Thursday, 21 January 2021

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

https://cherukuramamohan.blogspot.com/2021/01/america-amerigo-vespucci-v-spu-t-i-1.html

ఈ వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభాజించినాను.  ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.

America అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:

Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,

1454 – February 22, 1512) was an Italian explorer, financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing for Portugal around 1501–1502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)

పైన, మనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.

దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు

అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,

అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ

తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరును, ఆ పేరును ప్రతిబింబంపజేసే

జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు

మనదేశమునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'

గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు

ఉపయోగించము అని నా మనవి.

 మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా

ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమును, మన ఉదాసీనత వల్ల, ఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామో, ఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.

 మనము అధికముగా ఆలపించే  జాతీయ గీతము

 నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦

 రూపాయలు  అనే ఈ రోజుల్లో, 1882 వ సం. తన 'ఆనంద్ మఠ్' అన్న నవలలో

 బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరం' గీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్

 ద క్వీన్' అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ

 సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే

 అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర

 గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ

 గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది.

 ముస్లింలు, క్రైస్తవులు, అందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు

 కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది

 ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే

 సాక్ష్యము .

 In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of

 Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can

 be no debate about it. Of course Bankimchandra does show Durga to be

 inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can

 be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [The

 Nation].

మే 10, 2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో

 కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు

 నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరం' ఆలపించరాదని ఉద్ఘాటించినది

 రవీంద్రులవారే! అందులోని, ఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

 మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ

 గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో

 సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక

 పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో

 ప్రతిఘటన ఏదీ!

 ఇక 'జనగణమన' నేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.

 ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు

జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత

విదుషీమణి కావడం వల్ల,  సహకారముతో, ఠాకూరు వారు ఆలపించుట జరిగిది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగే, మంగళ దాయక

మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ

జాతుల ,పర్వతముల, నదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్

గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ V మనదేశానికి విచ్చేయు సందర్భములో

వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.

ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V

గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు

కదా !

 ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడు, అది దేవుని గూర్చి వ్రాసినదని

తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు

ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా

వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని

తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ

రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది

వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him

especially to welcome the Emperor." (Statesman, Dec. 28, 1911)"The

proceedings began with the singing by Rabindranath Tagore of a song

specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28,

1911) "When the proceedings of the Indian National Congress began on

Wednesday 27th December 1911, a Bengali song in welcome of the

Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted unanimously." (Indian, Dec. 29, 1911)

 ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో,

కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్' సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,

తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడై, నెహ్రూ గారికి చెప్పగా, వారి సహాయ

సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికి' గ్రహించడం జరిగింది.

 మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.

 విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో

గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని 

పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము

చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!

జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)

 జనగణమన్ అధినాయాక్ జయహే, భారత భాగ్య విధాతా

పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా

వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా

తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగే, గాహే తవ్ జయ్ గాథా

జన్ గణ్ మంగల్ దాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

అహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ

హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్రిస్తానీ

పూరబ్ పశ్చిం ఆసే, తవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా

జనగణ ఐక్యవిధాయక్ జయ్ హే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ

తుం చీర్ సారథి, తవ రథ్ చక్రే, ముఖరిత్ పథ దిన్ రాత్రీ

దారుణ్ బిప్లవ్ మాజే, తవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా

జనగణ పథ్ పరిచాయాక్ జయహే, భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే

ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే

దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకే, స్నేహమయీ తుమీ మాతా

జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే

గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే

తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే

తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే

జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll

"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల

ఆధారములను ఒకపరి పరికించుదాము -

మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో

మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం

జరిగింది.

2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో

మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే.

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.

మరివిధాత అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ

కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో పోల్చియుంటే 'విధాత్రి' అనియుండవలసినది.

4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస - తవ

సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు

చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.

పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని

అనుకొనుటకు వీలు కాదు, అన్వయము కుదరదు కాబట్టి.

6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన

తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం

"రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే

మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై 

కదా వుండినారు.

7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్

పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునా? వాడ

తగునా?

8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన

దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా

లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న

రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును

"టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత

జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే

చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.

ఈ విషయమును గూర్చి  కొంత చర్చించుకొందాం........     


               మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము 2

 పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి

సింహాసనము  చేజిక్కించుకొని, దేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన

మీర్ జాఫర్ ను, అతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న

మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ

బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు.

ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూ, ముఖోపాధ్యాయ  ముఖర్జీగానూ,

బందోపాధ్యాయ బెనఖుదీరం బోస్, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్ వంటి

మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ,

ప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు

వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ

వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ

వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి,

ఠీవికి, దర్జాకు, దర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు

కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత

ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ

గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక  ఒక మారు రవీంద్రులవారు 'వందే మాతరము'ను దుర్గా స్తుతి  అన్నారు కదా

అందుచే ఆ గీతము యొక్క పూర్తి పాఠమును నేను దిగువన ప్రత్యేకముగా

'వందేమాతరం' అన్న శీర్షిక క్రింద ప్రచురించున్నాను. అది దుర్గాస్తుతి కాదు,

మాతృభూమికి సమర్పించిన కృతజ్ఞతా ప్రసూనము మరియు దేశభక్తి ఉద్దీపనము. ఆ

గీతము యొక్క పూర్తి పాఠమును దానికి నా స్వేచ్ఛానువాదమును నిన్న నే మీ

ముందుంచినాను. అందు చేత దానిని ఇపుడు ఉంచలేదు.

రేపు మరికొన్ని వివరములతో.................

 


మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ 'వందేమాతరం' గీతమును పార్లమెంటులో

సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు

విరుద్ధమని బయటకు నడచినాడు అని పైన తెలిపినాను. నేటి కేరళ రాష్ట్ర గవర్నరు

మరియు ఉర్దూహిందీ,సంస్కృతము, ఫార్సీ, అరబ్బీ పండితుడగు ఆరీఫ్ మొహమ్మద్

ఖాన్ గారు, బుర్క్ గారి తీరుకు ఎంతో నొచ్చుకొన్నవాడై 'వందేమాతరం' గీతము యొక్క

పల్లవి , ప్రథమ చరణములను ఉర్దూ లోనికి తర్జుమా చేసి ఆ గీతములో ముస్లీములు 

ఆలపించకూడని అంశము ఏదీ లేదని నొక్కివక్కాణించినారు. ఆయన వ్రాసిన ఆ

గీతమును తెలుగు లిపిలో మీ ముందుంచుచున్నాను. మాతృక యొక్క భావార్థమును

నిన్ననే వేరుగా ప్రచురించినాను కాబట్టి ఇపుడు తిరిగీ వ్రాయలేదు. తస్లీమాత్ అంటే

వందనములు అని అర్థము.

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తూ భరీ హై మీఠే పానీ సే

ఫల్ ఫూలోంకి శాదబీ సే

దక్ఖిన్ కీ ఠండీ హవావోఁ సే

ఫసలోఁ కీ సుహానీ ఫిజావోఁ సే

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తేరీ రాతేఁ రోషన్ చాఁద్ సే

తేరీ రౌనక్ సబ్జ్-ఏ-ఫాం సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ సే

తేరీ మీఠీ భరీ జుబాన్ సే

తేరీ బాహోఁ మె మేరీ రాహత్ హై

తేరీ ఖద్మోఁ మె మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

వారువ్రాసిన పై గీతముతో కూడా తెలుగు స్వేచ్ఛానువాదముతో  మీముందుంచుచున్నాను.

ఎక్కడయినా మారు వందనము తప్ప దుర్గావందనము కలదా అన్నది గమనించగలరు.

వందనమమ్మా వందనము

తీయని నీరు తేనెలువూరు

పూలు ఫలమ్ముల పచ్చదనాలు

దక్షిణ ప్రాంతపు చల్లగాలులు

పచ్చని పంటల సౌందర నందము

వందనమమ్మా వందనము

చల్లని చంద్రుని వెలుగుల రాత్రులు

అందములీనెడు సుందర ఆకృతి

ప్రేమను పంచే నీ దరహాసము

తీయని కమ్మని నీ వాగ్మయము

మాశ్రమ మరచే నీ కర స్పర్శలు

నీ పదతలమే మాదగు స్వర్గము

వందనమమ్మా వందనము

మిగిలినది మరొకమారు ........   


       మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము-౩

ఇక రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి

చూద్దాము :

ఇక రవీంద్రుల వారికి నోబెల్ పురస్కారము వచ్చుటకు గల కారణములు ఒకసారి చూద్దాము :

1. 18 సంవత్సరాల చిరుత ప్రాయంలో దేశానికి తన ప్రాణాన్నే బలిగావించిన బెంగాల్

కిశోరము ఖుదీరామ్ బోస్ పరోక్షంగా ఠాగూర్ కు నోబెల్ ప్రైజ్ ఇప్పించి ఉండవచ్చు.

ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ న్యాయ శాస్త్ర రీత్యా అతని వయసుకు మరణ శిక్ష

విధించకూడనిదైనా, ఉగ్రవాదులు దయా పాత్రులు కారని ఎంచి, విధించినారు.  ఇది

1908,మే 21న జరిగిన ఉదంతము. అప్పటినుండి చిచ్చర పిడుగులై బ్రిటీషు వాళ్ళకు నిద్ర

లేకుండా చేసిన బెంగాలు పులులను మచ్చిక చేసుకొనే దానికి ఇట్లు చేసినారేమో !

2. రవీంద్రుడు నోబెల్ కమిటీ చేత సిఫార్సు చేయబడినవాడు కాదు.

3. ఆయనకు బంగ్లావాసిగా కాక ఆంగ్లో ఇండియన్ గా ఇవ్వబడింది.

4. బహుమతి గ్రహీతగా ఆయన భాషణ మివ్వవలెను. కానీ ఆయన ఏవిధమైన

భాషణము ఇవ్వలేదు .

5. ఆయన నోబెల్ కమిటీ కి రెండు పంక్తుల వార్త పంపినాడు.

6. బహుమతిని బ్రిటీషు రాయభారి గ్రహించి కోల్కతాలో రవీంద్రులకు అంద జేసినారు.

7. ప్రాక్పశ్చిమ నాగరికతల సంయోగమునకు పాటుపడిన వ్యక్తిగా నతనిని ఎంచి ఈ

బహుమతినిచ్చినారని కూడా అంటారు.

ఇక్కడ, ఖుదీరాం బోస్ నేటి తరానికి ఒక అజ్ఞాత దేశభక్తుడు, నేటి యువత /బాలురు,

చదివిన/చదివే చరిత్ర లో కనిపించడు. ఈ మహనీయుని గూర్చి ఈ తరం యువతరం

తప్పక తెలుసుకోవలసి యున్నది .

1889 డిసెంబరు 3 న జన్మించిన ఈయన 18 సంవత్సరాలా 8 నెలలా 8 రోజులకే

ఆంగ్లేయుల పైశాచికత్వమునకు బలియయిన బెంగాల్ బాలవీరుడు.  బెంగాలులోని

మిడ్నపూరుకు చెందిన వాడు. ఆయన, అరబిందో గారు పూర్వాశ్రమములో రాజకీయ

నాయకునిగా దేశమును జాగృతము చేయుచున్న కాలములో వారి ప్రభావమునకు

గురియైనవాడు. 16 సంవత్సరాల నూనూగు మీసాల నూత్న యవ్వనములోనే

మిడ్నపూరు పోలీసు స్టేషను వద్ద బాంబుల నమర్చినవాడు. ఆ తరువాత మూడు

సంవత్సరములకు ఆంగ్లేయులచే అరెస్టు కాబడి వారిచే విధింపబడిన ఉరిశిక్షకు 11

ఆగస్టు 1908 లో గురియయినవాడు. ఆయనపై వరుస బాబులనమర్చినాడన్న అబద్ధపు

అభియోగమును  మోపి  ఆయనకు ఉరిశిక్ష విధింపజేయుట జరిగినది. కింగ్స్ ఫోర్డ్

అన్న ముజఫ్ఫర్ పూర్ బీహారు కు చెందిన అతి కౄరుడైన  మేజిస్ట్రేటును బాంబు ఒక

చేతితో రైఫిల్ ఒక చేతితో పట్టుకొని బాంబును బగ్గీ పై వేసినాడు కానీ ఫోర్డు కు

బదులుగా కెన్నెడీ అన్న బారిస్టరు యొక్క భార్య బిడ్డ అందులో వుండినారు.

ఎట్లయితేనేమి ఖుదీ రామును బంధించినారు 1908 మే 1 న. ఆయనను గూర్చి

STATESMAN అన్న ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక  ఈ విధముగా వ్రాసినది.

The English daily, The Statesman, wrote on the following day, May 2, 1908:

The Railway station was crowded to see the boy. A mere boy of 18 or 19

Years old, who looked quite determined? He came out of a first-class

compartment and walked all the way to the phaeton, kept for him outside, like a cheerful boy who knows no anxiety.....on taking his seat the boy lustily cried 'Vande Mataram'...

ఇక్కడ ఇంకొక విషయము ఏమిటంటే అభియోగము మొత్తమును తనపై వేసుకొని తన

సహచర వర్గమును, విప్లవ సంఘమును కాపాడిన మహానీయుడాయన.

The Amrita Bazar Patrika, one of the prominent dailies of that era published

about him with the headlines   "Khudiram's End: Died cheerful and smiling"

The newspaper wrote: "Khudiram's execution took place at 6 a.m. this morning.

He walked to the gallows firmly and cheerfully and even smiled when the cap was drawn over his head." An established British newspaper,

The Empire, wrote: "Khudiram Bose was executed this morning...It is alleged

that he mounted the scaffold with his body erect. He was cheerful and

smiling." The Bengali poet Kazi Nazrul Islam wrote a poem to honor him.

నేను ఆ నిస్వార్థ జాతీయ వీరుని గూర్చి చాలా క్లుప్తముగా తెలిపినాను. గాంధిజీ కి

‘మహాత్మా’ అన్న బిరుదునిచ్చినది ఠాగూర్ గారా కాదా అంటే అది వివాదాంశము. మరణ

సమయమున ‘హేరాం’ అన్నాడా లేదా అంటే దానికీ వివాదము విభేదము ఉన్నదీ కానీ

ఖుదీరాం గారు ‘వందేమాతరం’ అన్నారా లేదా మోముపై చిరునవ్వుతో అసువులు

బాసినారా లేదా అన్నది మాత్రము నిర్వివాదాంశము. ఖుదీరాం ధృవతారలో

ఐక్యమైనాడు.  ధృవతారలో ఐక్యమైతే అయినాడు గానీ  అయినట్లు ఆ తారలో మనకు

కనిపించడు. మరి ఇటువంటి మహనీయులను గూర్చి పాఠ్యాంశములలో చేర్చ

నవసరము లేదా! మన పిల్లలకు దేశభక్తి అవసరము లేదా! బయటి దేశాలలో చదివే

భారతీయ విద్యార్థులకు ఈ పుణ్యభూమిని గూర్చి ఎంత తెలుసు.

నేడు బంకించంద్రుడు అమావాస్య చంద్రుడైనాడు, మరి రవీంద్రుడో నేడు

మధ్యందినమార్తాండు.

 చాలా దూరము వచ్చినాము.

మళ్ళీ కలుసుకొందాము మరి కొన్ని ఆసక్తికరమైన విషయములతో........    

  మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము - 4(చివరి భాగము)

మొహమ్మద్ ఇక్బాల్ గారు – వారు వ్రాసిన జాతీయ గీతము

మన చరిత్రను గురించి తెలుసుకొనుట మన తక్షణ కర్తవ్యము. మన గతము మన   వారసత్వము, మన సంస్కృతిని గూర్చి మనసారా  తెలుసుకొనుట మన బాధ్యత. మన దేశమును మన కళ్ళతో చూసుకొనుట అత్యంత ఆవశ్యకము. సద్గురు శివానంద మూర్తి గారు.

ఆ భవిష్యద్దార్శనికుని మాటలను మనసారా విశ్వసిస్తూ ‘సారే జహాఁసె అచ్చా’ అన్న జాతీయ హోదా గలిగిన గీతమును గూర్చి దానిని వ్రాసిన మొహమ్మద్ ఇక్బాల్ గారిని గూర్చి నేను విన్నది, చదివినది, పెద్దలచే తెలుసుకొన్నది  అతి క్లుప్తముగా తెలియజేస్తాను. వీరిని పాకిస్తాన్ దేశపు ఆధ్యాత్మిక పితగా గుర్తించుతారు. వీరికి అల్లామా ఇక్బాల్ అని గౌరవముగా పాకిస్తానీయులు పిలుచుకొంటారు. 'అల్లామా' అన్నది ముస్లీములు ఘనమైన విద్వాంసులకు ఇచ్చే బిరుదము.

ఈ విషయమును గురించి వ్రాయుటకు కారణము కొంత కాలము క్రితము ఈ విషయమై నేను చూచుట  తటస్థించిన  ఆస్య గ్రంధి లోని ఒక ప్రచురణ. అది ఇక్బాల్ గారిని గూర్చిన కొన్ని కల్పనలు కలిగియుండుట చేత నేను వాస్తవమును నా చేతనయినంత మేరకు మీ ముందుకు తేవలసి వచ్చినది. నేను ఎక్కువ మందికి చేరుతుందను ఉద్దేశ్యముతో ఆంగ్లములో వ్రాసినాను కానీ దానిపై ఎక్కువమంది దృష్టి సారించలేదు. కారణమును పాఠకుల మనస్సాక్షికే వదలివేస్తున్నాను. ఈ తెలుగు వ్యాసమునైనా చదివి వాస్తవాలు తెలుసుకొందురని నా ఆశ. ఈ  ఆశను దేశ ప్రేమకు కొలమానముగా భావించుతూ వున్నాను.

ఇక్బాల్ గారు ఈ గీతమును తమ 27 సంవత్సరముల వయసులో వ్రాసియుండవచ్చునని చదివినాను. వారపుడు లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా ఉద్యోగము చేసే వారు.  దీనిని తరానా అంటారు. ఇది ఘజల్ శైలిలో వ్రాయబడింది. 16 ఆగస్టు 19౦4 లో లాలా హరి దయాళ్ అన్న విద్యార్థి అభ్యర్ధన మేరకు ఆయన ఏర్పాటుచేసిన సభకు ఉపన్యాసకునిగా వచ్చినా ఇక్బాల్ గారు ఈ పాటను ఆక్కడి శ్రోతలకు ఆవిధముగా లోకానికీ మొదటిసారిగా వినిపించినారట. ఈ గీతమునకు ‘తరానా-ఏ-హింద్ అన్న నామకరణమును వారు చేసినారు. తరువాత కొంత కాలమునకు వారు భవిష్యద్ ఇస్లాం సమాజ స్థాపన కొరకు, ఇస్లాం వేదాంతమును చదువనెంచి ఐరోపా వెళ్ళుట తటస్తించినది.

ఇక గీతము యొక్క విషయమునకు వస్తే అది 9 చరణములను కలిగి వుంది. అందులోని 5 వ చరణము ఈ విధముగా కనిపిస్తుంది.

అయ్ అబ్ ఎ రుద్ ఎ గంగా! వహ దిన్ హై యాద్ తుఝ్ కొ

ఉతరా తెరే కినారే జబ్ కారవాఁ హమారా

మా బిడారు నీ ఒడ్డున విడిది చేసిన ఆరోజు నీకు జ్ఞాపకము ఉన్నదా! అని ప్రశ్నించుతున్నాడు కవి. మరి మహమ్మదీయులు మనము కలిసి బిడారును గంగ ఒడ్డున ఏర్పరచియుండినామా? చరిత్ర లో ఎక్కడయినా ఉటంకించ బడినదా!

బహుశ వారు తమ మతస్థులను గూర్చి చెప్పియుండవచ్చు. అప్పుడు, సనాతన ధర్మావలంబులమైన మనకు అన్వయించదు కదా! మరి అన్వయించనపుడు జాతీయ గీతము యొక్క హోదాకు తగుతుందా!

మనము వినే ఆ పాటలోని 3వచరణములో, అనగా అది పూర్తి పాఠము లోని 6వ చరణమౌతుంది, హిందీ, హిందుసితాఁ అన్న పదాలు వస్తాయి. బెంగాల్ బెంగాలీ గుజరాత్ గుజరాతీ, నేపాల్ నేపాలీ పాకిస్తాన్ పాకిస్తానీ అన్న విధముగా  హిందూస్తాన్ లో వున్న వారిని హిందీ అన్నారు. మరి హిందూస్తాన్ అన్నది మనము పెట్టుకొన్న పేరు కాదు కదా! ఇండియా హిందూస్తాన్ మనము పెట్టుకొన్న పేర్లు కాదు. ఎవరో నోరు తిరగని వారు పెట్టినవి. మనది భారత దేశము.

ఎందుకు మనము ఈ దేశమునకు భారత్ అన్న అధికారిక నామమును ఉంచుకొన కూడదు. ‘భ’ అన్న అక్షరానికి నిఘంటువు కొన్ని అర్థములను తెలిపింది, కానీ ఒక మహనీయుడు, మహా పండితుడు ‘భ’ అన్న అక్షరానికి అభివృద్ధి అన్న అర్థము లేక అన్వయము కూడా ఉన్నదని నాకు తెలియజేసినాడు. ‘నభము’ అభివృద్ధి లేనిది ఆకాశము, ‘భగము’ అన్న మాటకు వృద్ధి ప్రగతి కలిగించునది. 'అభము' అభివృద్ధి లేమి, ఎంత గొప్ప అర్థమో గమనించండి.

ఇక  హిందూ అంటే "హింసాం దూషయతి ఖండయతి ఇతి హిందుః"" ఎక్కడైతే హింస, పాపము ఉన్నాయో దానిని ఖండించేవాడే హిందువు అన్న ఒక క్రొత్త అర్థమును ఎవరో ప్రతిపాదించినారు. ఆధారము కానరాదు. అంత అర్థవంతమూ కాదు. హిమాలయములకు ఆవలనున్న అరబ్బు దేశీయులు ‘స’ ను ‘హ’ గా పలుకుటచే ‘సింధు’ నది కలిగిన దేశము ‘హిందు’ దేశమైనది.

ఉత్తర భారతమున ‘స’ ను ‘హ’ గా పలుకుతారని ఒక వ్యక్తి ఆస్య గ్రంధిలో వ్రాయగా చదివినాను. హిందీ భాషలో శ, , స మూడు అక్షరాలూ ఉండుటయే గాక వారి పేర్లలో సందీప్, శారద, కృషి--- ఈ విధముగా మూడు అక్షరములనూ ఉపయోగించుతారు. అరేబియా దేశాల వారు నేటికినీ గణితమును ‘హింద్స’ అనే పిలుస్తారు. ఉత్తర భారత దేశమున ‘గణిత్’ అంటారు ‘హింద్స’ అన్నది ఔత్తరాహిక  సామాన్యులకు తెలియని పదము.

తిరిగీ అసలు విషమునకు వస్తే, ఇక్కడ మనము అర్థము చేసుకొనవలసినది ఏమిటంటే మనమంతా హిందూ దేశమునకు చెందినవారము కావున హిందీలమైనాము అని మాట వరుసకు సమర్థించుకొందాము.  మీ దేశమేది అని ఒక విదేశీయుడడిగితే హిందూ దేశము’ అంటామా లేదా? హిందీ దేశము అని మాత్రము అనము కదా! అసలు మన ధర్మమును పాటించనివారు ‘హిందూస్తాన్’ అని అంటారనుకొందాము. అప్పుడు కూడా ‘స్తాన్’ అన్నది సంస్కృత పదమే. ‘హిందు’ శబ్దోచ్ఛారణ యే వారి మత రీత్యా ఉచ్చరించుట దోషము కదా! దంత్యములు, కంఠ్యములు, తాలవ్యములు, ఓష్ఠ్యములు అనునాసికములు  ఇత్యాదిగా వర్గీకరింపబడిన మన సంస్కృతము భాషలకు ఆది పునాది. మిగతా ఏ ప్రపంచ భాషకు కూడా ఈ వర్గీకరణ లేదు. అది వారు తెలుసుకొన ప్రయతించరు. ‘హింది’ ‘హిందు’ రెండూ ఒకటే కానీ వారు మొదటిది మాత్రమె ఉచ్చరించుతారు. అసలు అక్షరము అంటేనే బాహిరముగా ’అ’ నుండి ‘క్ష’ వరకు అని ధ్వనిస్తున్నా ‘క్షరము’ అనగా ‘నాశము’ కానిది అక్షరము. ఇంతటి గొప్ప విషయములను మనకందించిన మహనీయులు  మన పూర్వులు.

ఇక తిరిగీ ఇక్బాల్ గారి విషయమునకు వస్తే ఆయన ఇస్లాం వేదాంతమును పుణికి పుచ్చుకున్న తరువాత ‘తరానా-ఏ-మిలి’ అన్న గేయమును ‘సారే జహాఁ సె అచ్ఛా’ ఛందస్సులోనే వ్రాసినారు. ‘తరానా-ఏ-మిలి’ అంటే ‘మతానుగత గీతము’ అని మనము అనువదించుకొనవచ్చు. ఇక్బాల్ గారి లౌకిక తత్వమునకు సాధారణముగా ‘సారే జహాఁసె అచ్చా’ లోని ఈ చరణమును ఉటంకించుతారు.

మజహబ్ నహీఁ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా

హిందీ హైఁ హం వతన్ హై హిందూసితాఁ హమారా

మతము అన్నది వైరమును బోధించదు. మనము హిందువులము మనది హిందూస్థానము అని నుడివినారు.

1910 లో ఆయన వ్రాసిన ‘తరానా-ఏ-మిలి’ లో ఏమి వక్కాణించినారో చూడండి.

సైన్-ఓ-అరబ్ హమారా, హిందూసితాఁ హమారా

ముస్లిం హైఁ హం వతన్ హై సారా జహాఁ హమారా

మధ్య ఆసియా మనది, అరేబియా మనది, హిందూస్తాన్ మనది. మనము ముస్లిములము  ఈ ప్రపంచమే మనది. దీనితో వారి హిందూదేశ భక్తి ఏమయి పోయిందో గమనించండి. రెండు దశాబ్దముల పిమ్మట 1930 లో ఇక్బాల్ గారు అలహాబాదులో ముస్లిం లీగ్ వార్షిక సమావేశములోని తమ అధ్యక్షోపన్యాసములో ఏఏ ప్రాంతములలోనైతే ముస్లిం జనాభా ఎక్కువగా వుందో ఆయా ప్రాంతాలను అన్నింటినీ ముస్లిం దేశాలుగా మార్చవలెనని ఉద్ఘాటించిన మహనీయుడు ఆయన. ఈ దేశానికి, మన ధర్మమును పాటించే వారిలో దేశభక్తి గీతము వ్రాయ గలిగే మహా కవియే లేడా! అసలు పాకిస్తాను బీజమును నాటిన మహానీయుడాయనే!  ఆయన 1887 నవంబరు 8 న సియాల్కోట్(ఇప్పటి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతము) (1938 ఏప్రిల్ 21 న లాహోర్ (బ్రిటీష్ ఇండియా) లో మరణించినారు.

పాకిస్తానులో నేటికినీ ఆయన పుట్టిన దినమును ‘ఇక్బాల్ డే’ గా పిలుస్తూ ఆ రోజును సెలవు రోజుగా ప్రకటించుకొంటారు.

 చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఆయన పూర్వీకులు  ‘సప్రూ’ అన్న ఇంటిపేరు గలిగిన బ్రాహ్మణులు. వారు ఇస్లాం లోకి బలవంతముగా మార్చబడినవారే! ఆతరువాత కాలములో వారు పంజాబ్ నకు వలస వచ్చినారు. అదే కాశ్మీరుకు చెందిన పండితులు ముస్లిముల చెర తప్పించుకొని జమ్మూ చేరి తమ తిప్పలు తాము పడుతూ వుండగా తగుమమ్మా అంటూ వచ్చి మీకు సహాయము చేస్తాము మా మతములోనికి మారండి అన్న విదేశీ క్రైస్తవులను త్రిప్పి పంపిన ఆ గొప్పవారిని గూర్చి తలచినవారున్నారా!

తెలిసినది క్లుప్తముగా తెలిపినాను. మంచి చెడుల నిర్ణేతలు మీరే! ఇక వారి అభిప్రాయము హిందువులపై ఏవిధముగా ఉండినది అన్నది తెలిపి నేను విరమించుతాను.

Iqbal expressed fears that not only would secularism weaken the spiritual foundations of Islam and Muslim society, but that India's Hindu-majority population would crowd out Muslim heritage, culture and political influence. (Muhammad Iqbal (From Wikipedia)

మరి స్వాతంత్ర్యమునకు మునుపు ఈయన వ్రాసిన 'సారే జహాఁ సే అచ్ఛా' మనకు జాతీయ గీతము ఎట్లు కాగలుగుతుంది.

 స్వస్తి.

Parvateesam Vepa

💯👏👏👏ఈ పోస్టులో రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమన రచనలో బ్రిటిష్ ప్రభుత్వం రాజు ఎడ్వర్డ్ 5 ను పొగడుటకై వ్రాసిన జాతీయ గీతం జనగణమన అర్ధం,వివరణలు,వందేమాతరం గీతానికి జాతీయగీతం స్థాయి రాకుండా కుయుక్తులను పన్ని, తన జనగణమన గీతం ద్వారా తాను జాతీయ గీతం రచయితగా పేరు సంపాదించుకోవడానికి,తన గీతాంజలి కి నోబెల్ బహుమతి పొందడానికి చేసిన కుట్రలను బాగా వివరించారు. జనగణమన గీతం అన్ని చరణాలు అందించి వాటి అర్ధాలను వివరించి రవీంద్రుని రచనలలో గల మాయను వివరించేరు.

బంకించంద్ర ఛటర్జీ గారి వందేమాతరం గీతం మును అద్భుతమైన రీతిలో వివరించేరు. అది మూస్లింలు పాడ లేరని అది దుర్గా దేవిని పూజించే పాటని రవీంద్రుడు చేసిన వ్యాఖ్యలను బాగా వెలుగులోకి తెచ్చేరు.

ఇక్బాల్ గారి సారే జహాఁ సే అఛ్ఛాలో గల వివరాలను, పాకిస్థాన్ భక్తుడైన, పాకిస్థాన్ వారికి ఫాదర్ ఆఫ్ పాకిస్థాన్ గా ప్రసిద్ధుడైన ఇక్బాల్ అంతరంగాన్ని బాగా తెలిపేరు. సుదీర్ఘమైన మీ పోస్టును యెంతో ప్రస్తుతించినా చాలదు.

అమోఘము, మహాద్భుతమైన రీతిలో చిత్రించారండీ సత్యాలను.

మీ దేశభక్తి కి జోహార్లండీ రామ మోహనరావు గారూ...

అనేకానేక అభినందనలండీ.వందనములు.

YOU DID A GREAT JOB

Pemmaraju Purnachandra Rao

ఆర్యా శ్రీ మోహనరావు గారు మీరు వ్రాసిన విషయాలు కొన్ని నేను చదివిన విన్న విషయాలు ఇప్పుడు ఎవరికీ అసలు సంగతులే పట్టవు ఇంక అంతరార్ధం ఎవరికి పడుతుంది.ముఖ్యంగా శ్రీ వాకాటి పాండురంగారావు ఆంధ్రప్రభ సంపాదకులు ఇక్బాల్ కవితల అసలు పాఠం గుట్టు విప్పారు ఓ ప్రసంగంలో. మనలో కొందరు ఆహా ఇక్బాల్ దేశభక్తి మా గురించే ఈ కవిత అని మురిసిపోవడం గురించి చెబుతుండగా విన్నాను. కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానుల. మాటలు గుర్తుకు వచ్చాయి. భాషా భేదం కానీ మన ముక్కలే వాళ్ళవి అని,. మొగలు దర్బారు కుట్రలు అని ఓ ధారావాహిక యువ మాసపత్రికలో వచ్చేది అలాగే నెహ్రూ దర్బారు అంతఃపురం దారుణాలు తెలిసినా మన కాంగ్రేసు దశాబ్దాల పాలనలో బుర్రలను సామాజికంగా సామూహికంగా ప్రభావితం చేసేసాయి, మన స్వభావం లోనే రాజాశ్రయవిధేయత ఓ భాగమయ్యింది.టాగోర్ కవితా ప్రతిభ గురించి శ్రీ శ్రీ గారు తన సహజ ధిక్కార. ధోరణిలో. టాగూర్ కన్నా మన చింతా దీక్షితులు మిన్న అన్నారు.కానీ ఎవరికి కావాలి నిజం. ప్రసార మాధ్యమాలు చేసే హడావుడి తమ సంకుచిత పరిమిత భావజాలం ప్రజాభిప్రాయం అని ఢంకాలు 24\7 బజాయించడంవల్ల బ్రాహ్మణుడు నల్లమేక కధలా తయారయ్యింది నిజం నిర్ధారణ. ఇది కాలమహిమా అవకాశవాదమా వెన్నెముక సత్తా లేని భజనబ్రృందాల సామూహిక స్వార్ధ గీతాలాపనా. సర్కారీ కవుల కొలువుల గిట్టుబాటు వ్వవహారమా\. ఏమై నా మీ పరిశోధన ఆసక్తి నిజనిరూపణాసక్తి అభినందనీయం ఎంత మందికి ఎక్కుతుంది.ఈ ఘోష. Citation లో ప్రాక్పశ్చిమ సంయోగానికి చేసిన కృషికి ఇస్తున్నట్లు అన్నారు. సాహిత్యప్రతిభ కి కాదా ఆ నోబెల్ బహుమతి కూడా కమిటి నిర్ణయం లేకుండానే. ఇవ్వ డం అయ్యిందంటే ఇంతకు మించి ఆశ్చర్యం ఏముంటుందీ

🌹👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹

 

                                     


Wednesday, 13 January 2021

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

 

కొనకుండా నవ్వుకొనండి – బావా కర్ణా

https://cherukuramamohan.blogspot.com/2021/01/blog-post_13.html

ఇది దాదాపు 60 సంవత్సరముల క్రితము జరిగిన కథ. కడప జిల్లా పులివెందులకు 

దగ్గరగా వేంపల్లి పులివేన్స్డులకు నడుమన వేముల అనే ఓక గ్రామము ఉన్నది. 

సంక్రాంతికి పంటలు చేతికి వస్తాయి కాబట్టి డబ్బులు జేబుల్లో గలగలాలాడుతూ 

ఉంటాయి. తాగుడుకు కొదవే ఉండదు. ఆరోజుల్లో ఖాళీ అయిన కళ్ళాలలో సంక్రాంతి 

రోజు ఏ ‘కృష్ణ రాయభార’మో లేక ‘రామాంజనేయ యుద్ధమో’ ‘గయోపాఖ్యాన’మో 

నాటకము వేసేవారు. ఆ సంవత్సరము  ‘శ్రీకృష్ణ రాయభారము’ వేయదలచి ఒక 

నెలరోజుల ముందునుండి హార్మోనియము పద్యములు రాగయుక్తముగా ఆడే 

గురువును ఏర్పాటుచేసుకోని సాధన మొదల్కుపెట్టినారు.

ఆ రోజు రానే వచ్చింది. కల్లములో Set వేసినారు. వివిధ రంగులు విద్యుద్దీప కాంతులతో 

వెలిగిపోతూ వుంది ఆ కళ్లము. ఊర్పిళ్ళు అప్పుడే అయిన సమయము కాబట్టి 

సముద్రములోని అలల వలె గాలిలో పురుగులు తేలియాడుతూ ఉన్నాయి. నాటు 

సారాయి నీటుగా నటులంతా పీకల వరకు దట్టించినారు. గంట రాత్రి 10 కావస్తూ 

ఉండగా నాటకము మొదలైనది. ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో జనమునకు ‘థూ 

నీయమ్మ’ అనుట ఊతపదము.

  రాయభారము ఫలించా లేదు. ఆ అంకము బాగా రక్తి కట్టించినారు.

కృష్ణుడు కర్ణుని అతని భవనంలో కలువదలచి వెళ్ళినాడు. కర్ణుని చూచినాడు. సంభాషణ 

ప్రారంభించాబోతూ ‘బావా! కర్ణా!’ అన్నాడు. బావా అని నోరు తెరువగానే కొన్ని 

పురుగులో నోటిలోనికి పోయినాయి. వెంటనే ముందు వెనుక ఆలోచించకుండా తాగిన 

మైకము తలకెక్కగా, నోట దూరిన పురుగులను ఉమ్మివేస్తూ అలోకగా తన సహజమైన 

రీతిలో ‘థూ నీయమ్మ’ అన్నాడు. అంతటితో కర్ణ కృష్ణ యుద్ధము మొదలై నాటకము 

నడివీధికెక్కింది.

ఈ ఉదంతమును పద్య రూపములో ఈ విధముగా ఉంచినాను.

రాయ భారమందు రాజీని బడయక

అంగరాజు జేరి అచ్యుతుండు           

వాయి తెరచి తాను బావా యనంగానె

‘థూ నీయమ్మ’ యనెను దూర ఈగ

స్వస్తి.

Sunday, 20 December 2020

క్రైస్తవము - క్రిస్మస్ పండుగ

 క్రైస్తవము-క్రిస్మస్ పండుగ - 1వ భాగము

https://cherukuramamohan.blogspot.com/2020/12/blog-post_20.html

సనాతన ధర్మావలంబులగు పాఠకులకొక విన్నపము. క్రిస్మస్ దగ్గరికి వస్తూవుంది. శాంటాక్లస్ పిల్లలకు ఇంకా దగ్గరికి వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చి ఉంటాడు. మీరుకూడా మీ పిల్లలుఆతని వద్దనుండి గ్రహించే బహుమతులు చూసి సంతోషించి కూడా వుంటారు. ఆవిధముగా పిల్లలుఆ బహుమతులు తీసుకొను నపుడు మీరు ఉదాసీనతతో వ్యవహరించినారంటే ఆ లేత హృదయములో ఒక ఆకర్షణను ఆ మతము పై మీరు కలిగించుచున్నట్లే! మీరు తిరుమల లడ్డు ఇచ్చినా వారు తీసుకోరు మరి మనము ఆ బహుమతులకోరకు పిల్లలను ఉసిగోల్పుట తగునా! మరి అటువంటి పెద్దలలో ఎంత
మంది శాంటాక్లాస్ కు క్రిస్మస్ కు సంబంధము ఏమిటని ఆలోచించినారోతెలియదు. అసలు మన పండుగ కాదుకదా మనకెందుకు అందులో భాగస్వామ్యమన్న దృష్టి తోఆలోచించము. మన సంక్రాంతి, మన ఉగాది, మన శ్రీరామ నవమి, శివరాత్రులలో వారు పాలు పంచుకొంటున్నారా! మరి మీరెందుకు చేస్తున్నట్లు? వారు తెచ్చిపెట్టుకొని చేసుకొంటున్న పండుగలు రెండే. ఒకటి క్రిస్మసు రెండు New Years Day. రెండూ కృత్రిమమే! నేడు నేను మొదటి దానిని గూర్చి సవిస్తారముగా తెలియజేసే ప్రయత్నములో ఈ దిగువ లింకును మీ ముందు వుంచుచున్నాను. నాకు చేతనయినంత సమగ్రముగా వ్రాయుట చేత వ్యాస విస్తరించింది. అయినా ఓపిక తెచ్చుకొని చదివేది.
ఒక కట్టడమునకు పునాది ముఖ్యము. మరి ఈ మతము యొక్క పునాది ఎంత లోతు అన్నది తెలుసుకొని మీ ధర్మము యొక్క పునాదులు ఎంత గట్టివో ఎంత లోతైనవో తెలుసు కొనేది.
ధర్మఏవ హతోహంతి ధర్మోరక్షతి రక్షితః.
తస్మాధ్ధర్మోనహంతవ్యోమానో ధర్మో హతో వధీత్
ధర్మాన్ని చంపేస్తే అది మనల బతకనీదు. దానిని రక్షిస్తే అది మనల కాపాడుతుంది.
మరొక్కవిజ్ఞప్తి . సావకాశముగా చదువుతారని శ్రమకోర్చి ఈ వాస్తవాలను మీ ముందుంచుచున్నాను. ముఖ్యముగా నేటినుండి 25 వ తేదీ వరకు, ఆ తరువాత కూడా ఈ దిగువ కనబరచినలంకె లోచదువుతారని నమ్ముచున్నాను.

  క్రైస్తవము-- క్రిస్మస్ పండుగ

మతము అన్న మాటకు స్థూలముగా అభిప్రాయము అని అర్థము. ఈ అభిప్రాయమును తమ విజ్ఞత ననుసరించి సామాన్యులకు దిశానిర్దేశము చేయగలిగినవారు దేవ దూతలు, ప్రవక్తలు కగలుగుతారు. ఈ విధముగా తెలియబరచిన అభిప్రాయమును హృదయపూర్వకముగా అంగీకరించి ఆ మతమును అక్కున చేర్చుకొంటేదానివల్ల వ్యక్తికి గానీ సమాజమునకు గానీ దేశమునకు గానీ ఎటువంటి నష్టము వాటిల్లదు. పై పెచ్చు ఎంతో మంచి కూడా ఒనగూరవచ్చు. అట్లు కాకుండా కత్తి యంచు కంఠానికి ఆనించి 'తాతను చూపుతావా తద్దినము పెడతావా ' అనుట వల్లనే ప్రజలలో ఎకాభిప్రాయములేక ఎవరి మతము వారిదై పోయింది . పూర్వము అంటే ఒక 50 నుండి 100 సంవత్సరాల  కాలములో
ఆంగ్లములో గొప్ప చదువులు చదివిన వారు , ఆంగ్ల వైద్యమును అభ్యసించినవారు భారతీయుల నిత్య నైమిత్తిక జీవితములోని కొన్ని పద్ధతులను ఎద్దేవా జేసేవారు. అప్పటి ప్రజలు కూడా అది నిజమేనేమో అనుకొనేవారు. అసలు ఇప్పటికీ అలాంటి వారున్నారు. కానీ ఇప్పుడు మొదట క్రైస్తవంలో ఉన్న ఇతర మత విషయముల గురించి చర్చించుకుందాము. క్రైస్తవం యూదుమతం నుండి ఉద్భవించింది. ఒక్క మాటలో చెప్పవలసి వస్తేయూదు మతము యొక్క మొదటి బిడ్డగా చెప్పవచ్చు. యూదు మతము నుండి మత గ్రంథములను వీరు తీసుకున్నారు. ఆ మత గ్రంథములతో పాటు, వారి దేవుళ్ళను, పండగలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. అప్పటి కాలంలో ఉన్న ఇతర మతముల నుండి కూడా కొన్ని విషయములను తీసుకున్నారు. ఉదాహరణకు , క్రిస్మస్ పండుగ, priests బ్రహ్మచారులుగా ఉండటం , ఈస్టర్ పండుగ మొదలయినవి. ఇంతవరకు ఏమి తప్పులేదు. ఒక మతం అభివృద్ది చెందాలంటే కొన్ని మంచి విషయాలను ఇతరుల నుండి సంగ్రహించి ఒక గొప్ప మతాన్ని తయారుచేయడం తప్పులేదు, ఎందుకంటే దానివల్ల ప్రజలకు మంచి జరగవచ్చు కాబట్టి. కాని క్రైస్తవం అభివృద్దిలో మంచితో పాటు  చెడు పద్దతులు కూడా పొందుపరచినారందున.  నేడు ఆ మతానుయాయులు ఎన్నో విధములగు భ్రమలు కల్పించి, వారి అధిష్టానము నుండి తాము చేయు పనులకు ఆమోదము పొందకనే ఎన్నో విధములగు ఈ సనాతన ధర్మపు నియమములను తమవిగా చెప్పుకొని జన సముదాయములోనికి చొరబడుచున్నారు. కారణము విదేశ సంస్థ్లలనుడి వారండుకొనే ధనపు సంచులు.  మరి వారిలో, వారి మతములో నీతి నిజాయితీకి స్థానము కలదో లేదో వారి ఊహకే వదలవలసిన విషయము. నా లేఖనము యొక్క ప్రధానోద్దేశ్యము క్రిస్మస్ పండుగను గూర్చి వ్రాయుటయే కానీ అన్యథా కాదు.  క్రిస్మస్ పండుగ గురించి మరియు కొన్ని ఇతర చారిత్రక విషయాల గురించి మాట్లాడుకొనుటకు ముందు క్రైస్తవులు అంటే ఒకే వర్గమా లేక వివిధ వర్గములా అన్నది ముందు చూద్దాము.

క్రైస్తవులు రెండు విధములు. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంటులు. ఇవి కాక పోలిష్ చర్చి(polish church), మోర్మోనులు(Mormons – అమెరికాలో ఉండేవారికి ఇది బాగా పరిచయం), రష్యన్ ఆర్థోడోక్స్(Russian orthodox), జెహొవా విట్నెస్(Jehovah witness), ఆర్థోడోక్స్ (orthodox), బాప్టిస్టులు(Baptists), ఎవాంజలికులు(Evangelics), బెర్షిబాలు(Beersheba)
ప్రెస్బిటేరియనులు(Presbyterian), రోమను క్యాథలిక్కులు (Roman Catholicism), ఈస్ట్రన్ రష్యన్  ఆర్తోడాక్స్(Eastern Orthodoxy), పెంతెకోస్తు(Pentecostals). ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. క్రీస్తు పుట్టుకకు సంబంధించిన నిజానిజాలు కూడా వేరొక పర్యాయము చర్చించుకొందాము.
క్రైస్తములోని మనకు తెలియని కొన్ని వాస్తవాలను గూర్చి తెలుసు కొందాము. క్రైస్తవము  యూరపు మొత్తాన్ని దాదాపు పది శతాబ్దాలు పరిపాలించింది. ఈ కాలంలో ఉన్న రాజులు క్రైస్తవమును అధికార మతముగా ప్రకటించి దేశమును వారే ఏలేవారు, అట్లు రాజ్య పాలకులు క్రైస్తవులు కాకపోతే  స్వయంగా చర్చి పాలించేది. ఈ వెయ్యి సంవత్సరాల
కాలాన్ని చీకటి రోజులుగా చరిత్రకారులు పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఏ శాస్త్రసాంకేతిక వైద్య రంగాల్లో కూడా ఒక్క ఆవిష్కరణ గాని Arts, Sculptures గాని అభివృద్ది జరగలేదు. యూరపులోని దేశాలు అన్ని పూర్తిగా భారతదేశం, చైనా, పర్షియాల మీదనే ఆధారపడి వుండినవి. క్రైస్తవం తన బాల్యపు రోజులలో రోమను చక్రవర్తి మీద ఆధారపడి వుండేది. తరువాత రోమను సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్దం చేసింది. అంటే అప్పటికి వాటికన్, పొప్ ల వ్యవస్థ ఏర్పడిపోయింది. ఇటువంటి విషయములు వాటికన్ వారు మనకు తెలియుటకు ఇష్టపడరు. ఇవి కాక అనేక చారిత్రక విషయాలను క్రైస్తవులు మనకు కనబడకుండా ఉంచాలని ప్రయత్నిస్తారు. వాటిలో మచ్చుకు కొన్ని. స్పానిష్ఇంక్విజిషన్ (Spanish Inquisition), క్రూసేడులు, బానిసత్వము, విచ్ హంట్(Witch Hunt) మొదలైనవి. గోవా ఇంక్విజిషన్ ను  కూడా ఇందులో చేర్చవలసి యుంటుంది.
గోవా అన్న పేరు వినగానే మనకు గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు. కానీ ఆ అందాల, ఆకర్షణల  వెనుక భయంకరమైన చరిత్ర ఉంది. లక్షలాది హిందువుల జీవితములు క్రైస్తవమత ఛాందసత్వమునకు బలియైనాయి. ఈవిషయము ఎంతమందికి తెలుసునో నాకు తెలియదు. తెలిసినవారు తక్కువ అన్న నమ్మకముతో సంక్షిప్తముగా తెలియజేయుచున్నాను.
భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చిన వచ్చిన క్రైస్తవులు (పోర్చుగీసువారు. ఈ దేశము సంపదలకు నిలయమని కనుగొన్నాడు వాస్కోడగామా. అందుకే అంతులేని సంపదను ఒకటి బట్టు మూడుమార్లు వచ్చి తన మాయోపాయములచే ఇచ్చటి సంపద దోచుకొన్నాడు. వీరు రానురానూ స్థానికముగా ఏలే  రాజుల మధ్య గొడవలు పెట్టి అధికారం చేజిక్కించుకుని భారతదేశాన్ని ఆక్రమించారు. ఆవిధముగా గోవాను ఆక్రమించిన తరువాత అచ్చటి ప్రజలను క్రైస్తవము లోనికి మార్చవలెనని  పొర్చీగీసు వారు గోవా ఇంక్విజిషన్ ను ప్రవేశ పెట్టినారు. ఈ విషబీజమును 1542 లో ఫ్రాన్సిస్ జేవియర్ అను పాస్టరు  పోర్చుగీసు రాజు అయిన జాన్ – 3 మెదడులో నాటినాడు. 1560 – 1820 వరకు గోవాలో గోవా ఇంక్విజిషన్ అమలు అయ్యింది, అంటే దాదాపు 300సంవత్సరాలు ఇది అమలులో వుండినదన్నమాట.
ఫ్రాన్సిస్ జేవియర్ హిందువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు హిందువులు జాతి అపవిత్రమైన జాతి. వారు నల్లగా ఉంటారు, అసహ్యంగా ఉంటారు. హిందువులు పూజించే విగ్రహాలు దెయ్యాలు. వాటినుండి నూనెతో కూడిన అసహ్యమైన వాసన వస్తుంది. విసరి ఆంటీనియో డి నోరహ అనే పాస్టర్ ఇందులో భాగంగా ఓ కొత్త చట్టమును తెచ్చినాడు. దాని ప్రకారము హిందువుల దేవాలయాలను మూసివేయాలి. కొత్త దేవాలయాలు కట్టకూడదు. పాత దేవాలయాలకి మరమ్మతులు చేయకూడదు. అలాగే హిందు దేవాలయాల్లో వుండే బంగారము మరియు డబ్బు చర్చ్ ఆధీనంలోకి రావాలి. సంస్కృతము, మరాఠి, కొంకణి భాషలో ఉన్న మన సాహిత్యాన్ని, శాస్త్ర పురాణాదులను తగులబెట్టినారు. కుటుంబములో తల్లి కానీ తండ్రి కానీ  చనిపోతే వారి ఆ పిల్లల్ని  చర్చి, పాస్టర్ వాళ్ళు తీసుకొని వాళ్లను క్రైస్తవు లుగామార్చి వారి ఆస్తిని  చర్చి జప్తు చేసుకునేవారు.! గ్రామాధికారులు అందరూ క్రైస్తవులనే ఉంచేవారు. కోర్టులో క్రైస్తవులకు మాత్రమే సాక్ష్యం చెప్పే అధికారం ఉండేది. హిందువుల మందిరాలను కూల్చి  స్థానంలో చర్చిలు కట్టుకునేవారు ! హిందువులు  క్రైస్తవం స్వీకరిస్తే తప్ప పెళ్లి చేసుకొనకూడదు.  ఈ హింస మూడు వందల సంవత్సరములు జరిగినది. వారు ఊచకోత కోసిన లక్షలాది హిందువులలో బ్రాహ్మణుల సంఖ్య లెక్కకు మిక్కుటము.  చూడండి ఎంత దయాభరితమైన మతమో అది. ఇంత జరిగినా అక్కడి హిందువులు అంతరించి పోలేదు. అది ఈ జాతి గొప్పదనము.
మనము క్రైస్తవులలో ఎన్నో వర్గాములున్నాయని ఇంతకు మునుపు చెప్పుకొన్నాము. మరి అసలుక్రీస్తు ఒకడే అయినపుడు క్రైస్తవములో ఇన్ని విభాగాలెందుకు. మొదట రోమన్ కాథలిక్కు మతము మాత్రమే వుండేది కానీ దానితో ప్రప్రథమముగా విభేదించినవాడు  మార్టిన్ లూథర్ . ఇతను క్రైస్తవ సన్యాసి ,వేదాంతి , మరియు ప్రచారకుడు. ఇతను కాథలిక్కు మతముతో విభేదించి స్వంత కుంపటి లూథరన్ చర్చ్అన్న పేరుతో పెట్టుకొన్నాడు. తరువాత ఇంకా కొందరు రాను రాను తమ స్వంత కుంపట్లను రాజేసుకొన్నారు. అందులో మెథడిస్ట్ ఒకటి. దీని వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ. ఈయన ఆధ్యాత్మిక అభివృద్ధికి నిర్దుష్టమైన మార్గములు, కార్యాచరణ కలిగి యుండ వలెనని చెప్పినాడు. ఇక వేరొక ఉపమతము Presbyterians  అంటే మత పెద్దలు అని అర్థము.
ఇందు పెద్దతనమునకు ప్రాముఖ్యత నొసగినట్లు తెలియవచ్చు చున్నది. అదే విధముగా బాప్టిస్ట్ చర్చి అంటే మత తీర్థమును పుచ్చుకోన్నవారిని పునీతులను చేయుట. మంత్ర జలమును  ఆయా వ్యక్తులపై జల్లి లేక వారిని పవిత్ర జలమున ముంచి పునీతులను జేయుట. ఏ మంత్రములు జపించుటచే ఆ జలము మంత్రజలమైనదో నాకు తెలియని విషయము. పైగా మంత్రము అన్న సంస్కృత పదమునకు మననేన త్రాత ఇతి మంత్రం అని వేదాంగ భాగమైన నిరుక్తి తెలుపుతుంది. మరి ఆ అర్థము వచ్చే ఆంగ్ల పదమే లేదుకదా! క్రైస్తవములోని శాఖలనుగూర్చిఈవిధముగా చెప్పుకొంటూపోతే ఎన్నో వర్గములు ఇంకెన్నో మార్గములు. కానీ ఈ విధముగా చేయమని లేక చేయ వచ్చని వారందరు ప్రామాణికముగా భావించే బైబిలు లో వారు చేసే చాలా విషయాలు  చెప్పినట్లు ఎక్కడా కానరాదు. దీనిని చూస్తే ఈ క్రైస్తవ వర్గాలను ఐస్క్రీము సిద్ధాంతమునకు పోల్చవచ్చునేమో! ఇదేమిటి ఈ ఐస్క్రీము సిద్ధాంతమని అనుకోవద్దు. ఐస్క్రీములోఎన్నో flavor లు ఎన్నెన్నో వెరైటీలు . కానీ ఐస్క్రీము అమ్మకము మాత్రము పెరుగుతూనేఉందికదా! ఏ variety కొన్నా లేక తిన్నా ఐస్క్రీము కొన్న\తిన్నా అంటారుగానీ, ప్రత్యేకముగా అడిగితే తప్ప ఫలానా ఐస్క్రీము అని చెప్పరు కదా! బహుశ ఇదీ అంతేనేమో! ఈ విషయములను లోతుగా పరిశీలించితే క్రీస్తు అనుయాయులకు ఆధిపత్యమును గూర్చి తప్పితే ఆత్మా- పరమాత్మ లను గూర్చి తెలుసుకోవలె నన్న ఆలోచన ఉన్నట్లు అనిపించదు. నిజము వారి దేవుడెరుగు.
ఇక మనదేశానికి వస్తే, కేథలిక్కు చర్చి పోర్చుగీసు వారికి సహాయం అందించుట, గోవా ఇంక్విజిషన్ ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. గోవా ఇంక్విజిషన్ ను గూర్చి ముందే తెలిపినాను.  ఇది కాకుండా వారు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టిన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నది ఒక అభూతకల్పన. ఈ రెంటికీ తోడు. పోర్చుగీసు ను గూర్చి  GOOGLE లో నేను సేకరించిన ఈ విషయమును యథాతథముగా మీ ముందు ఉంచుచున్నాను, చదవండి :
Alliance ministry in Portugal is primarily funded through the Great Commission Fund. Help fulfill Jesus' Great Commission and make a gift to the GCF (Global Christian Forum (GCF) is a unique gathering of global Christian churches and organisations bringing together all the major streams of world Christianity. ) today.
మిగిలినది మరొకమారు.........

క్రైస్తవము-క్రిస్మస్ పండుగ - 2వ భాగము


Preview
Update

అంటే పోర్చుగీసుకు మతాంతరీకరణలకు గానూ లోపాయకారిగా GCF నుండి ఎంతటి మద్దత్తు లభించుతూ వుందోగమనించండి.

ఏసుక్రీస్తు అందరినీ మన్నించమన్నాడని చర్చి చెబుతోంది. చరిత్ర చూస్తే చర్చే ఏసు మాటలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనబడుతుంది. వారు మొదట రోమనుల సహాయంతో యూరపులో అభివృద్ది చెందినారు. 3వ శతాబ్దానికి చెందిన కాన్స్టంటైన్ (Constantine I) క్రైస్తవాన్ని రోము యొక్క అధికార మతంగా ప్రకటించిన మొదటి రాజు. ఆయన క్రైస్తవాన్ని పాటించని వారిని తీవ్రంగా శిక్షించేవాడు. దీనివల్ల క్రైస్తవం బాగా అభివృద్ది చెందింది. అతని కొడుకు Constantinus II తిరిగి పాత మతమైన మిత్రాయిజంను అధికార మతంగా ప్రవేశపెట్టినాడు. కాని పర్షియన్ల చేతిలో అతను పరాజయం పొందిన తరువాత రోములో క్రైస్తవానికి ఎదురులేక పొయింది.

ఒకవేళ నిజంగా Constantinus II పూర్తికాలం పాలించినట్లయితే మిత్రాయిజం ఇప్పుడు యూరపు మొత్తానికి మతంగా ఉండేదని చరిత్రకారులు అందరూ అంగీకరించే సత్యం. కాని 5వ శతాబ్దం చివరికి క్రైస్తవం రోమును పూర్తిగా వశం చేసుకోగలిగింది. ఇక అక్కడి నుంచి యూరపు మొత్తానికి క్రైస్తవం పాకింది.  సరే, ఇక విషయానికి వస్తే రోము చక్రవర్తులు క్రైస్తవం అభివృద్దికి సహాయం చేసినారు, కాని రెండు వందల సంవత్సరాల లోపే రోము సామ్రాజ్యాన్ని చర్చి ఆక్రమించుకొన్నది. వారు అప్పుడు చాలా సంతోషించి ఉంటారు క్రీస్తును చంపినందుకు పగసాధించినామని. అసలు క్రీస్తు చరిత్రకు అందుతాడా అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్న. అది వేరోకసారి చర్చిన్చుకొందాము వీలును బట్టి.

క్రైస్తవం యూదు మతం నుండి వచ్చిందని ముందు చెప్పుకున్నాం. యూదులవలననే క్రీస్తు

చంపించబడ్డాడని క్రైస్తవులకు నేటికీ యూదులంటే కోపమే. చరిత్రమొత్తంలో  అవకాశం దొరికిన ప్రతీ సారీ క్రైస్తవులు యూదులను చంపుతూనే వున్నారు.  క్రైస్తవులు మత గ్రంథాలను, చరిత్రను, చివరికి దేవుళ్ళను కూడా ఇచ్చిన మాతృమతమైన యూదు మతస్థులను చంపినారు. హిట్లర్ పాలనలో 6 కోట్ల మంది యూదులను హతమార్చినాడని ప్రతీతి. అప్పటి జర్మనీలో ఉన్న చర్చిలు, అప్పటి పోపు, చెప్పుకోదగ్గ సహాయం యూదులకు చేయలేదు. స్టాలిన్ కూడా ఎంతో మంది యూదులను చంపినాడు. క్రైస్తవం తనకు అన్ని ఇచ్చిన యూదుల  ఋణము  ఈ విధంగా తీర్చుకున్నది.

చరిత్రలోక్రైస్తవులు చేసిన మరికొన్ని  పనులు చూద్దాం. పోప్ ఇన్నోసెంట్ iii ఆల్బిగెన్షియన్ క్రూసేడు(Albigensian Crusade) అన్న యుద్దమును తమ క్రిస్టియను మత విభాగమైన CATHERISM పై ప్రకటించి పైశాచిక పరమైన రీతిలో చంపినారు. దీనిని ఉత్సాహవంతులు వికీపీడియా లో చదవవచ్చు. అయ్యా అసలైన కేథలిక్కులను వారితో విభేదించిన వారిని ప్రత్యేకముగా గుర్తించలేముు ఏమిచేయమంటారు అంటే వారి పీఠాధిపతి (Abbot)

 

"Kill them all for the Lord knoweth them that are His” (2 Tim. ii. 19) and so countless number in that town were slain." అన్నాడట.

ఇక క్రుసేడరులు ఎంత దారుణముగా , శాఖా భేదము కారణముగా తమవారినే ఏవిధముగా చంపినారో చూడండి.

The routiers rampaged through the streets, killing and plundering, while those citizens who could run sought refuge in the churches — the cathedral, the churches of St Mary Magdalene and of St.Jude. Yet the churches did not provide safety against the raging mob of invaders. The doors of the churches were broken open, and all inside were slaughtered.

మనదేశంలో, మన మతం(హిందూమతం) నుంచి ఉద్భవించిన బుద్దుడిని గాని, మహావీరుడిని కాని ఏనాడు మనం చంపదలచలేదు. రాజులూ ఒకరితో ఒకరు యుద్ధాలు

చేసినపుడు, శరణన్నవారిని రక్షించినారుగానీ దేవాలయాలో దూరి హత్యలు చేయలేదు. ఇంకా నిజం చెప్పాలంటే, బౌద్దమతం, జైనమతం సిఖ్ఖుమతము  కూడా ఈ దేశములో

వర్దిల్లినాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో యూరపు మొత్తం చీకటిలో నుండి బయటకు రావడానికి మొదట చర్చి యొక్క కబందహస్తాలనుంచి తప్పించుకోవలసివచ్చింది. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుట లేదని
, భూమియే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పినందుకు గెలీలియొను చంపుతామన్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని  మరి బైబిలు చెప్పినది. మరి అది ఆమతస్థుల కు ప్రామాణికమైతే అది చెప్పినది వాస్తవము కాదు గదా ! మరి ఆ గ్రంధ వాక్యములు చెప్పినది ఒకవేళ దేవుడే కానీ, చెప్పినది తప్పుకదా!

ఈ వాస్తవాలను ఒకసారి గమనించండి:

1) భూమి బల్లపరపుగా ఉంటుందని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?

2) దేవుడు Adam and Eveలను మరియు ఈ ప్రపంచాన్ని 4000BC లో సృష్టించినాడని

బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?

3) భూమి చుట్టూ సూర్యుడు, మరియు అన్ని నక్షత్రాలు తిరుగుతాయని బైబిలు చెబుతోంది. అది నమ్ముతారా?

4) చర్చిలలోకి స్త్రీలను ఎందుకు రానివ్వరు? (ఇప్పుడు రానిస్తున్నారు.పూర్వము రానిచ్చేవారు

కాదు).

5) ఇప్పటికీ స్త్రీలు Father/Priest వంటి పదవులలో ఉండరు. Fathers కి కేవలం సహాయక పాత్రలలో మాత్రమే ఉంటారు. ఎందుకు?

ఇప్పటికీ అమెరికాలో 51% క్రైస్తవులు, మిగతా వారిలో, ఎక్కువ మంది Atheists అని చెబుతూ వుంటారు.

యూరోపియన్ సమాజం, దేశాలు చర్చి పాలననుంచి ప్రజాస్వామ్యంలోకి మారడానికి ఎంత ఖర్చు(ప్రాణాలలో) పెట్టినాయో తెలుసా? ఒక్కసారి ఆ లెక్కలను మచ్చుకు కొన్ని చూద్దాము.

1) ఒక జర్మను, బైబిలును జర్మను భాషలోకి మార్చినందుకు 15,000మందిని చంపినారు.

2) క్యాథలిక్కు-ప్రొటెస్టెంటుల మధ్య జరిగిన యుధ్ధంలో 15, 00, 000 మంది చనిపోయినారని ఒక అంచనా.

3) యూరోపియన్ దేశాలు కేవలం ప్రజాస్వామంలోకి మారడానికి, అంటే కొంచెం మార్పు కోసం ఇన్ని ప్రాణాలను పోగొట్టుకోవలసి వచ్చింది. కాని మన దేశంలో కులానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు?  ఇప్పటికీ చర్చి అంటే యూరోపియన్ దేశాలలో తిరుగులేని అధికారానికి చిహ్నం.కాని మన గుడి అంటే అటువంటిది ఏమీలేదు కదా. మనదేశంలో అప్పటి ప్రజలు అప్పటి యూరోపియన్ ప్రజలకన్నా వారు మనలను పాలించేవరకు చదువులోను, సకల శాస్త్ర విజ్ఞానములోనూ, అన్నింటికీ మించి, మనం మనస్సులలో వారికన్నా చాలా పెద్దవారము. మనము మన పెద్దల నుండి గ్రహించిన సంస్కారము అవినాశము. మనము  చదువులో వెనుకబడుటకు కూడా కారణము మెకాలే విలియం జోన్స్, మాక్స్ ముల్లర్ మరియు వారియొక్క , మన హిందూదేశపు తొత్తులు. మనము మార్పును తక్కువ వ్యతిరేకతతో (Resistance) ఆహ్వానిస్తాము. అందుకే మనము మన సాంప్రదాయాలనుండి ఇంత దూరము వచ్చివేసినాము. ఇవిఅన్నీ మనమతంలోఉన్న Flexibility మరియు Elasticity కి నిదర్శనములు.

ఇప్పుడు క్రైస్తవం భారతదేశంలో అడుగు పెట్టి నప్పటి నుండీ ఏమి జరిగిందో ఒక్కసారి చూద్దాం. క్రైస్తవం మనదేశంలో రెండువేల సంవత్సరాల నుంచీ ఉన్నదని ఇప్పుడు కొన్ని సంస్ధలు కట్టుకధలు వినిపిస్తున్నాయి. క్రీస్తు అనుయాయి సెయింట్ థామస్ రెండువేల యేళ్ళ

క్రితం ఇక్కడకు వచ్చినాడని, అతను క్రీస్తును గూర్చి ప్రచారము చేస్తూవుంటే , అతనిని తమిళనాడులోని బ్రాహ్మణులు హత్య చేసినారని ప్రస్తుతం అబద్దాలు బాగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవమేమిటంటే క్రైస్తవం మన దేశంలోకి నాలుగవ శతాబ్దంలో సిరియన్ క్రైస్తవుల ద్వారా వచ్చింది. అప్పట్లో సిరియా పర్షియనుల పాలనలో ఉండేది. సిరియను క్రైస్తవులకు రోమనులతో సంబంధాలు ఉండేవి. ఇది పర్షియనులకు నచ్చలేదు. అందుకే వారు సిరియను క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. ఇందువల్ల కొందరు సిరియన్

క్రైస్తవులు పారిపోయి సముద్రమార్గం గూండా కేరళ వచ్చినారు. వారికి అక్కడి హిందూ

రాజు బ్రతకడానికి స్థలం ఇవ్వటము జరిగింది. ఆవిధంగా క్రైస్తవం మొట్టమొదట భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలోని క్రైస్తవులు అలా 16వ శతాబ్దం వరకు ఎలాంటి

ఇబ్బందులు లేకుండా బ్రతికినారు. వీరి గురించి ఒక విషయం ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది.

16వ శతాబ్దంలో మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు వారు ఇక్కడి క్రైస్తవులు ఏసును

పూజిస్తున్నారు కాని పూజావిధానం మొత్తం హిందూ పద్దతులలో ఉన్నది అని గమనించినారు. పోర్చుగీసు వారు మొదట గోవాలో ప్రవేశించి వారు అక్కడ చేసిన నరమేధము ఇప్పటికీ Portuguese Inquisition అన్న పేరు మీద ప్రచారంలో ఉన్నాయి. ఆవిషయమును ముందే తెలియజేసినాను. క్యాథలిక్కు చర్చి, భారతదేశానికి పోర్చుగీసు వారికి యుద్ధం జరుగుతుంటే పోర్చుగీసు వారికి పూర్తి సహాయసహకారాలు అందించింది. ఈ సంఘటన మనకు చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఈ లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు వారు St.Thomasను బ్రాహ్మణులు చంపినారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు (ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అబద్దపు చరిత్ర మనము పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే, పాశ్చాత్యులు ఇప్పుడు అస్సలు ఆ విషయం

చెప్పడమేలేదు పైగా ఇటీవల సెయింట్ థామస్ హిందూదేశమునకే రాలేదు అతను రోములోనే స్వర్గస్థుడైనట్లు నిర్దారించినారు.). మన స్వాతంత్ర్యసంగ్రామంలో క్యాథలిక్కు చర్చి పాత్ర సున్న. అది భారతదేశంలో చర్చి, మరియు క్రైస్తవం యొక్క పాత్ర క్లుప్తంగా.

బైబిల్ నందు యోహోవా "తాను కేవలం ఇజ్రాయిలీ ప్రజల దేవుడను" అని చెప్పుకున్నాడు.

ఎక్కడా ఆయన తాను ప్రపంచ ప్రజలకు ముఖ్యంగా భారతీయులకు దేవుడనని చెప్పలేదు.

ఆయన ఇజ్రాయిలీలను మాత్రమే ప్రేమించినాడు. వారికోసం ఈజిప్ట్ వంటి ఇతర దేశాల,జాతులను ప్రజలను శిక్షించినాడు.(బైబిలు లోని నిర్గమ కాండం, Exodus, చూస్తే మనకు ఆ విషయము తెలియగలదు.) అలాగే ఏసు కూడా "తప్పిపోయిన ఇజ్రాయిలీ ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్నుపంపినాడు".అని స్వయంగా చెప్పటము జరిగింది.(మత్త 15:24) అంతేకాక ఆయన తన భోధనలు కేవలం ఇజ్రాయిలీలకే చెప్పమని,ఇతర దేశాలలో ప్రవేశించవద్దని కూడా స్వయంగా చెప్పినాడు.(మత్త10:5-6) అంటే వీరిరువురూ ఇజ్రయిలీ ప్రజలకే రక్షకులమని తామే చెప్పుకున్నారు కానీ, మన  వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో, భాగవతంలో,శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణుడే ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమని,పద్నాలుగు భువన భాండములు,అన్ని దేవతలు,ఆయన నుంచే పుట్టినాయని, చీమ నుండీ బ్రహ్మ వరకూ అన్ని ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయనీ, ప్రాణులన్నింటికీ, తండ్రి, పోషకుడు, రక్షకుడు శ్రీకృష్ణుడే అని తెలుపుతున్నాయి. శ్రీ కృష్ణుడు కేవలం ఒక దేశానికి,ఒక జాతికి చెందిన దేవుడు కాదు. ప్రపంచాని కంతా దేవుడు. ఇక ఈ భూమిపై పుట్టి, భగవంతునికి అంకితమైన భక్తుని ఆలోచన, ఆవేదన, ఆర్తి ఏవిధముగా వుంటుందో చూడండి.

చివరి భాగము 24వ తేదీన........