Tuesday 11 April 2017

కాళీదాసు కవన ప్రతిభ

కాళీదాసు కవన ప్రతిభ

మొదటిసారి కాళిదాసు భోజరాజు ఆస్థానం లో ప్రవేశించినప్పుడు రాజు కొలువులో లేడు.మిగతా కవి,పండితులు కూర్చుని వున్నారు.
కాళిదాసు రాజసభలోకి ప్రవేశించాడు.ధగధగ లాడే మణి కుండలాలు ధరించి,తళ తళ మెరిసే దివ్య వస్త్రాల తోరాజపుత్రుడిలా వున్నాడు.కస్తూరి సువాసనలు విరజిమ్ముతూ,పూలమాలలు ఆభరణాలు గా ధరించి,మూర్తీ
భవించిన కవిత్వం లాగ,శృంగార రసప్రవాహం లాగ,దివినుండి భువి దిగి వచ్చిన దేవేంద్రుడిలా వున్నాడు.
సభికులందరూ ఆయన తేజస్సు చూచి అచ్చెరువొంది ఆయనెవరో తెలియకుండానే లేచి నిలబడి అభివాదం చేశారు.ఆయన ప్రతి నమస్కారం చేసి ఆసీనుడయ్యాడు.అంతలో భోజరాజు వచ్చాడు.వస్తూనే కొత్తవ్యక్తిని చూసి తమ పేరేమిటి కవీశ్వరా?అని అడిగాడు.కాళిదాసు ఆయన చేతిని తన చేతి లోకి తీసుకొని ఆయన అరచేతిలో 'కాళిదాసు' అని వ్రాశాడు.అది చదివి రాజు ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.కవీంద్రా సాయం సమయమవుతూంది కదా! సంధ్యా వర్ణన వినిపించండి అన్నాడు.కాళిదాసు నాలుగు చక్కటి ఉపమలతో ఓ చక్కటి శ్లోకం చెప్పాడు.
వ్యసనిన ఇవ విద్యా క్షీయతే పంకజశ్రీ:
గుణిన ఇవ విదేశే దైన్య మాయాంతి భ్రుంగా:
కు నృపతి రివలోకం పీడయత్యంధ కారో
ధన మివ కృపణస్య వ్యర్థ తామేతి చక్షు:
తా:--వ్యసనపరుడి విద్యలాగా తామరల కాంతి దిగజారిపొతున్నది.(సాయంకాలం తామరలు ముడుచుకుంటాయి.)తుమ్మెదలు పరదేశంచేరిన గుణవంతునిలాగా దైన్యాన్ని పొందుతున్నాయి. (.చీకటి
పడుతుంటే తుమ్మెదలు చెట్లపైకి చేరుతాయి)చీకటి దుర్మార్గు డయిన రాజులాగా లోకాలను బాధిస్తున్నది.
పిసినారివాడి దనం లాగా కంటిచూపు నిష్ప్రయోజనమవుతున్నది.(చీకటిలో కళ్ళు కనపడటం లేదు)
ఆ తర్వాత భోజరాజు కీర్తిని ఈ క్రింది శ్లోకాలలో స్తుతించాడు
.
మహారాజ!శ్రీమాన్!జగతి యశ సా తే ధవళితే
పయః పారావారం పరమపురుషోయం మృగయతే
కపర్దీ కైలాసం, కరివర మభౌమం కులిశ భ్రుత్
కళా నాథం రాహు: కమలభవనో కంస మధునా
తా:--శ్రీమాన్ రాజా! ఈ జగత్తంతా నీ కీర్తి చేత తెల్లనై పోగా నారాయణుడు తన పాలసముద్రం ఎక్కడ ఉందా?
అని వెతుక్కుంటున్నాడు.శివుడు వెండి కొండ అయిన తన కైలాసం ఎక్కడా?అని వెతుకుతున్నాడు.
వజ్రాయుదు డైన ఇంద్రుడు తన తెల్లనైన ఐరావతం కోసం వెతుకు తున్నాడు.రాహువు కళా నాథుడైన
చంద్రుడినీ,బ్రహ్మ తన వాహనమైన హంసనూ వెతుకుతున్నారు.పాలసముద్రమో,ఐరావతము,చంద్రుడూ,
హంసా తెల్లనివి కాబట్టి విశ్వమంతా వ్యాపించిన నీ కీర్తి తెలుపులో కలిసి పోయి కనపడటం లేదు
మరో చమత్కారమైన శ్లోకం చెప్పాడు కాళిదాసు..
నీర క్షీరే గృహీత్వా నిఖిల ఖగపతీ ర్యాతి నాళీకజన్మా
తక్రం,ధృత్వాతు సర్వా నటతి జలనిధీంశ్చక్ర పాణిం ర్ముకుందః
సర్వానుత్తుంగ శైలాన్ దహతి పశుపతి: ఫాల నేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తి కాంతా త్రిజగతి నృపతే!భోజరాజ క్షితీంద్ర!
తా:--నాళీక జన్మా=తామరపూవులో పుట్టిన బ్రహ్మ, నీరేక్షీరే గృహీత్వా=పాలూ నీళ్ళు కలిపి తెసుకొని
నిఖిల ఖగపతీ: యాతి=అన్ని పక్షుల దగ్గరకూ వెళుతున్నాడు.ఏ పక్షి నీటినీ పాలను వేరుచేయగలదో అదే తన వాహన మైన హంస అని గుర్తించేందుకు. చక్రపాణి అయిన నారాయణుడు తక్రం ధృత్వా= మజ్జిగ
తీసుకొని అన్ని సముద్రాలలో వేస్తున్నాడు.ఏ సముద్రం లో తోడుకొని పెరుగు అయితే అదే తన పాలసముద్రము అని గుర్తు పట్టడానికి పశుపతి:ఫాల నేత్య్రేణ పశ్యన్=శివుడు తన మూడో కంటి తో అగ్నిని
సృష్టించి అన్ని కొండలనూ చూస్తున్నాడు.ఏ కొండ కరిగితే అదే తన కైలాసం అని గుర్తించేందుకు నీ కీర్తి
మూడు జగాలకూ వ్యాపించి వాటిని తెల్లరంగు తో కప్పేసింది అందుకే త్రిమూర్తులు తమ నివాసాలను కనుక్కో లేక వెతుకుతున్నారు.
అంతకంటే చమత్కారంగా ఈ శ్లోకం చెప్పాడు
.
విద్వద్రాజ శిఖామణీ!తులయితుం ధాతా త్వదీయం యశః
కైలాసం చ నిరీక్ష్య తత్ర లఘుతాం నిక్షిప్తవాన్ పూర్తయే
ఉక్షాణం,తదుపర్యుపమా సహచరం,తన్మూర్ద్ని గంగా జలం
తస్యాగ్రే ఫణి పుంగవం,తదుపరి స్ఫారం సుధా దీధితీం
ఓ!విద్వథ్రాజ శిఖామణీ! ఆ బ్రహ్మదేవుడు కైలాస పర్వతాన్ని నీ కీర్తితో సమానం చేసేందుకు ఆ వెండికొండ మీద తెల్లని నందీశ్వరుడిని (ఉక్షాణం =ఎద్దును)దాని పైన తెల్లని ఉమాపతి యైన శివుడినీ
(ఉమా సహచరం)ఆయన శిరస్సు మీద గంగా నదినీ,దానిమీదతెల్లని సర్పరాజునూ,దాని మీద స్వచ్చమైన వెన్నెలరేడు నూ వుంచాడు.
ఇంతకంటే చమత్కారంగా మరో శ్లోకం చెప్పాడు.యిది ప్రశ్నోత్తర మాలికా రూపంగా వుంది.
స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి?'సురమునే భూతలే కామధేనో:
వత్స స్యానేతు కామః -- త్రుణచయం!'ఆధునా,ముగ్ధ దుగ్ధం న తస్యా?
శ్రుత్వా శ్రీ భోజరాజ ప్రచురవితరణం వ్రీడ శుష్క స్తనీ సా
వ్యర్థో హాయ్ స్యాత్ ప్రయాసః తదపి తదరిభి: చర్వితం సర్వము ర్వ్యాం
తా:--స్వర్గ లోకం లో కామదేనువును చూసుకునే పసుల కాపరికీ నారడుడికీ మధ్య సంభాషణ
నారదుడు :-ఓ! గోపాలకా స్వర్గం నుంచి ఎక్కడికి వెళుతున్నావు?
గోపాలకుడు:-సురమునీ మా కామధేనువు దూడ కోసం గడ్డిమోపు తెచ్చేందుకు భూలోకానికి వెళుతున్నాను.
నారదుడు:-ఓరి అమాయకుడా!యిప్పుడు కామధేనువు దగ్గర పాలు లేవా?
గోపాలుడు:-శ్రీ భోజరాజు గారి మహత్తరమైన వితరణ గురించి విని సిగ్గుపడిన కామధేనువు ఎండి పోయి
శుష్కస్తని అయిపొయింది.
నారదుడు:--అయితే నీ గడ్డి తెచ్చే ప్రయాసకూడా వ్యర్థమే కాబోతున్నది.భూమి మీద భోజరాజు పరాక్రమము వల్ల ఆయన శత్రువు లందరూ గడ్డి కరిచారు.(తిన్నారు)కాబట్టి నీకు ఆ గడ్డికూడా దొరకదు
అని భంగ్యంతరంగా చెప్పాడు. .
ఇన్ని ఉపమానాలతో వున్నఅద్భుత మైన శ్లోకాలు విని భోజరాజు ఆశ్చర్యముతో చూస్తూ ఉండిపోయాడు.
తర్వాత తేరుకొని కాళిదాసును కౌగలించుకొని సత్కారాలతో ముంచెత్తాడు.

Saturday 8 April 2017

రుద్ర సూక్త ధ్యాన శ్లోకం - ఆపాతాళ

రుద్ర సూక్త ధ్యాన శ్లోకం

యజుర్వేద తైత్తిరీయ సంహితలోని రుద్ర నమక ధ్యాన శ్లోకము అందరికీ తెలిసినదే.
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకామ్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో2భిషించేచ్చివం ||
కృష్ణయజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకంలో నాలుగవ ప్రశ్న, ఘోష శాంతి సూక్తం ఉన్నది. పాతాళము నుండి నభస్థలాంతము వరకు వ్యాపించిన జ్యోతిర్లింగ రూపుడైన రుద్రమహాదేవుని అభిషేక క్రియ ఇందులో ఈ విధముగా వర్ణింపబడి ఉన్నది. ప్రాగ్దిశ నుండి అష్ట వసువులు గాయత్రీ చందస్సులో మహాదేవుని స్తుతిస్తూ అమృతముతో అభిషేకిస్తున్నారు. దక్షిణ దిశనుండి ఏకాదశ రుద్రులు త్రిష్టుప్ చందస్సులో రుద్రుని స్తుతిస్తూ అభిషేకిస్తున్నారు. ద్వాదశాదిత్యులు ప్రతీచీ దిశనుండి జగతీ చందస్సులోనూ, ఉత్తర దిశనుండి విశ్వేదేవతలు అనుష్టుప్ చందస్సులోనూ అభిషేక క్రియ నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండములో ఊర్ధ్వ దిశనుండి దశ దిశలనుండి బృహస్పతి పఙ్క్తీ చందస్సులోని మంత్రములతో అభిషేక క్రియ నిర్వహిస్తున్నాడు. (“Structure of the Universe – Vedic” by K Sivananda Murty, 2013)
పింగళుని ఛందశ్శాస్త్రంలో సూత్రములు ఇలా ఉంటాయి. (గాయత్ర్యా వసవః (3.3), జగత్యా ఆదిత్యాః (3.4), విరజో దిశాః (3.5), త్రిష్టుభో రుద్రాః (3.6)….) పింగళుని సూత్రాలకు ఆధారం వేదమే! వేద మంత్రములనుండి, పింగళుని చందశ్శాస్త్రమునుండి బ్రహ్మాండ నిర్మాణమును ఊహించుకొనవచ్చును.

Friday 7 April 2017

లింగం

లింగం 
లిమః గమయతీతి లింగం : అంతము అంటే లయముతో ప్రారభంయ్యేది లింగము. 
లిం గమయతీతి లింగం : అంటే సృష్టి తొ మొదలై లయము చెందేది లింగము. 
గణితము ప్రకారము రెండు బిందువుల గుండా ఓకే వృత్తము పోగలదు. అంటే సృష్టి లయము రెండు బిందువులయితే వాటిని కలిగినదే ఈ జగత్ స్థితి. సృష్టింపబడినది లయించ వలసిందే, లయమమైనది సృష్టింప బడవలసిందే! ఈ ప్రయాణమును ఎరుకపరచేదే లింగము. లింగము అంటే చిహ్నము, గురుతు అని అర్థము. అసలు మనుస్మృతిలో 16 వేరువేరు అర్థములున్నాయి.

సృష్టి స్థితి లయములను నిర్వహించే పరబ్రహ్మ చైతన్యమును బహురూపములలో భావించి ఆరాధించుట అన్నది వేద విదితము. ఎవరో చెప్పినది కాదు. ఈ విగ్రహారాధనలో ప్రముఖమైనదే లింగ పూజ. ఈ లింగము యొక్క అర్థమును గూర్చి మనము ముందే చెప్పుకొన్నాము. ఈ లింగమును ఆద్యన్తములు లేని పరమేశ్వర స్వరూపముగా భావించి షోడశోపచారములతో పూజించుట స్మృతులు మనకు నిర్ణయించిన విధివిధానము. అసలు ఆది శంకరులవారు పాండురంగని కీర్తిస్తూ 'పరబ్రహ్మ లింగం భజే పాండు రంగం' అని కీర్తిస్తారు ఆయన విగ్రహము ముందు నిలిచి.
హృదయమునకు కుడి వైపున నాభినుండి జానెడు ఎత్తులో(అధౌ నిష్ట్యా వితః శాన్తిః నాభ్యం ఉపరి తిష్ఠతి) ఉన్నది నిష్టి. దీనిని sinus node అని అంటారని కూడా హృద్రోగ నిపుణులు చెబుతారు. అది ' నీలతోయద మధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః అని వేదము నందు చెప్పబడినది. అది నీలి రంగు కలువ కోరకము వలే నుండగా దాని కొసన పరమాత్మ లేక పరమేశ్వరుడు అణురూపములో ఉంటాడట. ఆ కోరకము లింగాకృతియే కదా!
అంటే ఈశ్వరుడు కలకాలము మనయందే లింగాకృతి లో వున్నాడనే కదా అర్థము. ఈ వాస్తవాన్ని గ్రహించితే అందరమూ అన్య మతస్థులను కూడా కలుపుకొని ఎంతో అన్యోన్యముగా మనగలుగ వచ్చును. అసలు ఈ జ్యోతికి ఆధారము అగుపించదు అనివిన్నాను. అది నిజమయితే పరమేశ్వరుడు ఆధార రహితుడు అన్న వేదవాక్కునకు పుష్టి చేకూరుచున్నట్లే కదా! అది అపుడు మనలో వెలిగే జ్యోతిర్లింగమే కదా!
లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమము చెప్పింది. లోకమంతా శివలింగము అనెడు భావనతో మనము లింగారాధన చేయవలేనన్నది తాత్పర్యము. అసలు NASA వంటి సంస్థలు తమ పరిశోధనా సారముగా 'అండాకృతిలోనున్న ఈ బ్రహ్మాండ కాంతిపుంజ గర్భములో ఈ గ్రహనక్షత్రాదులు ఇమిడియున్నాయి' అని మన వేదవిజ్ఞానము వివరించిన రీతిని ధృవపరచినారు.
మరి ఈ విషయమును ఎటువంటి ఉపగ్రహముల సహాయము లేకనే కేవలము తమ తపః శక్తితో చాటిన మహర్షులు ఎంత గోప్పవారో మనము అర్థము చేసుకొనుటకు మేధస్సు చాలకున్నా వారి విజ్ఞానానికి, విశ్వశ్రేయోదీక్షకు సాష్టాంగ దండప్రణామములను ఆచరించుదాము.

సృష్టి స్థితి లయములను నిర్వహించే పరబ్రహ్మ చైతన్యమును బహురూపములలో భావించి ఆరాధించుట అన్నది వేదం విదితము. ఎవరో చెప్పినది కాదు. ఈ విగ్రహారాధనలో ప్రముఖమైనదే లింగ పూజ. ఈ లింగము యొక్క అర్థమును గూర్చి మనము ముందే చెప్పుకొన్నాము. ఈ లింగమును ఆద్యన్తములు లేని పరమేశ్వర స్వరూపముగా భావించి షోడశోపచారములతో పూజించుట స్మృతులు మనకు నిర్ణయించిన విధివిధానము. అసలు ఆది శంకరులవారు పాండురంగని కీర్తిస్తూ 'పరబ్రహ్మ లింగం భజే పాండు రంగం' అని కీర్తిస్తారు ఆయన విగ్రహము ముందు నిలిచి.
హృదయమునకు కుడి వైపున నాభినుండి జానెడు ఎత్తులో(అధౌ నిష్ట్యా వితః శాన్తిః నాభ్యం ఉపరి తిష్ఠతి) ఉన్నది నిష్టి. దీనిని sinus node అని అంటారని కూడా హృద్రోగ నిపుణులు చెబుతారు. అది ' నీలతోయద మధ్యస్తాద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా|| తస్యాశిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితః అని వేదము నందు చెప్పబడినది. అది నీలి రంగు కలువ కోరకము వాలే నుండగా ఆని కొసన పరమాత్మ లేక పరమేశ్వరుడు అణురూపములో ఉంటాడట. ఆ కోరకము లింగాకృతియే కదా!
అంటే ఈశ్వరుడు కలకాలము మనయందే లింగాకృతి లో వున్నాడనే కదా అర్థము. ఈ వాస్తవాన్ని గ్రహించితే అందరమూ అన్య మతస్థులను కూడా కలుపుకొని ఎంతో అన్యోన్యముగా మనగలుగ వచ్చును. అసలు ఈ జ్యోతికి ఆధారము అగుపించాడు అనివిన్నాను. అది నిజమయితే పరమేశ్వరుడు ఆధార రహితుడు అన్న వేదవాక్కునకు పుష్టి చేకూరుచున్నట్లే కదా! అది అపుడు మనలో వెలిగే జ్యోతిర్లింగమే కదా!
లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమము చెప్పింది. లోకమంతా శివలింగము అనెడు భావనతో మనము లింగారాధన చేయవలేనన్నది తాత్పర్యము. అసలు NASA వంటి సంస్థలు తమ పరిశోధనా సారముగా 'అందాక్రుతిలోనున్న ఈ బ్రహ్మాండ కాంతిపుంజ గర్భములో ఈ గ్రహనక్షత్రాదులు ఇమిదియున్నాయి' అని మన వేదవిజ్ఞానము వివరించిన రీతిని ధృవపరచినారు.
మరి ఈ విషయమును ఎటువంటి ఉపగ్రహముల సహాయము లేకనే కేవలము తమ తపః శక్తితో చాటిన మహర్షులు ఎంత గోప్పవారో మనము అర్థము చేసుకొనుటకు మేధస్సు చాలకున్నా వారి విజ్ఞానానికి, విశ్వశ్రేయోదీక్షకు సాష్టాంగ దండప్రణామములను ఆచరించుదాము.


























Thursday 6 April 2017

దేవుని మౌనం - ఒక కథ

దేవుని మౌనం - ఒక కథ

అనగనగా ఒక వూరు. ఆ వూరిలో ఒక శివాలయం. ఒక నగర పారిశుధ్య కార్మికుడు ప్రతి రోజూ వెళ్లి స్వామిని దర్శించి తన పని ప్రారంభించేవాడు. పని ముగియగానే తిరిగీ స్వామిని చూసి నమస్కరించి వెళ్ళేవాడు.
ఈ వీధులు ఊడ్చే పని చేసే ఆ భక్తునికి పని చేసి  చేసి విసుగొచ్చింది. ఒక రోజు తన పని ముగిసిన వెంటనే దేవుడితో ఈ విధముగా మొరపెట్టుకున్నాడు.
"స్వామీ నీవేమో రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు.రోజంతా వీధులు ఊడుస్తూ దుమ్ము దూళి లోనే గడుపుతాను. ఇంటికి పోయి పడుకొంటే సరిగా నిద్ర కూడా రాదు. స్నానము చేద్దామన్నా నీళ్ళు దొరుకుట మాకు ఎంతో కష్టము. తెల్లవారితే షరా మామూలే. మళ్ళీ అదేపనే! ఈ పని నేను చేయలేను. నీది ఎంత హాయయిన పని. కావలసినవన్నీ కూర్చున్నచోటికే వస్తాయి. ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నీవు చేయి" అని నిగ్గదీసినాడు.
దేవుడు సరదా పడి సరేనన్నాడు. కానీ  ఒక్క షరతు మాత్రము విధించినాడు. "నీ కంటిముందు ఏమి  ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. ఎవరు ఏమి చేసినా నోరు మెదపకూడదు." అని ఒక నిర్దేశించినాడు.
అదేం పెద్దపనిలే అని తలచి "సరే" అన్నాడు మన కార్మికుడు.
తెల్లవారింది. అనుకొన్న ప్రకారమే శివుడు భక్తుడు తమ తమ పనులు మార్చుకొన్నారు.
 సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః ||
అని సంఖ్య యోగములో (29 వ శ్లోకము) భగవానుడు చెప్పినట్లు తాను ఆ కార్మికుని రూపములో ఆ పాత్రను నిర్వహించుతున్నాడు.
ఇక్కడ భక్తుడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు రావటం జరిగింది. ఆతడు స్వామి వద్ద "దేవా ! నా వ్యాపారములోని ఈ కొత్త లావాదేవీ లో   లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టినాడు. చొక్కా పై  జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయినాడు.
భక్తుడు  "ఒరేయ్... పర్సు వదిలేసినావు చూసుకో" అని అరుద్దామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయినాడు.
ఇంకొంతసేపటికి ఒక పేదవాడు వచ్చినాడు గుడికి. తనవద్ద నున్న ఒకరూపాయిని దేవునికి కానుకగా వేసి 
"దేవా... నా దగ్గర వున్నా ఈ ఒక్క రూపాయిని  నీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లినాడు. కళ్లు తెరిచేసరికి  పర్సు కనిపించింది. "ఇది నీ దయే తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయినాడు.
"ఒరే దొంగా అది నీది కాదు" అని అరుద్దామనుకొన్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి నోరు మూసుకొని ఉండిపొయినాడు. 
ఆ తరువాత ఒక Truck Driver వచ్చినాడు. అతడు ఈ విధముగా ప్రార్థించినాడు.
"దేవా బండినిండే సరుకుతో డిల్లీ వెళుతున్నాను. నన్ను  కాపాడు స్వామీ" అని దండం పెట్టుకొన్నాడు.
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చినాడు. "నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు పోలీసులతో. పోలీసులు అతడిని అరెస్టు చేసి Station కు తీసుకుపోయినారు.
ఈ అన్యాయాన్ని చూసి దైవరూపములోని భక్తుడు ఉండబట్టలేకపోయినాడు. "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు ఫలానా" అంటూ అంతా చెప్పివేసినాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని Driver ను వదిలేసి, పేదవాడిని పట్టుకుని వెళ్లిపోయినారు పోలీసులు.
సాయంత్రానికి అనుకొన్న ప్రకారము తమ తమ DUTY లను మార్చుకొన్నారు శివుడు, భక్తుడు. భక్తుడు దేవునితో  "దేవా! ఈ రోజు నేను ఎంత మంచి పని చేసినానో తెలుసా! ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడినాను.  దోషిని అరెస్టు చేయించినాను." అన్నాడు.
దేవుడు "ఎంత పని చేసినావురా వెర్రివాడా! నిన్ను మెదలకుండా చూస్తూవుండమని కదా నేను చెప్పింది,ఎందుకు నీవట్లు   చేసినావు." అన్నాడు. "అదేమిటి స్వామీ? నేను చేసిన ఘన కార్యమునకు నీవెంతో  మెచ్చుకుంటావనుకున్నాను." అన్నాడు భక్తుడు. ఆ మాటకు స్పందిస్తూ శివుడు ఈ విధముగా అన్నాడు.
"ధనవంతుడు మహాపాపాత్ముడు. పేదకు కాస్త డబ్బు అందితే  కొంచమైనా వాని కష్టము తీరుతుందని  నేనే ఇదంతా చేయించినాను.

ఇక Truck Driver తెల్లవారితే సరుకుతో చాలా దూరము పోవనున్నాడు. దారిలో వాని Truck నకు Accident జరిగి అతడు చనిపోతాడు. అతడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే బతికిపోయేవాడు.
ఇప్పుడు చూడు, నీవు అంతా తారుమారు చేసినావు. Truck Driver చావబోతున్నాడు. పేదవాని కష్టము తీరలేదు. దొంగ నిజమునకు అతడు కాదు. పర్స్ అతనికి దొరికింది అంతే. ఆ డబ్బు అతడు తన కుటుంబమునకు వుపయోగించియుంటే అతని దరిద్రమూ కొంత తీరేది, ఆ ధనవంతునికీ తన డబ్బు సద్వినియోగమయినందుకు కొంత పుణ్యమూ దక్కేది. అంతా అస్తవ్యస్తము చేసినావు." అన్నాడు దేవుడు.
నీతి:
దేవుడి ప్రణాళిక మనకు తెలియదు.
కీడుగా కనిపించేది వాస్తవానికి మేలు కావచ్చు.
తప్పుగా కనిపించేది  ఒప్పై ఉండవచ్చు.
ఆయన ను అందుకోవడము అంత సులభము కాదు. ఎంత సాధన కావలెనో!

Sunday 2 April 2017

దారీ తెన్ను లేనేలేక ఈ తీరాయెనా ...

 

దారీ తెన్ను లేనేలేక ఈ తీరాయెనా ...

Sastry KV:  గురువు గారూ తెలుగు రాని తెలుగువాడిగా బాధ కలుగుతోంది. ఇన్నాళ్లూ నాకు తెలుగు బాగానే వచ్చని, శ్రీమద్భాగవతం, శ్రీ మహా భారతం లలోని పద్యాలను అర్ధం చేసుకుని ఆస్వాదించగలుగుతున్నానని భావిస్తున్న నాకు ఆ ప్రతిభ నాది కాదని, అంత తేలిక భాషలో రాసిన ఆ మహానుభావులదని తెలుసుకున్నాను. ధన్యవాదములు. మరి నాలాగ ఎందరో! ఐతే దీనికి పరిష్కారం ఏంటి?

శాస్త్రి వ్రాసిన మాటలలో అంతర్లీనమైన బాధ కనిపిస్తూ వుంది. ఎందుకో నాకు ఆ మూడు పంక్తులు చదివినందుకే మనసు ద్రవించి నాకు తోచిన నాలుగు మాటలు వ్రాస్తున్నాను. వాస్తవానికి నేను తెలుగులో poor ఆంధ్రము లో weak . ఈ చిన్న వాక్యములో కూడా రెండు ఆంగ్ల పదాలను వాడవలసి వచ్చింది. అసలు విషయానికి వస్తే నేను ఏ భాషా ప్రత్యేకముగా చదువలేదు. మల్లెలు కట్టిన దారానికి కూడా మంచివాసన అబ్బినట్లు నా బాల్యములో నేనున్న వీధిలో గొప్ప పండితులు వుండేవారు. వాళ్ళు ' ఏమిరా బాగున్నావా' అన్నా నాలోపల ఏదో ఆనందము కలిగేది. బహుశ వారి మేని నంటిన గాలి కాస్త నాకూ సోకిందేమో !

నేను 5 వ తరగతి వరకు పాఠశాలకు పోయిన  పాపాన పోలేదు. ఇంట్లో తల్లిలేని నాకు మా అమ్మమ్మే అమరము త్రికాండలలో  ప్రథమ కాండ మాత్రమే, ఆంద్ర నామ సంగ్రహము చదివింప  జేసేది. ఆ పునాది తప్పించి నేను ప్రత్యేకముగా ఏ భాషా చదువలేదు. ఈ రోజు పాండిత్యము లేకపోయినా  నా ఆలోచనలకు అక్షర రూపము కల్పించే సామర్థ్యము వచ్చింది . తెలుగు కాకుండా ఐదు భాషలు  మాట్లాడ గలను. మూడు భాషలు వ్రాయగలను, నాలుగు భాషలు చదువగలను.

ఆంగ్లములో, హిందీలో అంతో ఇంతో ఎంతో కొంత కవిత్వము కూడా వ్రాయగలను. దయతో దీనిని స్వోత్కర్షగా భావించవద్దు. అది నా మాతృ భాష గొప్పదనము. అంతయు పరమేశ్వరానుగ్రహము. నడవడి అన్నింటికీ ముఖ్యము. దానిని సాధించితే దేనినైనా సాధించవచ్చు.

 మన గురుకులాలలో శిక్ష, విద్య అన్న రెండు భాగాలు ఉండేవి. క్రమశిక్షణ కూడా శిక్షలో ఒక భాగమే ! అసలివి మన దేశీయ విద్యా విధాన రథమునకు రెండు చక్రములు. T.B. మెకాలే ఇదేవిషయమే తన నివేదికలో బ్రిటీషు పార్లమెంటుకు నివేదించినాడు. శిక్ష, విద్య, గురుకులాలను నిర్మూలించి ఆంగ్లపాఠశాలాలను ఏర్పాటు చేయించుటలో కృతకృత్యుడైనాడు. వారికి తోడు నీడై , విలియం బెంటింక్ కు అంతే వాసియై మన రాజారామమోహన్ రాయ్ గారు కూడా నిలిచినారని చదివియుండినాను. అటువంటి వారి యనుగ్రహముతో మన భాషకు తల్లియైన సంస్కృతాన్ని ఆనాడు , మనతల్లియైన తెలుగును ఈనాడు సజీవ సమాధి చేసి చేతులు దులుపుకోన్నాము. ఈకాలము పిల్లలకు daddy కి good morning చెప్పు. Aunty కి taataa చెప్పు. One, two, three చెప్పు ఉదయము లేస్తూనే చెప్పించేవి ఇవి. ఇందులో 'చెప్పు'లు తప్ప మిగిలిన  దానిలో ఎంత తెలుగు వుందో చెప్పేవారికే తెలియాలి. మనము  విచక్షణా రహితులమై ఎంత భావదాస్యానికి లోనవుతూవున్నామో చూడండి. United States and UK are developed countries అని మనము వినియుంటాము. Past participle అయిన developed తీసుకొన్నప్పుడు, వాని ఎదుగుదల, కారణాంతరములచే నిలిచి పోబడిన దేశములుగా భావించవలసి వస్తుంది. Put పుట్ అయితే but బట్ ఎందుకయ్యింది. నైఫ్ అని ఆంగ్లములో వ్రాస్తే knife వ్రాయవలె. మరి k ఎందుకో ! మాత, పిత శబ్దములనుండి పుట్టినవే వారి Mother, Father. Daughter, Brother మొదలయిన పదములు కూడా సంస్కృత జన్యములే! ఇటువంటివి ఆ భాషలో కోకొల్లలు.

దక్షిణాది భాషలకు ద్రావిడ శబ్దము తగిలించుటే కృతకముు. ఆదికవి అని కొనియాడబడుచున్న నన్నయ, ‘కవి బ్రహ్మ’ తిక్కన, ‘ప్రబంధ పరమేశ్వరు’డగు ఎర్రన ‘కవి సార్వభౌము’డను బిరుదు గాంచిన బృహత్ పండిత కవికుల తిలకుడు శ్రీనాథుడు, ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అల్లసాని పెద్దన, ధూర్జటి, 'సాహితీ సమరాంగణ సార్వభౌమ' బిరుదాంకితుడు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రమును నెత్తికెత్తుకొన్నారు. శ్రీనాథుడు, కృష్ణరాయలు తమ పాండితీ ప్రకర్షచే ఏకంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనియె అన్నారు. ఈ భాష తల్లి ‘సంస్కృతము’ అని కూడా చెప్పినారు. తక్కొరులెవ్వరూ తెలుగు ద్రావిడ భాషా జన్యము అని అనలేదు. వారిమాటా మనకు గీటురాయి, లేక ‘కాల్డువెల్లు’ మాటా! వారికంటే పండితుడా ‘కాల్డువెల్లు’ ? ‘భాషా శాస్త్రము’ (Linguistics) స్వర లేక ధ్వని శాస్త్రము(Phonetics) తెలియని వారు కాదు మన పూర్వులు. వేదములు సంపూర్ణముగా ధ్వనిమయములు. అందుకే వానిని ఎన్నో లక్షల సంవత్సరములు ధ్వని రూపములోనే ఉంచినారు, కానీ లిపి తెలియక కాదు.

ప్రపంచభాష ఏదయినా సంస్కృత జన్యమేనని చంద్రశేఖరయతీంద్రులవారి మాట. వారి పాండిత్యము అపారము. వారొక అనర్ఘ రత్నము. మరిమనము వారిని నమ్మము. తన మాతృభాష యైన తమిళము కూడా సంస్కృతజన్యమేనని నొక్కి వక్కాణించిన మహనీయులు వారు. వారికి స్వపర భేదములుండవుగదా! మనకు క్రిస్టియన్మిషనరీకి చెందిన ‘కాల్డ్వెల్’ మాట శిరౌధార్యము. ఆతడు కేవలము క్రైస్తవము ప్రాకజేయుటకు సృష్టించిన పదమది. ఆర్య ద్రావిడ సృష్టి చేసిన వారిలో వారు ప్రముఖులు. చెన్నపట్టణమునకు సెయింట్ థామస్ వచ్చినాడన్న కల్పిత గాధను సృష్టించి, అకుంఠితమైన భారత దేశమునుండి, తమిళులను, ద్రావిడ భాషలన్న పేరుతో దక్షిణాది భాషలను ,వానిని మాతృభాషలుగా గల్గిన దాక్షిణాత్యులను విభజించి పుణ్యము మూట కట్టుకొన్నారు. పొరుగింటి పుల్లగూర ఎట్లయినా రుచి ఎక్కువ కదా !  వారి భావానువర్తులై దేవనాయగం వంటి అవకాశవాదులు 1969 లో క్రైస్తవము పుచ్చుకొని అసలు మన సనాతన ధర్మమే అబద్ధాల పుట్ట అనీ, తిరువళ్వారు సెయింట్ థామస్ వద్ద క్రైస్తవ తీర్థము పుచ్చుకోన్నాడని 'Was Tiruvalluvar A Christian' అన్న పుస్తకము రచించి పుణ్యము కట్టుకొన్నాడు. ఈ పుస్తకాన్ని ఏకంగా నాటి DMK ముఖ్యమంత్రిగారే  ఆవిష్కరించినారు. ఈ విధముగా ఒకటిగా వున్న గొలుసు లంకెలను త్రుంచి మనలను విభజించి, ఒకవేళ మతము మార్చలేకున్నా, మనలను తమ మతమునకు దగ్గరజేసుకొన్నారు. ఈ విడ్డూర, విపరీత, విపత్కర పరిణామాలకు మూలము క్రైస్తవ మతవ్యాప్తికి వచ్చిన ‘కాల్డువెల్లే’ ‘కారణభూతుడు’. సంస్కృతమును నిరసించిన ‘కరుణానిధి’ పేరు సంస్కృతము లోనే వున్నది. అతని బిరుదు ‘కలైజ్ఞర్’ అన్నది సంస్కృత నామము. (కలై=కళ; జ్ఞ=క్షుణ్ణముగా తెలిసినవాడు, రెండూ సంస్కృత పదాలే!) వారి పార్టీ (DMK) చిహ్నము ‘ఉదయ సూరియన్’ (ఉదయ సూర్యుడు సంస్కృత పదమే!). తమిళులు వాడే ‘అపరము’ (తరువాత, మళ్ళీ అని అర్థము) ‘సంస్కృత పదమే!

నేడు మన పరిస్థితి ఏమిటంటే మన భాష పై మనకు గౌరవము లేదు, మన ధర్మము గొప్పదనమేమిటో మనకు తెలియదు. మన సంస్కృతి మనకందుబాటులో లేదు. కారణం మనకు తెలుగు రాదు. మనకు  వేములవాడ భీమన లోని  ఉద్దండ లీల, నన్నయలోని ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలోని  ఔచిత్య భావ పదబంధం, ఎర్రాప్రెగ్గడలోని  ఉక్తి వైచిత్రి  శ్రీనాథుని సీసపద్యములు, పోతన అనుప్రాసాయుతమైన అద్భుత కవితా శైలి, నాచన సోముని నవీన గుణ తత్వము అన్నీ ఈనాడు గాలికి ఎగిరిపోయిన ఎండుటాకులే. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ వ్యూహం మనకు పరబ్రహ్మ పదార్థమే ! తెలుగంటే ఏమిటో తెలియని తెలుగుజాతికి వారసులము మనము.

మరి ఇప్పుడు మన కర్తవ్యమేమిటి?

కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. తెలుగు మాధ్యమం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక సంపదకి దూరం కావటమే. పునాది లేని భవనము అంటే కేవలము రాళ్ళు సున్నమే అన్నది గ్రహించగలిగితే తెలుగునకు ఒక 100 సంవత్సరాల పిమ్మటనైనా తెలుగునకు పునర్వైభవము తేగలుగుతామేమో !

అసలు తెలుగుకు ఉన్నంత అక్షర సంపద ఏ నాగరిక భాషకూ లేదు. ఒక్క తెలుగు వస్తే ఏ భాషనయినా నేర్చుకోవచ్చు. ఈ విషయములను రాహుల్ సాంకృత్సాయన్, పుట్టపర్తి నారాయణాచార్యులు మొదలగు మహనీయులు సహేతుకముగా నిరూపించినారు.

ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా?తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. అందుకే 'తెనుగు తేనె ఊట తేటరా గమనించు రామమోహనుక్తి రమ్య సూక్తి' అని వ్రాసుకొన్నాను.

మనము ఇకనైనా కళ్ళు తెరిచి పిల్లలను క్రెచ్చి, ప్రీకేజీ, ఎల్కేజీ, యుకేజీ, అనిచదివించకుండా ఓపికతో లేక ఓపికచేసుకొని తల్లిదండ్రులు 'అమరము' 'ఆంధ్రనామ సంగ్రహము' నేర్పించితే ఒకఏడాది తరువాత మెల్లమెల్లగా చిన్నచిన్నశతకాలు, రుక్మిణీకల్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాద చరిత్రము, విదురనీతి వంటి ఘట్టాలు నేర్పించితే వారు ప్రపంచములోనిఏ భాషనైనా నేర్వగలరు.

స్వస్తి.

Sanjeev Rao

Maanyulu maha adbhutamgaa vivarinchaaru...

 · Reply · 6y

Sadanandeeswaraiah Vallamkondu

'Chaalaa baaga chepparu

Ramu garu. Cheppagalagadam bhagavanthudu prasadenchina varam

Swayam krushi kuuda vumdi.

 · Reply · 6y

Jyothiprakasan Sambasivapillai

Chakkati vishleshana. Telugu baasha Ku tegulu patti konni dasaabdhamulayinavi. Mana paalakulu vaaduka vaakhyamulane graandhikamu chesinaaru. Assemblies LA lo baasanu tilakisthunnamuga. Maa chinnapuudu Peddabaalasiksha chadivinchaaru kaani mana maata yevaru pattinchukonaru.