Wednesday 20 May 2015

SOMA -- సోమ

SOMA -- సోమ


The Bible was originally written in Greek the language of the intellectuals of the time. At the last supper, when Jesus picks up the bread he describes his body with one particular word:
“And as they were eating, Jesus took bread; and when he had given thanks, he broke it and gave it to his disciples, saying, “Take, eat; this is my body (sōma | σῶμα).” – Matthew 26:26
That’s right, the word used in the original Greek for the body of Jesus is Soma. The Greek word Soma is of “undetermined” origin and refers to the body of a plant, isha (mystical/physical) (esha,esa,esus, Jesus), as well as a heavenly body viz. moon. 
With all of these points of similarity we can state conclusively that the central religious ritual of Christianity is patterned on Vedic cosmology. This is authentically proved by  E. Pococke in his work 'India In Greece'. It is also now evident to doubt that when they have borrowed the primary word 'Jesus' itself from Sanskrit, is it true that there existed any historic Jesus.
బైబిలు మొదట గ్రీకుభాషలో వ్రాయబడినది. నాడది పండిత భాష. క్రీస్తు 'అంత్య నిశాశనము' (Last Supper)రొట్టెముక్కను గైకొని, తన అనుచరులకు,  దానిని తన తనువుతో పోలుస్తూ ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించుతాడు:
"
వారు ఆవిధముగాభుజించు సమయమున,జీసస్ కృతజ్ఞతా పూర్వకముగా,ఒక రొట్టెను ముక్కలు చేసి వారికి అందజేస్తూ 'మీకోసగిన ఈ రొట్టెముక్కలు తినండి;ఇది నా తనువు( సోమ, sōma | σῶμα). -- మ్యాత్యూ 26:26
ఇక్కడ గమనించవలసిన విషయము ఏమిటంటే , గ్రీకు భాషలో క్రీస్తు శరీరానికి 'సోమ' అన్న శబ్దాన్ని వాడినారు, కానీ దాని వ్యుత్పత్తి వారికి తెలియదు.'సోమ' శబ్దము సంస్కృత జన్యమని, దానికి శివుడు(ఈశుడు, ఈశ, ఈస, ,ఈసస్,జీసస్ ) అన్న రూపాంతరము ఏర్పడినదన్నది వారి ఊహకు అందని విషయము.
దీనిని బట్టి మనకు అర్థమౌతున్నది ఏమిటంటే. వాళ్ళు, వారి మతగ్రంధములో వాడిన మౌలిక పదాలకు మూలము సంస్కృతము. మరి ఈశ నుండి జీసస్ అన్న పదము రూపాంతరము చెందినప్పుడు అసలు వ్యక్తీ పుట్టలేదేమో , పదము మాత్రము వాడుకొన్నారేమో అన్న ఆలోచనను రేకెత్తించక మానదు. అసలు గ్రీకు భాషకు  మూలము సంస్కృతమే అని పోకాక్ పండితుడు INDIA IN GREECE అన్న గ్రంధములో సోపపత్తికముగా నిరూపించినారు.

నేను వ్రాసిన SOMA -- సోమ అన్న శీర్షిక పై Sat Sangamu వారు వెలిబుచ్చిన అభిప్రాయానికి 

అనుబంధముగా నాలుగు మాటలు వ్రాయవలసి వచ్చి 

వ్రాస్తున్నాను.



Sat Sangamu మీకు అవకాశం తీరిక వున్నట్లయితే internet లో సంస్కృతంలో ముద్రితమైన bible దొరుకుతుంది, 


అసలది అది చూస్తే ఇంకా నేను చెప్పేదేముంది. మీరు ఇక్కడ వ్రాసిన దృక్పథమే అణువణువునా కనిపిస్తుంది. 

Butవ్యక్తి పుట్టలేదు అన్న మీ భావానికి నాకు ఏకీభవించ బుద్ధి కావటం లేదు కానీ, ఎంతైనా శకపురుషుడైనవారిని 


కాదనుట ఎట్లు? జ్ఞానులను దైవ సమానులుగా చూసే అలవాటు ప్రపంచ వ్యాప్తముగా వున్నది. రమణ మహర్షి జ్ఞాని 

కానీ భగవాన్‌ శ్రీ రమణులు అంటారు.షిరిడీ సాయి మహా జ్ఞాని, సద్గురువు కానీ ఆయన్ని దేవుడిగా చేసేసి విగ్రహాలు 

అభిషేకాలు etc చేసేస్తున్నారు.వీరు దైవానికి భిన్నులా అంటే, "ఆ పరమతత్వానికి అభిన్నులం కాదు" అని 

అనుభవపూర్వకంగా చెప్పారు కనుకనే వీరు జ్ఞానులు అయ్యారు. 

సంస్కారముతో కూడిన మీ సందేహానికి  నాకు చేతనైన రీతిలో సమాధానమిస్తున్నాను. దీనిని వాదములోనికి 

పరివర్తన చేయవద్దు.


The texts were mainly written in Biblical Hebrew, with some portions (notably in Daniel and 

Ezra) in Biblical Aramaic. Biblical Hebrew, sometimes called Classical Hebrew, is an 

archaic form of the Hebrew language. The very first translation of the Hebrew Bible was 

into Greek. (Biblical languages - Wikipedia)

 During the thousand years of its composition, almost the entire Old Testament was written in Hebrew. But a few chapters in the prophecies of Ezra and Daniel and one verse in Jeremiah were written in a language called Aramaic. This language became very popular in the ancient world and actually displaced many other languages. 
 The New Testament authors wrote in Greek. They did not, however, use really high-class or classical Greek, but a very common and everyday type of Greek. For many years some scholars ridiculed the Greek of the New Testament because many of its words were strange to those who read the writings of the great Greek classical authors such as Plato and Aristotle. But later many records were uncovered of ordinary people, and amazingly there were the same common terms used in everyday speech! The ridicule dried up accordingly. 
We now have His revelation in our own language and in 2300 other languages, too. Today we have the very Bible that comes to us from the three languages used in the original. Truly we can say, "God speaks my language, too!" (biblica.com)

కాబట్టి ఆ 2300 భాషలలో సంస్కృతము ఒకటి. కాబట్టి బైబిలును సంస్కృతములో చదువనవసరము లేదు. సంస్కృతములో పండితులమని చెప్పుకొన్న మాక్సు ముల్లరు గారు తన బంధువులకు గురువులకు ఏమి వ్రాసినాడో దయతో చదివేది. ఇక్కడ మనకు తెలియవచ్చేది ఏమిటంటే బైబిలును ఒకరు వ్రాయలేదు.మొదట కూడా ఒకే భాషలో వ్రాయబడలేదు.  అటువంటి పుస్తకమును వివిధ భాషల లోకి తర్జుమా చేసినవారు స్వకపోల కల్పనలు చేర్చకుండా వ్రాయరు. పరమాత్మ స్వరూపముగా చెప్పబడే క్రీస్తు పుట్టుకకు చారిత్రిక ఆధారములు నేటికినీ దొరుకలేదు. గ్రెగోరియన్ కేలెండరులో జరిగిన మార్పుచే ఆయన పుట్టుక డిసెంబర్ 25 కాదు అన్నది నిర్దారితమగుచున్నది.

ఇక రమణుల వారిని సాయిబాబాను గూర్చి మీరు ప్రస్తాపించినారు. 'అహం బ్రహ్మస్మి' అన్న వేదవాక్కుకు ప్రతినిధి యైనవాడే తానూ దేవుడని చెప్పుకొంటాడు. ఆ విధముగా అటు రమణులు గానీ ఇటు సాయిబాబా గానీ తాము దేవుళ్ళమని చెప్పుకోలేదు. మానవాతీత మహిమలను ప్రత్యక్షముగా చూసిన పామరజనులు తమకు తోచిన రీతిలో వారిని పూజించుచున్నారు. అట్లు చెప్పుకొన్నది 'శ్రీ కృష్ణ పరమాత్మ' మాత్రమె! 

నారాయణ  సమారంభం 
శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య  పర్యంతాం 
వందేగురుపరంపరాం 
వీరంతా క్రీస్తుకు ముందువారే ! వీరి ఉపదేశ సారాంశము కూడా 'మోక్షం  కావాలనే కోరిక  బలంగా ఉంటె, భౌతికవిషయసుఖాలను  విషంగా భావించి, వాటికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. సంతోషం, దయ, సహనం, రుజుత్వం, శాంతి,  దాంతి  అనే ఉత్తమ గుణాలను అమృతంగా భావించి , ఆప్యాయంగా స్వీకరించి , ఆచరించడానికి పూనుకోవాలి.'
వేరెవరైనా కూడా ఇంతకన్నా వేరుగా చెప్పరు. తానింత కావలసిన సంపదనుంచుకొని పోరుగింటికి ఎవరూ పోయి యాచించరు. 
ఇక వ్యక్తి పుట్టుకను గూర్చి ఒక్క మాట , నన్ను తప్పుగా తలవ వద్దు, 'నేను పరిశీలించినంతవరకు క్రీస్తు జన్మకు ఆధారములు కనిపించలేదు.' అట్లని 'ఆయన పుట్టనేలేదని' నేను ప్రతిపాదించనూ లేదు . మీరు ఆ విషయముపై ఏదయినా ఆధారము దొరికితే ఆస్య గ్రంధిలో (Face Book) లో ప్రచురించేది. నా తప్పు సవరించుకొంటాను. 

'లోకాఃసమస్తాస్సుఖినోభవంతు'అన్నమాటఅనునిత్యము తలచే ఈ అత్యంత ప్రాచీనమైన వైదిక సాంప్రదాయముఅందరికీ అవలంబనీయము. క్రీస్తు పుట్టుకకు పూర్వమే అధర్వణవేదాంతర్గతమైన 'మహోపనిషత్తు' ఈ విధముగా కనబడుతుంది. అందులో ఇవ్వబడిన ఈ  శ్లోకం చదవండి.  

ఉదారః పేశలాచారః సర్వాచారానువృత్తిమా
నన్తఃసఙ్గ-పరిత్యాగీ బహిః సంభార వా నివ

అయం బన్ధురయం నేతి గణనా లఘుచేతసాం
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం***

భావాభావ వినిర్ముక్తం జరామరణవర్జితం
ప్రశాన్త కలనారభ్యం నీరాగం పదమాశ్రయ

ఏషా బ్రామ్హీ స్థితిః స్వచ్ఛా నిష్కామా విగతామయా
ఆదాయ విహరన్నేవం సంకటేషు న ముహ్యతి
(మహోపనిషత్తు 6.70-73)

 ఇదే విషయాన్ని  ’హితోపదేశం’, ’విక్రమచరితం’  ’పంచతంత్రం’, ’చాణక్యనీతి’ అన్నగ్రంధాలలో కూడా చెప్పబడినది.  
ఇటువంటి విషయములను ఆకళింపు చేసుకొంటే ఈ దేశము కన్న మహనీయులను గూర్చి, ఈ దేశపు సనాతనత్వమును గూర్చి, సాంప్రదాయమును గూర్చి, అది ఇది ఎలా సర్వస్వమును గూర్చీ తెలుసుకోవచ్చు.
మన దేశములో జరిగిన మతాంతరీకరణలు, స్త్రీలను చెరచి, పురుషులను, శిశువులను చంపి మారణ హోమములు జరిపి మతమార్పిడులు చేసినారు. ప్రపంచము లోని ఏ దేశము కూడా 1000 సంవత్సరములు విదేశీయులతో పరిపాలింపబడి తన ఉనికిని కాపాడుకొన్నది లేదు. ఆ గౌరవము భారత దేశమునకే దక్కినది. ఈ దేశములోని ఏ వ్యక్తి, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే ఉత్తర దక్షినములలోని ఈ భారతావనిలో జన్మించిన వాని DNA ఒకటిగానే ఉంటుంది అన్నది ఇపుడు నిరూపింపబడిన సత్యము. సత్వ సాధన సత్య శోధన చేసి సాధించిన ప్రతివ్యక్తి బ్రాహ్మణుడే! ఇందులో అందరిదీ ఒకే ధర్మమే! 

స్వస్తి.






























No comments:

Post a Comment