Monday 21 November 2016

ఇదీ నిజం ఇదే మోదీయిజం

ఇదీ నిజం ఇదే మోదీయిజం
మోదీ దెబ్బకి ఆస్తులు అమ్ముకుంటున్న అంబానీ, అదానీలు.
మోదీ ప్రతాపం సామాన్యుల మీదేనా? మోదీకి అధికారం ఇచ్చింది సామాన్యులని ఇబ్బంది పెట్టడానికా అన్న ప్రశ్న మన మెదడులోని మారుమూలల్లో బయటికి రాలేక దాగుకొని వుంది. కానీ వాస్తవానికి నోట్ల రద్దు నిర్ణయమునకు ముందే,నుంచే
బడాబాబులపై దృష్టిపెట్టినట్లు తెలియవస్తూవుంది ఈ క్రింద తెలిపిన వైనము చూస్తే!. లక్షల కోట్ల అప్పులు తీసుకుని అవి తీర్చకుండా దర్జాగా తిరుగుతున్న వ్యాపారులకు మోదీ ఎనిమిది నెలల క్రితమే హెచ్చరిక పంపినారు. బ్యాంకులకు
కట్టవలసిన 5 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తో కలిసి మోదీ ఎంతో తీవ్రముగా ఆలోచించినారు. ఆస్తులు అమ్మి అయినా సరే అప్పులు కట్టితీరవలసిందేనని ఫిబ్రవరి 8న నే ఆయన బడాబాబులకు లేక బడాయి బాబులకు అల్టిమేటం ఇవ్వటము జరిగింది అని తెలియవస్తూవుంది. దీనితో అనేక కార్పోరేట్ కంపెనీలు తమ ఆస్తులని అమ్మకానికి పెట్టినట్లు తెలియవస్తూవుంది. నిజానిజాలు నాకు తెలియదు గానీ తెలియవచ్చిన సమాచారము ఈ క్రింది విధముగా వుంది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్
ఈ గ్రూప్, బ్యాంకులకి మొత్తం 1లక్ష 21వేల కోట్లు అప్పు ఉంది. దీన్ని తీర్చడం కోసం రిలయన్స్ తమ 44 వేల టెలికాం టవర్స్ ను 22 వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది. దానితో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 8వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఇక తమ మీడియా విభాగాన్ని 2వేల కోట్లకు అమ్మవలెనని నిర్ణయించుకుంది. ఈ విధముగా ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం 60 వేల కోట్లు సమీకరించి, అనిల్ అంబానీ తనకి ఉన్న అప్పుల్లో సగం తీర్చివేయ దలచినారని తెలియవస్తూవుంది. ఈ గ్రూప్ దేశంలో ఉన్న బ్యాంకులకు మొత్తం ఒక లక్ష కోట్ల అప్పుంది. ఈ గ్రూప్ తనకున్న ఆయిల్ రిఫైనరీలలో సగం వాటాను అమ్మి 25వేల కోట్లు, స్టీల్ ప్లాంట్స్ లో 49% వాటాను అమ్మి మరో 25వేల కోట్లు సమీకరించి, బ్యాంకులకి చెల్లించనుంది అని తెలియవస్తూవుంది.
అదానీ గ్రూప్
మోది ఆప్తుడు గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ బ్యాంకులకు మొత్తం 96 వేల కోట్ల బకాయిలు ఉంది. ఇవి తీర్చడం కోసం విదేశాలలోని బొగ్గు గనులను, రైల్వే ప్రాజెక్టులను అమ్మవలెనని నిర్ణయించుకుంది. తాజాగా మరో 6వేల కోట్ల ఋణం కోసం SBI తో MOU కుదుర్చుకుంది. ఇప్పుడు ప్రభుత్వ పెద్దల సూచనతో SBI ఈ లోన్ ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలియవస్తూ వుంది.
జేపీ గ్రూప్
మనోజ్ గౌర్ కు చెందిన జేపీ గ్రూప్ బ్యాంకులకు 75 వేల కోట్ల అప్పు ఉంది. ఇది తీర్చడం కోసం తన సిమెంట్ కంపెనీలలో కొంత భాగాన్ని బిర్లా గ్రూపునకు అమ్మి 15 వేల కోట్లు అప్పు తీర్చదలచుచున్నది. దీనికి తోడు, ఇతర ప్రాజెక్టులు అమ్మడం ద్వారా ఇంకొంత డబ్బు సమకూర్చుకుని మొత్తం, 24 వేల కోట్లు అప్పులు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలియవస్తూ వుంది.
GMR గ్రూప్
తెలుగు వాడు, గ్రంథి మల్లికార్జునరావు గారికి చెందిన GMR గ్రూప్ కి మొత్తం 48 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ గ్రూప్ తన అప్పులని తీర్చడం కోసం తమ అధీనంలోని రోడ్లు, ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ లలో కొంత వాటాను అమ్మడానికి సిద్ధం
అయింది అని తెలియవస్తూ వుంది.
లాంకో గ్రూప్
లగడపాటి వారి లాంకో గ్రూప్ కి మొత్తం 47 వేల కోట్ల అప్పులు ఉన్నట్లున్నాయి. వీటిని తీర్చడం కోసం రోడ్లు, పవర్ ప్రాజెక్ట్ లతో పాటు ఆస్ట్రేలియాలో కొన్న బొగ్గు గనులలో కూడా వాటా అమ్మి 25 వేల కోట్లు సమీకరించనుంది అన్నది అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తూ వుంది.
GVK గ్రూప్
జి.వి.కృష్ణారెడ్డి గారికి చెందిన ఈ గ్రూప్ కి 33 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవి తీర్చడం కోసం, వివిధ మార్గాలలో ఆస్తులలో వాటాలని అమ్మి 10 వేల కోట్లు సమీకరించే ప్రయత్నాలలో ఉంది.
ముకేష్ అంబాని
ముకేష్ అంబానీ విషయానికి వస్తే, ఆయన గ్రూప్ కి మొత్తం 1లక్ష 87వేల కోట్లు అప్పులు ఉన్నాయని తెలివస్తూంది. వీటిలో జియో కోసం చేసిన 65 వేల కోట్ల అప్పు కూడా ఉంది. జియో కోసం రిలయన్స్ మొత్తం లక్షా యాభై వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ముకేష్ కు చెందిన రిలయన్స్ మాత్రం బ్యాంకులకి వడ్డీ సకాలంలో చెల్లిస్తోంది. ఈ గ్రూప్ వ్యాపారాలు అన్నీ లాభాలలో ఉన్నాయి కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, తన మిత్రుడు కదా అని మోదీ ముకేష్ అంబానీని కూడా వదలలేదు. అక్రమంగా గ్యాస్ తవ్వుకున్నందుకు కేంద్రం, రిలయన్స్ కు 10 వేల కోట్ల ఫైన్ వేసిందని సమాచారము.
ఇక దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని సిగ్గు లేకుండా నడిపిన మన్మోహన్ గారు, వారికి నాయకత్వం వహించిన సోనియా గారి హయాములో కార్పోరేట్ కంపెనీలు పండగ చేసుకున్నాయి అన్న విషయము అందరికీ తెలిసినదే! 2009 మార్చి నాటికి కంపెనీలు చెల్లించాల్సిన అప్పుల్లో 85 వేల కోట్లను కొత్త రుణాలుగా మారిస్తే, ఈ మొత్తం యు.పి.ఏ చివరి ఏడాదికి వచ్చే సరికి సుమారు 3 లక్షల కోట్ల రూపాయల మేర కార్పోరేట్ డెబ్ట్ రి-స్ట్రక్చరింగ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరింది. దేశంలో టాప్ 10 కంపెనీల అప్పులే 5 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 2 లక్షల కోట్లు ఇప్పుడు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పట్టుదలగా ఉన్నాయి.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి, నల్లధనం, మొండి బకాయిలు, నకిలీ కరెన్సీ ఈ మూడిటి మీద మోది దృష్టి పెట్టి గట్టి చర్యలే తీసుకుంటున్నారు. మోది చెప్పినట్లు 70 ఏళ్లనుంచి పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలి అంటే కాస్త సమయం పడుతుంది. నోట్ల మార్పిడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. పైనుంచి క్రింది దాకా మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కోసం మన ప్రధాని మోది చేస్తున్న యజ్ఞం ఇది. అందుకే కాస్త ఈ ఇబ్బందులను వరిద్దాం భరిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం ఆపై ఈ కష్టాలను తరిద్దాం.
'అమ్మను Q లో నిలిపినాడు అమ్బానీని నిలుపలేదు' అన్న మాటలో కేవలము అనుప్రాస మాత్రమె వుంది. వాస్తవము లేదు. ఒక సాధారణ ప్రభుత్వ అధికారి తానూ వరుసలో నిలువకుండా తన Office Boy ని నిలుచుటకు పంపుతాడు మరి అంబానీ తనకు అవసరమైనపుడు పంపలేడా!
శుభం భూయాత్

No comments:

Post a Comment