Thursday 8 June 2023

మనలోనే మనకు వైరమా

 మనలోనే మనకు వైరమా 

https://cherukuramamohan.blogspot.com/2023/06/blog-post.html

ఈ దిగువ ఒక పాఠకుడు 

శంకరాచార్య నిందన చేసే వాళ్లని ఇలా స్మార్త గ్రూపులలో పాడి పొగడడం తరమా. శంకరుల తల్లి దుర్వ్యవహారం వల్ల శంకరుల పుట్టారని మాధవులు నిందతో ఉంటారు. అటువంటి మాధవులని ఆరాధించడమే కాక ఇల్లా స్మార్త గ్రూపులలో ప్రచారం చేయడం ఎప్పుటికీ సరికాదు. మీ నమ్మకాలు మీ వైయక్తికం.

శంకరులు సన్యసించి కూడా తన తల్లి అవసానదశలో ఉన్నాడని దివ్యదృష్టితో గ్రహించి తల్లివద్దకు చేరుకొని ఆమెను మరణానంతరము, ఆమె కోరిన విధముగా వైకుంఠమునకు పంపుతాడు. తల్లిని గూర్చి విలపించుతూ 'మాత్రు పంచకము' ఆశువుగా చెబుతాడు, శంకరులు వారి తలిదండ్రుల తపోదీక్ష వల్ల కలిగిన కుమారుడు. ఈ విషయమును, శంకరుల వారికాలములో ఉండి 'శంకర విజయము' వ్రాసిన చిత్సుఖాచార్యుల రచన ద్వారా తెలుసుకొనవచ్చును. 

సైద్దాంతికముగా వాదాడ నేర్వనివారు ఏనుగుపై దుమ్ము జల్ల ప్రయత్నించిన వారే ఔతారు. 

ఈ నీతిశాస్త్రోక్తిని గమనించండి.

సత్యం భ్రూయాత్ ప్రియం బ్రూయాత్ 

న  భ్రూయాత్ సత్యమప్రియం

ప్రియం చ నానృతం  భ్రూయాత్ 

ఏషా ధర్మ స్సనాతన: ||

మానవ జీవితంలో మాటకు (వాక్కుకు) ఉన్న మహిమ మహత్తరమైనది.. సత్యమునే పలుకవలెను అని మనందరం అనుకుంటాం.. అయితే, కొన్ని సందర్భాలలో సత్యం మాట్లాడకూడదని కూడా తెలుసుకోవాలి. అవి ఏమిటో ఈ శ్లోకంలో వివరించినారు. 

ఎల్లప్పుడూ సత్యమే పలకాలి.ప్రియమైన మాటలనే పలకాలి. అయితే, ఎదుటివారిని బాధపెట్టే మాటలు ఎంత సత్యమైనప్పటికీ వాటిని పలుకరాదు. అలా అని, ప్రియం చేకూర్చే మాట అనుకుంటూ అబద్ధం కూడా చెప్పకూడదు. ధర్మము చాలా సూక్ష్మమైనది.దానినెరిగి ప్రవర్తించవలెను.


వైష్ణవులు మాధ్వులు అందరూ సనాతన ధార్మికులే! ఒకే చెట్టుకు అనేక శాఖలు ఉంటాయి. మనము ఫలానా శాఖ పళ్ళను మాత్రమే తినము. అన్నమయ్య వైష్ణవుడు. అందరూ ఆరాధించుచున్నారు. ఆళ్వారులు ఆండాళ్ తో సహా అంతావైష్ణవులు. ఇప్పుడు స్మార్తులలో తిరుప్పావై చదువుతూ ఆండాళ్ నోములు నోమేవారెందరో!

ఇక ద్వైతము. ఆత్మ వేరు పరమాత్మ వేరు అని ప్రతిపాదించుటచే ఈ ఆత్మికజీవి పరమాత్ముని చేరుటకు పరితపించుతాడు. అంతే కానీ అన్యథా కాదు. ఉడిపి మంత్రాలయములకు వెళ్ళే వారిలో అద్వైతులే ఎక్కువ. నేను అద్వైతిని. శంకరులవారి సిద్ధాంతములు నాకు శిరౌదార్యములు. కానీ చావుబ్రతుకుల మధ్యనున్న నా శ్రీమతిని రక్షినది ఎ మందులూ వైద్యులూ కాదు. ర్మంత్రాలయ రాఘవెంద్రుడే! ఆయన అద్వైతులను గానీ శంకరుల వారినిగానీ తూలనాదినట్లు నేను చదువలేదు.

ఇక శంకరుల వారిని గూర్చి చేప్పుటకు నా శక్తి చాలదు. వారి గొప్పదనమంతా ఈ  క్రింది శ్లోకము లోనే ఉన్నది.ఆయనను 'అపర  శంకరులు' అని శ్లోకములోనే చెప్పబడినది. .

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం.

సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః॥

శంకరం శంకరాచార్యమ్ కేశవం బాదరాయణం

సూత్రభష్యకృతౌ వన్దే భగవంతౌ పునః పునః.

సూత్రం మరియు భాష యొక్క రచయితలు అయిన శ్రీ శంకరాచార్య రూపంలో ఉన్న శివునికి మరియు వేదవ్యాస (బాదరాయణ) రూపంలో ఉన్న విష్ణువుకు మళ్లీ మళ్లీ నమస్కారాలు.ఇక్కడ శంకరులవారిని అపర శంకరులుగా చెప్పుట జరిగినది.


అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్l

షోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రిమ్శే మునిరత్యగాత్ll

అని ఆ అపర శంకరులను గూర్చి తెలుపుతూ ఉంది. మనము అద్వైతులము స్మృతులను విశ్వసించుతాము కాబట్టి స్మార్తులమైనాము. విశిష్టాద్వైతులు, మాధవులు కూడా స్మృతులను నమ్ముతారు. ఆ విధముగా వారు కూడా స్మార్తులే కదా! వేదాలను నమ్ముతారు కావున వారుకూడా వైదికులైనారు కదా! 

అంతే కాక ఆదిశంకరులను' అపర శంకరులు అన్నారు, 'జగద్గురువు అన్నారు. మిగత మతాచార్యులను 'అపర విష్ణువు' 'అపర ఆంజనేయుడు' అనలేదు.

ఇక ఉపసంహారానికి వద్దాము. నేను మీకు పైన తెలిపిన ఉదాహరణ ప్రకారము మన మూలము ఒకటే! 12వ శతాబ్దానికి చెందినా రామానుజులవారు 120 సంవత్సరములు జీవించినట్లు చెబుతారు కానీ ఆయన మొత్తము దేశమును తిరిగినట్లు తెలిసిరాదు. క్రీస్తు పూర్వము 4 శతాబ్దికి చెందిన శంకరాచార్యులవలె, 14వ శతాబ్దమునకు చెందిన మధ్వాచార్యులవారు  నాటి భారతదేశమును 32 సంవత్సరముల వయసులోపే చుట్టిన దాఖలలు లేవు.  మధ్వాచార్యులవారు దక్షిణాది మాత్రమే తిరిగినారు.


విషయమును వివరముగా చెప్పవలసిన బాధ్యత మనదే!

ఓరుపు నేరుపు కలసిన

మారుపు  తేగలుగవచ్చు మంచి మనసుతో

పరిమర్ష గల్గువానికి  (పరిమర్ష = కోపము)

పరిణామము తెలియరాదు పరహిత రామా!


ద్వేషము స్వస్థత చెరచును 

ద్వేషము వైరమ్ము పెంచు తీరుగ తలవన్

ద్వేషము మిత్రుల బాపును 

ద్వేషము కెల్లపుడు నీవు ద్వేషిగా మనుమా!


ఈ దిగువన ఒక అద్వైతి ఆవేదన గమనించండి.


ద్వైతుల గురువు రాఘవేంద్రుల వారు రచించిన, (లేక ప్రక్షిప్తములేమో. ఇది నామాట) ఈ బాలుడు పారాయణం చేస్తున్న శ్లోకాలను ఒప్పుకుంటారా తెలుసుకోండి.???

ఒప్పుకుంటే ఆ అంత నిందను వారు చేసినట్టే

ఇది వారి పరంపరలో వచ్చిన గ్రంథం ఇప్పుడు మంత్రాలయ పాఠశాలలో పాఠం చేస్తారు

దీన్ని సూక్ష్మంగా గమనిస్తే రాఘవేంద్రుల వారు స్మార్తులకి గురు ఎలా కారని స్పష్టపడుతుంది మరియు ఈ అంతా నింద తప్పనియు చేయొద్దనియు వారు ఎక్కడా చెప్పి లేదు కాదా వారే పారాయణం చేసి ప్రోత్సహించారు అంటే వారి ఆంతర్యం గ్రహించండి సంస్కృత శుభాషితాలు కొన్ని రాశారు కాబట్టి మీకు సంస్కృతం తెలుస్తుందని ఊహిస్తున్న అయినా కానీ దాని అనువాద కింద ఉన్నది

కిందటి విడియోలో చూడండి పారాయణం

అదేమిటో తెలుసా సుమధ్వ విజయం గ్రంథంలో 1సర్గలో

49 to 55 శ్లోకాల్లో వున్నా విషయం

ఆ బాలుడు చేస్తున్న నిందకు అర్థం శ్లోకాలకు

కాలడి అనే బ్రాహ్మణ అగ్రహారం మణిమంత రాక్షసుడు సంకరడుగా పుట్టినాడు వాణిది సాంకర్య (వ్యభిచార) జన్మ

అంతా ఒక్కటే అన్నాడు

ఎవరు తన మాట వినరేమో అని

దుర్బుద్ధి తో అందరు ఏ ఆశ్రమం వారి మాట వింటారో అలాంటి సన్యాస ఆశ్రమాన్ని మోసం గా తీసుకున్నాడు

తనది కాని దాన్ని తనది చేప్పే వాడు దోంగ

విడు తనది కాని బ్రహ్మని తాను అన్న మహాతస్కర (పెద్ద దోంగ)

పరమపవిత్ర మైన బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాచాడు అది ఎలా ఉందంటే

పురోడాశ అన్నాని యజ్ఞానికి మడి గా చేస్తే

మలం తింటున్న కుక్క వచ్చి తింటే ఎలాగుంటుందో అలా

దోంగ పిల్లి ఎలా హవిర్శేశాన్ని తింటున్న దో అలా

దేవుడి పూజకి మంచి పూల మాల ఉంటే దాన్ని ఒక కోతి పీకేస్తోంటే ఎలాగుంటుందో అలా

పద్మ సరోవరానికి మదగజం వచ్చి తొక్కి నాశనం చేస్తే ఎలాగుంటుందో అలా

జగన్మిథ్య అంటూ జనులను వంచన చేస్తుండేవారు

అని చప్పుతున్నాడు

ఇక్కడ ఆలోచించాలి కాలడి పుట్టిన వారెవరు ?

సన్యాసం తీసుకున్నది ఎవరు ?

మలం తింటున్న కుక్క, దోంగ పిల్లి, మదగజం, కోతి మహాతస్కర (పెద్ద దోంగ) అని ఎవర్ని నిందిస్తున్నారు ?

ఇలా బాలపాఠంలో నే శంకర నిందను స్మార్త ద్వేషాన్ని నూరిపోసుతున్నారు గా

ఎవరు మారాలి ?

ఇవన్నీ భయంకర నింద తెలిసిన కూడా బ్రాహ్మణ ఐక్యతా అంతా ఒకటే అని ఊరికే అందామా ???


ఒక్కరు తిడుతూ ఉంటాను అదే సత్యం అదే మా పరంపరలో వచ్చినది, మీరు ఒప్పుకోకున్నా, ఇదే మాకు శాస్త్రియత అని

నిందను చేస్తున్నారు, అప్పుడు ఐకమత్యము సాధ్యమేలా వీలౌతుంది.



Cheruku Ramamohanrao, ayyaa meeku S Pavan Sharma choopettina aadhaaraalu ishtamayyaayi anukuntaanu.. Mana gurluvulaina shankaruluvaarini nindinchina vaaru manaku sarvatha poojyulu kaaru. 


Cheruku Ramamohanrao

Author

Top contributor

మీకు అటు అద్వైతము మీద ఇటు శంకరుల వారిమీద ఉన్న భక్తి గౌరవాలకు  అనేకానేక నీరాజనాలు. 

ఒకటి కావాలని త్రిమతాల వారికందరకూ కలిగితే ఐకమత్యము సాధ్యమౌతుంది.

అలా కావాలంటే పరస్పర గురువులను ఆచార సంప్రదాయాలను గౌరవించాలి అప్పుడు ఐక్యత సాధ్యమౌతుంది.


S Pavan Sharma garu, ఈ విధముగా కొందరు స్మార్తులు మాధ్వులను కూడా నింద చేసినారు.ద్వేషానికి ద్వేషము సమాధానము కాలేదు. శంకరులవారిని అభిశంశించినవారు, వారికాలములో ఎందరో. ముఖ్యముగా జైన బౌద్ధ కర్మిష్లులు ఉండినారు. వారినందరినీ తన వాదనా ప్రతిభతో ఓడించినారు.

‘బ్రహ్మావతార స్వరూపుడు’గా భావించే మండనమిశ్రుడిని వాదనలో జయించిన పిమ్మట, వారిని శిష్యులుగా చేర్చుకొని సన్యాసాశ్రమం ఇవ్వగా, ఆయనే ‘సురేశ్వరాచార్యులు’గా ప్రసిద్ధి చెందినారు. వారి ధర్మపత్ని ఉభయభారతీ మాతను శారదాదేవి స్వరూపిణిగా గుర్తెరింగి తాను స్థాపించబోయే పీఠాలకు ‘అధిష్ఠాన దేవత’గా ఉండమని శంకరులు కోరగా, ఆ జగన్మాత దానికి అంగీకరించింది. ఇక్కడ ఎక్కడా ఆమహనీయుడు ద్వేషణకు తావివ్వలేదు. మండన మిశ్రులవారి ప్రథమ గురువగు గౌడపాదులవారు వేషము మార్చి బౌద్దునిగా వారి ఆరామము చేరి వారితో వాదించగా, వారు సహించలేక పై అంతస్తునుంది తోస్తే వారు 'వేదాలు నిజమైతే నేను క్షేమముగా క్రిందికి చేరుతాను' అని ఊరుకోన్నాడేగానీ తన శిష్యగణముతో పోయి ఎదిరించలేదు. అంతే కాదు క్షణికావేశమునకు గురియైనందుకు తన తనువునే తుషాగ్నికి ఆహుతి చేసుకొన్నాడు కానీ పరమతస్తులను ద్వేషించలేదు.అట్టిమహనీయులు మనకు ఆదర్శము. అద్వైతము అఖండమౌ అగ్ని. ద్వేషించే వారంతా శలభములే!

ఇంకా మీరు ద్వేషమునకే ప్రాధాన్యత ఇస్తే వయసు కారణముగా, నేను సమాదానములనిస్తూ పోలేను. మన్నించేది.


ఇది ఆస్యగ్రంధిలో నాకు పైవారితో జరిగిన సంవాదము. ఐక్య రాష్ట్ర కూటమి (United States) లోని ఒక రాష్ట్రములో ప్రాథమిక విద్యా శాలలలో బైబిలు , అశ్లీలత, హింస ఉన్న కారణముగా నిషేధింపబడినది, ఈ దిగువ BBC ప్రసారము చేసిన వార్తను మీ ముందుంచుచున్నాను. Washington: A school district in the US state of Utah has banned the Holy Bible in primary schools for “vulgarity and violence”, the media reported on Saturday.


The decision was taken this week by the Davis School District, located north of the state capital Salt Lake City, the BBC reported.

ఇక అటువంటి ఉదంతములు ఖురాను లోనయితే చెప్పనవసరమే లేదు. దురదృష్టకరమైన విషయమేమిటంటే ముస్లీములు ఆ విషయములను పిల్లలకు బోధించి మతఛాందసులుగా మార్చుట మానరు. ఈ రెండు మతాలవారూ సామ దాన భేద దండోపాయాలతో మన మతము నుండి మాట మార్పిడులను ప్రోత్సహించే వారే!

అందుచేత నేను చేపావచేదేమిటంటే 

మనలో మనం 

కలసి ఉంటె కలదు సుఖం

కాదంటే కలుగును దుఃఖం

చేయి చేయి జత కలిసిన 

చేయలేనిదేమున్నది

చెరుపు జేయ తలపోసిన

చెడుమతాల చీడ వదల

చెంగట చెడు చేరనీక

చేవ జూపి సాగుదాం


స్వస్తి.



No comments:

Post a Comment