ఈ శ్లోకము సుప్రసిద్దము. ఒక పర్యాయము ఈ కతనమును ఆసాంతమూ చదవండి.
శ్లో. సహసా విదధీత న క్రియా

మవివేకః పరమాపదాం పదం

వృణుతే హి విమృశ్యకారిణం


గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః - 
  
సంస్కృత సాహిత్యంలో భారవిది తిరుగులేని స్థానం. అతని కవిత్వంలో ఉండే గొప్పదనం" భారవే రర్ధగౌరవమ్" అనేయీప్రసిధ్ధివల్ల తెలుపబడుతోంది. అంటే ,చాలాఅర్ధవంతంగా కవిత్వం చెపుతాడని భావం! పైశ్లోకం యితని కిరాతార్జునీయం కావ్యమ్ లోనిది.
పాండవులు అరణ్యవాసంలోఉన్నారు. అరణ్య, అజ్ఙాత వాసాలుముగిసినా సుయోధనుడు తమరాజ్యం తిరిగి యిస్తాడనేృనమ్మకంలేదు. అందువల్ల తమప్రయత్నంలో తాము ఉండటం మంచిదని కార్యాచరణగురించి సమావేశమయ్యారు. అప్పుడు ద్రౌపది వారితో అన్నమాటలు ఈశ్లోకంలో ఉన్నాయి.
“ఏపనిచేసినా చాలాజాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు పనికి రాదు. అవివేకం అనేక కష్టనష్టాలకు మూలం. బాగాఆలోచించి కార్యనిర్వహణమునకు పూనుకొనే వివేక వంతుని సద్గుణములయందు ప్రీతిగల సంపదలు స్వయముగా తామేవచ్చి వరించునుగదా"- అంటున్నది.
ద్రౌపదిని కేవలం స్త్రీగాభావించి తక్కువ చేయరాదు. ఆమెనీతిశాస్త్ర విశారద.చక్కని నైతికోపదేశముచేసింది. దీనివెనుక నేపధ్యముగా కవికి సంబంధించిన యొక కథ వినవచ్చుచున్నది.
భారవి మహాపండితుడైనను, లోకులకడ నాతని పాండిత్యమును భారవి తండ్రి మెచ్చెడివాడుగాదట! "ఆపోదురూ వాడేంపండితుడు?వట్టి కుర్రకుంక" యని చెప్పుచుండెనట. ఆమాటలు భారవికి మనోవేదన గలిగింప యెటులైన తండ్రిని మడియింప వలసినదేయను ధృఢసంకల్పమును గైకొనెను.
పాతకాలంలో ప్రతియింట వంటింటిలో పైన సామానులుభద్ర పరుచుటకు అటకలు ఉండెడివి. తండ్రిని జంపనెంచి కవిగారు అటకనెక్కి నక్కి కూర్చున్నాడు. చేతిలోనొక పెద్ద రుబ్బురాయి ఉన్నది. దానితోతండ్రిపని పూర్తిచేయ నాతనితలంపు.భోజన సమయమునకు ఆతనితండ్రివచ్చి వంగదిలో పీటపై కూర్చున్నాడు.భారవితల్లి యతనికి వడ్డన చేయుచు"మీరు పదేపదే భారవిని అవమానించుట తగునా? వాడెంతో కుమిలిపోవుచున్నాడో మీకుతెలియునా? యికనైన మానుకొనుడ"న, భారవితండ్రి 
"పిచ్చిదానా! నేనెరుగనా వాడి పాండిత్యము? అట్టిసత్పుత్రుడు జన్మించుట మనయదృష్టముగదా! అయినను వాడి యెదుట వాని పాండిత్యమును పొగడరాదు. అట్లుచేసిన గర్వపరుడై యహంకారమున జెడిపోవును. నామాట నమ్ముము. మనవాడు గొప్పపండితుడేకాడు గొప్ప కవి కూడా! అందులో సందేహమేలేదు." అనిపలికెను. అందుకే పెద్దలు ఈ విధముగా తెల్పినారు అని ఈ మాటను భార్యకు తెలియబరచినాడు:
ప్రత్యక్షే గురవః స్తుత్యా
పరోక్షే మిత్రబాన్ధవాః
కార్యాన్తే దాస భృత్యస్య
పుత్రఃస్తుత్య కదాచన
గురువులను ప్రత్యక్షముగా పొగడవలెను. బంధుమిత్రులను పరోక్షమున

పొగడవలెను. కార్యము ముగిసిన పిమ్మట దాస దాసీ జనములను పొగడవలెను. కానీ సంతానమును మాత్య్రము ఎప్పుడూ పొగడరాదు.
ఆమాటలువిని పశ్చాత్తప్తుడై యటక దిగివచ్చి తండ్రి కాళ్ళపై బడి క్షమింపగోరెనట! అంతేగాక అందుకు తగిన శిక్షను ఇచ్చితీరవలేనని కోరెనట.
ఫరవాలేదని అన్నా వదల లేదు. ఇక మార్గాంతరములేక ఆయన పుత్రునితో భార్యా సమేతముగా ఒక ఆరు నెలల కాలము ఆత్తగార్తింట్లో ఉండమన్నాడు.
ఇదికూడా శిక్షేనా అని మది తలచి తండ్రిని ఇంతకన్నా పెద్ద శిక్ష వేయం,అని కోరినాడట. తండ్రి “ ముందు దీనిని అనుభవించిరా! ఆపిడప నీవు నీకీశిక్ష చాలలేదు అనిపిస్తే అప్పుడు నీకు ఇంతకు మించినది విధిస్తా” నన్నాడట. వల్లెయని  భారవి తన భార్య చారుమతితో‌, మావఁగారు  అన్నంభట్టు ఇంటికి చేరుకున్నాడు.  అంతా మహామర్యాద చేసినారు. తమ ఊళ్ళో భారవి పేరు గొప్పగా  మారుమోగుతోందో తమకు ఎంత గర్వంగా ఉందో‌ పస్దేపడే చెప్పినారు. భారవికి సంతోషం‌ కలిగింది. రోజులు గడవటంతో మెల్లగా మర్యాదలు మాయమైనాయి. అల్లుడుగారి రాకకు కారణం అడిగితే సమాధానం లేదు. మామతో సహా ఇంటిల్లపాదీ చీదరించుకోవటం మొదలుపెట్టినారు. మెల్లగా పొలంపనులతో సహా అన్నిపనులూ వారు అప్పగించ మొదలుపెట్టినారు. భారవికి తండ్రిగారు వేసిన శిక్ష యొక్క అంతరార్థము తెలియవచ్చింది.
ఒకరోజున చారుమతి ఎప్పటి లాగానే పొలానికి అన్నం తీసుకొని వచ్చి, కళ్ళనిండా నీళ్ళునింపుకొని భర్తతో “ నా పరిస్థితి దినదినానికీ చౌకబారిపోతూ వుంది. రేపు వరలక్ష్మీవ్రతము చేసుకొనే యోగము నాకున్నట్లు లేదు. వదినలు ఏర్పాట్లు వైభవంగా చేసుకుంటున్నారు. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. ణా బతుకునకు కనీసం‌ కొత్తచీరైనా లేదు కదా!” అని వాపోయింది.  భారవి ఆమె బాధను అర్థము చేసుకొన్నవాడై  కొంచెం ఆలోచించి చిరునవ్వుతో‌ "ఈ వూళ్ళో వరహాలసెట్టి నా మిత్రుడని నీకూ‌ తెలుసు కదా. ఇదిగో‌ ఈ‌ శ్లోకం అతనివద్ద తాకట్టు పెట్టి అతడిని అడిగి డబ్బు తీసుకొని కావలసిన  సరకులు తెచ్చుకో తరువాత ఆ అప్పును నేను తీర్చుతాను” అన్నాడు.
వరహాల సెట్టి ఆమె చెప్పినది సాంతము విని శ్లోకాన్ని కళ్ళకద్దుకుని, " రేపుండే వాణ్ణి కాదు ఊళ్ళో. కావలసినంత తీసుకోండి. తాకట్టు పెరుతోనయినా ఆయన వ్రాసిన శ్లోకమును నావద్ద ఉంచుకొనే అదృష్టానికి నోచుకొంటాను" అన్నాడు. వరలక్ష్మీ వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి. వదినలకూ‌ అన్నలకూ‌ మరి నోట మాట రాలేదు.  వరహాలసెట్టి దేశంతర సముద్రయానమునకు వెళ్ళిపోయినాడు. ఆరు నెలల కాలము ముగిసిన పిమ్మట భారవి దంపతులు ఉన్నవిషయమును ఇంట్లో తెలియజేస్తే వారెంతో శిగ్గుచేంది క్షమాపననర్తించి ఉచిత మర్యాదలతో వారిని సాగనంపినారు.

వరహాల శెట్టి సముద్రవ్యాపారంలో ఓడమునిగి ఎన్నో ఇబ్బందులుపడి వూరు చేరుకొన్నాడు. పూర్తిగా చీకటి పడింది. ఇద్దరూ ఒకరినొకరు చూచుకొని ఆనందాతిశయమును అనుభవించినారు కానీ  ఇంట్లో ఎవడో నవయువకుడు మ్+అంచముపై పడుకొని యున్నది గమనించి ఆవేశం‌ అణచుకోలేక తనతో తీసుకుపోయిన పెట్టెలో వున్న బాకును  తటాలున బయటకు లాగినాడు. ఒరతో సహా పట్టుబట్టలో చుట్టి యున్న ఏదో తాళపత్రం బయట పడింది. దాన్ని తీసి చదివినాడు అంత ఆదుర్దాలో కూడా! అందులో ఆయనకు మనము పైన తెలిపిన శ్లోకమే కనిపించింది.
శ్లో: సహసా విదధీత న క్రియా
మవివేకః పర మాపదాం పదం
వృణుతేహి విమృశ్య కారిణో
గుణ లుబ్ధాః స్వయమేవ సంపదః!!
 
అంత కోపం లోనూ ఆ శ్లోకం భావం తలకెక్కింది శేట్టిగారికి. కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చెడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి అని. వరహాల శెట్టి నెమ్మదించినాడు. వివరము కనుగొనిన తరువాతే కర్తవ్యమును  ఆలోచించవచ్చును అని శాంతించినాడు.

తెల్లవారింది. ఊరంతా అభినందనలు తెలుపుతూ వుంటే శేట్టిగారికి మాత్రము కోపము కట్టలు తెంచుకొని వస్తూ వుండినది. అంతం+అంది సమక్షములో ఏమీ అనలేక నిలబడిన అతని వద్దకు ఆ యువకునితెచ్చి శెట్టిగారిభార్య “ఈయనే మీతండ్రి. ఆయన సముద్రయానము చేయబోవు సమయమునకు నిన్ను కడుపులో మోస్తూ వుండినాను. ఆయనకు పాదములంటి నమస్కరించ”మని చెప్పింది.  విషయం అర్థమయిన శెట్టి ఎంత ప్రమాదం తప్పిందీ! ఆ శ్లోకం రక్షించకపోతే ఇంకేమన్నా ఉందా! అనుకున్నాడు. విషయమును వివరముగా భార్యతో చెప్పినాడు. అంతటితో ఆగక భారవి దంపతులను ఎంతో మర్యాదగా తమ వూరికి రప్పించి కనకాభిషేకము చేయించి తన కృతజ్ఞత చాటుకొన్నాడు. భారవి ఇచ్చిన డబ్బు తీసుకొనక ఆయనకు ధనకనక వస్తువాహనములనిచ్చి సగౌరవముగా వారిని వారి వూరికి పంపినాడు.
మానవతా విలువను ఒకసారి గమనించండి. ఎదుటి మనిషిని, కంటి చూపు సాక్ష్యాధారముగా కొని దండించరాదు అని తెలియుట లేదా! చూచినారుకదా! ఆలోచన మనిషియావేశము నరికట్టినది. అనర్థము జరుగ కుండా కాపాడినది. కాబట్టి మీరందరూ బాగాయోచించి పనులు చేస్తూ ఉండుట అన్నది ఇందలిఉపదేశము.
మన కావ్యాలను  చదివితే ఎటువంటి HR TRAINING PROGRAMMES కు పోవలసిన అవసరము వుండదు.


స్వస్తి.

Tuesday 11 July 2017

దార్ (دار)


దార్ (دار)
దార్ (دار) అన్న పదానికి ఇల్లు, నివాసము, నెలవు, భవంతి,భూమి దేశము మొదలగు అర్థములు నిఘంటువులో కనిపించుతాయి. 'దరి' అన్న అర్థము కూడా సమంజసమేమో అని నాకనిపిస్తుంది. దరి అంటే 'ఒడ్డు'. ఈ విభాగాలను గూర్చి 'ఖురాను' లో గానీ 'హదీసు' లేక 'హథీథ్'లలో గానీ కనిపించదు. ఈ 'హథీథ్' అన్న మాటకు ఖురాను లో చెప్పబడినది కాక, ముసల్మానులకై  ప్రవక్త ప్రవచనము అన్న అర్ధముగా, చేయ తగినవి చేయ తగనివి అని తెల్చిచేప్పే వివరణలు గా  గ్రహించవచ్చునని నా అభిప్రాయము. స్థూలముగా ఈ దార్ అన్నది రెండు విధములుగా విభజింపబడినది.
1. దార్ అల్ ఇస్లాం 2. దార్ అల్ హర్బ్ అని.
1. దార్ అల్ ఇస్లాం : అంటే శాంతి నివాసము అని అరబిక్ భాష రాని మనము అర్థము చేసుకొనవచ్చును. ఇది పూర్తిగా ముస్లిం సామ్రాజ్యమై వుంటుంది సౌది అరేబియా లాగా.అక్కడ పాలకుల మాటే వేదము. ప్రజల నోటికి తాళము. ఆదేశమునకు హిందువు పోతే తన పండుగలు పబ్బాలు గానీ, వ్రతములు నోములు కానీ చేసుకోన వీలు లేదు. అంతెందుకు దేవుని చిత్రమును జేబులో ఉంచుకొనుట కూడా నేరమే! ఇచట వారి మతము మాత్రమే చెల్లుబాటవుతుంది. అన్యమతస్థులు అక్కడక్కడ వున్నా, అసలు మతానికి అనుకూలముగా తమను మలచుకోనవలసినదే! షరియాకు అంటే ముస్లిం న్యాయ వ్యవస్థ కు కట్టుబడి ఉండవలసిందే!
దీనిని అబూ హనీఫా ఏర్పరచినట్లు చెబుతారు . ఇందలి ప్రధానాంశాలు ఈ విధముగా వుంటాయి.
1. ముస్లిములంతా ఆ దేశముతో, ఆ దేశములో సంపూర్ణమగు సుఖమును పొందవలెను.
2. అట్టి దేశము ముస్లీముల చేత మాత్రమె పరిపాలింపబడవలెను.
3. ముస్లిం దేశములతో సరిహద్దులు కలిగియుండవలెను.
2. దార్ అల్ హర్బ్ (دار الحرب) ' యుద్ధభూమిగా అర్థము చెప్పుకోనవచ్చును.
దీనిని దార్ అల్ ఘర్బ్ అని కూడా అంటారు. అంటే పాశ్చ్యాత్య నిలయము అని మనము అర్థము చేసుకొన వచ్చును. హర్బ్ అన్నది జిహాద్ కు దగ్గరగా వుండే అర్థము వస్తుందని కాబోలు దానిని ఘర్బ్ అని ఒక క్రొత్త పేరు పెట్టినారు. ఇచ్చట ముస్లీములకు ప్రత్యెక చట్టము ఉండదు. ప్రత్యెక రాయితీలు కూడా వుండవు. ఇప్పుడు అరేబియా దేశములు ఐక్యరాజ్య సమితి సభ్యులు కావున ఈ విభాగము యథాతథముగా వాడుకలో లేదు. కానీ వారి మతము మెజారిటీ లో వున్నది అంటే ఈ దార్ అల్ హర్బ్ ను పాటించుతారు.
మెజారిటీ గావున్న కాశ్మీరు ముస్లిములు అచ్చట పండితులను ఎంత క్రూరముగా చంపినదీ, హిందూ స్త్రీలను మాన భంగము చేసినదీ, పురుషులను తుపాకులతో బెదిరించి మతమును మార్పించినది దూరముగా వున్నా మనము తలచుకొంటేనే ఓడలు కంపించుతుంది. మరి అచట వుండి అనుభావిన్చినవారికి ఎంత వ్యథ భయము మానసిక ఉత్పాతము కలిగియున్తుందో మనము ఊహించుకొన వచ్చును.  మిగతా వారు ఎంత కష్టపడి తప్పించుకొని వచ్చినదీ మనకు తెలియని విషయములు కాదు. ఇక పాకిస్తాన్ ను గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. 1947 లో 25% వున్నా హిందూ జనాభా 2014నకు 1% అయినది. మనము హాయిగా A.C. గదిలో కూర్చుని ఎన్నో విషయములను విశ్లేశించుతూ వున్నాముగానీ ఒక్క సారయిన సాటి హిందూ సోదరుల దయనీయ స్థితిని గూర్చి చిన్తించుచున్నామా! అక్కడి ముస్లీముల లాగా మనము ఇక్కడి ముస్లీములతో వ్యవహరించుచున్నామా! బంగ్లాదేశ్ లో హిందువులు  1947 లో 31% 2012 కు 9% వున్నారు. లక్షల మందిని ఊచకోత కోయగా, చెరబట్టి మత మార్పిడులు చేయగా ఎంతో మంది భారత దేశానికి వలస వచ్చినారు. 1951 లో 9.93% వుంటే 2011 నాటికి 14.23% వున్నారు. దీనిని బట్టి ఈ దేశము యొక్క ఔన్నత్యమును తెలుసుకోవచ్చు. మనము క్షేమముకదా అన్న స్వార్థ చింతన వీడి ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణ మారణ హోమములు జరిగిపోయినాయో!  ఈ విషయములను పదే పదే  వివిధ విధములగు ప్రసార మాధ్యమముల ద్వారా జన బాహులళ్యమునకు తెలియజేయ వలసిన బాధ్యత మనకు వుంది. ‘ఇది వాళ్లకు తెలియనిది కాదు’ అని అనే వాళ్ళు మనలో ఎక్కువమంది ఉంటారు.
ఇది ఒక Amazon ad లాంటిది. Amazon అందరికీ తెలిసిందే! అయినా విరివిగా ads వాళ్ళు వేస్తూనే వుంటారుకదా! ఇదీ అంతే. ఉత్తర ప్రదేశ్ లోని మావ్ జిల్లాలో 42.98% హిందువులుంటే 56.76% ముస్లిములున్నారు. ఇది ఎప్పటికయినా ముస్లిం దేశమే కావచ్చు. కేరళలోని మల్లపురము లో హిందువులు అతి తక్కువ. అంతా ముస్లిములే! ఏహిందువయినా చేత కాక తన భూమిని అమ్ముకొనవలెనన్నా దానిని ముస్లిములకు మాత్రమె అమ్మవలేనన్న చట్టమును అచ్చటి స్థానికులు ప్రవేశపెట్టినారు. తమిళనాడులోని ముస్లిములు 5% అయితే, తమిళనాడు లోని వెల్లూర్ వద్ద నున్న మేల్ విశారం లో  హిందువులు 22.97% అయితే ముస్లిములు 76.12% వున్నారు. ఇది మునిసిపాలిటి. ఇక్కడ వారు ఏమి చెబితే అదే జరిగేది. స్వంత దేశములోనే ఎంత బాధను భారించుతున్నారో చూడండి హిందువులు. ఇచట తమ మతములోకి మారిన వారికే తగిన వసతులు కల్పించుతామని వారు చెబితే శ్రీ సుబ్రమణ్య స్వామిగారిని అచ్చటి తమిళ్ మోర్చా వారు ఆహ్వానించితే ఆయన  మెల్వె విశారం వెళ్లి నయానో భయానో అది పరిష్కరించినారు.

దీనిని  3.దార్ అల్ దవా  4. దార్ అల్ అమన్ అని రెండు భాగాలుగా వ్యవహరించుతారు.
3. దార్ అల్ దవా: ముస్లిములు మైనారిటీ లో వున్నా మెజారిటీ లో ఒకే మతము ఉండక  పలుమతములుంటాయి. అప్పుడు ముస్లీములు తమకు కావలసిన రాయితీలనన్నిటినీ మరీ మరీ అడిగి తీసుకోనవలెనని ఆమత పెద్దలు చెప్పినారు. అప్పుడు క్రమేణా వారు తమ మతప్రయోజనములను కాపాడుకొంటూ ముందునకు సాగిపోతూ వుంటారు.
4. దార్ అల్ అమన్ : ఇందులో వారి పాత్ర ఎక్కువగా ఉండదు. వీరు మైనారిటీ లో వుంటారు మెజారిటీ రిలిజియన్ ఒకటే ఒంటుంది. వారు కట్టిందే రక్ష వారు పెట్టిందే భిక్ష అన్నట్లు ‘కుక్కిన పేను వలె’ ఉండవలసిందే! ఒకసారి ఆష్ట్రేలియా లో ఒక ఇమాం మాకు ‘COMMON CIVIL CODE’ వద్దు షరియా కావాలన్నాడు. వెంటనే ఆ దేశపు ప్రధానమంత్రి అవన్నీ కుదరవు వుంటే వుండండి పోతే పొండి అన్నాడు. తెల్ల వారుతూనే ముస్లిం ప్రతినిధులు ఆ ఇమాం తెలియక అన్నాడు  COMMON CIVIL CODE’ మాకు సమ్మతమే అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మైనారిటీస్, మెజారిటీ జన జీవన స్రవంతి లో కలిసిపోతేనే దేశములో ఉండమన్నాడు . అదేవిధముగా ఇంగ్లాండ్ లోని ఒక పట్టణపు మేయర్ తో ఒక ఇమాం భోజనశాలలో pork పెడుతున్నారంటే మీరు మా కట్టుబాట్లకు అనుకూలముగా ఉండవలసిందే అన్నాడు. మళ్ళీ వాళ్ళు నోరు మెదపలేదు. మనము మాత్రము ముస్లిం హోటళ్లకు పోయి వాళ్ళు పెట్టింది తిని వస్తూ ఉన్నాము, అందులో beef ఉందా అనికూడా విచారించకుండా.

మీరు ప్రతిఘతించండి, వారిపై కత్తులు దూయండి, తరిమి పారగొట్టండి అని నేను చెప్పుట లేదు. మీరు సాటి ముస్లిమును మీ ప్రాంతములో చూసుకొనే రీతిలో వారు సాటి హిందువును చూచుకొనుట లేదు అని తెలియజేస్తున్నాను.   ఈ విధముగా ముస్లిముల మత అసహనము రాను రానూ ప్రాకితే ప్రత్యక దేశాలు అగుటకు ఎక్కువ సంవత్సరములు పట్టకపోవచ్చు. సమరస భావన కలిగిందంటే సంతోషము సర్వత్రా వెల్లివిరుస్తుంది.

నాకెందుకు నాకెందుకు అని ఉండిపోవద్దు. ఇటువంటి వ్యత్యాసములు రాకుండా చూసుకోనవలసిన బాధ్యత యువతదే!


Saturday 8 July 2017

కుమారిలభట్టు

కుమారిలభట్టు
https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_8.html
ముందు ఈ విషయమును ఒకసారి పునశ్చరణ చేసుకొందాము. 1 లేక రెండవ శతాబ్దములో అశ్వఘోషుడు వ్రాసిన బుద్ధ చరిత ఆధారంగా గౌతమ బుద్ధుడు క్రీస్తుకు పూర్వము 6 వ శతాబ్దమువాడని మనకు తెలియవచ్చుచున్నది.
'విమర్శకాగ్రేసర''భారత చరిత్ర భాస్కర' మహామహులైన కోట వెంకటాచలం గారు శంకరులవారి కాలాన్ని సహేతుకంగా నిరూపించినారు. ఆ వెలుతురులో మన యానము ప్రారంభించుదాము.
శంకరుల కాలమునుండి అవిచ్ఛిన్నముగా గురుపరంపర గలిగిన జోషిమఠము,పూరి,ద్వారక,కంచి మఠములు కలి 2593(క్రీ.పూ. 509) శంకరుల కాలంగా నిర్ణయించినారు.
కుమారిల భట్టు, (శంకరులకన్నా 48 సం. పెద్దవారు).  వారు తుషాగ్ని లేక కుమ్ము (వేరుసెనగ పొట్టు నివురు గప్పిన నిప్పు)లో ఆత్మాహుతి చేసుకొనుచున్న అవసాన దశలో శంకరులవారు వారిని కలిసినట్లు ఈ క్రింది శ్లోకములో చెప్పబడినది.
ఋషి ర్బాణ స్తధా భూమి ర్మర్త్యాక్షౌ వామమేళనాత్|
ఏకత్వేన లభేతాంకం తామ్రాక్షా తత్ర వత్సరః|
ఋషి =7(సప్తర్షులు),బాణ(మన్మధ బాణములు)=5,భూమి=1,మర్త్యాక్షు (మానవుని కన్నులు)=2 ,తామ్రాక్ష =రక్తాక్షి నామ సంవత్సరము
విలోమముగా లెక్కించితే యుధిష్ఠిర శక (జైనులు ,బౌద్ధులు యుధిష్ఠిర శకమును పాటించుతారు. ఆయా మతములకాద్యులు క్షత్రియులు కావుననేమో.)2157 సం. న నిర్యాణమని చెప్పబడినది.
ఈ విషయమును ఎందుకు చెప్పవచ్చినానంటే చాలామంది పాశ్చాత్యులకనుయాయులగు చరిత్రకారులు క్రీస్తుకు పూర్వము 4 శతాబ్దికి చెందిన ఈ మహనీయుని కాలమును క్రీస్తు శకము 6 నుండి 8 వ శాతాబ్ది వరకు లెక్క కట్టినారు. అందుకే నేను బుద్ధుని కాలము తెలిపి ఆతరువాత దాదాపు 2౦౦ సంవత్సరముల కాలములో ఆ మతము యొక్క విస్తరణ ప్రబలమై వైదికము తిరోన్ముఖము పట్టదొడంగినపుడు 4వ శతాబ్ది లో ఈయన జన్మించినాడని తెలియజేసినాను. వాస్తవము తెలుపవలెను/వాస్తవము తెలుసుకోవలెను అన్న జిజ్ఞాస ఉంటేనే కొంత పరిశోధన చేయగలరు ఎవరయినా! అదిలేకపోతే నిజమును నిగ్గుదేల్చ వీలుపడదు కదా!
శంకరుల చే శృంగేరి మఠ ప్రధమ పీఠాధిపతిగా, శంకరుల వారిచేతనే నియమింపబడ్డ మండన మిశ్రులవారి (సన్యాస నామము సురేశ్వరాచార్యులు) ప్రధమ గురువులు కుమారిలభట్టు మాన్యవరులు 'తంత్రీ వార్తీకం' అన్న పుస్తకం వ్రాస్తే దాని వ్యాఖ్యానము  భట్ట సోమేశ్వరులవారు వ్రాసినారు.
ఇక కుమారిలభట్టు గారిని గూర్చి తెలుసుకొందాము.
ఆంధ్రులు ఆటవికులు కాదు అన్న విషయమును మహనీయులు వేదమూర్తులునాగు కోట వెంకటాచలము గారు సహేతుకముగా సాధికారికముగా బలపరచినారు. ఆంద్ర బ్రాహ్మణులు వేదవిద్యా సంపన్నులేగాక మహా విద్వామ్సులగా కూడా పేరెన్నికగన్నవారు. ఇప్పటికి కూడా ఆంధ్రబ్రాహ్మణులు వేదపఠనమునందసమాన ప్రజ్ఞగలవారని డాక్టరు భాండర్‌కర్ మొదలగు విద్వాంసు లభిప్రాయము లిచ్చి యున్నారు. వేదవేత్తలయి ప్రఖ్యాతిగాంచిన యాంధ్ర బ్రాహ్మణులలో కుమారిలభట్టు మిక్కిలి ప్రముఖుడుగానున్నాడు.  ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను. ఈ  మతమునకే పూర్వ మీమాంస యని పేరు. ఇది కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపఱచుకొని హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని నిరసించెడు జైనబౌద్ధమతముల ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక ధర్మమునుప్రబలజేసెను ఈకుమారిలభట్టునకు భట్టపాదుడను మఱియొకపేరుగలదు. ఈతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందఱు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు జెప్పబడియుండుటచేత నాంధ్రుడని విశ్వసింపవచ్చును. జినవిజయమను జైనగ్రంథమునం దీక్రిందిశ్లోకము గానంబడుచున్నది.
శ్లో. ఆంధ్రోత్కలానాం సంయోగే పవిత్రే జయమంగలే
గ్రామే తస్మిన్ మహానద్యాం భట్టాచార్యః కుమారకః
ఆంధ్రజ్యోతి స్తిత్తిరిరో మాతా చంద్రగుణాసతీ యజ్ఞేశ్వర పితాయస్య.
ఈ విషయము ఒక విధముగా ఆంధ్రుల గొప్పదనమును మరియు కుమారిల భట్ట మహాశయుని వంటి ప్రతిభా సంపత్తి గలిగినవారు ఈ ఆంధ్రజాతి మకుటమునకు శ్యమంతక మణులై ఈ జాతిని ప్రభావింప జేసినారని తెలియవస్తూ వుంది. ఇక కుమారిల భట్టుగారిని గూర్చి నాకు తెలిసిన మేరకు తెలియజేస్తాను.
కుమారిలభట్టు
ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధము వ్యాప్తిలో యుండినది.  బౌద్ధము వేదమును అంగీకరించదు.  బౌద్ధమును ఖండించి  ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచిఅందరినీ తిరిగీ వేదమార్గమున నడిపించుతకా అన్నట్లుకుమారస్వామి కుమారిల భట్టుగా వెలసినారని చెబుతారు.  వేదవిజ్ఞాన సంపంనుడగు ఆ మహనీయుడు అవైదిక మతములచే మన సనాతన ధర్మముపై నీలినీడలేర్పడుటకు అంగీకరించక పోవుటేగాక దానిని ఖండించి వేదమతమును పునఃప్రతిష్ఠ త్రికరణశుద్ధిగా చేయ దలచినాడు.
నాటి మహామహానుభావులు ఏవిషయమునయినా సాకల్యముగా సమగ్రముగా సాధికారకముగా తెలుసుకోకుండా ఖండించే ఆలోచనే కలిగియుండేవారు కాదు. నేడు మనము ఆ బాట తప్పి చాలా దూరము వచ్చివేసినాము. కేవలము వాచాలత వాదమునకు ఎన్నటికీ పరిపుష్ఠి చేకూర్చదు. అందువల్ల ఆ శ్రేష్ఠతరుడు తన నిత్య నైమిత్తిక వేద కర్మలను తాత్కాలికముగా తగ్గించుకొన్నాడో లేక తాత్సారమే చేసినాడో కానీ  ఒక బౌద్దారామమునందు ఆయన చేరినది ఒక చారిత్రిక సత్యము. 7 అంతస్తులను కలిగిన ఆ కట్టడము బౌద్ధమునకు కాణాచియై యుండినదట.  ఆయన, అచటి ఉపాధ్యాయులు  సనాతన ధర్మమును ఖండించి చెప్పునపుడు  కంట తడి పెట్టుకొనేవారట.   ఒకరోజున గురువు అది గమనించి  ఎందుకు ఏడుస్తున్నావు? అని అడగగా అపుడు ఆయన సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను అని ఆయన అబద్ధం చెప్పారు. ఆ సమయమున మానసికముగా ఆయన ఎంత కృంగిపోయి వుంటాడో!
వంచన, మంచికేనైనా చెడ్డకేనయినా కలకాలమూ గుప్తముగా వుండిపోదు. ఆయన అసలు రహస్యము ఆ బౌద్ధ సంఘమునకు తెలిసిపోయింది. ఆయనకు చెప్పకుండా వారు 7 అంతస్తునకు తోడుకొని పోయి అచ్చట నుండి త్రోసివేసినారు ఆయన చేసిన వంచనకు ప్రతీకారముగా!

 అపుడు కుమారిల భట్టు క్రింద పడిపోతూ  వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మమే సత్యమయితే   నేను భూపతనమయినా మరణించకుందును గాక అని మనఃపూర్వకముగా తలచినాదట.  కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చుట తప్పించి ప్రాణహాని కలుగలేదు.
 ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి? అని అడిగాడు.
మనము ముఖ్యముగా భాగవతములో  అశరీరవాణి పలికింది అని వింటాము. అశరీరవాణి అంటే వేరేమీకాడు వేదమే! ఇప్పుడు ఆ వేదమే అశరీరవాణియై పలికింది. సంపూర్ణ ధ్యాననిష్ఠాగరిష్ఠులగు మునివర్యులకు మాత్రమే అది వినిపిస్తుందు కాబట్టి  దానికి శృతి అని పేరు వచ్చింది. గురుశిష్య పరంపరలో వింటూ స్వరం తెలుసుకుని పలుకుతారు కనుక ఆవిధముగాకూడా అది శ్రుతిఅగుచున్నది. అట్టి శృతిణి నమ్మిన నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది అని అడిగినాడు ఆయన. ఆయనకు సమాధానము  ఈ విధముగా అందినది. నీవు వేదమే ప్రమాణం అయితే అన్న మాటలో సంశయము కనిపించింది. ఆ అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది. అని వినిపించింది.
తన మీద తనకే ఒకవిధమగు ఎహ్యభావము కలిగింది కుమారిల భట్టు గారికి. తుషాగ్ని ప్రవేశం చేసినసారు ఆయన. ఊక, వరిదాన్యపు పొట్టు, వేరుసెనగ పొట్టు ఇటువంటివి రగిల్చితే ఒకేసారి మండి బూడిద కావు.రాజుకొంటూ రాగులుకొంటూ పొగను వేడిమిని కలిగించుతూ బూడిద అయ్యేవరకూ కాలుతూనే వుంటుంది. ఆవిధముగా కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్న సమయంలో శంకరాచార్యుల వారు వారివద్దకు వచ్చినారు. తానూ కర్మకాండ కంటే జ్ఞాన యోగము గొప్పదని వారితో వాదించ వచ్చినట్లు తెలిపినారు. అందుకు ఆయన జరిగిన కథనంతా వివరముగా విశదముగా తెలియబరచి ఈ విధముగా తుషాగ్నిలో కాలుటయే తగిన ప్రాయశ్చిత్తమని తలచి ఆవిధముగా చేయుచున్నట్లు తెలిపినాడు. వాదనకు తన శిష్యుడు మండనమిశ్రుడు తగినవాడనిచేబుతూ మాహిష్మతీ నగరములో వుండే ఆయన వద్దకు శంకరులవారిని పంపి క్రమేణా ఆమహనీయుడు తనువు చాలించినాడు.
కుమారస్వామి కుమారిలభాట్టుగా జన్మించి బౌద్ధ, జైన మతములను వృద్ధిజెందనీయక నిలువరించి తన అవతార పరిసమాప్తి గావించుకొన్నారు. పునః ప్రతిష్ఠకై కుమారుని తండ్రియగు శంకరులే లోకశంకరులై ఆదిశంకరులై జగద్గురువులై భూమిపై అవతరించినారు. వారు మండనమిశ్రుని ఓడించిన పిదపనుండీనే పూజా సమయమున జేయు సంకల్పములో ఏ దేవతాపూజ చేస్తూ ఉన్నామో ఆదేవత పేరుజెప్పి ప్రీత్యర్థం అన్న మాటను చేర్చమని ఆదేశించినారు. తరువాతికాలములో ఆయన తిరుజ్ఞాన సంబంధర్ గా తమిళనాడులోని శీర్గాళి లో శివపాదహృదయ, భగవతి దంపతుల బిడ్డగా జన్మించి వైదిక ధర్మమును శివపారమ్యమును చాటినాడు.
పరమేశ్వరార్పణమస్తు.

శుభం భూయాత్.

Thursday 6 July 2017

పాఠక జన గణ మణులకు నాదొక చిన్న విన్నపము

పాఠక జన గణమణులకు నాదొక చిన్న విన్నపము
https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post.html
నాకున్న సముదాయములో నాదయిన మేధో పరిధిలో, ఒకవేళ మీరు వుంది అనుకొంటే, తెలుగులోనూ ఆంగ్లములోనూ పాటో, పద్యమో, వ్యాసమో, హాస్యోక్తులో, పెద్దల నీతి వాక్యములో నా కుడ్యము పై ప్రచురించుతూ వుంటాను. పద్య గీత హాస్యాదులను కొంత కష్టమున్నా వర్ణములతో వర్ణనాతీతము చేయ ప్రయత్నిస్తుంటాను. వ్యాసములను సామాన్యముగా లంకెను జతజేసి గోడకు చేరవేస్తాను. ఏది ఏమయినా ప్రోద్దుబోని కబుర్లు ఉండకుండా వుండే ప్రయత్నము మాత్రము మనఃపూర్వకముగా చేస్తాను.
ఏతావాతా నేను మీనుండి కోరేది ఒకటే! నా ప్రచురణలకు, నాకు ఏదో ప్రాచుర్యము రావలేనని ఈపని చేయుట లేదు. నాది, కేవలము నాకు తెలిసినది తెలియజేయవలేనను తపన. అందువల్ల నేను మిమ్ము కోరేది ఒకటే. మీరు వానిని విరివిగా చదవండి. అభిప్రాయ విభాగము (Comment Box) లో మీ అభిప్రాయమును తెలిపి, నచ్చినది అయితే పదుగురికి పంచండి.
మనకు తెలియని ముప్పు మన మధ్యనే వుంది. ఒక 800 సంవత్సరములకు పూర్వము, మనలో వర్ణాశ్రమ ధర్మములున్నా వానిని వక్రీకరించుకొనక సహజీవనము గడిపినాము. అందుకు మన దేశ ప్రగతియే సాక్ష్యము. ఒకప్రక్క తురుష్కులు వేరొక ప్రక్క అప్రాచ్యులు సామదానభేద దండోపాయాలతో మనలోని బలహీనతలను అందిపుచ్చుకొని తమ తమ మతములలో మన సహోదరుల నెందరినో చేర్చుకొన్నారు. ఆరోజు మనవారే కానీ ఈ రోజు మనపై శత్రుత్వమును పూని ఎన్నో దారుణమగు అభియోగములను మనపైన మన సనాతన ధర్మమూ పైన మోపుచున్నారు. అసలు DNA TEST ప్రకారము హిందువులలో వర్ణ విచక్షణగానీ ఆర్యద్రావిడ విభేదాలుగానీ లేవని, ఆసేతు సీతానగ పర్యంతము అంతా ఒకటేనని శాస్త్రీయముగా నిరూపింపబడినది. ఈ వరవడిని నిలువరించుటకు మనము తప్పక వారి మత గ్రంధములను చదివి తీరవలసినదే! ఒక పరమతస్థుడు సంస్కృతము రాకున్నా వేదములను దాశరథివారి భాష్యముతో చదివి, వేదములు ఏసుక్రీస్తును ప్రతిపాదించినవని ఏకంగా, తాను ప్రామాణికమని తలచే గ్రంధమునే వ్రాసినాడు. మనలో సాంప్రదాయ, సంస్కార పరిధులను దాటకుండా దానిని ఖండించగలిగేవారు ఎందరున్నారు. అదేవిధముగా వేరొక మతమువారు 'అల్లోపనిషత్తు' అన్న ఉపనిషత్తునే మన ధర్మమున జొనిపి మనల వెర్రిగొర్రెలుగా చేయ ప్రయత్నించుచున్నారు. ఇంత ఘోరమునకు వడిగట్టిన వారితో మరి మనము వాదించుటకు వారి లోతుపాతులు తెలుసుకొననవసరములేదా! కుమారిలభట్టు బౌద్ధులతో వాదించుటకు మారువేషమున వారి గురుకులమున చదువలేదా! కుమారిల భట్టును గూర్చి ఈ దిగువ లంకెలో చదువ వచ్చును.(https://cherukuramamohan.blogspot.com/2017/07/blog-post_8.html) ఎదుటి వారితో వాదించుటకు ముందు క్షుణ్ణముగా దానిని గూర్చి తెలుసుకొండి.
తపన లేకుంటే పతనమే! ఈ విషయమును మరువకుండుట మరీ ముఖ్యము.
అందువల్ల చదివి నచ్చితే నచ్చినదని మీ అభిప్రాయమును తెలుపండి లేక ఇంకా నాకు తెలియని, నేను తెలుపని విషయములుంటే తెలియజేసి పుణ్యము కట్టుకొండి.
మనధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే!
చెరుకు రామమోహన్ రావు
Likes: 101 Comments: 53 Syhares : 11

53 Comments

Most relevant

  • Kannaji Rao Jr.
    తప్పకుండా గురూజీ
    2
    • Like
    • Reply
    • 5y
  • Sadanandeeswaraiah Vallamkondu
    మంచి సూచన చేసారు. ధన్యవాదాలు.
    • Like
    • Reply
    • 5y
  • Meduri Venkata Suryanarayana
    మంచి సూచన. తప్పకుండా తెలియ జేస్తామండి. ధన్యవాదాలు
    • Like
    • Reply
    • 5y
  • Venkateswara Prasad
    మంచి సూచన చేశారు
    నమస్తే సార్
    • Like
    • Reply
    • 5y
  • Sarada Rupakula
    మీ రచనలు అన్నీ చదువుతాను నేను. నా స్నేహితులకు కూడ మీ గురించి చెప్పి మీ స్నేహితులుగా చేసాను. మీ పోస్టు ని వారే నేరుగా చదవడానికి వీలుగా.
    • Like
    • Reply
    • 5y
    • Cheruku Ramamohanrao
      చాలా సంతోషం అమ్మా
      కామెంట్ వుంటే అది మరికొందరని చదివింపజేస్తుంది. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకొందాం.
      • Like
      • Reply
      • 5y
      • Edited
  • Cheruku Ramamohanrao
    ISLAM (A small prelude) చదివితే మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.
    • Like
    • Reply
    • 5y
  • Sudha Jandhyala
    తప్పకుండా మనవంతు కృషి చేద్దాం
    • Like
    • Reply
    • 5y
  • Bharati VS
    తప్పకుండా తెలియజేస్తాము
    • Like
    • Reply
    • 5y
  • DrChintalapati MuraliKrishna
    ధర్మ మర్మాలు తెలిసిన ప్రాజ్ఞులు మీరు. మీ విశ్లేషణలు ఉత్తేజకరంగా ఉంటాయి. మీవంటి పెద్దలు ఈరోజుల్లో అరుదు. మాలాంటి అల్పజ్ఞానులం మీ వచోమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. కనుక నిరంతరాయంగా మీ ప్రవచనా లను కొనసాగించండి గురువర్యా!!
    4
    • Like
    • Reply
    • 5y
    • Cheruku Ramamohanrao
      మురళీ కృష్ణ గారు మీ సుహార్ద్రత బహుథా ప్రశంసనీయము. సంస్కారము అనిర్వచనీయము. నాకంత యోగ్యత లేకున్నా మీ అభిమానమునకు కృతజ్ఞతలు.
      • Like
      • Reply
      • 5y
  • Talisetti Venkata Subba Rao
    Good feelingd
  • Brahmasri Chilukuri Venkatappaiah
    పెద్దలకు నమస్కారం ! ప్రస్తుతం మేము చేస్తున్న యజ్ఞం అదే !
    2
    • Like
    • Reply
    • 5y
    • Edited
  • కవిశ్రీ సత్తిబాబు
    గురువరేణ్యా మీవచనములు మాకు అమృతగుళికలు..మీకివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు
    2
    • Like
    • Reply
    • 5y
  • media2.giphy.com
    MEDIA2.GIPHY.COM
    media2.giphy.com
    media2.giphy.com
    • Like
    • Reply
    • 4y
  • Muralikrishna Devarabhotla
    Guruvugariki. Namaskaramulu
    • Like
    • Reply
    • 4y
  • Subramanyam Juturu
    Meeru prachurinche postulanu tappaka chaduvutanu guruvu gaaru! Vinodamu mariu vignanamunu kalagalipi pamputunnaru. Hindu matamu voka pedda gajamu lantidi. Enni shunakamulu ventabadina daanni emi cheyalevu. Charitra grandhalalo aryulanu, dravidulanu konta vakrikarincharu. Southern people dravidulani, North Indians aaryulani voka siddhantamu vundi.
    • Like
    • Reply
    • 4y
  • Savithri Bachimanchi
    తప్పక మీ ప్రవచనాలను పోస్టు
    చేయండి
    3
    • Like
    • Reply
    • 4y
  • Nandyal Vithal
    Maa Prayatnam Memu chestam Andi
    2
    • Like
    • Reply
    • 4y
  • Srinivasa Subrahmanyasai Bhagavatula
    మీరు చెప్పిన విషయము ఆచరించ దగినది.
    చివరి వాక్యము " మన ధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే !"
    అక్షర సత్యము చెరుకూరి వారూ !!!!
    4
    • Like
    • Reply
    • 4y
  • Akella Perisivakumar
    తపన లేకున్న పతనం తప్పదన్నప్పుడు
    మన సనాతన ధర్మాన్ని మన మే పరిరక్షించుకోవడానికి నడుం బిగిద్దాం.
    • Like
    • Reply
    • 4y
  • Ram Josyula
    Intaku memu cheyavalasindi emito selavivvandi cherukuri varu.....
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      మా యింటి పేరు 'చెరుకు' మాత్రమె. 'ఊరు' లేదు. చదివి మీ అభిప్రాయాలను తెలిపితే అది ఇంకా కొంతమంది చదువుటకు దోహదపడుతుంది. విషయ పరిజ్ఞానము ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఎదుటి వానికి మాట్లాడే అవకాశమివ్వక నోరు మూయించగలరు. ఈ విషయమును పైన విశధముగా వ్రాసినాను.
      మీ స్పందన తెలిస్తే నాలో కొంత ఉత్సాహమునునిమ్పి క్రొత్త విషయములు తెలుపుటకు అవకాశము ఇచ్చినవారవుతారు.
      ఈ ధర్మమునకు ఊపిరి యువతయే!
      • Like
      • Reply
      • 4y
      • Edited
    • Ram Josyula
      Tappakunda .....
      2
      • Like
      • Reply
      • 4y
    • Ramalingaswamyp Panamgipalli
      Aaa Tamasha kaakapote cherukuki vooremitandi, annee voolle !annivoollu annirastralalo vuntundi!'meeintiperuto.vooruledani anukonakkaraledu,.annivoollu meeve !
      • Like
      • Reply
      • 4y
  • Satyanarayana Choppakatla
    ఈమధ్యమీసువచనాలులేక ముఖపుస్తకం చిన్నబోయింది రోజుకోసారి చెరకు రసంవడ్డించండి!
    4
    • Like
    • Reply
    • 4y
    View 1 more reply
  • Nageswar Lanka
    Dharmaparirakshana
    ki meeru chesthunna prayathnam sarvada
    Slaghaneeyam
    • Like
    • Reply
    • 4y
  • Parameswara Nitturu
    కుమారిలభట్టు వృత్తాంతాన్ని వివరింపగలరని మనవి చేస్తున్నాను గురువుగారూ.
    2
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      అలాగే. కొంచెము వెసలుబాటు దొరుకుతూనే వ్రాస్తాను
      • Like
      • Reply
      • 4y
  • Satya Rama Prasad Kalluri
    మీకు మా సహకారం తప్పకుండా ఉంటుందండీ!
    • Like
    • Reply
    • 4y
  • Krishna Murthy
    chaala baagundi. yuvatha ituvantivi chadivi tappaka artham chesukoni vaariki telisina vaariki kooda telipite entho upayogakaramgaa vuntundi..._/|\_
    • Like
    • Reply
    • 4y
  • Abburi Nagabose
    మన ద్థెయం సనాతన ధర్మం న్ని పరిరక్షించడమె 'అన్న మీ ధ్యేయం కు నా నమః సుమాంజలు
    • Like
    • Reply
    • 4y
    • Edited
  • బిజుమళ్ళ ఆనంద రావు
    మీ ప)యత్నం ఆరంభించండి. అందరూ క)మంగా తోడౌతారు.
    • Like
    • Reply
    • 4y
  • Thirupathi Pendam
    tq so much sir
    • Like
    • Reply
    • 4y
  • Nittur Guruprasad
    I MISSED MOST OF YOUR GOOD LINES DUE TO MY SCHEDULE. I FEEL YOUR WORDINGS ARE GOODS AND EXPLANATORY ONES. NEEDED TO MANY. THANKS FOR SHARING SUCH A NICE INFORMATION..
    • Like
    • Reply
    • 4y
  • Subbaji Vadlamani
    Rao garu........meeku teluso ledo.......ramayana upanisathulu urdulo vrayabaddayi........manam tapatrayam padakkarledu...PARITRANAYA ..........MEEDA NAMMAKAM UNCHANDI.........Manalo chalamandiki teliyani charitra vishayalu......telusukunte .....ee taoatrayam undadu
    • Like
    • Reply
    • 4y
    • Cheruku Ramamohanrao
      మీరు నకు' తెలుసో లేదో' అన్నారు. నాకు తెలియదు. అసలేదన్నా ఇదమిద్ధముగా నాకు తెలుసునని ఎన్నడూ చెప్పుకోనూ లేదు.
      మీరు దయతో మీ విజ్ఞానమును పంచేది. మీ సలహాకు ధన్యవాదములు.
      మీరు చెప్పినట్లే 'పరిత్రాణాయ.....' మీద నమ్మకముంచుతాను.
      • Like
      • Reply
      • 4y
      • Edited
    • Subbaji Vadlamani
      I am sorry if I have hurt u by my starting words......teluso ledo..............
      • Like
      • Reply
      • 4y
    • Cheruku Ramamohanrao
      Nothing to regret. I am ignorant.
      • Like
      • Reply
      • 4y
  • D Subrahmanyam
    అయ్యా. మీ పోష్టులు చదివి తెలుసుకొని నేర్చుకోవటమే తప్పా కామెంట్ చేసేంత పాండిత్యం నాకు లేదు. మీరు చెప్పినట్లు మనకృషి మనం చెయ్యాల్సిందే. Thank you for the inspirational post
    • Like
    • Reply
    • 4y
    • Edited
    • Cheruku Ramamohanrao
      విజ్ఞానం పంచుదాం విజ్ఞానం పెంచుదాం. ధన్యవాదాలు
      • Like
      • Reply
      • 4y
  • Vetkataramanarao Nidugondi
    చాలా బాగుంది
    • Like
    • Reply
    • 4y
  • Varanasi Gangadhara Rao
    ఈ మాద్యమమంలో మీరు ప్రచురించే ప్రతి వాక్యము అక్షర సత్యం , గాన మీరు ధన్యులు; ఇంతకంటే ఏమిచేప్పలేను, మంచిని పెంచుతున్నప్పుడు కొన్ని ప్రస్తావనలు రావచ్చు....ప్రక్కన ఉంచి కొనసాగించండి.....నమస్తే
    • Like
    • Reply
    • 4y


24 Comments
Comments

Kannaji Rao Jr. తప్పకుండా గురూజీ

Reply
2
22 hrs
Sadanandeeswaraiah Vallamkondu మంచి సూచన చేసారు. ధన్యవాదాలు.

Reply
1
22 hrs
Meduri Venkata Suryanarayana మంచి సూచన. తప్పకుండా తెలియ జేస్తామండి. ధన్యవాదాలు

Reply
2
22 hrs

Reply14 hrs
Venkateswara Prasad మంచి సూచన చేశారు 
నమస్తే సార్

Reply
1
21 hrs
Sarada Rupakula మీ రచనలు అన్నీ చదువుతాను నేను. నా స్నేహితులకు కూడ మీ గురించి చెప్పి మీ స్నేహితులుగా చేసాను. మీ పోస్టు ని వారే నేరుగా చదవడానికి వీలుగా.

Reply
1
21 hrs
Cheruku Ramamohanrao చాలా సంతోషం అమ్మా
కామెంట్ వుంటే అది మరికొందరని చదివింపజేస్తుంది. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకొందాం.

Reply14 hrsEdited
Cheruku Ramamohanrao ISLAM (A small prelude) చదివితే మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.

Reply21 hrs
Sudha Jandhyala తప్పకుండా మనవంతు కృషి చేద్దాం

Reply
1
15 hrs
Bharati VS తప్పకుండా తెలియజేస్తాము

Reply
1
15 hrs
DrChintalapati MuraliKrishna ధర్మ మర్మాలు తెలిసిన ప్రాజ్ఞులు మీరు. మీ విశ్లేషణలు ఉత్తేజకరంగా ఉంటాయి. మీవంటి పెద్దలు ఈరోజుల్లో అరుదు. మాలాంటి అల్పజ్ఞానులం మీ వచోమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. కనుక నిరంతరాయంగా మీ ప్రవచనా లను కొనసాగించండి గురువర్యా!!

Reply
4
15 hrs

Reply
1
14 hrs
Brahmasri Chilukuri Venkatappaiah Acharyulu · 112 mutual friends
పెద్దలకు నమస్కారం ! ప్రస్తుతం మేము చేస్తున్న యజ్ఞం అదే !

Reply
2
13 hrsEdited
కవిశ్రీ సత్తిబాబు గురువరేణ్యా మీవచనములు మాకు అమృతగుళికలు..మీకివే నా హృదయపూర్వక నమస్సుమాంజలులు


Reply
1
11 hrs
Muralikrishna Devarabhotla Guruvugariki. Namaskaramulu

Reply
1
10 hrs
Subramanyam Juturu Meeru prachurinche postulanu tappaka chaduvutanu guruvu gaaru! Vinodamu mariu vignanamunu kalagalipi pamputunnaru. Hindu matamu voka pedda gajamu lantidi. Enni shunakamulu ventabadina daanni emi cheyalevu. Charitra grandhalalo aryulanu, dravidulanu konta vakrikarincharu. Southern people dravidulani, North Indians aaryulani voka siddhantamu vundi.

Reply
1
10 hrs
Savithri Bachimanchi తప్పక మీ ప్రవచనాలను పోస్టు
చేయండి

Reply
3
9 hrs
Nandyal Vithal Maa Prayatnam Memu chestam Andi

Reply
2
9 hrs
Srinivasa Subrahmanyasai Bhagavatula మీరు చెప్పిన విషయము ఆచరించ దగినది.
చివరి వాక్యము " మన ధ్యేయము మన సనాతన ధర్మ పరిరక్షణే !"
అక్షర సత్యము చెరుకూరి వారూ !!!!

Reply
4
9 hrs
Akella Perisivakumar తపన లేకున్న పతనం తప్పదన్నప్పుడు
మన సనాతన ధర్మాన్ని మన మే పరిరక్షించుకోవడానికి నడుం బిగిద్దాం.

Reply
1
7 hrs
Ram Josyula · Friends with Akella Perisivakumar
Intaku memu cheyavalasindi emito selavivvandi cherukuri varu.....

Reply6 hrs
Cheruku Ramamohanrao మా యింటి పేరు 'చెరుకు' మాత్రమె. 'ఊరు' లేదు. చదివి మీ అభిప్రాయాలను తెలిపితే అది ఇంకా కొంతమంది చదువుటకు దోహదపడుతుంది. విషయ పరిజ్ఞానము ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఎదుటి వానికి మాట్లాడే అవకాశమివ్వక నోరు మూయించగలరు. ఈ విషయమును పైన విశధముగా వ్రాసినాను.
మీ స్పందన తెలిస్తే నాలో కొంత ఉత్సాహమునునిమ్పి క్రొత్త విషయములు తెలుపుటకు అవకాశము ఇచ్చినవారవుతారు.
ఈ ధర్మమునకు ఊపిరి యువతాయే!

Reply5 hrs
Ram Josyula · Friends with Akella Perisivakumar
Tappakunda .....

Reply
1
5 hrs
Ramalingaswamyp Panamgipalli Aaa Tamasha kaakapote cherukuki vooremitandi, annee voolle !annivoollu annirastralalo vuntundi!'meeintiperuto.vooruledani anukonakkaraledu,.annivoollu meeve !

Like
Reply
1
4 hrs
Satyanarayana Choppakatla ఈమధ్యమీసువచనాలులేక ముఖపుస్తకం చిన్నబోయింది రోజుకోసారి చెరకు రసంవడ్డించండి!

Reply
4
5 hrs
Cheruku Ramamohanrao అంతా మీ అభిమానము. మీ ఆశీర్వాదము

Reply
1
5 hrs
Satyanarayana Choppakatla శుభంభూయాత్!

Reply
2
5 hrs

Reply
1
5 hrs
Nageswar Lanka Dharmaparirakshana 
ki meeru chesthunna prayathnam sarvada 
Slaghaneeyam

Like
Reply
1
1 hr
Parameswara Nitturu కుమారిలభట్టు వృత్తాంతాన్ని వివరింపగలరని మనవి చేస్తున్నాను గురువుగారూ.

Reply
2
33 mins
Cheruku Ramamohanrao అలాగే. కొంచెము వెసలుబాటు దొరుకుతూనే వ్రాస్తాను