Wednesday 26 July 2023

మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

 మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము

https://cherukuramamohan.blogspot.com/2023/07/httpscherukuramamohan_26.html

ఈ వ్యాసమును నాలుగు భాహాగాములుగా విభజించినాను.  ఒక్కొక్క భాగము ఇంచుమించుగా ఒక్కొక్క విషయాన్ని తెలుపుతుంది. వరుసగా మనాలుగు రోజులు ప్రకటించి 10వ తేదీకి ముగిస్తాను. ఈ శ్రమ అంతా మన యువత మన గతమును అర్థము చేసుకొనుటకే! తప్పక క్రమము తప్పక చదివేది.

America అన్న పేరు ‘అమెరికా’కు ఎట్లు వచ్చింది అంటే:

Amerigo Vespucci (/vɛˈspuːtʃi/; [1] Italian: [ameˈriːɡo veˈsputtʃi]; March 9,

1454 – February 221512) was an Italian explorer, financier, navigator, and cartographer from the Republic of Florence. Sailing for Portugal around 1501–1502, Vespucci demonstrated that Brazil and the West Indies were not Asia's eastern outskirts (as initially conjectured from Columbus' voyages) but a separate continent described as the "New World". (Courtesy Google)

పైనమనము నెత్తిన పెట్టుకొని ఊరేగే అమెరికాకు ఆపేరెట్లు వచ్చిందో తెలుసుకొన్నాము.

దీనినిబట్టి మనకు ఏమి తెలుస్తుందంటే ఒక దేశమునకు పేరును ఏర్పరచుకొనుటకు

అత్యంత ప్రముఖమగు ఉదంతమునకు చిరస్మరణీయతను ఆపాదించుతూ,

అర్థవంతముగా ఆపేరు పెట్టుకొంటున్నారు. ఆవిధముగానే ప్రతిదేశమూ

తమ సంస్కృతిని చాటునటువంటి ఒక పేరునుఆ పేరును ప్రతిబింబంపజేసే

జాతీయగీతమును వారు ఏర్పరచుకొంటారు. మరి భారత దేశమన్న అర్థవంతమైన పేరు

మనదేశామునకుండగా,దేశ మాతను అచంచలమైన భక్తితో ప్రార్థించే 'వందేమాతరం'

గీతముండగా నిర్దుష్టముగా వానిని మనవి  అని అవి మాత్రమె ఎందుకు

ఉపయోగించము అని నా మనవి.

 మనము రోజూ వాడే INDIA అన్న పేరుకు అర్థమును గూర్చి ఏనాడైనా

ఆలోచించినామా! మన జాతీయగీతము యొక్క అర్థము పరమార్థమును గూర్చి ఒక్క మారయినా తెలుసుకొనే ప్రయత్నము చేసినామా! లక్షల సంవత్సరముల సంస్కృతి కలిగిన మన దేశమునుమన ఉదాసీనత వల్లఎంతటి నిర్లక్ష్యమునకు గురిచేయుచున్నామోఈనాటికీ బానిసత్వమును ఎంత విడనాడలేకుండా ఉన్నామో పైన తెలియబరచిన లంకె లో ఉన్న వ్యాసమును చదివి తెలుసుకౌని పదిమందికీ పంచేది.

 మనము అధికముగా ఆలపించే  జాతీయ గీతము

 నిమ్మకాయల కొట్టుకెళ్ళి వందే మాతరం(వంద ఏమాత్రం) అంటే ఇంచుమించు  5౦౦

 రూపాయలు  అనే ఈ రోజుల్లో1882 వ సం. తన 'ఆనంద్ మఠ్అన్న నవలలో

 బంకించంద్ చటర్జీ గారు 'ఈ వందేమాతరంగీతాన్ని పొందుపరచినారని 'లాంగ్ లివ్

 ద క్వీన్అన్న బ్రిటీషు వారి బలవంతపు నినాదమునకు వ్యతిరేకముగా నినదించిన ఈ

 సింహ నాదము తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిందని నేటి యువతకు తెలిసే

 అవకాశము తక్కువ. 1896 కోల్కతా కాంగ్రెస్ సమావేశములో రవీంద్ర నాథ ఠాగూర

 గారే ఈ గీతాన్ని స్వయంగా పాడినారు. కానీ ఈ జాతి చేసుకొన్న దురదృష్టము వలన ఈ

 గీతము జాతీయగీతమై కూడా పొందవలసిన గౌరవము పొందలేక పోవుచున్నది.

 ముస్లింలుక్రైస్తవులుఅందరూ దీనికి వ్యతిరేకులే. ఈ గీతమునకు హిందువుల మద్దత్తు

 కూడా అంతంతే అనిపిస్తుంది నాకు. వీరందరికంటే ఎక్కువగా దీనిని వ్యతిరేకించింది

 ఠాకూరు గారే. ఈ విషయం 1937 లో ఆయన సుభాష్ చంద్ర బోస్ కు వ్రాసిన లేఖయే

 సాక్ష్యము .

 In his letter to Subhas Chandra Bose (1937), Tagore wrote: "The core of

 Vande Mataram is a hymn to goddess Durga: this is so plain that there can

 be no debate about it. Of course Bankimchandra does show Durga to be

 inseparably united with Bengal in the end, but no Mussulman [Muslim] can

 be expected patriotically to worship the ten-handed deity as 'Swadesh' [The

 Nation].

మే 102013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ గీతమును పార్లమెంటులో సాటి సభ్యులతో

 కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు విరుద్ధమని బయటకు

 నడచినాడు. అసలు మొట్టమొదట 'వందేమాతరంఆలపించరాదని ఉద్ఘాటించినది

 రవీంద్రులవారే! అందులోనిఆయన చెప్పిన కొన్ని చరణములు తీసివేసిన తరువాత

1896 కలకత్తా కాంగ్రెసు సమావేశములో మొదట పాడిందీ ఆయనే!

 మన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాదు గారు జనవరి 20,1950 న ఈ

 గీతమునకు జనగణమన తో సమాన స్థాయి ప్రకటించినా ,స్వాతంత్ర్య సమరములో

 సర్వదేశ జనాళి తారక మంత్రమైన,ఆ గీతమునకు ఆ స్థాయిని దక్కనివ్వలేక

 పోయినందుకు మనము సిగ్గుపడినా సరిపోతుందా! మనలో చైతన్యమెదీ. మనలో

 ప్రతిఘటన ఏదీ!

 ఇక 'జనగణమననేటి మన జాతీయ గీతిక ఠాకూరు వారిచే 1911సం.లో వ్రాయబడినది.

 ఆ తరువాత 1919 ఫిబ్రవరి 28 న బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - మదనపల్లి (చిత్తూరు

జిల్లా) లో ఆ కాలేజి ప్రిన్సిపాల్ కజిన్స్ గారి అర్ధాంగి గారి,ఆవిడ పాశ్చాత్య సంగీత

విదుషీమణి కావడం వల్ల,  సహకారముతోఠాకూరు వారు ఆలపించుట జరిగిది .

ఆ పాట లోని అధినాయక,భాగ్య విధాత,తవ శుభ నామే జాగేమంగళ దాయక

మొదలగు పదములన్నీ పుమ్ వాచక శబ్దాలు . ఆ గీతములోని మిగత పదములన్నీ

జాతుల ,పర్వతములనదుల పేర్లే. ఇందులోని కవిత్వము పండితులకే ఎరుక. ఠాకూర్

గారు నెహ్రు గారికి అత్యంత ఆప్తులు. జార్జ్ మనదేశానికి విచ్చేయు సందర్భములో

వారు వీరిని అడిగితే అది తన భాగ్యమని తలచి ఆయన ఈ గీతము వ్రాయుట జరిగినది.

ఈ గీతము వంగ భాషలో వ్రాయుటయే కాక దానిని ఆంగ్లములో తర్జుమా చేసి జార్జ్ V

గారికి 1911 డిసెంబర్ 28 న సమర్పించుకొన్నారు. ఎందుకంటే వారికి వంగభాష రాదు

కదా !

 ఆయన చేసిన పనికి విమర్శలు వెల్లువెత్తి  నపుడుఅది దేవుని గూర్చి వ్రాసినదని

తప్పించుకో జూసినాడు. కానీ ఆ గీతము పూర్తిగా చదివినవారికి అర్థమౌతుంది అందు

ఆయన చొప్పించిన అబిప్రాయము.

ఆ గీతములో వున్నవి 5 చరణములు. చివరి చరణము జార్జ్ గారి రాణిని గూర్చి కూడా

వ్రాసినారు. అక్కడేమో బంకించంద్ చటర్జీ గారు చిత్తశుద్ధితో వ్రాసిన దేశ భక్తి గీతాన్ని

తప్పు పడుతూ దుర్గా మాతను ముస్లీము లెట్లు ఆరాధించు తారు  అన్నారు. కానీ ఇక్కడ

రాణి గారిని అందరూ  ఆరాధించండి అని చెబుతూ వున్నారు. వారి మనసుకు ఈ క్రింది

వార్తా పత్రికలు అద్దము పడుతున్నాయని పాఠకులు గ్రహించగలరు .

"The Bengali poet Rabindranath Tagore sang a song composed by him

especially to welcome the Emperor." (Statesman, Dec. 281911)"The

proceedings began with the singing by Rabindranath Tagore of a song

specially composed by him in honor of the Emperor." (Englishman, Dec. 28,

1911) "When the proceedings of the Indian National Congress began on

Wednesday 27th December 1911, a Bengali song in welcome of the

Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was alsoadopted unanimously." (Indian, Dec. 291911)

 ఈ గీతములో ఠాకూరు గారు చేసిన ప్రశంస  కు బదులుగా నెహ్రు గారి ప్రోత్సాహంతో,

కింగ్ జార్జ్ గారు నోబెల్ ప్రైజ్ కమిటీ సభ్యుడైనందువల్ల, స్వతహాగా 'నోబెల్సన్నిహిత మిత్రుడైనందువల్ల ఈ పాటకే నోబెల్ ప్రైజు ప్రకటించితే,

తన ప్రతిష్ఠ వికటించుతుందని తెలిసినవాడైనెహ్రూ గారికి చెప్పగావారి సహాయ

సహకార సౌజన్యములతో ఠాకూరు గారే రచించిన 'గీతాంజలికిగ్రహించడం జరిగింది.

 మన, అధికముగా ఆలపింపబడే జాతీయ గీతము యొక్క పూర్తి పాఠము ఈ దిగువన ఇవ్వబడినది.

 విజ్ఞులగు మీరు ఇందులో దేశమాతను గూర్చిన స్తవము ఎంతవరకూ ఉన్నదో

గమనింతురు గాక! ఇక నాల్గవ చరణము గమనించితే ఠాగూరు మహాశయులు ఎవరిని 

పొగిడే ఉద్దేశ్యముతో వ్రాసినారో పాఠక శ్రేష్ఠులైన మీరు చదివిన తక్షణ అర్థము

చేసుకొనగలరు. మిగిలిన నాలుగు చరణములు శ్రీవారి పొగడ్తే!

జనగణ మన్ అధినాయాక్ జయహే  (పూర్తి పాఠము)

 జనగణమన్ అధినాయాక్ జయహేభారత భాగ్య విధాతా

పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ్ ఉత్కల్ బంగా

వింధ్య హిమాచల్ జమునా గంగా ఉచ్ఛల్ జలధి తరంగా

తవ్ శుభ్ నామే జాగే తవ్ శుభ్ ఆశిష్ మాగేగాహే తవ్ జయ్ గాథా

జన్ గణ్ మంగల్ దాయాక్ జయహేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll1ll

అహరః తవ్ ఆహ్వాన్ ప్రచారిత్ సుని తవ్ ఉదార్ వాణీ

హిందూ బౌద్ధ సిఖ్ఖ్ జైన్ ముసల్మాన్ ఖ్రిస్తానీ

పూరబ్ పశ్చిం ఆసేతవ సింహాసన్ పాసేప్రేంహార్ హయ గాథా

జనగణ ఐక్యవిధాయక్ జయ్ హేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll2ll

పతన్ అభ్యుదయ బంధుర్ పంథా యుగ యుగ దావతి యాత్రీ

తుం చీర్ సారథితవ రథ్ చక్రేముఖరిత్ పథ దిన్ రాత్రీ

దారుణ్ బిప్లవ్ మాజేతవ శంఖధ్వని బాజే సంకట్ దుఃఖ యాత్రా

జనగణ పథ్ పరిచాయాక్ జయహేభారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll3ll

ఘోర్ తిమిర్ ఘన్ నిబిడ్ నిశీథే పీడిత మూర్ఛిత్ దేశే

ఙాగృత్ ఛిల్ తవ్ అవిచల్ మంగల్ నత్ నయనే అనిమేషే

దుస్స్వప్నే ఆతంకే రక్షా కరిలే అంకేస్నేహమయీ తుమీ మాతా

జనగణ్ దుఃఖ త్రాయాక్ జయహే భారత్ భాగ్య విధాతా

జయ్ హే జయ్ హే జయ్ హే జయ్ జయ్ జయ్ జయ్ హే  ll4ll

రాత్ర ప్రభాతిల్ ఉదిల్ రవిచ్ఛవి పూర్వ ఉదయగిరి భాలే

గాహే విహంగం పుణ్య సమీరణ్ నవజీవన్ రస ఢాలే

తవ కరుణారుణ్ రాగే నిద్రిత్ భారత్ జాగే

తవ చరణే నత్ మాథా జయ్ హే జయ్ హే జయ్ హే

జయ్ జయ్ జయ్ జయ్ హే భారత్ భాగ్య విధాతా  ll5ll

"జనగణమన" గీతము కింగ్ జార్జ్ గారిని పొగుడుతూ రాసిందనడానికి గల

ఆధారములను ఒకపరి పరికించుదాము -

మనము జాతీయగీతము అన్నపేరుతో పాడేది ఠాగూరు గారు వ్రాసిన 5 చరణాలలో

మొదటిది మాత్రమే! అన్ని చరణాలు పైన అందజేసినాను.

1. 1911 డిసెంబర్ నెలలో క్ంగ్ జార్జ్ పర్యటన సందర్భంలోనే ఈ గీతాన్ని లిఖించడం

జరిగింది.

2. ఈ గీతములో "అధినాయ"కుడిని కీర్తించడం జరిగింది. 1911 లో బానిసత్వంలో

మగ్గుతున్న భారతదేశపు జనులకు అధినాయకుడు ఆరోజుల్లో బ్రిటీషు చక్రవర్తే!  'సింధ్ '  ఇపుడు పాకిస్తాన్ కు చెందినది. దానిని మన జాతీయ గీతములులో ఎట్లు గ్రహించ వీలగును?

3. "భారత భాగ్య విధాత" అంటే భారతదేశానికి తలరాత రాసేవాడు అని అర్థము.

మరివిధాత అంటే బ్రహ్మబ్రహ్మ అంటే తలరాత రాసేవాడు అనే కదా అర్థము. ఆ

కాలానికి బ్రిటీషు దాస్యంలో మగ్గుతున్న భారతదేశం యొక్క నుదుటిరాతను వ్రాయగలవాడు ఒక్క బ్రిటీషు చక్రవర్తి మాత్రమే. కావున ఐదవ కింగ్ జార్జ్ మాత్రమే ఈ పొగడ్తకు అర్హడు. అంటే ఈ పొగడ్త దేశమునకైతే కాదు అని అర్థమైపోవుచున్నది కదా! దేశమును స్త్రీ తో పోల్చియుంటే 'విధాత్రిఅనియుండవలసినది.

4. రెండవ చరణమును ఒకపరి గమనించుదాము. అందు "పూరబ్ పశ్చిమ్ ఆస - తవ

సింహాసన్ పాసే". అనాటి కాలంలో తూర్పుపశ్చిమ ప్రాంతాలను పాలిస్తున్నది బ్రిటీషు

చక్రవర్తి మాత్రమే. మరి ఈ విశేషణము ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

5. ఈ నాలుగవ చరణములో ‘స్నేహమాయీ తుమీ మాతా’ అన్న సంబోధన వుంది.

పుంలింగ శబ్దాలతో నడుస్తున్న ఈ గీతములో మాతా అని దేశాన్ని అన్నాడు అని

అనుకొనుటకు వీలు కాదుఅన్వయము కుదరదు కాబట్టి.

6. "తవ చరణే నత మాథా...రాజేశ్వర భారత భాగ్య విధాత" అని రాయడం ద్వారా మన

తలలను బ్రిటీషు చక్రవర్తి పాదాలకు తాకించుచున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం

"రాజేశ్వర’ అంటే సార్వభౌముడు అన్న అర్థము చెప్పుకోవచ్చు. రాజులకు రాజు అంటే

మరి అంతే గదా! ఆకాలంలో భారతదేశంలోని రాజులందరూ అతని దయకు దాసులై 

కదా వుండినారు.

7. మొదటి చరణములో ‘పంజాబ్ సింధ్ గుజరాత్...’ అనికదా వున్నది. అసలు సింధ్

పూర్తిగా పాకిస్తాన్ లో ఉంది కదా! మరి మన జాతీయ గీతములో వాడనగునావాడ

తగునా?

8. "గాహే తవ జయ గాథా". 1911 వ సంవత్సరములో దాస్య శృంఖలలో బంధింపబడిన

దేశమాత విజయగాధను ఎలుగెత్తి చాటే అవకాశము లేదుకదా!

పందొమ్మిదవ శతాబ్ద ఆరంభంలో భారతీయులు ఆంగ్లేయుల ప్రభావమునకు ఎక్కువగా

లోనైనారు. ఆంగ్ల ప్రభావమునకు లోనై వారి అలవాట్లను వంట బట్టించుకొన్న

రవీంద్రనాథ ఠాకూర్ గారు,  బ్రిటీషు ఉచ్ఛారణకు అనుగుణంగా తన పేరును

"టాగోర్"గా మార్చుకొన్నాడు. ఇది ఎంత మానసిక దాస్యమో!

మేధావులందరూ ఏకకంఠముతో ఒప్పుకొన్న "వందేమాతరం" గీతం భారత

జాతీయగీతంగా ఎన్నుకోబడదని ఘన స్వాతంత్ర్యయోధుడైన వీర్ సావర్కర్ 1938లోనే

చెప్పినాడు. వాస్తవంలో అదే జరిగింది.

ఈ విషయమును గూర్చి  కొంత చర్చించుకొందాం........     



               మనము అధికముగా ఆలపించే జాతీయ గీతము  2

 పధ్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటీషువారి సహాయముతో సిరాజుద్దౌలాను హతమార్చి

సింహాసనము  చేజిక్కించుకొనిదేశమునే చేజార్చి మనలను బానిసలు గా దిగజార్చిన

మీర్ జాఫర్ నుఅతనిని  చంపించిన మీర్ కాశీమును మట్టి కరిపించి  వశం చేసుకున్న

మొట్టమొదటి ప్రాంతము బ్రిటీషు  పద్ధతులకు ప్రభావితులైన చాలా మంది బెంగాలీ

బాబులు తమ పేర్లను సైతము బ్రిటీషు  వారికనుగుణమగు  రీతికి మార్చుకొన్నారు.

ఆవిధంగా చటోపాధ్యయ చటర్జీగానూముఖోపాధ్యాయ  ముఖర్జీగానూ,

బందోపాధ్యాయ బెనఖుదీరం బోస్చిత్తరంజన్ దాస్సుభాష్ చంద్రబోస్ వంటి

మహానుభావులు దేశమాత ముద్దుబిడ్డలూ లేకపోలేదు. బ్రిటీషువారి ప్రభావానికీ,

ప్రలోభానికీ  గురియైన  వారూ లేకపోలేదు. అసలు రవీంద్రులవారి పూర్వీకులలో నవాబు

వద్ద వజీరు కాదలచి ఇస్లాం లోనికి మారినారు అని కూడా చెప్పుకొంటారు. ఆ

వంశమునకే చెందిన ప్రసిద్ధ హిందీ నటి  మీనాకుమారి తల్లి వైపు వారు కూడా ఆ

వంశీయులే! ఆంగ్లేయులను అనుసరించిన భారతీయులు ‘మద్య సేవనము’ రాజసానికి,

ఠీవికిదర్జాకుదర్పానికీ  అది నిదర్శనంగా భావించ సాగినారు. వారిలో రవీద్రులవారు

కూడా ఒకరు. ఇన్ని కారణములచే రవీంద్రుడు ఈ గీతమును వ్రాయగా వారికి అత్యంత

ఆప్తుడగు నెహ్రూ గారు తమమంత్రి వర్గమును నొప్పించి ఒప్పించి మెప్పించి ఈ

గీతములోని మొదటి చరణమును మన జాతీయగీతముగా చేసియుండవచ్చును.

ఇక  ఒక మారు రవీంద్రులవారు 'వందే మాతరము'ను దుర్గా స్తుతి  అన్నారు కదా

అందుచే ఆ గీతము యొక్క పూర్తి పాఠమును నేను దిగువన ప్రత్యేకముగా

'వందేమాతరంఅన్న శీర్షిక క్రింద ప్రచురించున్నాను. అది దుర్గాస్తుతి కాదు,

మాతృభూమికి సమర్పించిన కృతజ్ఞతా ప్రసూనము మరియు దేశభక్తి ఉద్దీపనము. ఆ

గీతము యొక్క పూర్తి పాఠమును దానికి నా స్వేచ్ఛానువాదమును నిన్న నే మీ

ముందుంచినాను. అందు చేత దానిని ఇపుడు ఉంచలేదు.

రేపు మరికొన్ని వివరములతో.................

 


మే 10,2013 లో షఫికుర్రహమాన్ బుర్క్ ఈ 'వందేమాతరంగీతమును పార్లమెంటులో

సాటి సభ్యులతో కూడి  ఆలపించక పోగా పాడేటపుడు వినుట కూడా ఇస్లాముకు

విరుద్ధమని బయటకు నడచినాడు అని పైన తెలిపినాను. నేటి కేరళ రాష్ట్ర గవర్నరు

మరియు ఉర్దూ,  హిందీ,సంస్కృతముఫార్సీఅరబ్బీ పండితుడగు ఆరీఫ్ మొహమ్మద్

ఖాన్ గారుబుర్క్ గారి తీరుకు ఎంతో నొచ్చుకొన్నవాడై 'వందేమాతరంగీతము యొక్క

పల్లవి ప్రథమ చరణములను ఉర్దూ లోనికి తర్జుమా చేసి ఆ గీతములో ముస్లీములు 

ఆలపించకూడని అంశము ఏదీ లేదని నొక్కివక్కాణించినారు. ఆయన వ్రాసిన ఆ

గీతమును తెలుగు లిపిలో మీ ముందుంచుచున్నాను. మాతృక యొక్క భావార్థమును

నిన్ననే వేరుగా ప్రచురించినాను కాబట్టి ఇపుడు తిరిగీ వ్రాయలేదు. తస్లీమాత్ అంటే

వందనములు అని అర్థము.

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తూ భరీ హై మీఠే పానీ సే

ఫల్ ఫూలోంకి శాదబీ సే

దక్ఖిన్ కీ ఠండీ హవావోఁ సే

ఫసలోఁ కీ సుహానీ ఫిజావోఁ సే

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

తేరీ రాతేఁ రోషన్ చాఁద్ సే

తేరీ రౌనక్ సబ్జ్-ఏ-ఫాం సే

తేరీ ప్యార్ భరీ ముస్కాన్ సే

తేరీ మీఠీ భరీ జుబాన్ సే

తేరీ బాహోఁ మె మేరీ రాహత్ హై

తేరీ ఖద్మోఁ మె మేరీ జన్నత్ హై

తస్లీమాత్ మాఁ తస్లీమాత్

వారువ్రాసిన పై గీతముతో కూడా తెలుగు స్వేచ్ఛానువాదముతో  మీముందుంచుచున్నాను.

ఎక్కడయినా భారత మాత వందనము తప్ప దుర్గావందనము కలదా అన్నది గమనించగలరు.

వందనమమ్మా వందనము

తీయని నీరు తేనెలువూరు

పూలు ఫలమ్ముల పచ్చదనాలు

దక్షిణ ప్రాంతపు చల్లగాలులు

పచ్చని పంటల సౌందర నందము

వందనమమ్మా వందనము

చల్లని చంద్రుని వెలుగుల రాత్రులు

అందములీనెడు సుందర ఆకృతి

ప్రేమను పంచే నీ దరహాసము

తీయని కమ్మని నీ వాగ్మయము

మాశ్రమ మరచే నీ కర స్పర్శలు

నీ పదతలమే మాదగు స్వర్గము

వందనమమ్మా వందనము

మిగిలినది మరొకమారు ........  

No comments:

Post a Comment