Sunday, 2 December 2018

బఫే పార్టీ

బఫే పార్టీ
మన సంస్కృతిని ఎంత పోగొట్టుకొన్నామో, ఎంత పోగొట్టుకొంటున్నామో, ఎంత పోగొట్టుకొంటామో గతము లోనికి వెళ్లి యోచిస్తే అర్థమౌతుంది. ఆర్జన తప్ప అమ్మానాన్నలకు అన్యథా అవసరమేలేదు. ఆకారణముతో అద్భుతము అనిర్వచనీయము అయిన మన సంస్కృతికి పిల్లలను తలిదండ్రులు ఎంతగా దూరము చేసినారో చెబితే మాటలకందదు.
మాతాపితరులు మాతప్పులేదని బుకాయించినా వారి ఆత్మ సాక్షి వాస్తవమేమిటో తప్పక చెబుతుంది.
మనము పోగొట్టుకొన్నది ఏమిటో ఒక్కసారి మాకాలములోని పెళ్ళిళ్ళను నేమరేసుకొంటే హృదయము ద్రవిన్చుతుంది. నాడు పెళ్ళిళ్ళు సత్రములలోనో దేవాలయములలోనో, ఇల్లు పెద్దదయితే ఇంట్లోనేనో జరిగేది. చిన్న పిల్లలది ఒప్కజట్టు, ఆడపిల్లలది ఒక జట్టు మొగపిల్లలది ఒకజత్తుఒకజత్తు,మగవాల్లది పిచ్చ్చాపాటీ జట్టు ఒకటైతే పేకాట జట్టు ఒకటి.
ఇక వంటవద్ద వంటవారికి కావలసిన పదార్థము అందించే ఒకరిద్దరు, పెళ్ళి మంతపమునకు సామాగ్రి సమకూర్చేవారు కొందరు, ముఖ్యముగా అరిటాకు భోజనము అయినవాళ్ళ వడ్డెన పోగొట్టుకొన్నాము. ఈరోజు పిల్లలూ పెద్దలలో కూడా అరిటాకులు అన్న తినేది మాకు రాదు, తట్టనే పెట్టండి అనే వాళ్ళు వున్నారు. ఇటువంటి ఇబ్బందులే లేకుండా బఫే అవతరించింది. ఇందు ఎంగిలి, మంగళము, చేయదగినది , చేయదగనిది అన్న తారతమ్యములు లేకుండా అన్నీ చేస్తున్నారు అన్నీ తింటున్నారు, అన్నే పారేస్తున్నారు.
ఇది నేటి మన సాంప్రదాయము. ఈ సందర్భములో ఒక చాటువు గుర్తుకోస్తూవుంది.
చాకివాని తోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీరగట్టె
శివుడు తోలు గప్పె చీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
ఈ ఉపోద్ఘాతముతో ఒక వ్యంగ్యాత్మకమైన గేయమును ‘Buffet Party’ ని గురించి వ్రాసినాను. అది మిమ్ము నవ్విస్తుంది మరియు ఆలోచింపజేయిస్తుంది.ఈ దిగువ లంకెలో చదివేది. 
Link: https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html
బఫే పార్టీ
https://cherukuramamohan.blogspot.com/2018/12/blog-post.html


రెండో తేదీ కూతురి పెళ్ళి
తప్పక రండి వెళుదురు మళ్ళీ
మూడో తేదీ వుంది రిసెప్షను
దానికి తోడుగ  బఫే ఫంగ్షను
మనవారంతా వస్తారపుడే
చెప్పితి మీకీ మాటను ఇపుడే
ఫంగ్షనుకే నే వెళ్ళితినండీ
అదే హాలు ఇక వెళ్లి ‘తినండి’
అన్నాడచ్చటి వాలంటీరు
చూపుచు నాకొక మనుషుల ఏరు
కోట్లు గడించిన కోట్లు ధరించిన
వారంతా మరి క్యూ లో నిలుచొన
చెప్పుకాళ్ళతో చేత తట్టతో
సత్తుబొచ్చెలో సన్న గులకతో
సవ్వడి జేసిన రీతిని గలగల
వింటూనే నే పోయితి వెలవెల
వీధి బిచ్చములు గురుతుకు వచ్చెను
దానిజూచి సగమాకలి జచ్చెను
అయినా అడుగును వేసితినండీ
చెప్పెదనా చోద్యాన్ని వినండి
శుచి శుభ్రతలను వేయుచు మంటల
ఎవడో చేసిన ఏవో వంటల
తెచ్చియుంచెదరు తీరుబాటుగా
యూనిఫారమున ఠాటుబాటుగా
అన్నము పప్పూ పులుసూ చారూ
మజ్జిగపులుసు కూరలు ఆరు
జీరా రైసు  వాంగీ బాతు
బిరియానీ మరి బిసిబేలె బాతు
నాను చపాతీ రోటీ పూరీ
ఉన్నాయన్నీ టేబుల్ చేరి
ఇవి కాకుండా ఎన్నో స్వీట్లు
పేర్లు తెలియుటకు ఎన్నో పాట్లు           
పొళ్ళూ రైతా పలు పచ్చళ్ళు
చూచిన చచ్చును మన ఆకళ్ళు
తిను పదార్థముల అమరిక గోళము
ఏమితినాలో గందరగోళము
అయ్యా అన్నము అని ఒకరంటే
పప్పూ పులుసు అడుగుతువుంటే
బంతి భోజనము ముగిసిన పిమ్మట
యాచకులొకరింకొకరిని కుమ్ముట
గురుతుకు వచ్చెను నాకా గతము
కనగా కాదిది నాకవగతము
ఔత్తరాహికుడు హిందీ భాషలొ
అనుచూ ఉండెను బఫే ’లొ’ బఫే ’లొ’
ఆశ్చర్యముతో చూచితి నటునిటు
దున్నలు కుమ్మును అని అనుకొంటూ
తెలిసెను అప్పుడు దున్నలు కాదని
ఆతను అన్నమును తినమన్నాడని
తట్టలు పట్టుకు తిరుగుతూ వుంటే
దేశ దరిద్రత నకలది  కంటే
గతము లోపలికి మది వెడలింది
ఆ వైభవమది ఇటు తెలిపింది
బంతి చాపలను వరుసగ పరచి
బంధుమిత్రులను కూర్చున బనిచి
అక్కా అన్నా బావా మామా
పిన్నీ చిన్నా కన్నా కుసుమా
అందరికీ అరిటాకుల యందున
పంచభక్ష్య పరమాన్నములందున
కొంటెతనానికి ప్రేమను గూర్చుచు
వేళాకోళమునెంతో జేయుచు
బావా ఇది తిను మామా ఇది తిను
అని కొసరుచు వడ్డించగ వరుసను  
వద్దంటూనే వేయించుకొనే
భోక్తల బొజ్జలు గాంచగనౌనే
ఆ మాధుర్యము ఆ మమకారము
ఆ ఆప్యాయత ఆ ఆదరము
ఎక్కడ దొరకును ఎప్పుడు దొరకును
నామది దానిని ఎన్నడు మరచును 
స్వస్తి      







Monday, 26 November 2018

మేడం-ఆంటీ-అంకుల్


మేడం-ఆంటీ-అంకుల్
https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post_26.html
‘Baba Black sheep.....’ అన్న Rhyme మనకు సుపరిచితమే! ఇందులో Sheep ఏమని జవాబు చెబుతుందంటే ‘One for my Master one for my DAME..’
‘My Dame’ రానురానూ Madam అయినది. అది గొర్రె కాబట్టి My Dame (Madam) అంటే చెల్లినది. నాస్త్రీ, నా ఆడది, అన్న అర్థములో వచ్చే ఈ పదము తప్ప మన సంస్కృతిలో మన భాషలో వేరు పదములేదా! అసలు Dame అన్నది French శబ్దము వాళ్ళు ఇంటి యజమానియగు స్త్రీని Dame అంటారు.
మరి ఈ మాటకు ప్రత్యామ్నాయము లేదా అంటే ఉంది. అదే  అమ్మ . అమ్మ అన్నది అత్యుత్తమమైన పదము. పదము అన్న మాటకు రెండు అర్థములు. ఒకటి ‘అర్థమును కూర్చెడి అక్షరముల కలయిక.’ వేరొక అర్థము ‘ఉన్నత స్థానము’. నకోక అర్థము 'పాదము'. మరి అమ్మ అన్న పదము’ పలికి అమ్మ’ పాదము’ పట్టితే అదియే స్వర్గ పదము’ .
అమ్మ అడిగిన వరాలిచ్చే దేవుని బొమ్మ. వేసవిలోచెట్టు నీడ అమ్మ , దాహార్తికి వాన మేఘమమ్మ,తీయనైన నీటి చలమ అమ్మ, ఇంటి వెలుగు అమ్మ, కంటి చూపు అమ్మ. అసలింటికి పట్టుకొమ్మ అమ్మ, అందుకే ఆమెను మనకిచ్చింది బ్రహ్మ.

అమ్మ, తల్లి, మాత,జనని, అన్న ఎన్నో ప్రతినామాలు ఉన్నాయిఅమ్మకు. అమ్మ అనే పదము ఓం నుండి వచ్చిందని పెద్దలంటారు. మనము అంకాళమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని దేవతలకు అమ్మను చేరుస్తాము. తల్లిని అమ్మ అంటాము. సమాజములు స్త్రీని అమ్మ అని పిలుచుట మన సాంప్రదాయము. దీనిని బట్టే అమ్మ అన్న మాట ఎంత పవిత్రమైనదో మనకు తెలుస్తుంది. మాతృ శబ్దము నుండి మాత అంటే  అమ్మ అన్న శబ్దము వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే! మాతృ శబ్దమమునుండినే లాటిన్ లోని  matter, మితెర (గ్రీక్) మదర్ అన్న శబ్దాలు వచ్చినాయి. అంటే పురాతన నాగరికత గా చేప్పుకునే  గ్రీకు అరబ్బీ,జర్మన్(mutter) డచ్ (moeder) ఈ భాషలే కాకుండా అనేకమైన భాషలలో మాతర్ అన్న సంస్కృత శబ్దాన్నే కృతకము చేసి తల్లికి ప్రత్యామ్నాయముగా వాడుకుంటారు.
కావున ప్రపంచము లోని భాషలకు సంస్కృతము మాతృక , ప్రపంచములోని తల్లులకు మన 'మాత' యే మాతృక. అదే విధంగా పితృ, భ్రాతృ, దుహితర్ అను సంస్కృత శబ్దాలనుండి పుట్టినవే father, brother, daughter   మొదలగునవి. మాత అన్న శబ్దము ఆ పరాశక్తి అమ్మకు వాడుతాము . దీనిని బట్టే అమ్మ అన్న మాట యొక్క ప్రాశస్త్యము మనకు తెలుస్తుంది. ఇది ఇంకొక విషయము కూడా తెలుపుతుంది, అది ఏమిటంటే   మన సంస్కృతి ఎంత ప్రాచీనమైనది అన్నది పాశ్చాత్య నాగరికత ఎంత నవీనము అన్నది.
ఇక  Madam అన్న పదము యొక్క మూలమును తెలుసుకొందాము. ఫ్రెంచ్ భాషనుండి లాటి, తద్వారా ఆగ్లమునకు వచ్చింది ఈ Madam అన్న పదము వచ్చింది. ఈ క్రింద Google నుండి ‘Madam’ యొక్క పుట్టుకకు సంబంధించి గ్రహించిన విషయమును మీ ముందుంచుచున్నాను.
‘Madam /ˈmædəm/, or, as French, madame /ˈmædəm/ or /məˈdɑːm/,[1] is a polite form of address for women, often contracted to ma'am /ˈmæm/ in American English and /ˈmɑːm/ in British English. The abbreviation is "Mme" or "Mme" or "Mdm" and the plural is Mesdames (abbreviated "Mmes" or "Mmes" or "Mdms"). The term was borrowed from the French Madame (French pronunciation: [maˈdam]), which means "my lady". (Courtesy: Google)’
కావున “Madam” కన్నా ‘అమ్మ’ అని పిలుచుట చేత స్త్రీలను అత్యున్నతముగా గౌరవించిన వారలమగుచున్నాము అన్నది నిర్వివాదాంశము.
ఇక ‘ఆంటీ అంకుల్’ అన్న పదములకు అర్థములేమిటి అన్నది ఆలోచించుతాము.
మళ్ళీ కలుద్దాము.......


ఇక ఆంటీ అంకుల్ ను గురించి
వెస్టు కల్చరెపుడు వేడి కాఫీ యాయె
వారి రీతి నీతి పాలు చీని
అందుచేత ఆంటి అంకులు మనకొచ్చె
మామ అత్త పిన్ని మాయామాయె
 నిరంతరమూ సువాసన వెదజల్లే శ్రీగంధపు వృక్షమును మొదలంట నరికి కొని తెచ్చుకొని గంధపు అగరుబత్తీ వెలిగించినట్లు వుంది మన వరుస. పాశ్చాత్య సంస్కృతి అగరుబత్త్హీ వంటిది. భారతీయ సంస్కృతియగు చందన సాలము నేటిది కాదు తరతరములనుండి వస్తూ వున్నది. ఆ మరులుగొల్పు మంచి గాలిని మనము పీల్చుచూ మనము మన వారసులు ఆరోగ్యముగా హాయిగా ఉండవలెనని ఏర్పాటు  చేసినారుచేసినారు మన పూర్వులు. అచెట్టును నిర్దాక్షిణ్యముగా నేటి తరము కొట్టివేస్తూ వుంటే బరువెక్కిన మనసుతో ఎవరయినా బాధ వెలిబుచ్చితే నీకెందుకు నాయిష్టం అంటున్నారు. ఈ విధముగా ఆలోచనలు వెర్రితలలు వేస్తూ పోతే స్వంత ఇంటికి న్నిప్పుపెట్టుకొని ‘నాయిష్టం నాయిల్లు’ అంటారేమో!
పాశ్చాత్య సంస్కృతిని గూర్చి ఒక్కసారి తెలుసుకొనే ప్రయత్నము చేయుటకు నేను తెలియజేయుచున్నది ఒకసారి, మనసు పెట్టిచదవండి.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు. అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మ లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె'(डायन,Witch) గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు, ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు. మొదటిసారిగా హిలరీ క్లింటన్ నిలచినా ఓడిపొయినది.

ఇంచుమించు13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ పాశ్చాత్య జాతికి పెళ్లి అన్నది తెలియదు. నేటికి కూడా, అది ఆడామగ సంబంధము. అదే మన సాంప్రదాయములో  రెండు కుటుంబాల అనుబంధము. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే, రేపు వీనికి లేక ఆమెకు విడాకులిచ్చి వేరొకరితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు  అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ  ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్న ఆ పాశ్చాత్యదంపతులు అదృష్ట వశాన రెండు  మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే  వ్రాసుకొంటారు అట్లు కాకుంటే వడంబడిక చేసుకొంటారు. అది లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రయమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే అతడు ఆమె  పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. అదే విధముగా అతని పిల్లలు, తమ తండ్రి క్రొత్తగా పెళ్ళిచేసుకొన్న యువతిని ‘ఆంటీ’ అంటారు. మరి అటువంటి సంబోధనలు చెడ్డవి కాదా! ఒకపరి ఆలోచించండి. చైనా, జపాను, మలేషియా,నేపాల్, భూటాన్ ఇత్యాది అనేక దేశములు తమ తమ సంస్కృతిని సజావుగా కాపాడుకొంటూ వస్తూవున్నాయి. ఒకనాటి మన దేశములో భాగమయిన పాకిస్తాన్ తమ మతము తమ సంస్కృతికి అడ్డువస్తాయని హైందవ సంస్కృ తినేకాక హిందువులనే పొట్టన పెట్టుకొంది. వారివలె దుర్మార్గమునకు పాలుపడండి, అని నేను చెప్పుటలేదు. నేను కేవలము మన ఆచారవ్యవహారములు ఎంతో సనాతనమైనవి. ద్రష్టలయిన మహాఋషి  మునులు మనకు ఏర్పరచిన మానవ సంబంధముల బాటలో నడుద్దాము అని మాత్రమె చెబుతున్నాను.
పాశ్చాత్యులు ఈ విధముగా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day, Father’s day (mothers' day, Father’s day ని గూర్చి విస్తృతముగా ఇదివరలో వ్రాసినాను.) రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ నాన్నను వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది.
అందుకే Uncle, Aunt అన్న పదములకు శబ్ద కోశము లో చిన్నాన్న లేక మామ అన్న అర్థమును, పిన్ని లేక అత్త అన్న అర్థములను చూస్తాము. మనకున్నన్ని వావి వరుసలు వారికి లేవు. అందుకే వారు 'పిండికీ పిడుక్కూ ఒకే మంత్రము'ను వాడుతారు. దయవుంచి ఆ విధముగా సంబోధించి మన తలిదండ్రులకు అవమానమును కోరి తేవద్దు. పైపెచ్చు కొత్తవారిని సంబోధించునపుడు ఏమండి, పెద్దవాలయితే గురువు గారు, అయ్యా, అమ్మా, అంతగా ఆంగ్లమే కావాలన్నా 'సార్' అని వాడితే మన వాసి తగ్గేది ఏమీ లేదు.
 క్రొత్తవాళ్ళతో ఎంతో అనుబంధమున్నట్లు బంధుత్వమును అంటగట్టి పిలుచుట మన సాంప్రదాయము కాదు అని తెలియజేస్తూ నా ఆలోచనకు అడ్డుకట్ట వేస్తున్నాను.

స్వస్తి.

Saturday, 3 November 2018

మదిలోని మాట














మదిలోని మాట

https://cherukuramamohan.blogspot.com/2018/11/blog-post.html

ఒక విషయము వ్రాయవలెను అంటే వ్రాసేవానికి ముందు అవగాహన అవసరము.

అటుపిమ్మట ఆ అవగాహనను భావము లోనికి రూపాంతరము చెందించవలసి

యుంటుంది. ఆపై  ఆ భావమును, దానికి అనుకూలమైన భాషలోనికి మార్చవలసి

యుంటుంది. ఇవన్నీ మానసిక ప్రక్రియలే. ఆ తరువాత అక్షరములను వ్రాత బల్లపై

వుంచవలసి యుంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రక్రియను దైవదత్తముగా భావించితే

తనకు చేతనగు రీతిలో నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుతాడు. అదే

స్వార్థబుద్ధి అయితే ధనాపేక్షతో చేస్తాడు. కొందరు ఇంతటి గొప్పపని చేసికూడా

అయాచితముగా వచ్చిన పారితోషికమునే గ్రహించుతారు. యాచించరు.

యాచించేవాడు స్వార్థ కవి లేక పండితుడు.  ఆ రెంటికీ దూరమున్నవాడు

పరమార్థ కవి లేక పండితుడు. అసలు తనలో ఏమీ లేకుండా ఏదో వ్రాసేవాడు

నిరర్థ కవి లేక పండితుడు.

ఈ ఆస్య గ్రంధికి చెందిన అందరూ నిస్వార్థులే. కానీ వీరిలో కొందరు తాను

వ్రాసినది ఎందరికి నచ్చినది అని చూస్తారు. వీరిని కూడా రెండు తెగలుగా

విభజించవచ్చు.

మొదటి కోవకు చెందినవారు సంఖ్యను జూచి సంతృప్తి పడిపోతారు. రెండవ

కోవకు చెందినవారు నచ్చిన వారి సంఖ్యను ఆలంబనగా తీసుకొని తమ రచనకు

మరికాస్త పదును పెట్టి చదువరులకు తమకు తెలిసిన విషయములను

ఉత్సాహముతో తెలియజేయ తలచుతారు.

ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తిని నేను. తెలిసినది కొంచెమయినా,

తెలుపవలెనను తపన కలిగిన వాడను. అందుకే, ముద్రణ కష్టమయినా Likeలు లేక

పోయినా, నా ప్రయత్నమును విరమించను. వ్రాయుట దీక్షగా స్వీకరించి మాత్రమే

వ్రాస్తూ వుంటాను. ఇన్నిచెప్పినా నేనూ మనిషినే! నాలోనూ బలహీనత ఎదో ఒకటి

ఉంటుంది.

నాలోని ఆ బలహీనత ఏమిటి అన్నదానికి ఒక ఉదాహరణ రూపముగా

తెలియజేసుకొంటాను.

Cricket లో గొప్పగా batting చేసిన ముగ్గురూ వ్యక్తులను తీసుకొందాము.

1.                   డాన్ బ్రాడ్మన్ : నాడు టెస్ట్ క్రికెట్ మాత్రమే వుండేది. క్రీడాకారులు కూడా బంతి భూమిపై వేగముగా తమను దాటి వెళ్ళిపోతే  దానిని పొందుటకు పరిగెత్తేవారు. లేక Ball ఒకవేళ Catch కి వస్తే పరిగెత్తి పట్టే ప్రయత్నము చేసేవారు. అంతకు మించిన ప్రయత్నము, కష్టము నాడు కనబడదు.

2.                తెండూల్కర్: ఈయన కాలానికి One Day, T20 వచ్చినాయి. ఆటలో నైపుణ్యము 

పెరిగినది. బంతులను విసరు తీరుతెన్నలు ఎంతగానో మారిపొయినాయి. Batting 

నైపుణ్యము పెరిగి పోయింది. Jonty Rhodes పుణ్యమా అని Fielding పద్ధతులు కూడా 

మారజొచ్చినాయి. Circus Feats చేసి బంతిని పట్టుట సాధన చేసినారు. అట్టి 

పరిస్తితులలో, తన శరీర ఆరోగ్యము వల్లనో, తన నైపుణ్యము వల్లనో, ఎన్నో Records ను 

స్వంతము చేసుకొన్నాడు.


ధోనీ, కోహ్లీ: వరవడి పెరిగింది, నైపుణ్యము పెరిగింది. ఆటగాళ్ళు పెరిగినారు.

అవకాశాలు తగ్గినాయి. గాయాలను సైతము లెక్కచేయక ఆడేవారు

అధికమయినారు. అన్నిటికీ మించి Matches అన్నీ Recod కావటం తో వానిని మళ్ళీ 

మళ్ళీ చూసి, తమ తప్పులు సవరించుకొనుట, ఇతరుల బలహీనతలు కనుగొని వారిపై 

దెబ్బకొట్టుట నేర్చుకొన్నారు. ఇవికాక Coaches ను Batting, Bouling, Fielding లకు 

విడి విడిగా ఏర్పాటుచేసుకొని సామర్థ్యమును పెంచుకొన్నారు.

ఎవరి రికార్డులు వారివే! పోల్చుట, వివిధ కాలపరిస్థితులకు అనుగుణముగా మారిన 

ఆటలో,   నావరకు సబబు అనుపించదు. ఆ కాలములకు వారు గొప్ప. కవిత్వము

పాండిత్యము , వ్యాసరచన కూడా ఇటువంటివేనని నా అభిప్రాయము. ఈ కాలములో 

వుండే భావ ప్రసార మాధ్యమములు నాడు లేవు, అయినా మహనీయులు వ్రాసిన 

గ్రంధములు అజరామరములై నిలచిపోయినాయి. నాటి మహానుభావులు, కొందరయితే 

మహా పడితులై కూడా గుర్తింపునకు పాటుపడలేదు.

కాళిదాసు పేరు ప్రాచుర్యములో ఉన్నంతగా మల్లినాథసూరిని గూర్చి ఎందరికి తెలుసు. 

అసలు ఆయన కాళిదాసు కావ్యములకు వ్యాఖ్యానము వ్రాసియుండి ఉండకపోతే ఆ 

గ్రంథములకు ఇంత ప్రాచుర్యము వచ్చియుండెడిదా! ఈ విషయము ఎంత మందికి 

తెలుసు. ఆయన ఆంధ్రుడని ఎందరికి తెలుసు.

మల్లినాథుడి ఇంటిపేరు కొలచాల. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే 

వికారాలున్నాయి. కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామము తెలంగాణా రాష్ట్రము లోని, 

మెదక్ జిల్లాకేంద్రమైన మెదక్ కుు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు 

పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని 

తెలుస్తోంది.

మహామహోపాధ్యాయుడగు జటావల్లభుల పురోషోత్తం గారు స్వయంగా

మల్లినాథులవారిని గూర్చి చెబుతూ, ఆయనే లేకుంటే కాళిదాసునకు అంత పేరు

వచ్చేది కాదేమో అన్నారు. ఇంతటి మహానుభావులు ఎందఱో! ఎందరెందరో!

కానీ నేటి పరిస్థితి అది కాదు. రామాయణ, భారత భాగవత, మహాకావ్య, ప్రబంధములను

చదివేవారు కనిపించరు అనుట అతిశయోక్తి కానేరదేమో! నేడు ఆస్యగ్రంధిలో తమ 

కవితలను పంచే కవులు పుంఖానుపుంఖములు. కానీ ఇందులో, గంభీరమగు భావము 

కలిగియుండి కూడా, ఎక్కువమంది భాషాసంపదను సమకూర్చుకొను  జిజ్ఞాస, నిబద్ధత 

కలిగినవారు తక్కువ. అప్పుడు కవిత పేలవమై తేలిపోతుంది.

 సారవంతమైన రచనలను పాఠకులు చదివి అభిప్రాయములు తెలుపుతూ 

ప్రోత్సహించితే మంచి రచనలు ఆస్యగ్రంధిని అలరించగలుగుతాయి.

 

మాటవరుసకు నేను గతము లో వ్రాసిన సంబాజి విషయమే

తీసుకొందాము. నావంటి ఒక అనామకుడు ఆయనను గూర్చి వ్రాసినా

వ్రాయకున్నా, చదువ వలసినవారు చదివినా చదువకున్నా ఆయన వాసికి వన్నె

తరుగదు. కానీ మనవాడయిన ఒక మహనీయుని గూర్చి పదుగురు

తెలుసుకోవలెనని తలచినాను. కానీ నాది వ్యర్థ ప్రయత్నమని అర్థమైపోయింది.

ఎందుకంటే, ఇందు మోడీ లేడు, రాగా లేడు, కచరా లేడు, నాచనా లేడు. పోనీ

చిరు, రాచ, అల్లు, మబాతారా, మొదలయిన ధనాపేక్ష కీర్తి కండూతి కలిగిన వ్యక్తి

కనబడడు. అందువల్ల చదువుటకు మనకు నిరాసక్తి. ఇందులో మీటూ (మాంసము)

మీటూ (Me too) లేదు. ఇక చదువుట ఎందుకు అనుకొని వుంటారు.

అది నిజమని నాకు అనిపిస్తుంది. అంతటి మహోన్నతమయిన వ్యక్తిని గూర్చి

తెలుసుకొన తలంపేలేని పాఠకులకు ఆయనను గూర్చి తగిన విధముగా తెలుపలేక

పోయిన నేను, ఆ అమహావీరుని, చనిపోయిన తరువాతకూడా అవమానపరచి

రెండవ ఔరంగజేబును కాలేను. అందుకై వ్రాయుట విరమించుచున్నాను.

ఆయనను గూర్చియే కాదు. దేనిని గూర్చి వ్రాసినా పాఠకులకు ఎందుకో మంచి

తెలుసుకొనవలెనంటే ఎదో ఉదాసీనత. అదే 'మోడీ పాలన బాగుందా లేదా అని

ఇక ప్రశ్న వేసి వదిలిపెడితే 200 మందికి తక్కువలేకుండా likes మరియు For and 

Against Comments వ్రాస్తారు. దీనివల్ల మన విజ్ఞానము పెరుగుతుందని నేను 

భావించను.

‘అజరామర సూక్తులు’, ‘సమస్య మనది సలహా గీతది’ మొదలగు అనేక 

మంచివిషయములను,  ఏ రూపములో వున్నా, ఎవరు వ్రాసినా చదువుట 

అలవరచుకొండి. మీరు నేర్చినది భావితరాలకు వ్యాప్తి చేయగలరు. ఈ సనాతన ధర్మ 

పరిరక్షకులు మీరే!

స్వస్తి.

Wednesday, 31 October 2018

ఛత్రపతి సంబాజీ మహారాజ్


ఆరనివ్వను  జారనివ్వను భరత  భూమి  స్వరాజ్య జ్వాల
మ్లేచ్ఛ పాలన మాడిపోవును చూడుమిదె శలభముల లీల
సంబాజి
చరిత్ర అన్న పేరుతోభారతీయులమైన మనతో చెత్త చదివించి అయోమయము లోనికి నెట్టిన కుహనా చరిత్ర కారులు వ్రాసిన కట్టుకతలనే చరిత్ర అనుకొంటున్నాము. తన పేరుతోనే ఒక శకమునేర్పరచిన విక్రమార్కుని గూర్చి చదవము. ప్రశాస్తికేక్కిన భోజరాజును గూర్చి చదవము. అసలు ఆ మహనీయుడు తన కాలములోని రెండవ కాళిదాసు సహాయముతో 'రామాయణ చంపుఅన్న కావ్యమును వ్రాసినాడు. దానికి తోడు 'సమరాంగణ సూత్రధారఅన్న యుద్ధతంత్రయంత్రశస్త్రాస్త్ర సందోహమును వివరించు గ్రంధమును వ్రాసినాడు. 
పరమ పురుషులగు రాముడు కృష్ణుడు భూమిపై అవతరించి తాము దైవావతారులమని తెలియజెప్పిన ప్రభుత్వము వారి దైవత్వమునువారు ఈభూమిని పునీతము చేసిరన్న సత్యమునకు మద్దతుగా కనీసము మన రూపాయల కాగితములపై వారి ఊహా చిత్రములనైనా ముద్రించదు. మహా వీరాధివీరులయిన రాణా ప్రతాప్శివాజీటేగ్ బహాదుర్సంబాజి వంటి మహావీరుల చరిత్రను మనకు సవివరముగా తెలుపదు. 
పోనీ ఎవరైనా నాలాంటి వెర్రివారు చేతనయిన మేరకు ఆ మహనీయుల గూర్చి గానీ మన సాహిత్యమును గూర్చిగానీమన సంస్కృతి సంస్కారములను గూర్చిగానీ చదువరు.
ప్రజలను ధర్మమార్గామువైపునకు నడిపించవలసిన నేటి పురాణ ప్రాసంగికులకు రాముడు మధ్యము త్రాగినాడామాంసము తిన్నాడా అన్న విషయమును గూర్చి చెప్పుట ముఖ్యము. ఏ రామాయణమును చదివి ఈ మాటలన్తున్నారో ఆ రామాయనములోనే 'రామో విగ్రహవాన్ ధర్మఃఅని రాముని శత్రువాగు మరీచునిచే చెప్పబదినదని వ్రాయబడి వుంది. రాముని గోప్పదనమునస్కు అది చాలదా! మరికొందరు అన్య మతావలంబులు 'కృష్ణుడు పేడి కదా అంతమంది భార్యలెందుకు.
ఇటువంటి విషయములపై చర్చ అనవసరము. అట్టి విశాపూర్త వ్యాఖ్యలను అరికట్టవలేనంటే యువకులు మన ఇతిహాసములు (యదార్థ చరిత్రలు) చదివితే అపుడు సమర్థవంతముగా చర్చించగలరు.
సంబాజి ని గూర్చి తక్కువ మందికి తెలుసునని నా ఉద్దేశ్యము. అందుకే నాకు తెలిసిన మేరకు ఆయనను గూర్చి వ్రాయుచున్నాను. తప్పక చదివేది.

 ఛత్రపతి సంబాజీ మహారాజ్
శస్త్ర నిపుణుడు శాస్త్ర నిష్ణాతుడు అగు సంబాజి లేక శంభాజీ, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు మరియు వీరుడుమేరునగ ధీరుడువైరిజన విదారుడుసంస్కృత గ్రంధకారుడుఈయన ఆత్మగౌరవము దేశభక్తి నిజమునకసమానము, అనుపమానము, అనితర సాధ్యము.  
శివాజీ మొఘలులతో తలమునకలుగా యుద్ధము చేస్తున్న సమయములో, 16 సంవత్సరముల వయసులో 7 కిలోల బరువు కలిగిన కత్తితో రామనగర్ యుద్ధము న శత్రువులను జయించిన వీరుడితడు.
శివాజీ కి ముగ్గురు భార్యలు కాగా శంభాజీరెండవ భార్యయగు సాయీ బాయి పుత్రుడు. శంభాజీ జననము మే 14, 1657 న పురంధర్ కోటలో జరిగింది.
శివాజీ భార్య సోయరా బాయికి రాజారాం అనే కుమారుడు ఉండేవాడు. అతడు సంభాజీకన్నా 13 సంవత్సరములు చిన్నవాడు. అయినా సోయరాబాయికి తనకుమారుని ఛత్రపతి గావించవలెనను ఆశ అతిశయించి ఉండెడిది. దానికి తోడుగా అతి పిన్న వయసు, అంటే తన 2సం. వయసులోనే శంభాజీ తన తల్లిని పోగొట్టుకొనుటచే తన నాన్నమ్మయగు జిజాబాయి వద్దనే పెరగవలసి వచ్చింది.  స్వార్థమతియగు సోయరాబాయి శివాజీకి అవాకులు చవాకులు చెప్పి సంబాజీని తండ్రికి అన్నివిధములా దూరము చేసిందితన కుమారునికి పట్టము కట్టించవలెనను కృతనిశ్చయముతో! దానితో తండ్రీకొడుకుల నడుమ ఆంతర్యము పెరిగిపోయి సంబాజీకి కారగార శిక్ష విధించవలసివచ్చింది శివాజీకి.
రాజ్యాధికారము విషయమై తండ్రితో వచ్చిన ఈ తగాదా ఎంతగా ముదిరి పోయిందంటే, కారాగారమునుంది తప్పించుకొని సంబాజీ మొఘలులతో కలియుటయేగాక  ఇస్లాం మతములోనికి మారినాడు శంభాజీ.   
మిగిలినది వేరొక రోజు......
కానీ వారి దౌర్జన్యాలు, అత్యాచారాలు చూసి తానుచేసిన తప్పును గ్రహించి ఆచటినుండి తప్పించుకొని బయటపడినాడు. ఎంతయినా భారత భాగవతములను ఉగ్గుపాలతో తన కుమారుడు శివాజీ ని పెంచిన తల్లియే కదా శంభాజీ ని కూడా పెంచినది. స్వపరివారములోనే కలిగిన ఈర్ష్యాద్వేషాలు, పదవీ మొహాలు, క్షణికావేశాలు ఎంత విపరీత విపత్కర పరిణామములకు దారి తీస్తాయో చూడండి. జరగకూడనిది జరిగినా చివరకు దానివల్ల  ఇటు శివాజీ కి అటు శంభాజీ కి మేలే జరిగింది. కొడుకు ఔన్నత్యమును గుర్తించినాడు తండ్రి. తండ్రి ఆదర్శమును గ్రహించినాడు కుమారుడు. వారి అనుబంధము అటుపిమ్మట విడరాని బంధమై నిలచింది.
1666లో ఔరంగజేబు  తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా పంపిన ఆహ్వానమును మన్నించి ఆతనిని కలియుటకు,8,9 సంవత్సరముల వయసుగల  సంబాజి కూడా తండ్రి కోరికపై 125౦ కిలోమీటర్ల దూరము లోనున్న ఆగ్రా కు తండ్రి వెనకాల కూర్చుని పయనించిన ధృఢమనస్కుడు మన సంబాజి.
రాజ దర్బారులో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరచినాడు. ఇది సహించలేని శివాజి బయటికి కుమారునితో కూడా వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేసినారు.
ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నాదానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించినాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగినాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకుగుడులకుఫకీర్లకు పంపించే విధముగా ఔరంగజేబు నుండి అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీశంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన. సంబాజి తండ్రిని తప్పించి తానూ తప్పుకొన్నాడని కూడా అంటారు. ఒక మాట మాత్రము నిజము. సంబాజి బాల్యము నుండియే ఎంతో చురుకైనవాడు.
శివాజీ రాజధానిని చేరుకొన్నాడు కానీ శంభాజీ మొఘలుల బారిన పడకుండా, ఉజ్జయినికి దగ్గరగా, శివాజీ బంధువయిన రఘునాథ్ కోర్డే అను మంత్రి కి దూరపు బంధువు ఇంటిలో దాదాపు ఒకటిన్నర సంవత్సరము ఉండవలసి వచ్చింది.
రఘునాథ్ కోర్డే వాళ్ళు బ్రాహ్మలు.  ముస్లిములకు అనుమానము రాకుండా సంబాజీకి ఉపనయనము మధురలో చేయించి తమ ఇంటి బాలునివలె చూసుకోదొడగినారు.
ఏది ఎట్లయితేనేమి ఔరంగజేబుకు సంబాజి ఆ బ్రాహ్మణ అగ్రహారములో అజ్ఞాతవాసము చేయుచున్నట్లు తెలియవచ్చింది. వెంటనే తన దళపతికి కొంత సైన్యము నిచ్చి నిజము తెలుసుకొని సంబాజీని బంధించి డిల్లీ తేవలసినదిగా చెప్పి పంపినాడు. ఆతను ఆ అగ్రహారమునకు వచ్చి  ఆయింటి పెద్దను గద్దించి ఆయింటవున్న అనుమానాస్పదుడైన ఆ బాలుని గూర్చి అడిగినాడు. ఆ బాపడు కూడా ఎంతో నిబ్బరముతో ఆ బాలుడు తన కూతురి కొదుఇక్లని నమ్మబలికినాడు. బ్రాహ్మణుడు వేరొకరి ఎంగిలి, అది ఒకవేళ భార్యయే గానీ గాక, తిన కూడదు. అందునా అబ్రాహ్మణుని ఎంగిలి తినుట మహా పాతకముగా భావించుతాడు. ఆ విషయము తెలిసిన ఆ దళపతి ఒకే కంచములో భోజనము వడ్డింపజేసి ఆతను ఆ బాలుని కూడి భోజనము చేస్తే అప్పుడు నమ్ముతానన్నాడు. ఆ బ్రాహ్మణుడు తన నిష్ఠకన్నా రాజభక్తి గొప్పదని త్రికరణ శుద్ధిగా నమ్మి అట్లే కలిసి సంబాజి తో ఆరగించినాడు. బ్రాహ్మణులు అంత రాజ భక్తి గలిగినవారు. వారు ఏరోజూ తాము రాజు కావలెనని కోరుకోలేదు. తమ రాజు బాగుండవలెనని కోరుకోన్నవారే! చాణక్యునిలో కూడా మనము ఈ విషయమును గమనించవచ్చు. వచ్చిన దళపతి, సంబాజి వారి ఇంటి సభ్యుడేయని నమ్మి వెనుదిరిగినాడు.

మిగిలినది వేరొకసారి........
                              ఛత్రపతి సంబాజీ మహారాజ్- 3వ భాగము
ఉపనయనమయినందువల్ల సంస్కృతము, వేదవిద్య నేర్చుకొన్నాడు. ఆ అగ్రహారములో సంబాజి కి కవి కలశ్ తో పరిచయమైనది. ఆ పరిచయము ‘ఇంతింతై వటుడంతయై...’ అన్నట్లు ఆమరణాంతము పందిరికి అల్లుకొన్న తీగె వలె ఉండిపోయింది. సంబాజి 9 భాషలయందు పాండిత్యము సంపాదించి కవనముజేయు సామర్థ్యము కలిగియుండినాడని చరిత్రకారులు చెబుతారు. ఆయన సంస్కృతములో తన తండ్రిని గూర్చి ‘బుధా చరిత్ర’ అన్న గ్రంధమునే గాకుండా ‘శృంగారిక’ అన్న కావ్యమును కూడా వ్రాసినాడు. అదే విధముగా తన మాతృభాష మరాఠీ లోకూడా గ్రంధములను వ్రాసినాడు. అందుకే నేను ఆయనను గూర్చి చెబుతూ ఆయనకు శస్త్ర విద్యయేగాక శాస్త్రవిద్య కూడా కరతలామలకమని చెప్పినాను.
27 ఏళ్ళపాటు యుద్ధములలో గడిపి హిందూ రాజులకు ఆదర్శముగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యమును  నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 31680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించినాడు. అప్పటికి సంబాజికి 23 సంవత్సరముల వయసు. పట్టాభిషిక్తుడయిన వెంటనేతండ్రి పోయినాడని ఉదాసీనుడై ఉండిపోకఔరంగాబాదు పై దండెత్తినాడు. ఔరంగా జేబు సంపద ఎక్కువగా అందు దాచబడి ఉండినది. తన తక్కువ బలగాముతోఎక్కువ బుద్ధిబలముతో ఆ దండయాత్ర చేసినాడు. రాజ్యము నిలుపుకొనుటకు సంపదయే కదా ముఖ్యము. అది తెలిసిన ఔరంగజేబు తనకు ముఖ్యుడగు హుసేన్ అలీ ఖాన్ అను పేరుగల సేనాపతికి 20 వెల ఏనుగులు అంతకు మించిన గుర్రములుదానికన్నా ఎక్కువగా కాల్బలమునిచ్చి 2 దినములలో సంబాజిని పట్టి తెమ్మన్నాడు. చిటికే వేసి,అలాగే తెస్తానన్నాడు హుసేన్ అలీ. కానీ యుద్ధము ఒక సంవత్సర కాలము జరిగినా ఫలితము లేకపోయినది. హుసేన్ అలీ వెనుదిరిగినాడు. సంబాజి సంవత్సరముల కాలములో 12౦ యుద్ధములు చేసి ఒక్కటి కూడా ఓడిపోలేదని మరాఠా దేశములో చెప్పుకొంటారు. సంబాజి ప్రాణ సమానుడగు కవి కళశ్ ను తన ప్రధానమంత్రిగా చేసుకొన్నాడు. అతను మరాఠా కానందువల్ల తక్కిన మంత్రులు అసంతృప్తులయి వుండినారు. కుటిలుడయిన ఔరంగజేబు దన రాజ్యమును విస్తరించదలచి గోవా లోని పోర్చుగీసు వారితో ఒప్పందమునొకదానిని కుదుర్చుకొని తన నావలను దక్షిణమునకు మరలించి దానిని సంపూర్ణముగా వశము చేసుకోనవలేననుకొన్నాడు కానీ కుశాగ్రబుద్ధియైన సంబాజి అది తెలుసుకొని వారిని  జయించి ఔరంగజేబుకు అవకాశము లేకుండా చేసినాడు. 9 సంవత్సరములు, సంబాజి తిరుగలికి క్రింది రాయిగా తానుంటూ ఔరంగజేబును పైరాయిని త్రిప్పినట్లు త్రిప్పినాడు.
8లక్షల సైన్యము తో దక్కను ప్రాంతమునకు యుద్ధమునకు వచ్చిన ఔరంగజేబును అతి తక్కువ అనగా ఇంచుమించు  20 వేల  సైన్యముతో అమేయ బుద్ధిబలమును జోడించి ప్రతిఘటించి ఎన్నో యుద్ధములు గెలిచిన మహావీరుడు ఆయన. మరాఠాలో యుద్ధము జరుగుతూవుంటే ఉత్తరాభారతమునకు తనవేగులను పంపి అక్కడి రాజులను స్వతంత్రింపజేసిన అపర చాణక్యుడు. ప్రత్యేక విభాగమును ఏర్పరచి బలవంతముగా ఇస్లామును జేరిన వారిని తితిగి హిందువులుగా మార్చిన ఘనుడాయన. ఈ పని తన తండ్రి ప్రారంభించినా తాను చక్కటి పథకముతో ఆ కార్యమును నిర్వహించినాడు.

ఆయన తెలివితేటలకు ఇప్పుడు నేను చెప్పబోవు ఉదంతము ఒక గీటురాయి. 
అది తదుపరి భాగములో.....
     ఛత్రపతి సంబాజీ మహారాజ్- చివరి భాగము
ఆయన తన రాజ్యములోని ప్రముఖులయిన వడ్రంగులను, సాలె\దర్జీ వారిని సంఘటితము చేసి రబ్బరు కొయ్య, రబ్బరు పాలనుండి వస్త్రము తయారుచేయించినాడు. రబ్బరు వస్త్రము చాలా నెమ్మదిగా కాలుతుంది. కొయ్యతో బాణములు తయారు చేయించి. దానికి ఈ రబ్బరు గుడ్డను చుట్టించినాడు. బాణము ములికికి నూనెలో అద్ది విస్పోటక రసాయనమును అందులో ఉంచిన బట్టనుచుట్టి విల్లుకు సంధించి వదలితే అది కోటగోడలకు తగిలి విధ్వసమును కలిగించి శత్రువులకు ఊపిరి సలుపనీకుండా చేసేది. ఈ విధముగా సంబాజి ఎంతో చురుకైన బుద్ధితో వ్యవహరించేవాడు శత్రువులతో!
1689 వరకు మొఘలులతో జరిగిన ప్రతి యుద్ధములోనూ సంబాజి గెలిచినాడుకానీ తన ఆస్థానములోని చిక్కాదేవ్ రాయ్ అను ఒక సామంతుడు మొదటినుండి కూడా కవి కలశ్ ను ప్రధానిగా చేయుట అరిగించుకోలేక యుండినాడు. దానికి తోడు సంబాజి అతని మాటకు విలువనిచ్చేవాడుకాడు, కారణము అది మరాఠాల ఉద్యమమునకు వ్యతిరేకమై ఉండటమే! అదిగాక తన భార్య యొక్క ఇరువురు సోదరులు అధికార మదముతో వ్యవహరించినందుకు వారికి మాసిక వెతనమును నిలిపినాడు సంబాజి. వారి అనుయాయి గనోజీ శిల్కే  తో, సంబాజి మరియు కవికలశ్ సంగామేశార్కు పోతున్నారని వారిని గూర్చిన రహస్య సమాచారమును ఔరంగజేబు సేనానాయకునికి అందజేసినారు. ‘ఇంటిలోనివాడు పెట్టిన కంటిలో పుల్ల’ తో  సంబాజి మరియు కవి కలశ్ లు  బంధింపబడినారు.
సంబాజి కవి కలశ్ ల  సహవాసమునకు చక్కగా సరిపోవు నీతి శాస్త్ర నిర్వచనము చూడండి.
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే రాష్ట్రవిప్లవే |
రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠతి స బాంధవః ||
అది ఉత్సవమే కానీవ్యసనమే కానీదేశములో ఏర్ర్పడిన విప్లవమే కానీఅది ర్సాజసత్కారమేకానీస్మశానమే కానీ కలిసి వచ్చువాడే స్నేహితుడు అన్న మాటకు కట్టుబడిన మహనీయుడు కవి కలశ్. సంబాజి తో తానూ బందీ అయినాడు ఔరంగజేబుకు.
వారిరువురినీ ఒంటెలకు కట్టించి భయపెట్టి పౌరులచే వారి పై మలమూత్ర విసర్జన చేయించిన నీచుడు ఔరంగజేబు. చేతనయితే కట్లు విప్పి కలబడమి, లేకుంటే బందీగానే తల నరికి వేయమని గర్జించినాడు సంబాజి. ఈ సందర్భమున నాకు జ్ఞాపకము వచ్చుచున్న భర్తృహరి సుభాషితము యొక్క ఏనుగు లక్ష్మణ కవి తెనుగు సేత మీముందుంచుట భావ్యమని భావించి ఈ దిగువ తెలుపుచున్నాను. పరిస్థితుల ప్రభావము వల్లనే కానీ గాక ‘సింహము ఎన్ని కష్టనష్టాలు కల్గినా ఏనుగు కుంభస్థలముపైకెగిరి  దాని యొక్క మదముతో నిండిన మెదడు తినవలెనని మాత్రమే తలచుతుంది’ అన్నది ఈ పద్య సారము.
గ్రాసము లేక స్రుక్కిన జరాకృశమైన విశీర్ణమైన నా
యాసము నైన నష్టరుచి యైనను బ్రాణభయార్తమైన ని
స్త్రాస మదేభ కుంభ పిశిత గ్రహ లాలస కీలసాగ్ర హా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే?
సంబాజి, కవి కలశ్ విషయములో కూడా అదే జరిగింది. చిత్ర హింసలకు గురియైనాడు కానీ వానితో సంధికి ఒప్పుకొనలేదు. వాడు కోరిన మూడుకోరికలూ నిర్ద్వంద్వముగా నిర్లక్ష్యముగా త్రుణీకరించినాడు. ఆమూడు కోరికలూ 1. తాను ఓడినట్లు ఒప్పుకోవటం 2. తమ కోటలనుండి కొల్లగొట్టిన సంపద తిరిగీ ఇవ్వడము,  3. మిత్రులిరువురూ ఇస్లాం స్వీకరించటం.
ప్రాణంవాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతుl
 అనిత్యో భవతి ప్రాణో మానమా చంద్ర తారకమ్ll అన్న భారత జాతీయ సంప్రదాయానికి కట్టుబడి ప్రాణములను సమర్పించుకొన్న మహనీయులు వారు.
ఆ మరణము ఎవరూ తమ పగవారికి కూడా కోరుకొనరు. ఆ దుష్టుడు వారి తోలు ఒలిపించి ఉప్పుకారము చల్లిమ్పజేసినాడు. గోర్లు మొదలంటా తీసివేయిన్చినాడు. వెంట్రుకలు ఒక్కొక్కటి పీకించినాడు. కళ్ళు పొడిపించినాడు. చివరకు వ్రేళ్ళు చేతులు ఖండింపజేసినాడు. ఇంతజరుగుతూవున్నా పంచాక్షరీ జపము మానలేదు వారిరువురూ! చివరకు విసిగి వేసారి చిరుతపులి గొర్లను తెప్పించి వానితో వారిని చీల్చి , గొడ్డలి తో సంబాజీ తల నరికించి పూణే వద్ద ప్రవహించే భీమానది ఒడ్డున విసరివేయించినాడు.
అసలు ఔరంగజేబు ఎంతటి దుర్మార్గుడంటే తన తండ్రికే  అంటే షాజహానుకు పెద్ద భార్య ద్వారా పుట్టిన దారా షికోవ్ తల నరికి, అప్పటికే కారాగారములో వున్న తండ్రి
అన్నము తినబోయే సమయములో తండ్రి పుట్టిన రోజు కానుకగా పంపినాడట. ఇప్పటికయినా నా కుమారునికి నాపై ప్రేమ కలిగినది అని భ్రమించి ఆ పెట్టె తెరచి తలనుచూసి తలక్రిందులై మూర్చపోయినాడట షాజహాన్.
అట్టి దురాత్ముని ప్రతిఘటించి ప్రాణము కోల్పోయిన మహనీయుడు సంబాజిని గూర్చి ఎంతమందికి తెలుసు. ఎంతమంది తమతమ తరగతులలో పాఠ్యాంశములుగా చదివినారు. అసలు ఇపుడు నేను వ్రాసి మీముందుంచినది  ఎంతమంది చదువుతారు. చరిత్ర అన్నది మన భవితకు కరదీపిక. చరిత్ర పాలవంటిది, దానిని పెరుగుచేసి మధించితే వచ్చేవెన్న మన భవిష్యత్తుకు నేతిని అందిస్తుంది. మరి నేయి కావలెనంటే పాలు వుండవలసినదే!

స్వస్తి.



Tuesday, 23 October 2018

పాశ్చాత్య ప్రముఖులు బైబిల్ ను గూర్చి చెప్పిన మాటలు వారి భాషలోనే


పాశ్చాత్య ప్రముఖులు బైబిల్ ను గూర్చి 
చెప్పిన మాటలు వారి భాషలోనే
ఎంచి చూడుమా యోచించి చూడుమా!
చదివి యోచించండి యోచించుతూ చదవండి.
కనులపండువౌ వనమున కలుపుమొక్కలేల
ఏరివేయ నీ వనమొక సుధాసుఫలశాల
విషయ మెరుగుటకును వివరమ్ము కొరకును
విలువ గల్గు సకల విషయములకు
విధిగ తెలియవలయు వేదసారమ్మును
వివిధ శాస్త్రజ్ఞాన వివరమెరిగి

లంకె : https://cherukuramamohan.blogspot.com/2018/10/blog-post.html
నాధర్మముపై అభిమానము తప్పించితే నాకు పరమత ద్వేషము లేదు. కానీ ఎవరయినా మన ధర్మము యొక్క మర్యాదపై దాడి చేయ ప్రయత్నించినపుడు వారి వాదనను త్రిప్పికొట్టగల సామర్థ్యము యువతలో కలుగవలెనంటే అందుకుతగిన జ్ఞానమును సముపార్జన చేసుకొనుట ఎంతో అవసరము. హీన భాషణములు సంస్కారవంతులకు శోభను చేకూర్చవు. అందుకే ముఖ్యముగా యువత, మరియు వారికి చెప్పగలిగిన పెద్దలను ఇటువంటి విషయములను చదివి తెలుసుకొనగలిగితే ఈ సనాతన సమాజమును సంఘటిత పరచుటకు తగిన సుముదీర్ణత (ప్రయోజకత్వము, గొప్పదనము) కలిగియుంటారు. ఒకవేళ ముందే తెలిసియుంటే తగిన విధముగా తగిన సమయములో చెప్పా ప్రయత్నించేది. ప్రయత్నమూ లాభానష్టములకు అతీతము.(Trail costs nothing). మామిడి తోటకయినా కలుపుమొక్కలు ఎరిపారవేయవలసినదే!
బైబిల్ ను గురించి పాశ్చాత్యులలో పేరెన్నిక గన్న వాళ్ళు బైబిలును గూర్చి ఏమన్నారో వారి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను
Thomas Jefferson, the third President of America, admits candidly:
It is between fifty and sixty years since I read the Apocalypse (Revelation), and I then considered it merely the ravings of a manac.—76
 Thomas Jefferson

Joseph Lewis, President of Free Thinkers of America and editor of The Age of Reason, states:
The Bible is not a divine revelation from God. It is not inspired; on the contrary, it is a wicked book.... It has been responsible for more suffering and torture than any other volume ever printed--77
- Joseph Lewis

Ms Matilda Joslyn Gage, an American writer, states
Boiling heretics and malefactors alive, commonly in oil but occasionally in water, was practiced throughout Europe until a comparatively late period.--78
- Matilda Joslyn Gage

అసలు 'బైబిలు ' అంటేనే పుస్తకముల దొంతర అని అర్థము. గ్రీకు భాష లో 5680 కి పై చిలుకు బైబిళ్ళు ఉన్నాయని అంచనా .సిరియచ్ లాటిన్ కోప్టిక్ ఆర్మనిక్ భాషలలో 19,000 వునాయని అంచనా. ఇవి కాక ఆంగ్లములో 24,000 ప్రతులున్నాయని అంచనా . ముఖ్యమైన విషయమేమిటంటే ఇవియేవీ ఒకే పుస్తకము యొక్క ప్రతులు కావు. వేరు వేరు పుస్తకములు. జార్జ్ బెర్నార్డ్ షా , పైని మొదలగు పాశ్చాత్య విజ్ఞులు ఈ గ్రంధమును ఎంతో విమర్శించినారు. వీటన్నిటిలో కూడా ఎన్నోప్రక్షిప్తాలు ,అనుకరణలు, అనుసరణలు వున్నాయి.
4-24(Deuteronomy) God himself proclaims like this ' For the lord your God is consuming fire, a jealous God'
ప్రపంచములో, According to the World Christian Encyclopedia (year 2000 version), global Christianity had 33,820 denominations with 3,445,000 congregations/churches composed of 1,888 million affiliated Christians, వున్నాయి . వీరు ఒకరి చర్చి కి ఒకరు పోరు . హిందుత్వములో కులాల ప్రస్తాపన వచ్చినపుడు అనేకులు అగ్గిమీద గుగ్గిలమౌతారు. కానీ ఆనాడు ఆవిధమగు వర్గీకరణ చేసి మన సమాజమునకు ఎంత మేలు చేసినారు అన్నది గమనించరు. కులము అన్న మాట వస్తే మాత్రం అదేదో ఘోరమైన నేరము చేసినట్లు ఏమీ తెలుసుకోనకుండానే అంతా ఒకటైపోతారు. దాని వెనుక వుండే సదుద్దేశ్యమును గమనించరు. మెకాలే కుటిలత్వమునకు మనము వధ్యశాలలోని మేకలమైనాము అన్నది గ్రహించగలిగితే మనకు అంతా మంచే జరుగుతుంది.
అందుకే విషయవలయములలగు అట్టివారి వారి విషయాలలోనికి పోవుట కంటే మన సనాతన ధర్మమూ పైన మహనీయులు (వారిలో పాశ్చాత్యులు కూడా వున్నారు ) వ్రాసిన పుస్తకాలు యువత చదువనారంభించితే ఈ ధర్మము విశ్వ మానవ శ్రేయస్సుకు ఎంతో ఉపయోగ పడుతుంది.
अयं बन्धुरयं नेति गणना लघुचेतसाम् | उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||”
Aya bandhuraya nēti gaanā laghucētasām | udāracaritānām tu vasudhaiva kuumbakam ||
Discrimination saying "this one is a relative; this other one is a stranger" is for the mean-minded. For those who're magnanimous, the entire world constitutes but one family.
తత్సత్