Monday 4 July 2016

భారతీయ శాస్త్ర విజ్ఞానము ..10

భారతీయ శాస్త్ర విజ్ఞానము ..10
( లోహశాస్త్రము ) 
వెండి
ప్రాచీన కాలపు నాణెములు వెండితో తయారుచేయబడుచుండినవని చారిత్రిక పరిశోధకులు కనుగొన్న తరువాత మన దేశమున వెండి ఎంత పురాతన కాలమునుండి అంటే క్రీ.పూ.1 వ శతాబ్దము నుండి, ఉపయోగింప
బడుచుండినదన్న విషయము మనకు అర్థమౌచున్నది. ఖగోళము జోతిషము ఒకటే అన్ని పాశ్చాత్యులు అనుకొనే కాలమునకు ఎన్నో వేల సంవత్సరములకు పూర్వమే అవి వేరన్న శాస్త్ర సంపద మనది.గ్రహములను తెలియబరచినది మనవారు. ఆ గ్రహములకు  ఏ ఏ లోహములు ప్రీతికరములు అని తెలిపినది మనవారు. ఆ విధముగా వెండి చంద్రునకు ప్రీతికరమని తెలిపినారు. ఆయన వెంనేలరాజు. వెన్నెల వెలుగు వెండివలేనే ఎంతో తెల్లగా ప్రకాశవంతముగా వుంటుంది కదా! పైగా వెండికి రజతము అని పేరు. బంగారునకు మహారజతమని పేరు. అంటే అసలు వెండి, బంగారుకన్నా ముందు పుట్టినదనే కదా! నిగూఢమైన నాటి ఈజిప్టు రాజ కళేబరముపై కనిపించే వెండి బంగారు నగలు హిందూ లోయ నాగరికతకు చెందినవని చరిత్రకారులు తమ పరిశోధనల మూలముగా తెలియబరచుచున్నారు. ఇంతకూ మించిన సాక్ష్యాధారాలు వేరేమి కావలె.చాణక్యుని అర్థ శాస్త్రమును పరిశీలించితే మిగత లోహములతో బాటూ వెండివాడకమును  గురించికూడా మనము తెలుసుకొనగలము.
రాగి (తామ్రము)
కౌటిల్యుని అర్థ శాస్త్రం లోనే రాగి గనులు, రాగి పరిశ్రమల గురించిన ప్రస్తావన ఉంది. ఇది రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్ లలో అధికంగా లభిస్తుంది. అసలు రాగిని గూర్చిన ప్రస్తాపన ఋగ్వేదము లోనే వస్తుంది. మరి రుగ్వేదకాలమును ఎవరు నిర్నయించవలె.కీస్తుకు పూర్వము 6500 నుండి 5500 సంవత్సరములకు మధ్య కాలము లో ఆధార పూర్వకముగా రాగి వాడకమును గూర్చి మనకు తెలియవస్తుంది. బోలన్ కనుమలకు దగ్గరగా దక్షిణ సింధునదీ ప్రాంతములో క్వెట్ట, కళాత్, సిబి ప్రాంతములకు మ్న్డుమన వున్న మేహ్ర్రాఘర్ అన్న వూరిలో 1974 లో 6 దిబ్బలు బయల్పడినాయి. వానినుండి 32000 కళాఖండాలు బయల్వేడలినాయి. అందులో మరీ చిన్నది కానట్టి వ్యాసము కలిగిన స్థూపాకారములో వున్న రాగి కోవు దొరికింది. మరి దానికి ముందే రాగి వాడకమున్నట్లు మనకు ఆయుర్వేదము ద్వారానూ పురాణముల ద్వారానూ తెలియవచ్చినా పాశ్చాత్యులకు చూపుటకు ఆధారములు లేవు. అది మన విధి. అసలు ఈ వస్తువు దొరకకుంటే మనకు అసలు రాగిణి గురించి తెలియనట్లే! అసలు ఇత్తడి, కంచు 
మనదేశములోనే మొదట తయారయినది. కంచు గంటలు పురాతన దేవాలయములలోనివి ఎప్పటివి అన్నది, విదేశములలో ఎప్పటినుండి వున్నాయి ఆనదీ తెలిపితే మన ఆలయాలు అంతకు ముందువైతే , కొన్నయినా ఆ కాలమునకు చెందినవి ఉంటాయికదా . ' ఇతి ఘంటానాదం కృత్వా' అన్న దేవతార్చన మంత్రమే ఉన్నదికదా!

సీసము
అసలు మన ఋషులు బంగారు,వెండి. రాగి, సీసము,యసదము, పాదరసము ఆయుర్వేదమునండు ఉపయోగించుట మనకు తెలిసినదే. అవి నేటికీ వాడబడుచున్నవి.మరి ఈ ఆయుర్వేదము ఎన్ని వేల, లక్షల సంవత్సరముల నాటిదని నేటి చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పగలరా! సీసపు నిక్షేపములు  గుంటూరు లోని దూమెట్ట, బండ్లమేట్టులలోనూ, కడప జిల్లాలోని జంగంరాజుపల్లె, మామండూరులలో కలవు.  సీసము turky లో మొదట, క్రీస్తు పూర్వము 6000 లో దొరికినదని చెబుతారు. కానీ ఇది చదవండి.
Historians generally agree that the first Turkic people lived in a region extending from Central Asia to Siberia. Historically they were established after the 6th century BCE. ( wikipedia )

మరి దీనిని వాస్తవముగా తీసుకొంటే ఈ దేశమును నివాసముగా ఏర్పరచుకోన్నవారు తమతో బాటు సీసము తెచ్చుకోన్నారనుకోవలేనా! అసలు ఈ విషయము ఎందరికి తెలుసునో నాకుతెలియదు. సీసపు పాత్రల ఖరీదు చాలా ఎక్కువ. ఖాళీ పాత్రను వెలిగించిన పొయ్యి పైన పెడితే పాత్ర కరిగిపోతుంది. ఈ పాత్రలో చారు ( ఆధునికులు రసము అంటారేమో!) పెడితే అమితమైన రుచి వస్తుంది. అనుభవము అధికముగా వుంటేనేగాని ఇటువంటి విషయములు తెలిసిరావు.

యశదము
The metal using cultures appeared in the Indian sub-continent around 6th millennium BCE. Subsequently, copper metallurgy is well attested to at various sites by the 4th millennium. Besides copper-bronze, these ancient societies were also aware of various other metals like gold, silver, tin. Even deliberate production of iron goes beyond the 1st millennium BCE. Compared to the great antiquity of these metals, in a historical perspective, regular production of zinc and brass and distillation of zinc is very late. (  by J.S. Kharakwal, PhD )
దీనిని బట్టి యశదమును వేరుపరచు విదానము మనకు ఎంత పూర్వమునుండి తెలుసునన్నది 
తెలియుచున్నది. యశదమును ముడిపదార్థమునుండి వేరుపరచుట మనకు తప్ప అసలు ప్రపంచ దేశములలో ఎవరికీ తెలియని కాలములోనే మనకు తెలుసు. యశదము(zinc)ను ఖనిజము నుండి వేరు పరచు విధానము మన వారికి మాత్రమె 4000 సంవత్సరముల క్రితమే తెలుసు.ఆ విధానము ఒకసారి గమనించండి.యశదము 997 డిగ్రీల సెల్షియస్ లో ద్రవీభవించుతుంది.అది 1000 సెల్షియస్ లో ఆవిరి ఔతుంది. అంటే  ముడేమూడు డిగ్రీల వ్యత్యాసములో ఈ పరివర్తన జరుగుతుంది. సాధారణంగా క్రింద వేడిచేసి పైనుండి ఆవిరిని వేరొక పరికరములోనికి పట్టి లోహమును వేరుచేస్తారు. కానీ మన పూర్వులు మంట పైనపెట్టి క్రిందినుండి తగిన పాత్రలలో, సరియైన ఉష్ణోగ్రత వద్ద పట్టి దానిని శీతలీకరణ విధానముతో  దానిని యశదముగా మార్చుతారు. ఈ లోహమును శుభ్రపరచు విధానము మన వారలకు తప్ప ప్రపంచములో వేరెవరికీ తెలియదు. మననుండి ఒక చైనీయుడు సంగ్రహిస్తే వానినుండి విలియం ఛాంపియన్ అన్న ఒక ఆంగ్లేయుడు గ్రహించి మొదటి సారిగా 1543 సంవత్సరములో యశద సంబంధ కార్మాగారమును తమ దేశములో నెలకొల్పినాడు. కంచు తయారికి అత్యంత మూల పదార్థము యశదమే. ఇది రాజస్తాన్ లోని జవార్,రాజపుర-దరిబ(375 BC) మరియు రాంపుర-అగుచ (370BCE) ప్రాంతాలలో అధికముగా ఈ నిక్షేపములున్నట్లు చరిత్రకారులు తెలుపుచున్నారు. యశదమును ఉపయోగించకుండా  కంచు (కాంశ్యము) ఇత్తడి (ఋతిక) లను తయారుచేయలేరు. మరి వీనిని మొదట ఎవరు తయారు చేసియుంటారు?

పాదరసము

పాదరసము కూడా లోహము.ఇది చంచల స్వభావము కలది, మనుషుల మనసుల మాదిరి. ఈ ధాతువును ఆయుర్వేదములో ఎంత కాలము నుండి మనము ఉప్యోగించుచున్నామో ఎవరూ లెక్క కట్టలేదు. పాదరసమును గూర్చి మన ఋషులు పరిపూర్ణముగా దాని ఉపయోగాములను గూర్చి కూడా తెలుసుకొని దానిని ఆయుర్వేదములో కూడా ఉపయోగించుతూవుంటే , 17 వ శతాబ్దము వరకు అదేమిటో తెలియదు పాశ్చాత్యులకు. తెలిసిన తరువాత వారు పెట్టుకొన్న పేరు Quick Silver . అంటే వెండి రంగులో భూతలము పై బడితే పారాడుతూవుంటుంది కాబట్టి. ఫ్రాన్సు ప్రభుత్వము భారత దేశము నుండి వచ్చు రస ఔషధములు (Medicins made of Mercury) విరివిగా అవసరమైన వ్యాధులకు వాడమని ఆ కాలములో చట్టమే అమలుచేసి యుండినారు.
మన పూర్వులు అనేక వేల సంవత్సరములనుడి రస విజ్ఞానము కలిగి యున్నారు. దీనిని విమాన నిర్మాణములో కూడా వాడేవారని ముందే చెప్పుకొన్నాము. భోజరాజు కాలములో దీనిని విమాన చోదనమునకు వాడేవారని చెప్పుకొంటారు. ఇక ఆచార్య నాగార్జనుని గూర్చి స్వర్ణమును గూర్చి తెలుపునపుడే తెలియబరచినాను. జటిలమైన Psoriyasis లాంటి వ్యాధులకు రాసౌషధ చికిత్స అత్యంత ఉపయోగకరము.
గొప్ప పండితుడు, బహుభాషా కోవిదుడు అయిన అల్బరూని పర్షియన్ దేశస్తుడు, కానీ ఘజ్నవీ సంస్థానము (ఆఫ్ఘనిస్తానములో ) నిలిచిపోయినాడు, ఈయన భౌతిక , గణిత, ప్రకృతి శాస్త్రములందు దిట్ట. ఈయన 11వ శతాబ్దములో వ్రాసిన  'తారిక్-అల్- హింద్ (History of India ) లో ఈ విధముగా పేర్కొన్నాడు " పాదరసము ఉత్పత్తి, ఉపయోగము లను గూర్చి వీరికి తెలియనిది లేదు" అని మనదేశపు ప్రతిభను ప్రపంచమునకు పరిచయము చేసినాడు.

ఇనుము-ఉక్కు

 కుతుబ్ మీనారు ప్రక్కలో యుండే గుడి యొక్క ఉక్కు ధ్వజస్థంబము ఎప్పటిదో తెలియని (కొందరు 1600సంవత్సరములంటారు గానీ ఋజువులు నేను చదవ లేదు.) కాలము నుండి నేటివరకు త్రుప్పుపట్టలేదు.నేడు కూడా ఢిల్లీ కాలుష్యము ఎంత ప్రయత్నించినను ఆ స్థంబమును ఏమీ చేసుకొనలేకయున్నది. ఇది ఎక్కువ మందికి తెలిసినదే , కానీ కర్ణాటకలోని కొల్లూరు లో  2400 సంవత్సరముల క్రితము ఆది శంకరాచార్యుల ఆగమన జ్ఞాపికగా,ఆవూరి శాస్త్రజ్ఞులో మేధావులో కాదు, మస్త్యకారులు నిలబెట్టిన స్థంబము , 750 c.m. వర్షము  ఒకసంవత్సరములో 6-8 నెలలు పడుతూ వున్నా చిలుము (త్రుప్పు) పట్టక మనపూర్వీకుల ప్రతిభకు ప్రతీకగా తలఎత్తుకొని నిటారుగా నిలిచియుంది.
కాశీ ఖండమయః పిండం అన్నారు మన పూర్వులు. మరి అయస్ అంటే ఇనుము లేక అందునుండి వచ్చిన ఉక్కే గదా! అయః+కాంతము = అయస్కాంతము అంటే ఇనుమును ఆకర్షించునది అనియే కదా అర్థము. మరి ఈ శబబ్దముల పుట్టుక భారతదేశమున , సంస్కృతమున ఎప్పుడు పుట్టినవో తెలుసుకొంటే ఇనుము ఈ దేశమున ఎంత పురాతనమైనది అన్నది తెలుసుకొనవచ్చును. ఋగ్వేదమున, ఆయుర్వేదమునకు ఆది పురుషులగు అశ్వని దేవతలు కృత్రిమముగా మోకాలును, యుద్ధములో పోగొట్టుకొన్న విస్ఫల అన్న రాజుకు, అమర్చినట్లు మనకు తెలియుచున్నది. మరి ఋగ్వేదము ఎప్పటిది అన్నది ఎవరూ ఇంతవరకు తేల్చలేని విషయము.
RV 1.117.11
Hymned with the reverence of a son, O Asvins ye Swift Ones giving booty to the singer,
Glorified by Agastya with devotion, established Vispala again, Nasatyas.
As legend has it, the Asvin twins appear and help restore Vispala’s leg with an artificial limb perhaps made from iron or copper/bronze. The “operation”, if one can call it that was performed in time that Vispala could move BEFORE the conflict opened (presumably the next morning).
ఖగోళ, భూగోళ,ప్రాకృతిక, భౌతిక, శాసన, వ్రాతమూలక పరిశోధస్నాల ద్వారా భారతయుద్ధము క్రీస్తు పూర్వము 3139 లోనూ  కలియుగము క్రీస్తు పూర్వము 3012 లోను ప్రారంభమైనదని ఘంటా పథముగా నిర్ణయించ బడినది. మరి ఆ యుద్ధములో వాడిన ఆయుధములు అనగా బాణములు బల్లెములు, గదలు మరి ఇనుము ఉక్కు తో కాక దేనితో తయారు చేయబడినట్లు. మరి ఇంతటి పూర్వ చరిత్ర మరి యే ఇతర దేశములకైనా  మతములకైనా ఉన్నదా! మరి లేనపుడు వారెందుకు మన చరిత్ర నంగీకరించారు. శుశ్రుతుడు మొదటి శాస్త్ర చికిత్స నిపునుదని పాశ్చాత్యులు కూడా ఒప్పుకొన్నారు. మరి ఆయన శాస్త్ర సహాయము లేకనే శాస్త్ర చికిత్స నిర్వహించెనా! మరి శాస్త్రములు వాడియుంటే అవి త్రుప్పు పట్టని సాధనములే కావలెను కదా ! మరి ఆయన కాలమునకు  ఇనుము ఉక్కు ఉన్నట్లే కదా! ఇన్ని విధములైన అవకాశాములుండియు మనము మన చరిత్ర, మనపూర్వుల గొప్పదనము తెలుసుకోలేకుండా యున్నాము. నిజానికిది సిగ్గుచేటు కాదా! ఈ క్రింది మాట చదవండి మన ప్రభుత్వ శాఖనే ఏమి చెప్పుచున్నదో?
Indians were familiar with iron and steel during the Vedic age more than 4,000 years ago. ASHOK BASU  (PRESS INFORMATION BUREAU -- GOVERNMENT OF INDIA )

Delhi's Iron Pillar This is again a fine example of India's great heritage in iron making. Recent work on the same has shown the presence of a layer of the hydrated iron hydrogen phosphate (FePO4rH3PO4,4H2O) layer & then an amorphos S-FeOOH layer over the base metal that greatly resisted corrosion / oxidation of the pillar.

Prof. Lalit Pandey (16 November 2009) Excavation at Iswal (Rajasthan), under Prof. Lalit Pandey’s supervision during 2001- 2007, has provided the earliest date of iron working in southeast Rajasthan. The C14 date of the iron working is 1053 BC.

The word "wootz" appears to have originated as a mistranscription of wook, an anglicised version of ukku

ప్రతిది , పాశ్చాత్యుల తప్పుడు వాదనను పోద్రోసి మన వాస్తవములను మనమే నిరూపించుకోనవలసి వచ్చుచున్నది. ఇది మన దౌర్భాగ్యము.
భారతీయ శాస్త్ర విజ్ఞానము ..11( లోహశాస్త్రము )  తో మళ్ళీ కలుస్తాము.

మన దేశమును గూర్చి పేరెన్నికగన్న విదేశ విద్యావంతుల మాటలు వారి నోటితోనే :



India is the cradle of the human race, the birthplace of human speech, the mother of history, the grandmother of legend and the great grand mother of tradition. - Mark Twain. 

If there is one place on the face of earth where all dreams of living men have found a home from the very earliest days when man began the dream of existence, it is India. --French scholar Romain Rolland. 

India conquered and dominated China culturally for 20 centuries without ever having to send a single soldier across her border. --Hu Shih, (former Chinese ambassador to USA).

యువత ఇకనైనా మేల్కొంటే దేశానికి , మన పూర్వీకుల గౌరవానికి ఎంతో మేలుచేసినవారవుతారు.
ఈ వ్యాసము వ్రాసేటపుడు కృష్ణునితో ఈ విధముగా మొరపెట్టుకొన్న ద్రౌపదే గురుతుకు వచ్చింది. ఇది తిక్కన భారతములోని  ఉద్యొగపర్వంలో రాయబారానికై వెడుతున్న కృష్ణుడితో ద్రౌపది అన్న మాటలు.
వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, అందు పాండుభూ-
వరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి, నీతివిక్రమ-
స్థిరులగు పుత్రులన్ బడసితిన్, సహజన్ముల ప్రాపుగాంచితిన్,
సరసిజనాభ! ఇన్నిట ప్రశస్తికి నెక్కినదాన నెంతయున్.

ఇంట గోప్పదానినై కూడా ఇన్ని ఇక్కట్లు పడుతున్నానని అర్థము.

New Delhi, July 18: Experts at the Indian Instituteof Technology have resolved the mystery behind the 1,600-year-old iron pillar in Delhi, which has never corroded despite the capital's harsh weather.
Metallurgists at Kanpur IIT have discovered that a thin layer of "misawite", a compound of iron, oxygen and hydrogen, has protected the cast iron pillar from rust.
The protective film took form within three years after erection of the pillar and has been growing ever so slowly since then. After 1,600 years, the film has grown just one-twentieth of a millimeter thick, according to R. Balasubramaniam of the IIT.
In a report published in the journal Current Science Balasubramanian says, the protective film was formed catalytically by the presence of high amounts of phosphorous in the iron—as much as one per cent against less than 0.05 per cent in today's iron.
The high phosphorous content is a result of the unique iron-making process practiced by ancient Indians, who reduced iron ore into steel in one step by mixing it with charcoal.
Modern blast furnaces, on the other hand, use limestone in place of charcoal yielding molten slag and pig iron that is later converted into steel. In the modern process most phosphorous is carried away by the slag.
The pillar—over seven metres high and weighing more than six tonnes—was erected by Kumara Gupta of Gupta dynasty that ruled northern India in AD 320-540.
Stating that the pillar is "a living testimony to the skill of metallurgists of ancient India", Balasubramaniam said the "kinetic scheme" that his group developed for predicting growth of the protective film may be useful for modeling long-term corrosion behaviour of containers for nuclear storage applications.






Viswakarma’s son, Nala built the Rama Sethu, the bridge from Rameswaram in Tamil Nadu to Mannar, Sri Lanka, at Sri Rama’s request. Rama and Vyasa called this the Nala Sethu. Nala was a second cousin of Hanuman, through his father Kesari.

(An Ancient Hanuman temple from the Pandava Age survives till today. It is situated near Baba Kharak Singh Marg, New Delhi, near Janthar Mandir. The reason it was not destroyed by the Muslim invaders, is because there is the symbol of the crescent moon on the Vimana.)

No comments:

Post a Comment