Monday 26 November 2018

మేడం-ఆంటీ-అంకుల్


మేడం-ఆంటీ-అంకుల్
https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post_26.html
‘Baba Black sheep.....’ అన్న Rhyme మనకు సుపరిచితమే! ఇందులో Sheep ఏమని జవాబు చెబుతుందంటే ‘One for my Master one for my DAME..’
‘My Dame’ రానురానూ Madam అయినది. అది గొర్రె కాబట్టి My Dame (Madam) అంటే చెల్లినది. నాస్త్రీ, నా ఆడది, అన్న అర్థములో వచ్చే ఈ పదము తప్ప మన సంస్కృతిలో మన భాషలో వేరు పదములేదా! అసలు Dame అన్నది French శబ్దము వాళ్ళు ఇంటి యజమానియగు స్త్రీని Dame అంటారు.
మరి ఈ మాటకు ప్రత్యామ్నాయము లేదా అంటే ఉంది. అదే  అమ్మ . అమ్మ అన్నది అత్యుత్తమమైన పదము. పదము అన్న మాటకు రెండు అర్థములు. ఒకటి ‘అర్థమును కూర్చెడి అక్షరముల కలయిక.’ వేరొక అర్థము ‘ఉన్నత స్థానము’. నకోక అర్థము 'పాదము'. మరి అమ్మ అన్న పదము’ పలికి అమ్మ’ పాదము’ పట్టితే అదియే స్వర్గ పదము’ .
అమ్మ అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ , దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ, ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.

అమ్మ, తల్లి, మాత,జనని, అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము. సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే  అమ్మ అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని  matter, మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత గా చేప్పుకునే  గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter   మొదలగునవి. మాత అన్న శబ్దము ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము . దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే   మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
ఇక  Madam అన్న పదము యొక్క మూలమును తెలుసుకొందాము. ఫ్రెంచ్ భాషనుండి లాటి, తద్వారా ఆగ్లమునకు వచ్చింది ఈ Madam అన్న పదము వచ్చింది. ఈ క్రింద Google నుండి ‘Madam’ యొక్క పుట్టుకకు సంబంధించి గ్రహించిన విషయమును మీ ముందుంచుచున్నాను.
‘Madam /ˈmædəm/, or, as French, madame /ˈmædəm/ or /məˈdɑːm/,[1] is a polite form of address for women, often contracted to ma'am /ˈmæm/ in American English and /ˈmɑːm/ in British English. The abbreviation is "Mme" or "Mme" or "Mdm" and the plural is Mesdames (abbreviated "Mmes" or "Mmes" or "Mdms"). The term was borrowed from the French Madame (French pronunciation: [maˈdam]), which means "my lady". (Courtesy: Google)’
కావున “Madam” కన్నా ‘అమ్మ’ అని పిలుచుట చేత స్త్రీలను అత్యున్నతముగా గౌరవించిన వారలమగుచున్నాము అన్నది నిర్వివాదాంశము.
ఇక ‘ఆంటీ అంకుల్’ అన్న పదములకు అర్థములేమిటి అన్నది ఆలోచించుతాము.
మళ్ళీ కలుద్దాము.......


ఇక ఆంటీ అంకుల్ ను గురించి
వెస్టు కల్చరెపుడు వేడి కాఫీ యాయె
వారి రీతి నీతి పాలు చీని
అందుచేత ఆంటి అంకులు మనకొచ్చె
మామ అత్త పిన్ని మాయామాయె
 నిరంతరమూ సువాసన వెదజల్లే శ్రీగంధపు వృక్షమును మొదలంట నరికి కొని తెచ్చుకొని గంధపు అగరుబత్తీ వెలిగించినట్లు వుంది మన వరుస. పాశ్చాత్య సంస్కృతి అగరుబత్త్హీ వంటిది. భారతీయ సంస్కృతియగు చందన సాలము నేటిది కాదు తరతరములనుండి వస్తూ వున్నది. ఆ మరులుగొల్పు మంచి గాలిని మనము పీల్చుచూ మనము మన వారసులు ఆరోగ్యముగా హాయిగా ఉండవలెనని ఏర్పాటు  చేసినారుచేసినారు మన పూర్వులు. అచెట్టును నిర్దాక్షిణ్యముగా నేటి తరము కొట్టివేస్తూ వుంటే బరువెక్కిన మనసుతో ఎవరయినా బాధ వెలిబుచ్చితే నీకెందుకు నాయిష్టం అంటున్నారు. ఈ విధముగా ఆలోచనలు వెర్రితలలు వేస్తూ పోతే స్వంత ఇంటికి న్నిప్పుపెట్టుకొని ‘నాయిష్టం నాయిల్లు’ అంటారేమో!
పాశ్చాత్య సంస్కృతిని గూర్చి ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నము చేయుటకు నేను తెలియజేయుచున్నది ఒకసారి, మనసు పెట్టిచదవండి.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మ లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు, ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. మొదటిసారిగా హిలరీ క్లింటన్ నిలచినా ఓడిపొయినది.

ఇంచుమించు13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ పాశ్చాత్య జాతికి పెళ్లి అన్నది తెలియదు. నేటికి కూడా, అది ఆడామగ సంబంధము. అదే మన సాంప్రదాయములో  రెండు కుటుంబాల అనుబంధము. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే, రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు  అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ  ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్న ఆ పాశ్చాత్యదంపతులు అదృష్ట వశాన రెండు  మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే  వ్రాసుకొంటారు అట్లు కాకుంటే వడంబడిక చేసుకొంటారు. అది లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె  పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. అదే విధముగా అతని పిల్లలు, తమ తండ్రి క్రొత్తగా పెళ్ళిచేసుకొన్న యువతిని ‘ఆంటీ’ అంటారు. మరి అటువంటి సంబోధనలు చెడ్డవి కాదా! ఒకపరి ఆలోచించండి. చైనా, జపాను, మలేషియా,నేపాల్, భూటాన్ ఇత్యాది అనేక దేశములు తమ తమ సంస్కృతిని సజావుగా కాపాడుకొంటూ వస్తూవున్నాయి. ఒకనాటి మన దేశములో భాగమయిన పాకిస్తాన్ తమ మతము తమ సంస్కృతికి అడ్డువస్తాయని హైందవ సంస్కృ తినేకాక హిందువులనే పొట్టన పెట్టుకొంది. వారివలె దుర్మార్గమునకు పాలుపడండి, అని నేను చెప్పుటలేదు. నేను కేవలము మన ఆచారవ్యవహారములు ఎంతో సనాతనమైనవి. ద్రష్టలయిన మహాఋషి  మునులు మనకు ఏర్పరచిన మానవ సంబంధముల బాటలో నడుద్దాము అని మాత్రమె చెబుతున్నాను.
పాశ్చాత్యులు ఈ విధముగా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day, Father’s day (mothers' day, Father’s day ని గూర్చి విస్తృతముగా ఇదివరలో వ్రాసినాను.) రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ నాన్నను వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది.
అందుకే Uncle, Aunt అన్న పదములకు శబ్ద కోశము లో చిన్నాన్న లేక మామ అన్న అర్థమును, పిన్ని లేక అత్త అన్న అర్థములను చూస్తాము. మనకున్నన్ని వావి వరుసలు వారికి లేవు. అందుకే వారు 'పిండికీ పిడుక్కూ ఒకే మంత్రము'ను వాడుతారు. దయవుంచి ఆ విధముగా సంబోధించి మన తలిదండ్రులకు అవమానమును కోరి తేవద్దు. పైపెచ్చు కొత్తవారిని సంబోధించునపుడు ఏమండి, పెద్దవాలయితే గురువు గారు, అయ్యా, అమ్మా, అంతగా ఆంగ్లమే కావాలన్నా 'సార్' అని వాడితే మన వాసి తగ్గేది ఏమీ లేదు.
 క్రొత్తవాళ్ళతో ఎంతో అనుబంధమున్నట్లు బంధుత్వమును అంటగట్టి పిలుచుట మన సాంప్రదాయము కాదు అని తెలియజేస్తూ నా ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్నాను.

స్వస్తి.

Saturday 3 November 2018

మదిలోని మాట














మదిలోని మాట

https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post.html

ఒక విషయము వ్రాయవలెను అంటే వ్రాసేవానికి ముందు అవగాహన అవసరము.

అటుపిమ్మట ఆ అవగాహనను భావము లోనికి రూపాంతరము చెందించవలసి

యుంటుంది. ఆపై  ఆ భావమును, దానికి అనుకూలమైన భాషలోనికి మార్చవలసి

యుంటుంది. ఇవన్నీ మానసిక ప్రక్రియలే. ఆ తరువాత అక్షరములను వ్రాత బల్లపై

వుంచవలసి యుంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రక్రియను దైవదత్తముగా భావించితే

తనకు చేతనగు రీతిలో నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుతాడు. అదే

స్వార్థబుద్ధి అయితే ధనాపేక్షతో చేస్తాడు. కొందరు ఇంతటి గొప్పపని చేసికూడా

అయాచితముగా వచ్చిన పారితోషికమునే గ్రహించుతారు. యాచించరు.

యాచించేవాడు స్వార్థ కవి లేక పండితుడు.  ఆ రెంటికీ దూరమున్నవాడు

పరమార్థ కవి లేక పండితుడు. అసలు తనలో ఏమీ లేకుండా ఏదో వ్రాసేవాడు

నిరర్థ కవి లేక పండితుడు.

ఈ ఆస్య గ్రంధికి చెందిన అందరూ నిస్వార్థులే. కానీ వీరిలో కొందరు తాను

వ్రాసినది ఎందరికి నచ్చినది అని చూస్తారు. వీరిని కూడా రెండు తెగలుగా

విభజించవచ్చు.

మొదటి కోవకు చెందినవారు సంఖ్యను జూచి సంతృప్తి పడిపోతారు. రెండవ

కోవకు చెందినవారు నచ్చిన వారి సంఖ్యను ఆలంబనగా తీసుకొని తమ రచనకు

మరికాస్త పదును పెట్టి చదువరులకు తమకు తెలిసిన విషయములను

ఉత్సాహముతో తెలియజేయ తలచుతారు.

ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తిని నేను. తెలిసినది కొంచెమయినా,

తెలుపవలెనను తపన కలిగిన వాడను. అందుకే, ముద్రణ కష్టమయినా Likeలు లేక

పోయినా, నా ప్రయత్నమును విరమించను. వ్రాయుట దీక్షగా స్వీకరించి మాత్రమే

వ్రాస్తూ వుంటాను. ఇన్నిచెప్పినా నేనూ మనిషినే! నాలోనూ బలహీనత ఎదో ఒకటి

ఉంటుంది.

నాలోని ఆ బలహీనత ఏమిటి అన్నదానికి ఒక ఉదాహరణ రూపముగా

తెలియజేసుకొంటాను.

Cricket లో గొప్పగా batting చేసిన ముగ్గురూ వ్యక్తులను తీసుకొందాము.

1.                   డాన్ బ్రాడ్మన్ : నాడు టెస్ట్ క్రికెట్ మాత్రమే వుండేది. క్రీడాకారులు కూడా బంతి భూమిపై వేగముగా తమను దాటి వెళ్ళిపోతే  దానిని పొందుటకు పరిగెత్తేవారు. లేక Ball ఒకవేళ Catch కి వస్తే పరిగెత్తి పట్టే ప్రయత్నము చేసేవారు. అంతకు మించిన ప్రయత్నము, కష్టము నాడు కనబడదు.

2.                తెండూల్కర్: ఈయన కాలానికి One Day, T20 వచ్చినాయి. ఆటలో నైపుణ్యము 

పెరిగినది. బంతులను విసరు తీరుతెన్నలు ఎంతగానో మారిపొయినాయి. Batting 

నైపుణ్యము పెరిగి పోయింది. Jonty Rhodes పుణ్యమా అని Fielding పద్ధతులు కూడా 

మారజొచ్చినాయి. Circus Feats చేసి బంతిని పట్టుట సాధన చేసినారు. అట్టి 

పరిస్తితులలో, తన శరీర ఆరోగ్యము వల్లనో, తన నైపుణ్యము వల్లనో, ఎన్నో Records ను 

స్వంతము చేసుకొన్నాడు.


ధోనీ, కోహ్లీ: వరవడి పెరిగింది, నైపుణ్యము పెరిగింది. ఆటగాళ్ళు పెరిగినారు.

అవకాశాలు తగ్గినాయి. గాయాలను సైతము లెక్కచేయక ఆడేవారు

అధికమయినారు. అన్నిటికీ మించి Matches అన్నీ Recod కావటం తో వానిని మళ్ళీ 

మళ్ళీ చూసి, తమ తప్పులు సవరించుకొనుట, ఇతరుల బలహీనతలు కనుగొని వారిపై 

దెబ్బకొట్టుట నేర్చుకొన్నారు. ఇవికాక Coaches ను Batting, Bouling, Fielding లకు 

విడి విడిగా ఏర్పాటుచేసుకొని సామర్థ్యమును పెంచుకొన్నారు.

ఎవరి రికార్డులు వారివే! పోల్చుట, వివిధ కాలపరిస్థితులకు అనుగుణముగా మారిన 

ఆటలో,   నావరకు సబబు అనుపించదు. ఆ కాలములకు వారు గొప్ప. కవిత్వము

పాండిత్యము , వ్యాసరచన కూడా ఇటువంటివేనని నా అభిప్రాయము. ఈ కాలములో 

వుండే భావ ప్రసార మాధ్యమములు నాడు లేవు, అయినా మహనీయులు వ్రాసిన 

గ్రంధములు అజరామరములై నిలచిపోయినాయి. నాటి మహానుభావులు, కొందరయితే 

మహా పడితులై కూడా గుర్తింపునకు పాటుపడలేదు.

కాళిదాసు పేరు ప్రాచుర్యములో ఉన్నంతగా మల్లినాథసూరిని గూర్చి ఎందరికి తెలుసు. 

అసలు ఆయన కాళిదాసు కావ్యములకు వ్యాఖ్యానము వ్రాసియుండి ఉండకపోతే ఆ 

గ్రంథములకు ఇంత ప్రాచుర్యము వచ్చియుండెడిదా! ఈ విషయము ఎంత మందికి 

తెలుసు. ఆయన ఆంధ్రుడని ఎందరికి తెలుసు.

మల్లినాథుడి ఇంటిపేరు కొలచాల. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే 

వికారాలున్నాయి. కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామము తెలంగాణా రాష్ట్రము లోని, 

మెదక్ జిల్లాకేంద్రమైన మెదక్ కుు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు 

పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని 

తెలుస్తోంది.

మహామహోపాధ్యాయుడగు జటావల్లభుల పురోషోత్తం గారు స్వయంగా

మల్లినాథులవారిని గూర్చి చెబుతూ, ఆయనే లేకుంటే కాళిదాసునకు అంత పేరు

వచ్చేది కాదేమో అన్నారు. ఇంతటి మహానుభావులు ఎందఱో! ఎందరెందరో!

కానీ నేటి పరిస్థితి అది కాదు. రామాయణ, భారత భాగవత, మహాకావ్య, ప్రబంధములను

చదివేవారు కనిపించరు అనుట అతిశయోక్తి కానేరదేమో! నేడు ఆస్యగ్రంధిలో తమ 

కవితలను పంచే కవులు పుంఖానుపుంఖములు. కానీ ఇందులో, గంభీరమగు భావము 

కలిగియుండి కూడా, ఎక్కువమంది భాషాసంపదను సమకూర్చుకొను  జిజ్ఞాస, నిబద్ధత 

కలిగినవారు తక్కువ. అప్పుడు కవిత పేలవమై తేలిపోతుంది.

 సారవంతమైన రచనలను పాఠకులు చదివి అభిప్రాయములు తెలుపుతూ 

ప్రోత్సహించితే మంచి రచనలు ఆస్యగ్రంధిని అలరించగలుగుతాయి.

 

మాటవరుసకు నేను గతము లో వ్రాసిన సంబాజి విషయమే

తీసుకొందాము. నావంటి ఒక అనామకుడు ఆయనను గూర్చి వ్రాసినా

వ్రాయకున్నా, చదువ వలసినవారు చదివినా చదువకున్నా ఆయన వాసికి వన్నె

తరుగదు. కానీ మనవాడయిన ఒక మహనీయుని గూర్చి పదుగురు

తెలుసుకోవలెనని తలచినాను. కానీ నాది వ్యర్థ ప్రయత్నమని అర్థమైపోయింది.

ఎందుకంటే, ఇందు మోడీ లేడు, రాగా లేడు, కచరా లేడు, నాచనా లేడు. పోనీ

చిరు, రాచ, అల్లు, మబాతారా, మొదలయిన ధనాపేక్ష కీర్తి కండూతి కలిగిన వ్యక్తి

కనబడడు. అందువల్ల చదువుటకు మనకు నిరాసక్తి. ఇందులో మీటూ (మాంసము)

మీటూ (Me too) లేదు. ఇక చదువుట ఎందుకు అనుకొని వుంటారు.

అది నిజమని నాకు అనిపిస్తుంది. అంతటి మహోన్నతమయిన వ్యక్తిని గూర్చి

తెలుసుకొన తలంపేలేని పాఠకులకు ఆయనను గూర్చి తగిన విధముగా తెలుపలేక

పోయిన నేను, ఆ అమహావీరుని, చనిపోయిన తరువాతకూడా అవమానపరచి

రెండవ ఔరంగజేబును కాలేను. అందుకై వ్రాయుట విరమించుచున్నాను.

ఆయనను గూర్చియే కాదు. దేనిని గూర్చి వ్రాసినా పాఠకులకు ఎందుకో మంచి

తెలుసుకొనవలెనంటే ఎదో ఉదాసీనత. అదే 'మోడీ పాలన బాగుందా లేదా అని

ఇక ప్రశ్న వేసి వదిలిపెడితే 200 మందికి తక్కువలేకుండా likes మరియు For and 

Against Comments వ్రాస్తారు. దీనివల్ల మన విజ్ఞానము పెరుగుతుందని నేను 

భావించను.

‘అజరామర సూక్తులు’, ‘సమస్య మనది సలహా గీతది’ మొదలగు అనేక 

మంచివిషయములను,  ఏ రూపములో వున్నా, ఎవరు వ్రాసినా చదువుట 

అలవరచుకొండి. మీరు నేర్చినది భావితరాలకు వ్యాప్తి చేయగలరు. ఈ సనాతన ధర్మ 

పరిరక్షకులు మీరే!

స్వస్తి.