Saturday 26 November 2016

Myind Media (Media for my India)
మనసు బహు విచిత్రమైనది . ఇది అందరికీ వుంటుంది , అందరిలో వుంటుంది. దాని పరిధి అనంతము. అటువంటి మనసును ముఖ్యముగా ఒక ఆదర్శప్రాయమైన విషయముపై కేంద్రీకరించుట చాలా తక్కువ మందికే సాధ్యము. Cricket లో నూరు పరుగులు సాధించి తాను గొప్ప పేరు సంపాదించవలె ననే తపన గలిగిన వారు వనములో చెట్ల వలె ఎందరో వుంటారు, కానీ తన ఉనికికి ప్రాధాన్యత నివ్వకుండా సుగంధమును లోకానికి పంచే శ్రీచందన వృక్షములా వుండే వారు  ఎక్కడ వుంటారు ఎంత మంది వుంటారు  అన్నది అంత సులభముగా తెలుసుకో గలిగిన విషయము కాదు. అటువంటి మూడు చందన వృక్షములను గూర్చినదే ఈ వివరణ.

మాన్యత మహనీయత కన్నా మానవత గొప్ప అన్న ఒక సదుద్దేశ్యముతో  ధనాపేక్ష కాకుండా జనాపేక్షతో, అమెరికా చేరినా ఆంధ్రము పై మక్కువతో, కలయికకు కారణమును ఏర్పరచుకొని , మనము అన్న భావానికే తమ మనములందు పెద్దపీటవేసి మన మధ్యకు వచ్చిన   మైండ్ మీడియా వ్యవస్థాపకులు మాట మాత్రానికి కూడా అహంకారము ఆభిజాత్యము లేని లంక నాగరాజు గారు మరియు భాను గౌడ గారు, కనక ప్రసాద్ గారు .మంచిని పెంచుటే మానవత , పెంచినది పెంపొందించుటే మా ‘నవత’ అని ఎంచి భారత దేశము పై మక్కువతో  హృదయ పూర్వకముగా   వీరు ఏర్పరచిన సంస్థ పేరు Myind Media అని పెట్టుకున్నారు.
దేశమునకు కోశము, భవితకు యువత, యువతకు ధృడత , ధృడతకు నడత అత్యంత ఆవశ్యకమని నమ్మి అటువంటి యువతలో ఉత్సాహము, ఉద్వేగము ఉత్పన్నము చేయ ఆశ్వాసనము నిస్తూ   Myind Media ను ఆవిర్భవింప జేసినారు.
శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి
అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాంతి వినాయకాః
మంచి చేయ దలచిన వారికి అడుగడుగునా అడ్డంకులే అదే చెడ్డయితే అడ్డంకులు తమకు తామే భయపడి అడ్డు తొలగుతాయి. తెలిసి కూడా శ్రేయస్సు కొరకే పాటు పద తలచినారు మన మాన్యులు. మన దేశములో యువకులు అంటే 35 సంవత్సరముల లోపు వారు 65 శాతము వున్నారు. ఈ యువశక్తి యే కదా దేశ పురోగతికి ఆధారము ,ఆలంబనము అన్న వాస్తవమును ఎరింగి మన దేశ ఔన్నత్యము, మన సంస్కృతి , మన నానా విధ శాస్త్ర పరిజ్ఞానము, మన సంగీత సాహిత్యాది లలిత కళలు, సునిశిత హాస్యము  మొదలగు వివిధములైన అంశములను తమ ఆశయముతో రంగరించి మీ కందించి ఆనందింప జేయు   పరిశుద్ధ చిత్త స్ఫూర్తితో మీ ముందుకు వస్తున్నారు Myind Media అన్న ప్రసార మాధ్యము ద్వారా. వారి నిరంతర కృషికి నింగియే హద్దు. Their main aim is:
To spread the message to the youth that India must be protected, not just for its boundaries, but for its culture, the loss of which will be a loss to the entire humanity. It is the individual′s responsibility to understand the glory of our heritage and practice our culture. Every citizen should realize that his well being is linked to the welfare of his country. It is therefore his duty to lead his life responsibly and pray for the country.

ఏపనికైనా డబ్బే ప్రధానము . ‘ధన మూలం ఇదం జగత్’ అన్నారు కదా పెద్దలు. కానీ లాభము లేని పనులలో పెట్టుబడి ఎవరు పెడతారు అని అనుకునే రోజులలో ముందుకు వచ్చినారు ఈ ముగ్గురు. వారి అచంచల విశ్వాసము తమ ధ్యేయముపైన ఉండుటచే కలిగినదాని లోనే కాసింత తో ముందునకు నడుము బిగించి ముందునకు వచ్చినారు.    . అందుకే
అల్పానా మపి వస్తూనాం సంహతి: కార్యసాధికా                                              
తృణైర్గుణత్వ మాపన్నైర్భధ్యన్తే మత్తదన్తిన:
విడివిడిగా అత్యంత బలహీనమైన గడ్డిపోచలు కలిసినాయంటే గజము నైనా బంధించ గలుగుతాయి అన్న వాస్తవాన్ని ఆకళింపు చేసుకుని ఈ పనిని తలపెట్టినారు .  కార్యము ఎంత  కఠినమైనది అన్నది కాదు ముఖ్యము ఆ పనిని చేయుటకు కలిగిన సంకల్ప బలము, ఆలోచించే బుద్ధి, సునిశితమైన పరిశీలన, అందుబాటులో వుండే వనరులు, అనుకూలించే పరిస్థితులు మరియు అన్నింటికన్నా మించి అండగా నిలిచే భావ సారూప్యత కలిగి  చేతులు కలిపే ఆప్త బృందము. అన్నీ సమకూరితే అలుపు సొలుపు లేకుండా పని చేయవలెననే అనిపిస్తుంది.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినంఉపరస్య  నరభస్యః  
క్రియసిద్ధి సత్వే భవతి మహతం నోపకరణే.    

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు. మహనీయులు కేవలము ఆశయము-ఫలితముపై ధ్యాసనుంచుతారు కానీ తమకు కలిగే కంటకాలను గూర్చి కాదు, అన్న విషయాన్ని అక్షరాలా పాటించి ఉన్నతి సాధించిన శ్రేష్ఠులను  ఆదర్శముగా తీసుకుని వీరు అడుగు ముందుకు వేయటం జరిగింది.

వీరు మన భరతభూమి సంస్కృతీ సౌరభమును దశదిశలా వ్యాపించవలెను అన్న   ధ్యేయముతో దానికి తగిన ఉపాంగములతో ఈ Online Radio ను ప్రారంభించినారు.
ఎన్నో ఆవిష్కరణలు చేసి కూడా పేరుకు ప్రాకులాడని మన  ఋషులను గూర్చి, మన వైదిక ధర్మమును గూర్చి, వైదికము నందు అంతర్గతమైన మతముల గూర్చి (Various Schools Of Thoughts), శాస్త్రీయ సంగీతమును గూర్చి, శాస్త్రీయతను సంతరించుకున్న మన సినిమా సంగీతమును గూర్చి, KVరెడ్డి ,BN రెడ్డి, LV ప్రసాద్, కమలాకర కామేశ్వర రావు వంటి దిగ్దంతులైన దర్శకులను గూర్చి, వివిధ రంగములలో విశ్వ విఖ్యాతి గాంచిన తెలుగు తేజములను గూర్చి, భళారే విచిత్రమనిపించే ఎన్నో విడ్డూరాలను గూర్చి , ‘ప్రియమైన మీతో’ అన్న పేరుతో వక్త శ్రోతల లఘు సంభాషణలు, ప్రజలను పేద దారి పట్టించే అమెరికా నాగరికత లోని లొసుగులకు సంబంధించిన వక్తల ముఖాముఖి ప్రసంగములు,  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము పై ‘ Techie Talk’ ఆధునిక శాస్త్ర విజ్ఞానమును గూర్చి ‘Science Talk’ ఆయుర్వేద వైద్య  విధానము ననుసరించి శరీర ఆరోగ్యమునకు తీసుకొనవలసిన సలహాలను గూర్చి, ఇవన్నీ కాకుండా నేటి తెలుగు ప్రపంచములో లబ్ధ ప్రతిష్ఠులైన వారితో ముఖాముఖీ మొదలైన అంశములతోనూ, అందరికీ నవ్వుకొనుటకు అనువైన విధముగా అశ్లీలము లేని హాస్యరస కార్యక్రమములతోనూ, గోపికా మానస చోరుడైన శ్రీ కృష్ణుని ఆదర్శముగా గొని తెలుగు జగతి లోనికి అడుగు పెట్టింది.

ఇది కాకుండా ఇటు శ్రోతలలో అటు ప్రజలలో కూడా సంస్కృతి , కవిత్వము మొదలగు విషయములపై సదవగాహన పెంపొందించుటకు ‘పద్య స్పర్ధలు’ కవిత స్పర్ధలు’ ప్రజల ముందుకు తెచ్చి  వారిలో ఒక నూతన ఉత్తేజమును కలిగించు నిబద్ధత తో సామాజిక రచ్చబండగా చెప్పదగిన ‘ఆనన గ్రంధి’ లేక ‘గ్రంధ ముఖి’(facebook) లో ప్రకటించి , అందులో పద్యములు వ్రాసిన వారిని  అందరినీ ప్రోత్సహించ దలచి ఉచిత రీతిగా బహుమతి ప్రదానము చేయుట జరిగినది. కవితల విషయములో పోటీదారులు ఎక్కువై నందువల్ల  బహుమాన యోగ్యత కలిగిన వానికి బహుమతి ప్రదానము ప్రకటించుట జరిగినది. కవిత వస్తువు ‘ఉగాది’ కాబట్టి పాల్గొను వారి సంఖ్య పరిమితి దాటింది.

ఇవే కాకుండా కృష్ణ పుష్కరములకు  పుష్కర ప్రాశస్త్యము, విశేషించి కృష్ణా పుష్కరముల గొప్పదనమును గూర్చి  తెలుపుతూ ఒక సంచికను వీరు విడుదల చేయబోవుచున్నారు. దానిని ఉచితముగా భక్తులకు అందజేయ వలెననుకొనుట వారి సౌమనస్యత. 

ఇంకొక ముఖ్యమైన విషయము ఏమిటంటే ఉత్తుంగ తరంగములతో దనరారు భారతీయ విజ్ఞాన సాగర విశిష్ఠతను  తెలుగువారికి తెలుగు వారికి తెలియజేయ దలచిన అంతరంగము గలిగిన వారి శ్రీయుతులు చెరుకు రామమోహన్ రావు గారికి ఆ బాధ్యతను ఒప్పజెప్పినారు. 

ఇవికాకుండా సంస్కృతము భారతీయ భాషలకు మాతృకయే కాక సంస్కృతికి , సాహిత్యానికి, విజ్ఞానానికి ఆటపట్టన్నది గ్రహించి, ప్రపంచమంతా విస్తరించియున్న ‘సంస్కృత భారతి’ అన్న సంస్థతో సంప్రదింపులు జరిపి, వారి సౌజన్యముతో మన ‘అదృశ్య వాణి’(Radio) శ్రోతలకు ఆ దేవ వాణి యందు అభినివేశమును కల్పింపవలెనని కంకణము కట్టుకొని యున్నారు. మరియొక ముఖ్యమైన విషయము ఏమిటంటే ‘అవధానము’ అన్నది ఆంధ్రుల ఆస్తి. కొన్ని ఇరుగుపొరుగు భాషల వారు ఈ ప్రక్రియకై ప్రయత్నించి ప్రతిఫలము సాధించలేక పోయినారు. అటువంటి సంపదను ముందు తరాలకు అందించుటకు గాను శ్రీయుతులు మోపిదేవి భాస్కర రావు    గారి సహాయ సహకార సౌజన్యములతో  బాలురకు పరిచయము చేయబోవు చున్నారు .

ఈ విషయములన్నీ ప్రజలలో చొచ్చుకొని పోవుటకు ముందు కావలసినది జనాకర్షణ. అందులోని భాగముగా నేటి పేరుపొందిన గాయకులచే ‘మీ పాట మా నోట’   అన్న శీర్షికతో శ్రోతల సంఖ్యను ఇనుమడింప జేస్తున్నారు.

వైవిధ్య భరితమైన ఇన్ని కార్యక్రమముల పట్టిక చూస్తే వీరిలో ఎంత ఉత్సాహము ఎంత ఉద్వేగము ఎంత పట్టుదల ఉన్నదో తెలియవస్తుంది. మరి ఇన్ని ప్రణాలికల (నిజమునకు ప్రణాళిక అంటే భూమి లోనికి  దింపిన క్రోవి అనగా నాళము, ఆంగ్లములో Pipe or Tube)
కు తగిన తైలము భూమి నుండి వస్తుందా అన్న భయము కలుగుతుంది. అయినా ‘కృషి తో నాస్తి దుర్భిక్షం’ అన్నారు కదా పెద్దలు. నిస్వార్థ సేవకు పరమాత్ముని అండదండలు తప్పక ఉంటాయన్నది ఆర్యవాక్కు.

ఆశయమేమొ గొప్ప యది యాచరణమ్మున గూర్చ నెంచుచున్
పాశము తోడ ఈ పనిని బాయక చేయగ నిర్ణయించుచున్
లేశము కూడ  సందియము లేక మనంబున దేశమాత సం

దేశము గాంచు వీరల సుధీరుల గాచుము వెంకటేశ్వరా! 

రాజు,కనక, భాను, రవీందర్ లను గూర్చి వ్రాయ వలెను...... పద్మిని ని గూర్చి ఒక మాట చెప్పవలెను.స్వకీయమన కారణాల వాళ్ళ వదిలిపెట్టిందని........ 

No comments:

Post a Comment