మనవయికూడా
మననుండి విడిపడిన దేశములు
ఈ వ్యాసమును నేను వీలయినంతవరకూ క్లుప్తముగా వ్రాసినాను. చదవండి.
ఒకప్పుడు
బర్మా(మ్యాన్మార్) మనదేశాములోని భాగము. 8వ శతాబ్దము నుండి
అది అఖండ భారతమునకు దూరమైనది. అంతవరకూ ముస్లిం, క్రైస్తవ
పాలకులకు నేపాల్ భూటాన్ బర్మా టిబెట్ మొదలగు ప్రాంతాలు లోను కాలేదు. అఖండ భారతమంటే
కలియుగారంభమున జనమేజయుని కాలము వరకు ఇది అఖండమే. రూపతి అన్న ఒక కురు రాజ కుమారుడు
(ధృతరాష్ట్ర కుమారులలోనివాడు కాదు.) తపస్సు చేయనెంచి మానస సరోవర దిశగా వెళ్ళినా
అచటి గిరిసీమలకు ఆకర్షితుడై వనవాసులను కూడగట్టి ,ఆ ప్రాంతమునకు
త్రివిష్టపమను పేరుబెట్టి తానుమొదటి రాజై పరిపాలించినాడు.అది రాను రానూ టిబెట్
అయింది.వారు పాటించినది సనాతన ధర్మమే వారి రాజు ఒక కౌరవ రాజే. క్రీస్తు పూర్వము 15వ శతాబ్దములో మగధ
సామ్రాజ్యాని గిరివ్రజ పురమును రాజధానిగా చేసి మౌర్యులు పరిపాలించు కాలములో
టిబెట్టు వారి సామంత రాజ్యము. ఇప్పుడది చైనాలో భాగమని మనకు తెలిసినదే. మానస
సరోవరము, కైలాస శిఖరము
సంస్కృత నామములు కలిగినపుడు వానికి అనుబంధమైన త్రివిష్టపము మనరాజులచేత ఏలబడి మన
దేశములో భాగము కాదంటే అంతకన్నా హాస్యాస్పదము వేరేమి ఉంటుంది.
ఇది ఒక ఎత్తయితే బర్మా ఇప్పుడు కొన్ని దేశముల వారు మాత్రమే మియాన్మార్ గా గుర్తించినారు.
ఆంగ్లేయుల ఏలుబడిలో బర్మా 1824 నుండి 1937 వరకూ భారత దేశము యొక్క అభిన్న భాగమై ఉండినది. 1947 కు పది సంవత్సరముల పూర్వము అది 1937 లో విడిపడినది. 1931 నాటికి 7% భారతీయులను కలిగిన ఆ ప్రాంతమునకు వీరు కట్టుచుండిన పన్ను శాతము 55 అయితే బర్మీయులు కట్టుచుండిన పన్ను శాతము 11.
పైగా బర్మా ఆనాడు భారత దేశములోని అతి పెద్ద పరిధి గల్గిన భారతీయ అఖండ విభాగము. ఆప్రాంతమునకు ప్రక్కనున్న బంగాళ దేశ జనాభా750 లక్షలయితే బర్మా లో 90 లక్షలు ఉండేవారు. బర్మా విస్తీర్ణము 170 చదరు మైళ్ళు. బెంగాల్ యొక్క విస్తీర్ణము 151 చదరపు మైళ్ళు. విడిపోవుటచే ఎంత నష్టపోయినామో గమనించండి. (Imperial Gazetteer of India, v. 4, p. 46.)
భారత దేశము నుండి బర్మా 1937 లో విడిపడింది అని చెప్పుకొన్నాము. అప్పటికి బర్మా మనదేశాములోని భాగము. మేము విద్యార్థులుగా ఉన్న కాలములో దేశాపతములలో బర్మాను హరతదేశ భాగముగా చూసేవారము. సరి, ఆసమయమున మన దేశము బ్రిటీషు వారిచే పరిపాలిమ్పబడుతూ ఉండినది. మరి బర్మాను విడదీసినది వారే! అప్పటికే మనము పూజించే తెరమీదీ నేతలు ఈషణ్మాత్రమైనా ప్రతిఘటన చూపలేదు. అసలు 1932 లో బర్మాలో అభిప్రాయ సేకరణ నిమిత్తము జరిగిన ఎన్నికలలో Antiseperation league 47 స్థానాలు గెలిస్తే Seperation league దక్కిన్చుకోన్నది 29 స్థానాలు మాత్రమె!
అసలు బర్మాకు ఆంధ్రులకు అవినా భావసంబంధము ఉండేదని మనకు తెలియవస్తూవుంది. బర్మాను, బ్రహ్మదేశమనేవారనీ బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ 700 నాటికే ఆంధ్రులు ఈ దేశానికి వర్తకము నిమిత్తము వస్తూ పోతూ ఉండేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. సముద్రము మీద బర్మాకు వచ్చిన భారతీయులలో ఆంధ్రులే మొదటి వారని ప్రతీతి. బర్మా క్రీస్తు శకము 8వ శతాబ్ది నుండి రాజకీయంగా మనకు దూరమైనది. బర్మాతదితర ఈశాన్య ప్రాంతాలు స్వతంత్రముగా వుండుటవల్లనూ, ముస్లిం క్రైస్తవ మూకల వశము చాలా కాలము కాకుండుటవల్లనూ అవి మన దేశముతో విడిపడినాయి. క్రీస్తు శకము 1885 అనగా కలియుగము 4987 వ సంవత్సరము వరకు అది స్వతంత్ర దేశము. కాని విధి వికటించి తదుపరి ఆ ప్రాంతము వారికి లొంగి 1937 అనగా కలి సం. 5039 వారిచే బలవంతముగా విడగొట్ట బడినది.
ఆంగ్లేయుల ఏలుబడిలో బర్మా 1824 నుండి 1937 వరకూ భారత దేశము యొక్క అభిన్న భాగమై ఉండినది. 1947 కు పది సంవత్సరముల పూర్వము అది 1937 లో విడిపడినది. 1931 నాటికి 7% భారతీయులను కలిగిన ఆ ప్రాంతమునకు వీరు కట్టుచుండిన పన్ను శాతము 55 అయితే బర్మీయులు కట్టుచుండిన పన్ను శాతము 11.
పైగా బర్మా ఆనాడు భారత దేశములోని అతి పెద్ద పరిధి గల్గిన భారతీయ అఖండ విభాగము. ఆప్రాంతమునకు ప్రక్కనున్న బంగాళ దేశ జనాభా750 లక్షలయితే బర్మా లో 90 లక్షలు ఉండేవారు. బర్మా విస్తీర్ణము 170 చదరు మైళ్ళు. బెంగాల్ యొక్క విస్తీర్ణము 151 చదరపు మైళ్ళు. విడిపోవుటచే ఎంత నష్టపోయినామో గమనించండి. (Imperial Gazetteer of India, v. 4, p. 46.)
భారత దేశము నుండి బర్మా 1937 లో విడిపడింది అని చెప్పుకొన్నాము. అప్పటికి బర్మా మనదేశాములోని భాగము. మేము విద్యార్థులుగా ఉన్న కాలములో దేశాపతములలో బర్మాను హరతదేశ భాగముగా చూసేవారము. సరి, ఆసమయమున మన దేశము బ్రిటీషు వారిచే పరిపాలిమ్పబడుతూ ఉండినది. మరి బర్మాను విడదీసినది వారే! అప్పటికే మనము పూజించే తెరమీదీ నేతలు ఈషణ్మాత్రమైనా ప్రతిఘటన చూపలేదు. అసలు 1932 లో బర్మాలో అభిప్రాయ సేకరణ నిమిత్తము జరిగిన ఎన్నికలలో Antiseperation league 47 స్థానాలు గెలిస్తే Seperation league దక్కిన్చుకోన్నది 29 స్థానాలు మాత్రమె!
అసలు బర్మాకు ఆంధ్రులకు అవినా భావసంబంధము ఉండేదని మనకు తెలియవస్తూవుంది. బర్మాను, బ్రహ్మదేశమనేవారనీ బుద్ధునికి పూర్వము అంటే క్రీ.పూ 700 నాటికే ఆంధ్రులు ఈ దేశానికి వర్తకము నిమిత్తము వస్తూ పోతూ ఉండేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయము. సముద్రము మీద బర్మాకు వచ్చిన భారతీయులలో ఆంధ్రులే మొదటి వారని ప్రతీతి. బర్మా క్రీస్తు శకము 8వ శతాబ్ది నుండి రాజకీయంగా మనకు దూరమైనది. బర్మాతదితర ఈశాన్య ప్రాంతాలు స్వతంత్రముగా వుండుటవల్లనూ, ముస్లిం క్రైస్తవ మూకల వశము చాలా కాలము కాకుండుటవల్లనూ అవి మన దేశముతో విడిపడినాయి. క్రీస్తు శకము 1885 అనగా కలియుగము 4987 వ సంవత్సరము వరకు అది స్వతంత్ర దేశము. కాని విధి వికటించి తదుపరి ఆ ప్రాంతము వారికి లొంగి 1937 అనగా కలి సం. 5039 వారిచే బలవంతముగా విడగొట్ట బడినది.
హిందూ సామ్రాజ్య
భాగమైన సింహళము(ఇప్పటి శ్రీ లంక) బుడుతకీచులు (ఫోర్చుగీసులు) క్రీస్తు శకము 1505 లో
వశపరచుకోనబడినది. అసలు ఇప్పటికి అక్కడ తెలుగువారు వారి మూలములు అధికమని చారిత్రికులు
నిరూపించియున్నారు. అసలు మొదటి తెలుగు వ్యాకరణము వ్రాసినది రావణుడనే ఒక ప్రచారము
ఇప్పటికీ వున్నది. మన భాష మాన సంస్కృతి కలిగిన భూభాగముమనది కాకుండా వేరు
ఏమవుతుంది. సిరిమవో భండారునాయకే, విక్రమ
సింఘే మొదలగువారలు తెలుగువారలే
వినియున్నాను. తెలుగు కవులు ఎక్కువగా 'మలయానిలము' అన్న శబ్దమును తమ
కవితలలో వాడుతారు. మలయా అంటే నేటి మలేషియా. ఆనాడు అక్కడ శ్రీగంధము చెట్లు ఎక్కువగా
ఉండేవట. గాలికి ఆ చెట్ల కదలికవల్ల వచ్చే సుగంధభరితమౌ ఆ గాలినే మలయానిలము అంటారు.
శ్రీలంకకు పడమరగా
ఉన్నమాల్ దీవ్స్ ఒకప్పటి మాలా ద్వీపములు. అవి చిన్న చిన్న భూభాగాములై
ఒకదానినొకటియానుకొని మాలగా ఉన్నందువల్ల ఆ పేరు వచ్చిందంటారు. సామాన్య శకము 12 వ శతాబ్దములో
బౌద్ధ ధర్మావలంబనమైన ఈ దేశాము ముస్లీము ముష్కరుల హస్తగతమైనది. సా.శ.1796 లో దీనిని
బ్రిటీషు వారు ఆక్రమించి 1965లో
స్వాతంత్ర్యమును ఇచ్చినారు.
ఇవికాక మనవియైకూడా మనవి కాకుండా పోయిన భూభాగాలు
ఈ దిగువన ఇవ్వబడినవి.
నాటి అఖండ భారతము
: 27,48,115 చ.మై.
దేశము
బంగ్లాదేశ్
...................................: 57,000 చ.మై (1మైలు= 1.61కి.మీ.
ఇంచుమించు)
మయన్మార్
...............................:2, 61,000 చ.మై
శ్రీ లంక
......................................:25,000 చ.మై.
మాల్ దీవ్స్ (
మాలా ద్వీపములు) : 115 చ.మై.
పాకిస్తాన్
....................................: 3, 07,000 చ.మై. (బాంగ్లా
కలిపి)
ఆఫ్ఘనిస్తాన్...................................: 2, 51,000చ.మై.
నేపాల్.........................................:
57,000 చ.మై.
భూటాన్
......................................: 18,000 చ.మై.
త్రివిష్టుప్.......................................:
4, 72,000చ.మై.
నేటి
భారతము(గొరగంగా మిగిలిన జుట్టు ):13,00,000చ.మై
______________
27, 48,115చ.మై
_______________
ఇంత భూభాగము
కలిగి యుండినవారమై యుండి కూడా, అవి విడిపోయినా
నోరుమూసుకొనే ఉన్నాము. మన జాతిని పరమతములలోనికి మార్చుకొంటూ పోతున్నా పల్లెత్తు
మాట మాటలాడని సహనశీలురము. ఆదికవి వాల్మీకి పేరును ఒక చలనచిత్ర దుష్టపాత్రధారికి
పెట్టినా, అది ఆ మహర్షిని
కించపరచినట్లుగా భావించము. పొరుగున ఉన్న తమిళనాడులో, ఆర్య ద్రావిడ
వాదమును అమలులోకి తెచ్చి దేశమును, ఒకవిధముగా రెండు
చేసిన ఒక ద్రావిడ ఉద్యమ నేతకు సంబంధించిన
ఒక వాస్తవాన్ని చెప్పినందుకు ఒక చిత్రకథానాయకుని బెదిరించుచున్నారు, కానీ మనము
మాత్రము ఏమాత్రమూ స్పందన లేకుండా పట్టనట్టు ఉండిపోతాము. వాల్మీకికి బదులు ఏ శకుని
అనో వాలి అనో పెట్టియుండవచ్చుకదా! నేను ఎవరినీ తప్పుపట్టుటలేదు కానీ ఆలోచించమని
చెబుతున్నాను.
ఇవన్నీ ఎందుకు
చెబుతున్నాను అంటే 'నేను' అన్న మాటను
విడిచిపెట్టి 'మనము' అన్న మాటను
పట్టుకొంటే ఎంతో ప్రగతిని సాధించగలము.
స్వస్తి.
Very good information provided by you sir which we can't reach out
ReplyDeleteకలియుగారంభకాలానికి అనగా జనమేజయుని కాలానికి అఖండ భారతములో గల భాగములు చాలా వరకూ బర్మా,నేపాల్,భూటాన్ లు భారత దేశంలోని భాగాలు అని బాగా వివరించారండీ.
ReplyDeleteత్రివిష్ఠపపురం అనగా నేటి టిబెట్టు ఆవిర్భావాన్ని బాగా వివరించేరు. అతను ఒక కురు వంశజరాజని తెలిపేరు.
అలాగే 15వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యానికి టిబెట్టు సామంత రాజ్యమగుటను తెలిపేరు.
మానససరోవరము,కైలాసము వంటి పేరుగల త్రివిష్టపము మన భారతదేశానికి చెందినది కాదనుకుంటే హాస్యాస్పదమని బాగా వివరించారు.
ఆంగ్లేయుల పాలనలో 1824నుండి 1937 వరకూ
బర్మా
ఆంగ్లేయుల పాలనలో
భారత్ లో భాగమే.
బర్మా వైశాల్యము,వారు కట్టే పన్ను శాతమును బాగా వివరించారు.
బర్మా విడిపోవుటచే భారత దేశం యెంతో భూమిని కోల్పోయిన వివరాలందించేరు.బ్రిటిష్ వారే బర్మాను భారత్ నుండి విడదీసేరు. అప్పటి బాడా నేతలెవరూ దీనిని ప్రతిఘటించలేదు. నిజానికి బర్మా పౌరులలో అత్యధికకులు యీ విభజనకు వ్యతిరేకమని 1932 లో జరిగిన అభిప్రాయ సేకరణ ఎన్నికలలో ANTISEPARATION LEAGUE 47 స్థానాలు గెలువగా, SEPARATION LEAGUE 29 స్థానాలను మాత్రమే గెలుచుకొని డం
గురించి బాగా వివరించారు.
బర్మాకు ఆంధ్రులకు గల అనుబంధం గురించి కూడా బాగా తెలిపేరు.
ఒకప్పుడు బ్రహ్మదేశమను నామము గలదే తర్వాత బర్మా గా మారింది.
బుద్ధునికి పూర్వము 700 సంవత్సరాలకు ముందే ఆంధ్రులు వ్యాపారం కోసం బర్మా వెళ్ళేవారు అని వివరించారు.చివరికి 1937లో బర్మా భారత్ నుండి విడగొట్ట బడిందని తెలిపారు.
అలాగే సింహళము ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలోని భాగమనీ
అక్కడ తెలుగు వారు బాగా యెక్కువగా ఉండేవారనీ వివరించేరు.
మొదటి తెలుగు వ్యాకరణం వ్రాసినది రావణుడే అని ఉన్న ఐతిహ్యం గురించి తెలిపేరు.
ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
సిరిమావో భండారు నాయికే,
విక్రమ్ సింఘేమొదలగు వారు తెలుగు వారేనని చెప్పి ఆశ్చర్యం కలిగించేరు.
మలేషియాలో.. అధికంగా ఉండే శ్రీ గంధమును చెట్లపైనుండి వచ్చే గారినే మలయానిలమంటారని చెప్పి ఆశ్చర్యం కలిగించేరు.
మాల్దీవులు గురించి చాలా బాగా వివరించారు..
12వ శతాబ్దంలో బౌద్ధ దేశమైన మాల్దీవులను ముస్లిం ముష్కరులు ఆక్రమించిన వైనం తెలిపారు.
1796లోబ్రిటిష్ వారు దానిని ఆక్రమించి 1965లో స్వాతంత్ర్యం యివ్వడం గురించి వివరించారు.
ఆనాటి అఖండ భారత వైశాల్యం
27,48,115 చ.మైళ్ళు అనీ,
నేటి భారతంలో ఉన్న భూమి
13,00,000 చ.మైళ్ళు అనీ
బంగ్లాదేశ్,మయన్మార్, శ్రీ లంక, మాల్దీవులు, పాకిస్థాన్ బాంగ్లా కలిపినది,ఆఫ్ఘానిస్థాన్,నేపాల్,
భూటాన్,త్రివిష్టుప్ లు మనదేశనుంచి విడగొట్ట బడటం వల్ల ఆ 13,00,000 చదరపు మైళ్ళు
మాత్రమే మిగిలిందనీ
అంటే దాదాపు 14,48,115 చదరపు మైళ్ళు భూమి మన అఖండభారత్ నుండి విడగొట్టబడి మనదేశం నష్ట పోయిందని లెక్కలతో పక్కాగా నిరూపించారు.
అమోఘమైన వివరాలను అందించే రండీ రామమోహన రావు గారూ.
ఇప్పటికీ యధేచ్చగా జరుగుతున్న
మీతో మార్పిడులను గురించి, వాల్మీకి మహర్షి పేరును ఓ సినిమాలో విలన్ కి పేరుగా పెట్టడం గురించి తెలిపేరు. తమిళనాడు లో హైందవ వ్యతిరేక ద్రవిడ ఉద్యమం గురించి చాలా సత్యాలను తెలిపారు.
మన దేశానికి జరిగిన అన్యాయాలను,జరిపిన వారి గురించి యెంతో సవివరంగా చాలా పెద్ద వ్యాసాన్ని రచించే రండీ
రామ మోహన రావు గారూ.
మీరు ఎంతో శ్రమపడి రచించేరో...ఊహకందని విషయం. మన దేశం చరిత్రను గురించి మీరు కలుగ జేస్తున్న జాగృతి యెంతో ప్రత్యేకమైనది.చాలా విశిష్టత గలది.
మీకు మీరే సాటి.. మీ అద్భుతమైన దేశభక్తికీ,సహృదయతకూ
వేవేల అభినందనలండీ రామ మోహన రావు గారూ.
వందనములండీ 🌹🙏🙏🙏🌹