Monday 31 July 2023

తమలపాకు

 తమలపాకు

https://cherukuramamohan.blogspot.com/2023/07/blog-post_31.html

‘తాంబూలం సమర్పయామి అని పూజావిధి లో భగవంతునికి కర్పూరనీరాజనము ఇచ్చే ముందు తాంబూలమును సమర్పించుకొంటాము. దీనిలోని అర్థము, అనగా దేవునికి భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయములను సమర్పించిన తరువాత పచ్చకర్పూరముతో కూడిన తమలపాకులు,వక్కలు,  సాధారణముగా మూడు ఆకులు, రెండు వక్కలు, మర్పించి తాంబూలం సమర్పయామి అని చెబుతారు. ఈ తాంబూల సమర్పణలో  తమలపాకులకు ఇంత ప్రాధాన్యత ఎందుకు అన్న విషయమును గూర్చి తెలుసుకొందాము.

తమలపాకును సంస్కృతములో నాగవల్లి అంటారు. వల్లి అంటే తీగ అని అర్థము. సాధారణముగా ఈ తీగను అవిశె చెట్టుకు పెనవేసి పెంచుతారు. ఇది నాగు వలెనె చుట్టుకొంటూ ప్రాకుతుంది కాబ్బట్టి నాగవల్లి అయిఉండే అవకాశము ఉన్నది.

ఇప్పుడు ఈ నాగవల్లి కి సంబంధించిన ఒక కథ చెప్పుకొందాము. సముద్ర మంథనము జరిగినపుడు ఇంద్రునికి అందునుండి ఉద్భవించిన ఐరావతము అన్న ఒక తెల్లని ఏనుగును కానుకగా ఇచ్చుట జరిగినది. ఆయన దానిని స్వర్గములోని

నందన వనములో కట్టింప దలచి ఏనుగుల కాపరి మావటి యగు మతంగునికి ఆ పని అప్పజేప్పినాడు. ఏనుగుల వెనుక కాళ్ళకు సంకెలు వేసి బంధించుతారు. అందుకొరకై నేలను ఆనుకొనియుండే బలమైన ఆధారము కొరకు చూస్తే

అతనికి ఒక బలమైన కల్పవృక్షపు ఏరు కనిపించింది తనవద్దనున్న బలమైన తాటితో ఏనుగు యొక్క ఒకకాలికి  ఆ మోకును ఆ వేరుకు కట్టినాడు. ఆవేరు నుండి వచ్చిన ఒక అతిసన్నని పిల్లవేరుకు  ఐరావతముయోక్క మడమ తగిలి అది ఆకులను దాల్చినది. ఆ వల్లిక నాగము అనగా ఏనుగు ను తాకి ఏర్పడినది కావున నాగవల్లి అన్నపేరుతో భూమికి చేర్చబడినది. నాకము నుండి వచ్చినది కాబట్టి నాకవల్లి అని కూడా పిలువ బడుచూ రాను రానూ నాగవల్లి అయి ఉంటుంది.

ఇక ఈ నాగవల్లిని తాంబూలములో ఎందుకు విశిష్ఠముగా వాడుతారో చూద్దాము. దేవునికి ఫలం పత్రం పుష్పం తోయం సమర్పించవలెనన్నది ఆర్య వాక్కు. నైవేద్యము ముగిసిన పిదపగూడా స్వామికి వీని అవసరము ఉంటుంది. అందుకనే అన్నింటికీ ప్రత్యామ్నాయముగా తమలపాకులను ఉంచుతారు. మూడు తమలపాకులు రెండు వక్కలు ఎక్కువమంది తాబూల రూపములో సమర్పించుకొంటారు. మరి పూలు పళ్ళు నీరు ఆకులకు బదులు తమలపాకులనే ఎందుకు పూజా సమయమున వాడుతారో చూద్దాము. ఈ నాగవల్లికి ఒక్కొక్క ఆకే మొలుస్తూ ఎగబ్రాకుతూ వుంటుంది. 

స్వతహాగా అది పత్రము, దానిలోనే పుష్పము ఫలము నిక్షిప్తమై ఉంటాయి. ఫలములోని బీజము నాటకనేపూవు పూయకనే, కాయకాయకనే ఒక్కొక్క ఆకును కలిగి ఆ తీగ పైపైకి  ప్రాకుతూ వుంటుంది. అంటే ఈపత్రములో పుష్పము ఫలము నిక్షిప్తమై ఉన్నాయి అనేకదా అర్థము. అంటే తమలపాకు లో పత్రం ఫలం పుష్పం ఉన్నాయి. తమలపాకులు సులభముగా వాడిపోవు. వాతావరణము చల్లగాఉన్నా, లేకున్నా, ఆకులను ఒక తడిపొడి బట్టలో చుట్టిపెట్టి అతిగా చెమ్మ తగిలించకుండా ఉంచితే 20 రోజులైనా ఉంటాయి. అంటే స్వతహాగా వానిలో నీరు ఉన్నదనే కదా! అందుకే పత్రం పుష్పం ఫలం తోయానికి బదులుగా భగవంతునికి తాంబూలములో సమర్పించుతారు. ఎటూ తమలపాకు తోడుగా పూగీ ఫలము అనగా వక్క లేక పోక ఉంచనే ఉంచుతారు. ఇక అన్నీ భగవంతునికి సమర్పించినట్లే కదా! రాయలసీమ ముఖ్యముగా కడప జిల్లాలో తాంబూలమును వక్కాకు అనే అంటారు. చతుర్విధ పురుషార్థాలలోనూ ఈ తాంబూలము మూలము. ఎట్లు? అన్నది ఒకసారి గమనించండి. ఒక గృహస్తు తనపుణ్య కార్యములో భాగముగా దానము చేయుట అతని ధర్మము. ఆధనముతోబాటు ‘తుభ్యమాహం సంప్రతతే నమమఅనిచెప్పి మూడు ఆకులు రెండు వక్కలు ఇచ్చి దానము చేస్తాడు. అది అతడు నిర్వహించిన ధర్మము. భార్య భర్తకుభోజనానంతరము, శయ్యాగృహములో తాంబూలము ను అందించుట ఆమె ధర్మము. గురువుకు దక్షిణ తోబాటూ తాంబూలము నందించుట శిష్యుని ధర్మము.

ఇక అర్థము. అర్థము అనగా ధనము. కవులచే కావ్యములు వ్రాయించవలెనంటే ఆయనకు పుష్కలముగా ధనమో, ధాన్యమో అగ్రహారములో రత్నకనక రాసులో తాంబూలముతో సహా ఇచ్చి కృతిని వ్రాయ అర్థించుతారు. ఒక సైన్యాధ్యక్షుని యుద్ధమునకు పంపవలెనంటే పుష్కలమగు ధనముతో బాటూ తాంబూలమునిచ్చి ఆజ్ఞాపించుతారు. 
మిగిలినది మరోమారు.....

తమలపాకు 2

ఇక కామము. కామము అంటే లైంగికమైన కోరికయే కాదు. ఒక వస్తువును అనగా ఒక ఆభరణము కావచ్చు, రత్నాలు పొదిగిన పట్టు వస్త్రమే కావచ్చు, స్థలము, పొలము, ఇల్లు, అధికారము, స్త్రీ, ఈ విధముగా ఏదయినా కావచ్చు, వానిని సాధించి స్వంతము చేసుకొనవలెననుకొనుటయే కామము ఇటువంటి ప్రతిపాదనలో ఆకూవక్కా పెట్టి తాంబూలమునిచ్చేవారు. భార్యా భర్తల మధ్య శృంగారపరమైన అనుబంధమునకు తమలపాకు చిలకలతో మొదలవుతుంది. యుద్ధము చేయుటకు తాంబూలము పుచ్చుకొంటే, ఆ పుచ్చుకొన్న వ్యక్తి ప్రాణాలకు తెగించి పోరాడుతాడు.  పెళ్లి చూపులలో తాంబూలము, ఒక స్థలమో పొలమో కొనుటలో తాంబూలము సంస్కారము (Advance) ఇచ్చేవారు. ఈ విధముగా తాంబూలము మన సంస్కృతిలో ఒక ప్రముఖ్యమమైన స్థానమును ఆక్రమించియున్నది.

ఈ తాంబూలమును  గూర్చి జనపదములలో నానెడు భారతమునకు సంబంధించిన ఒక కథ తెలియజేస్తాను.

ఇంద్రప్రస్థమున నభూతో నభవిష్యతి అన్న చందమున మయనిర్మిత సభాభవనములో సకల యోద్ధ విభుదాగ్రగణ్యుల సమక్షములో అగ్ర తాంబూలము అచ్యుతునకిచ్చుట అందరికీ తెలిసినదే! పరమాత్మ తన విడిది గృహమునకు వెడలి రుక్మిణితో తనకు ధర్మజుడు అగ్ర తాంబూలమొసగిన విషయమును ఎంతో సంతోషముగా తెలిపినాడు. అందుకు జవాబుగా రుక్మిణి ‘ఇక మీరు అనుక్షణమూ ధర్మజుని ఆజ్ఞ పాటించవలసినదే!’ అన్నది. అందుకే సలహాదారునిగా, రాయభారిగా, చివరకు రథసారధిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకొనవలసి వచ్చినది.

ఇక తమలపాకు ప్రాశస్త్యము మీకు తెలిసినదే! అయినా ఒక్కమారు ఆ విషయమును స్పృశించి ఈ వ్యాసమును ముగించుతాను.

ఆయుర్వేదములో తమలపాకుకు ‘నక్షత్ర గుణం’ ఉన్నట్లు చెప్పబడినది. వైదిక గణిత శాస్త్రములో ‘భూత సంఖ్య విభాగము లో నక్షత్ర అంటే 27 అని అర్థము. అంటే తమలపాకులో 27 విధములగు ఔషధీ గుణములు ఉన్నాయట. పంచాఙము ప్రకారము మనకు ఉండేది 27 నక్షత్రములే కదా!   ఈ తమలపాకు యొక్క ఉపయోగములు అన్న విషయమును google సౌజన్యముతో మీ ముందు ఉంచుచున్నాను. క్రింద తెలియజేసిన విషయములలో  వైద్యుని సలహా మేరకు  నడుచుకొనేది.

మిగిలినది మరోమారు....... 

తమలపాకు 3 (చివరి భాగము)

తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.

తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.

తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.

అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.

 ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్థం తమలపాకు లో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వక్క తప్పించి, కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి. 

తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.

నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె. ముఖ్యముగా నెయ్యి కాగినవెంటనే అందు ఆ వేడిలోనే తమలపాకును వేయుట కద్దు.

తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.

తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.

ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.

తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.

అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.

తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియాన్ని శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చే వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.[8][9]

ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.

ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.

ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియాలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.

స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)

తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.

చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.

తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.

తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)

గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.

తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.

ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

తమలపాకు కాండాన్ని (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.

పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.

హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.

తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.

తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.

తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)

తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్తంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.

తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.

తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.

తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.

మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.

తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

తాంబూలము దేవునికి సమర్పించుట అంటే ‘స్వామీ మాకు నీవే రక్ష’ అని చెప్పుట. మనము చేసే సకల సత్కార్యములకు ఆయన తోడూ నీడ ఉండవలెనని కోరుతా అన్నమాట. సన్యాసులు పరమాత్మకు తాంబూలము  సమర్పించనే కూడాడు. వారికి తాంబూల సేవనము కూడా పనికి రాదు.
తులసియు నాగవల్లికయు పరమాత్మ అనుగ్రహించినవి. పూజ్యభావముతో వానిని గౌరవించుట మన ధర్మము.

స్వస్తి.  


Wednesday 26 July 2023

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

 మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

https://cherukuramamohan.blogspot.com/2023/07/httpscherukuramamohan_26.html

ఈ వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభజించినాను.  ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.

America అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:

Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,

1454 – February 221512) was an Italian explorer, financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing for Portugal around 1501–1502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)

పైనమనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.

దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు

అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,

అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ

తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరునుఆ పేరును ప్రతిబింబంపజేసే

జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు

మనదేశామునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'

గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు

ఉపయోగించము అని నా మనవి.

 మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా

ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమునుమన ఉదాసీనత వల్లఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామోఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.

 మనము అధికముగా ఆలపించే  జాతీయ గీతము

 నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦

 రూపాయలు  అనే ఈ రోజుల్లో1882 వ సం. తన 'ఆనంద్ మఠ్అన్న నవలలో

 బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరంగీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్

 ద క్వీన్అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ

 సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే

 అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర

 గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ

 గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది.

 ముస్లింలుక్రైస్తవులుఅందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు

 కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది

 ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే

 సాక్ష్యము .

 In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of

 Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can

 be no debate about it. Of course Bankimchandra does show Durga to be

 inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can

 be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [The

 Nation].

మే 102013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో

 కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు

 నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరంఆలపించరాదని ఉద్ఘాటించినది

 రవీంద్రులవారే! అందులోనిఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

 మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ

 గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో

 సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక

 పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో

 ప్రతిఘటన ఏదీ!

 ఇక 'జనగణమననేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.

 ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు

జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత

విదుషీమణి కావడం వల్ల,  సహకారముతోఠాకూరు వారు ఆలపించుట జరిగిది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగేమంగళ దాయక

మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ

జాతుల ,పర్వతములనదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్

గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ మనదేశానికి విచ్చేయు సందర్భములో

వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.

ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V

గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు

కదా !

 ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడుఅది దేవుని గూర్చి వ్రాసినదని

తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు

ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా

వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని

తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ

రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది

వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him

especially to welcome the Emperor." (Statesman, Dec. 281911)"The

proceedings began with the singing by Rabindranath Tagore of a song

specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28,

1911) "When the proceedings of the Indian National Congress began on

Wednesday 27th December 1911, a Bengali song in welcome of the

Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted unanimously." (Indian, Dec. 291911)

 ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో,

కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,

తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడైనెహ్రూ గారికి చెప్పగావారి సహాయ

సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికిగ్రహించడం జరిగింది.

 మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.

 విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో

గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని 

పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము

చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!

జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)

 జనగణమన్ అధినాయాక్ జయహేభారత భాగ్య విధాతా

పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా

వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా

తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగేగాహే తవ్ జయ్ గాథా

జన్ గణ్ మంగల్ దాయాక్ జయహేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

అహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ

హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్రిస్తానీ

పూరబ్ పశ్చిం ఆసేతవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా

జనగణ ఐక్యవిధాయక్ జయ్ హేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ

తుం చీర్ సారథితవ రథ్ చక్రేముఖరిత్ పథ దిన్ రాత్రీ

దారుణ్ బిప్లవ్ మాజేతవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా

జనగణ పథ్ పరిచాయాక్ జయహేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే

ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే

దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకేస్నేహమయీ తుమీ మాతా

జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే

గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే

తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే

తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే

జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll

"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల

ఆధారములను ఒకపరి పరికించుదాము -

మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో

మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం

జరిగింది.

2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో

మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే!  'సింధ్ '  ఇపుడు పాకిస్తాన్ కు చెందినది. దానిని మన జాతీయ గీతములులో ఎట్లు గ్రహించ వీలగును?

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.

మరివిధాత అంటే బ్రహ్మబ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ

కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో పోల్చియుంటే 'విధాత్రిఅనియుండవలసినది.

4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస - తవ

సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పుపశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు

చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.

పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని

అనుకొనుటకు వీలు కాదుఅన్వయము కుదరదు కాబట్టి.

6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన

తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం

"రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే

మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై 

కదా వుండినారు.

7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్

పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునావాడ

తగునా?

8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన

దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా

లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న

రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును

"టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత

జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే

చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.

ఈ విషయమును గూర్చి  కొంత చర్చించుకొందాం........     



               మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము  2

 పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి

సింహాసనము  చేజిక్కించుకొనిదేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన

మీర్ జాఫర్ నుఅతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న

మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ

బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు.

ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూముఖోపాధ్యాయ  ముఖర్జీగానూ,

బందోపాధ్యాయ బెనఖుదీరం బోస్చిత్తరంజన్ దాస్సుభాష్ చంద్రబోస్ వంటి

మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ,

ప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు

వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ

వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ

వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి,

ఠీవికిదర్జాకుదర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు

కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత

ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ

గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక  ఒక మారు రవీంద్రులవారు 'వందే మాతరము'ను దుర్గా స్తుతి  అన్నారు కదా

అందుచే ఆ గీతము యొక్క పూర్తి పాఠమును నేను దిగువన ప్రత్యేకముగా

'వందేమాతరంఅన్న శీర్షిక క్రింద ప్రచురించున్నాను. అది దుర్గాస్తుతి కాదు,

మాతృభూమికి సమర్పించిన కృతజ్ఞతా ప్రసూనము మరియు దేశభక్తి ఉద్దీపనము. ఆ

గీతము యొక్క పూర్తి పాఠమును దానికి నా స్వేచ్ఛానువాదమును నిన్న నే మీ

ముందుంచినాను. అందు చేత దానిని ఇపుడు ఉంచలేదు.

రేపు మరికొన్ని వివరములతో.................

 


మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ 'వందేమాతరంగీతమును పార్లమెంటులో

సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు

విరుద్ధమని బయటకు నడచినాడు అని పైన తెలిపినాను. నేటి కేరళ రాష్ట్ర గవర్నరు

మరియు ఉర్దూ,  హిందీ,సంస్కృతముఫార్సీఅరబ్బీ పండితుడగు ఆరీఫ్ మొహమ్మద్

ఖాన్ గారుబుర్క్ గారి తీరుకు ఎంతో నొచ్చుకొన్నవాడై 'వందేమాతరంగీతము యొక్క

పల్లవి ప్రథమ చరణములను ఉర్దూ లోనికి తర్జుమా చేసి ఆ గీతములో ముస్లీములు 

ఆలపించకూడని అంశము ఏదీ లేదని నొక్కివక్కాణించినారు. ఆయన వ్రాసిన ఆ

గీతమును తెలుగు లిపిలో మీ ముందుంచుచున్నాను. మాతృక యొక్క భావార్థమును

నిన్ననే వేరుగా ప్రచురించినాను కాబట్టి ఇపుడు తిరిగీ వ్రాయలేదు. తస్లీమాత్ అంటే

వందనములు అని అర్థము.

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తూ భరీ హై మీఠే పానీ సే

ఫల్ ఫూలోంకి శాదబీ సే

దక్ఖిన్ కీ ఠండీ హవావోఁ సే

ఫసలోఁ కీ సుహానీ ఫిజావోఁ సే

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తేరీ రాతేఁ రోషన్ చాఁద్ సే

తేరీ రౌనక్ సబ్జ్-ఏ-ఫాం సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ సే

తేరీ మీఠీ భరీ జుబాన్ సే

తేరీ బాహోఁ మె మేరీ రాహత్ హై

తేరీ ఖద్మోఁ మె మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

వారువ్రాసిన పై గీతముతో కూడా తెలుగు స్వేచ్ఛానువాదముతో  మీముందుంచుచున్నాను.

ఎక్కడయినా భారత మాత వందనము తప్ప దుర్గావందనము కలదా అన్నది గమనించగలరు.

వందనమమ్మా వందనము

తీయని నీరు తేనెలువూరు

పూలు ఫలమ్ముల పచ్చదనాలు

దక్షిణ ప్రాంతపు చల్లగాలులు

పచ్చని పంటల సౌందర నందము

వందనమమ్మా వందనము

చల్లని చంద్రుని వెలుగుల రాత్రులు

అందములీనెడు సుందర ఆకృతి

ప్రేమను పంచే నీ దరహాసము

తీయని కమ్మని నీ వాగ్మయము

మాశ్రమ మరచే నీ కర స్పర్శలు

నీ పదతలమే మాదగు స్వర్గము

వందనమమ్మా వందనము

మిగిలినది మరొకమారు ........  

Friday 21 July 2023

ముట్లుదిగిన సతికి నొక్క మగశిశువుట్టెన్




 https://cherukuramamohan.blogspot.com/2023/07/blog-post_21.html

      • Like
      • Reply
      • 7y
    • Satya Narayana
      హరిఓం:—రవి గాంచనిచో ,కవిగాంచున్
      పదాలను కూర్చి సమస్యకు భంగంకాకుండా మీ పద గుంభనం బాగుంది
      • Like
      • Reply
      • 7y
    • Gowrishankar Gowri
      Chalabagunnadi sir.Navamasamul.It is quite natural.poorana .sense of humour.Poorana noppimpaka tanovvaka.Dhanyudu meeru Sumathi.sir.Hats of for the literary talent.
      • Like
      • Reply
      • 7y
    • Subramanyam Juturu
      Samasyanu chala samayaspurtigaa sadhincharu.you are the literary wizard.Namaste rao gaaru.
      • Like
      • Reply
      • 7y
    • Appaji Peri
      ॐ अद्भुतं!!!
      • Like
      • Reply
      • 7y
    • Prathap Nyshadam
      చెరకన్న నీ చేతకలము కదలితేగలగల భావాలు పారు
      సరస్వతి సరసాలు సరాగాలు స్రవివించు
      కవిని గాని నాచే నాలుగు మాటల బలుకు
      ఇది ఒకపదము పదమవే వచ్చినవి ఏమో
      • Like
      • Reply
      • 7y
    • Eswar Telikepalli
      Excellent Andi
      • Like
      • Reply
      • 7y
    • Eswar Telikepalli
      Question varaku cahadivi answer chadavakunda konchem sepu alochinchanu - Emaina solution dorukuthundhemo ani
      • Like
      • Reply
      • 7y
    • Mahendravada Murthy
      చాలా బాగుంది.
      1979లో శతావధాని రావూరి వెంకటేశ్వర్లు గారు ఇదే సమస్య ను ఈక్రింది విధంగా పూర్తిచేసారు.
      ఇట్లాటి కఠిన ప్రాసను
      ఎట్లాంటి కవీంద్రున కైననీయందగునా
      అట్లైతే నవ మాసపు
      ముట్లుడికగిన సతికి నొక్క మొగశిశువు పుట్టెన్.
      • Like
      • Reply
      • 6y
    • Mahendravada Murthy
      ముట్లుడిగిన సతికి
      • Like