Saturday, 9 May 2020

24 కేశవ నామాలు (చతుర్వింశతి కేశవ నామములు)


తుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)
https://cherukuramamohan.blogspot.com/2020/05/24.html
కేశవ నామాలు
ఆచమనం (ఆచమనీయం)- పూజాదికాలకు, సంధ్యావందనమునకు ముందుదినములో ఆయా కార్యములు చేయు సమయములోఅనేక సార్లు శుచికై చేసే ప్రక్రియ. మనము సామాన్యముగా మూడు మార్లు ప్రణవ సహితముగా  కేశవాయ స్వాహ, నారాయణ స్వాహా, మాధవాయస్వాహ  తో ప్రారంభించి శ్రీకృష్ణాయనమః వరకుగల 24 నామాలతో చేసేది పురాణ ఆచమనీయము. గాయత్రీ మంత్రముతో చేసేది శ్రుత్యాచమనము. అచ్యుతఅనంతగోవింద నామాలతో చేసే మరియొక ఆచమన పద్ధతి ఉంది. ఆచమనీయ పద్ధతులను అటుంచి ఈ 24 కేశవా నామములను గూర్చి తెలుసుకొందాము.
ఈ 24 నామాల ప్రత్యేకత ఏమిటిఆ వరుసకు ఏమైనా అర్థంఉందాపూర్తి ప్రమాణాలు నాకు తెలియవుగాని విన్నచదివిన విషయాలు చెప్పుకోవచ్చు కదా. కేశవ నామం నుండి కృష్ణ నామము వరకు ఉన్న నామాలను విష్ణుపదానికి సోపాన పంక్తిగా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రములోని వృషపర్వ అనే నామము (259), ఈ సోపాన పంక్తిని సూచిస్తుంది. పర్వము అంటే భారతములో కణుపు అనిచెప్పుకుంటాము. దీనికి మెట్టు అని కూడా అర్థం ఉన్నది. వృష అంటే ధర్మము. వృషపర్వ అంటే ధర్మ మార్గము. అంచెలంచలుగా విష్ణుపదానికి చేర్చే మార్గము. మార్గము గమ్యము కూడా ఆయనయే.
కేశవ నామము పరమపదమైతే శ్రీకృష్ణ నామము భూమిపై మనకు సమీపవర్తిగా మసలినది. మనకు కాల చక్రములో బుద్ధునిగావాసుదేవకృష్ణుని గా ఆయన అత్యంత సన్నిహితుడు. జైన తీర్థంకరుడు అరిష్టనేమి ఆయన పెదతండ్రి కుమారుడు. భాగవతము ప్రకారము విష్ణుని అవతారమైన బుద్ధుడు మనకు బాగా తెలిసిన గౌతమ బుద్ధుడు కాడు. గౌతమ బుద్ధునికి తండ్రి పెట్టిన పేరు సిద్ధార్థుడు. విష్ణుసహస్రము ప్రకారము సిద్ధార్థ కూడా విష్ణునామమే (నామం 252). సిద్ధించిన అర్థము కలవాడు. ప్రవృత్తి మార్గములో ఉండకుండా నివృత్తి మార్గములో ఉంటాడు. కోరిక తీరిన తరువాత అశాంతి అతనికి ఉండదు.అంటే ఏ కామన లేనివాడని అర్థము. రాముడుకృష్ణుడుగౌతమ  బుద్ధుడుమహావీరుడు, మహావీరుడుఅరిష్టనేమి అందరూ క్షత్రియులే. కృష్ణుడు గీతాచార్యుడుగా మనకు జగద్గురు స్థానములో ఉన్నాడు. యోగీశ్వరునిగా యోగి హృదయాకాశంలో కనుగొనగల పరమాత్మ. మన యోగక్షేమం వహిస్తానని చెప్పినవాడు. ఆయన నిర్వాణముతోనే కలియుగారంభము. మిగతా అవతారాలు కాలములో మనకు చాలా దూరం. మహాభారత పాత్రధారిగా ఈ భూమిపై నడయాడిన చారిత్రక వ్యక్తి. భూదేవికి పతి.
ఈ శ్రీదేవి భూదేవులకు పతి అనుట ఒక సాంకేతికము. విష్ణువు అంటే సర్వే సర్వత్ర ప్రకటితమై ఉండువాడు. పతి అంటే భర్త. భర్త అంటే భరించేవాడు. ఆయన భూమిని భరించి ధరించేవాడు. అట్లే లక్ష్మి దేవి భర్త అంటే, 8 విధములగు సంపదలకు అధికారిణియగు లక్ష్మిని భరించేవాడు. అందుకే ఆమెకు ఆయన హృదయములో స్థానము. ఆయనను హృదయ పూర్వకముగా భజించితే ఆయన హృదయము మన హృదయములో ఉండిపోతుంది. అది విష్ణు పూజా రహస్యము. శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ వాసుదేవా అన్నానారాయణా అన్నాగోవిందా అన్నా మంచిదే. మనం రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకే మహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది. మనం స్మరించినప్పుడు వివిధ లక్షణములు కలిగిన ఆయా రూపములు ఆయా కార్యములయందు వినియోగించితే అత్యధిక ప్రయోజనం ఉంటుంది.
ఈ కేశవ నామములు 24 మాత్రమే ఎందుకు అన్నది మొదట గణిత పరముగా విశ్లేషించుకొందాము.
మాకాలములో Permutations and Combinations ను పౌనఃపున్యములు అనేవారు.  చక్రీయముగా జరిగే ప్రక్రియలలో (పునరావృతం అయ్యే) అనగా భ్రమణడోలనాలను బట్టి వద్దనున్న వస్తు సమముదాయమును మార్చి పెర్చుటను పౌనఃపున్యములు అంటారు. ఈ పౌనఃపున్యములను తెలుగులో నేడు ప్రస్తార సంయోగములుగా పిలుస్తున్నారు. మనకు ఇక్కడ ప్రస్తారములు మాత్రమే కావలెను. అందుచే వానిని గూర్చియే మాట్లాడుకొందాము.
1,2,3,4 అన్న నలుగురు భోజనమునకు ఒక హోటలుకు వెళితే నాలుగు అరటియాకులు వేస్తాడు ఆ వడ్డించే వ్యక్తి. ఆ నాలుగు ఆకుల వద్ద, ఏఆకు వద్ద ఎవరు కూర్చోవలెనన్నదే ప్రస్తారము.
ఈశ్వరుడు 10 విధములగు ఆయుధములను ధరిస్తాడు. ఆయనకు 5 తలలు 10 చేతులు ఉన్నవి అని వేదము తెలుపుతుంది. ఆ 10 చేతులలో పది ఆయుధములు ఉంటాయి. అవి ఏవి అని ఒకపరి చూద్దాము.
అవి, పాశము. అంకుశము, సర్పము, డమరుకము, కపాలము, శూలము, ఖట్వాంగము(మంచపు కోడు కావచ్చు, గుదియ), శక్తి (Missile), బాణము, విల్లు, ఈ పది ఆయుధములు ఆయన చేతులలో పరిపరి విధములుగా అమర్చి దలచితే అవి 36,28, 800 అవుతుంది. అన్ని మూర్తులను గుర్తుంచుట మానవమేధకు దుర్లబమైన విషయమే! అందువల్ల ఆయనది ఒకటేరూపము. అది లింగరూపము.
అదేవిధముగా విష్ణువు చతుర్భుజుడు. శిరస్సు ఒకటే. ఆయన ధరించునవి నాలుగు ఆయుధాలు. అవి ఏవంటే, శంఖ చక్ర గదా పద్మములు. ఆయన అవతారమూర్తి. ఈ నాలుగు ఆయుధములను ఆయన చేతులలో 24 విధములుగా అమరించవచ్చు.
మరి ఈ 36,28, 800 మరియు 24 ఏవిధముగా వస్తుంది అంటే 10x9x8x7x6x5x4x3x2x1= L10=10!= Ten factorial అంటారు.
అదేవిధముగా 4x3x2x1=24=L4=4!= Four Factorial అంటారు. Factorial అన్న పదమును వాడినాను కాబట్టి ఇది ఏ పాశ్చాత్యులో కనిపెట్టినారనుకోవద్దు. ఇది మన భాస్కరాచార్యుడు- 2 సవిస్తారముగా 600 సంవత్సరముల క్రితమే, తన ‘లీలావతి’ గణితములో తెలిపినాడు. మనము మెకాలే మత్తులో మునగనంత వరకు ‘లీలావతి’నే అనుసరించేవారము.
ఇపుడు తిరిగీ విష్ణువు ఆయన యొక్క ఆయుధములను గురించి మాట్లాడుకొంటే ఆయన నాలుగు చేతులలో 24 విధములుగా(క్రమ గతులు=Patterns ) ఆ ఆయుధములను ధరించవచ్చును. ఒక్కొక్క విధముగా ధరించినపుడు ఒక్కొక్క పేరు విష్ణువునకు ఇవ్వబడినది. 
మిగిలినది రేపు..... 
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-2
1.  కేశవ(శంఖం చక్రంగద_పద్మం)

 2.   నారాయణ (పద్మంగదచక్రం_శంఖం)

 3.   మాధవ(చక్రంశంఖంపద్మం_గద)

 4.   గోవింద(గదపద్మంశంఖం_చక్రం)

 5.   విష్ణు(పద్మంశంఖంచక్రం_గద)

 6.   మధుసూదన(శంఖంపద్మంగద_చక్రం)
 7.   త్రివిక్రమ (గదచక్రంశంఖం_పద్మం)
 8.    వామన (చక్రంగదపద్మం_శంఖం)
 9.    శ్రీధర (చక్రంగదశంఖం_పద్మం)
10.   హృషీకేశ (చక్రంపద్మంశంఖం_గద)
11.   పద్మనాభ (పద్మంచక్రంగద_శంఖం)
12.   దామోదర (శంఖంగదచక్రం_పద్మం)
13.   సంకర్షణ (శంఖంపద్మంచక్రం_గద)
14.   వాసుదేవ (శంఖంచక్రంపద్మం_గద)
15.   ప్రద్యుమ్న(శంఖంగదపద్మం_చక్రం)
16.   అనిరుద్ధ(గదశంఖంపద్మం_చక్రం)
17.   పురుషోత్తమ (పద్మంశంఖంగద_చక్రం)
18.    అధోక్షజ (గదశంఖంచక్రం_పద్మం)
19.    నారసింహ (పద్మంగదశంఖం_చక్రం)
20.    అచ్యుత (పద్మంచక్రంశంఖం_గద)
21.    జనార్థన (చక్రంశంఖంగద_పద్మం)
22.    ఉపేంద్ర (గదచక్రంపద్మం_శంఖం)
23.   హరి(చక్రంపద్మంగద_శంఖం)
24.   శ్రీకృష్ణ నమః (గదపద్మంచక్రం_శంఖం)
ఈ రూపములలో 15 మూర్తులను మనము   15వ శతాబ్దములో, గుజరాత్ లోని పాటన్ లో  నిర్మించిన రాణీ కి వావ్ (రాణీ బావి)లో చూడగలము. ఫనస్ వాడి గుర్గాఁవ్ ముంబాయిలో 1927లో కట్టించిన వెంకటేశ్వరాలయములో ఈ చతుర్విమ్శతి కేశవ నామములకు ప్రాతినిధ్యము వహించుచున్న 24శిల్పములనూ చూడవచ్చును.
తిరిగీ కేశవనామల విషయమునకు వద్దాము. ఈ కేశవ నామాల విశేషాలు తెలుసుకోవడానికి ముఖ్య గ్రంథం విష్ణుసహస్రనామ స్తోత్రం. వీనిలోని ఈ  నామాలు ఆ స్తోత్రములో వస్తాయి. కాని ఈ వరుసలో ఉండవు. కొన్ని రెండు, మూడు పర్యాయాలు వస్తాయి. మొదటి 12 నామాల వరుసను నేను గమనించినది వరాహమిహిరుని బృహత్సంహితలో. 12 సంఖ్య, మాసములగాను, రాశులుగాను జ్యోతిషములో ప్రాధాన్యము కలది. కాల పురుష, నక్షత్రపురుష వర్ణనలో ఇవి వస్తాయి.
మృగశీర్షాయాః కేశవ నారాయణ మాధవాః సగోవిన్దాః
విష్ణుమధుసూదనాఖ్యౌ త్రివిక్రమో వామనశ్చైవ ||105.14||
శ్రీధరనామా తస్మాత్ హృషీకేశశ్చ పద్మనాభశ్చl
దామోదర ఇత్యేతే మాసౌ ప్రోక్తా యధా సంఖ్యమ్ ||105.15||
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో "మాసానాం మార్గశీర్షో2హమ్" అన్నాడు. బహుశా ఆకాలంలొ అది సంవత్సరారంభం అయిఉంటుందేమో.
ఈ శ్లోకాలలో "యథా సంఖ్యం" 24 యొక్క వివరణ ఇస్తుంది. ఇది సాంఖ్య దర్శనానికిసంకేతం. ఆ దర్శనం ప్రకారం సృష్టికి ఆధారం చతుర్వింశతి (24) తత్త్వాలు. కేశవ నామము అవ్యక్తమును, నారాయణ నామము మహత్ (బుద్ధి) తత్త్వమును, మాధవనామము అహంకారమును, గోవింద నామము మనస్సును తరువాత 20 నామములు పంచ తన్మాత్రలను, పంచ భూతములను, పంచ జ్ఞానేంద్రియములను, పంచ ప్రాణములను సూచించును. సాంఖ్యమును విష్ణువు అవతారములలోని కపిలునిచేత దర్శించబడినదిగా చెబుతారు.
ఈ 24 తత్వముల వివరములను ఈ దిగువన పొండుపరచినాను.
చతుర్వింశతి తత్వములు (24)
పంచభూతములు 5  భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచఙ్ఞానేంద్రియములు         5  శ్రోత్రము(చెవి), త్వక్కు(చర్మము),  చక్షుస్సు(కన్ను), జిహ్వ(నాలుక),  ఘ్రాణము(ముక్కు), పంచకర్మేంద్రియములు       5  వాక్కు(నోరు), పాణి(చేయి), పాద(కాలు),  పాయువు (గుదము),  గుహ్యము(రహస్యేంద్రియము)
విషయపంచకము         5  శబ్దము(చప్పుడు), స్పర్శము, రూపము(ఆకృతి), రసము (రుచి), 5గంధము(వాసన)
అహంకార త్రయము : 3  అహంకారము, 2 బుద్ధి, 3 మహత్తు (అవ్యక్తము), మనస్సు: 1,మొత్తము: 24      
మనము ఇప్పుడు ఈ నామాల విశిష్టతను పరిశీలించుదాము. (ఆధారము సద్గురు శివానంద మూర్తిగారి "మహా విష్ణు తత్త్వము - భీష్మ బోధ.)
మనము రోజూ చదివే 24 నామాలు అన్నీ ఒకేమహావిష్ణువు యొక్క వివిధరూపాల పేర్లు. ఒకొక నామానికి ఒక విశిష్టత ఉంది. మనము స్మరించినప్పుడు వివిధ లక్షణములు కలిగిన ఆయా రూపములు ఆయా కార్యములయందు వినియోగపడితే అత్యధిక ప్రయోజనం ఉంటుంది. మూల తత్త్వము నుండి జగత్తు వ్యాప్తిచెందినప్పుడు ఆయన వాసుదేవుడు. నిర్గుణమైన బ్రహ్మ వస్తువునుండి సగుణముగా ప్రపంచమంతా వ్యాపించినది వాసుదేవ మూర్తి. జగత్తు అంతటినీ తనలోనికి ఉపసంహారము చేసినప్పుడు ఆయన నారాయణ మూర్తి. జగత్తులో ఉండే మనుష్యులలోని జ్ఞానులు ఆయనను ఉపాసనచేసి ఆయనను పొందే ప్రయత్నములో, ఆజీవులనే అనుగ్రహించి తనవద్దకు తీసుకొనేవాడు సంకర్షణ మూర్తి. జగత్తులో ఉండే సుఖభోగములను, ఇంద్రాది పదవులను ధర్మబద్ధంగా ఆయన అనుగ్రహముచేత పొందు లక్షణములున్నప్పుడు ఆయన గోవిందుడు.

ఈ 24 విష్ణురూపములలో ఆయన ధరించే శంఖము, చక్రము, గద, శార్ఙ్గము (శార్ఙము, విష్ణువు విల్లు) వేర్వేరు స్థానములలో ఉంటాయి. (4! = 4x3x2x1, factorial 4)
1. కేశవ - (23, 648 నామములు) - త్రిమూర్త్యాత్మకుడని మనము నిత్యమూ స్మరించు 24 నామములలో మొదటినామము. సంపూర్ణత్వానికి సంకేతం. 'సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి' - అనే సూక్తికూడా ఇదే సూచిస్తున్నది. ఇక్కడ కేశ శబ్దము ఉంది. కాంతి కిరణములే ఆయన కేశములు. సూర్యచంద్రులకు కిరణములు ప్రసాదించువాడు. కిరణములద్వారానే సమస్త విశ్వమున వ్యాపించి ఉన్నవాడు. "అంశవో యే ప్రకాశంతే తే కేశ సంజ్ఞితా" అనే శ్లోకం ఉంది. బ్రహ్మ,విష్ణు, శివ, శక్తులను కేశవ నామం సూచిస్తుంది.
को ब्रह्मा ईशः रुद्रः तौ आत्मनि स्वरूपे वयति प्रलये उपाधिरूपमूर्त्तित्रयं मुक्त्वा एकमात्र-परमात्मस्वरूपेणावतिष्ठते इति ।
ఎవరైతే బ్రహ్మ, ఈశ, రుద్ర తత్త్వములను ఆత్మలో ధరించి, ప్రళయ కాలమున త్రిమూర్తుల రూపములను ఉపసంహరించి ఒకే పరమాత్మగా వెలుగునో ఆయనయే కేశవ విష్ణువు. ఈయన తత్త్వం ఇంద్రాదులకు కూడా దుర్లభం.
మిగిలినది మళ్ళీ ......



చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-3


2. నారాయణ (245 నామము) – ‘నారం అయనం యస్యసః నారాయణం’
నారం అంటే బ్రహ్మజ్ఞానము. ఆయనం అంటే స్థానముగా కలిగిన వాడు నారాయణుడు.
మరొక విధముగా నారము అంటే నీరు అని అర్థము. “आपो नारा इति प्रोक्ता आपो वै नरसूनवः” मनुः జహ్ను నారాయణో నరః అంటుంది సహస్రనామం. సంసారమనే జలరాశినుండి మానవుల తరింపచేసి పరమపదానికి చేర్చువాడు జహ్నువు.
మరోవిధముగా  నార శబ్దము జీవులను సూచిస్తుంది. నారములు అంటే జీవులే. ఆయనము అంటే ప్రయాణము. జగత్తులోని జీవుల గతిని నిర్దేశించువాడు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయాణములో ఆయన జీవులందరికీ గమ్యస్థానము. “यच्च किञ्चिज्जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा । अन्तर्वहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः” అని మంత్రపుష్పం లో చెప్పుకుంటాం. శ్రావ్యము దృగ్గోచరము అగు ఈ సృష్టికి మూలాధారము ఆయనే! లోపల బయట అంతా ఆయనే! ఆయన సర్వవ్యాపి. ఆయనే నారాయణుడు.
‘నారాయణాత్ ప్రాణోజాయతే’ అంటుంది వేదము. అట్లే ‘మనస్సర్వేంద్రియాణిచ’ అంటుంది. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’, ‘నారాయణదేవతా ముతద్యన్తే నారాయణే ప్రవర్తన్తే నారాయణే ప్రళీయంతే’. అంటే సృష్టి స్థితి లయములకు కారకుడు ఆయనే. ఇదే పరమేశ్వర తత్వము.
3. మాధవ (72,167 నామములు) - మహాలక్ష్మి భర్త. ఈ ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపము. దానిని భరించువాడు ఆయన. మా అంటే లక్ష్మి అనియే కాకుండా, విద్య అన్న అర్థము కూడా ఉన్నది. మాధవ అంటే విద్యలకు అధిపతి. రమాధవః అని అర్థం ముందే చూసినాము కదా! ఆత్మకు ఆత్మ జ్ఞానము కొరకు అవసరమైన విద్యలు అనంతముగా ఉన్నాయి. యోగ మార్గము, భక్తి మార్గము, పశుపతి మార్గము - ఇలా ఎన్నో మార్గములుగా ఉన్న ఆధ్యాత్మిక విద్యలన్నిటికీ ఆయనే అధిపతి అనే విషయం మాధవనామం సూచిస్తుంది. విష్ణువు లో రుద్రాంశ వున్నది. ఈశ్వరునిలో విష్ణ్వంశ వున్నది. అందుకే కదా శివాయ విష్ణురూపాయ అన్నది.
4. గోవింద (187, 539, 825 నామాలు) - (गां पृथ्वीं धेनुं वा विन्दतीति) గో శబ్దము పృథ్విని, గోవులను,కిరణములను, వేదములను కూడా సూచిస్తుంది. శ్రీ మహావిష్ణువు అనంతము, పాపరహితము ఐన ధరణిని పొందినవాడు. దేవతలకు, గోవులకు ఇంద్రుడు, అందుకు ఆయనను గోవిందుడని కీర్తిస్తారు. గోవు శబ్దమునకు వాక్కు కూడా (गोभिर्वाणीभिर्वेदान्तवाक्यैर्विद्यते) అర్ధముగా చెప్పబడినది. వాణి అన్న శబ్దమునకు వేదము అన్న అన్వయము వున్నది. ఆవాక్కును ప్రాప్తింపచేసేవాడు కాబట్టి గోవిందుడు. ఈ విశ్వములో గోవులుగా(ధేనువులు), చెప్ప బడేవన్నీ జీవాత్మలు. జీవులు పొందే శాశ్వతమైన ఆనందము ఇచ్చేవాడు కావున గోవిందుడు. వాక్కులను వేదవాక్కులుగా పరిగణిస్తే వేదముల వలన లభించువాడు గోవిందుడని చెప్పుకోవచ్చును.
5. విష్ణు (2,257,258, 657 నామములు) - వ్యాప్నోతి ఇతి విష్ణుః, అంతటావ్యాపించి ఉన్న వాడు. (all-pervading) సూర్యమండలములోను,
 సూర్యమండలము వెలుపలా ఉన్నాడు. ద్వాదశ ఆదిత్యులలో ఒకరు విష్ణువే. కాని ఆ పరమాత్మ ఆ 12 మంది లోనూ ఉన్నాడు. (ద్వాదశ ఆదిత్యులు - ధాత, మిత్ర, అర్యమ, రుద్ర, వరుణ, సూర్య, భగ, వివస్వన్, పూషా, సవితా, త్వష్ట, విష్ణు). అందుకే ఆయన సూర్య నారాయణుడు. మనం భూగోళం మీద ఉంటాము. మన పితరులు పితృలోకములోను, దేవతలు స్వర్గంలోనూ ఉంటారు. విష్ణువు లోకములన్నిటిలోనూ, అందరిలోనూ, లోకముల మధ్య ఆకాశము లోనూ కూడా వ్యాపించి ఉంటాడు. విష్ణుపదమంటే ఆకాశం. అందుకే ఆకాశగంగ విష్ణుపాదోద్భవి అయింది. ఆయన బ్రహ్మాండమంతటిలోను, బ్రహ్మాండము అవతలా, సకల బ్రహ్మాండములలోను ఉంటాడు. సకలభూతములలో సర్వాంతర్యామిగా కూడా ఉన్నాడు. అందుకే సహస్రనామాలలో విశ్వమనే పేరు మొదట చెప్పి, విష్ణువు రెండవ నామముగా చెప్పబడినది. ఇదే పద్ధతిలో 256వ నామం వృషాహీః అని 257వ నామం వృషభః అని, 258వ నామం విష్ణుః అని చెప్పబడినవి. వృష అంటే ధర్మము. భ అంటే కాంతి అని కాకుండా అభివృద్ధి అన్న అర్థమును ఒక మహావేద పండితుని ద్వారా బాల్యములో విన్నాను. వృషాహీ, వృషభ నామాలు రెండు ఆయన ధర్మ స్వరూపుడని తెలుపుతాయి. ధర్మ పాలకుడు విష్ణువే. ధర్మగ్లాని కలిగినప్పుడు అవతరించేవాడు ఆయనే.
 ధర్మ సంస్థాపన ఆయన కార్యం. దీనికొరకే ఆయన సర్వవ్యాపియైన విష్ణువు. ఉదాహరణకు భోజనముచేసిన తరువాత నీళ్ళు వదలి "అమృతాపిధానమసి రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినా ముదకందత్తం అక్షయముపతిష్ఠతు" అని మంత్రమును బ్రాహ్మలు భోజనము ముగుస్తూనే చదువుతారు. దాని అర్థము ఏమిటంటే,  ఇప్పుడు నేను భుజించి అనుభవించిన నా సంతృప్తి కోటానుకోట్ల అపుణ్యనిలయములైన రౌరవాది నరకములలోని జీవులకు కూడా కలగాలి. ఈ విధముగా అనుష్ఠించిన ధర్మము వలన విష్ణువు సర్వ వ్యాపకత్వము వలన ఆ కోరిక నెరవేరుతుంది.
6. మధుసూదన (73వ నామం) - మధు అనే రాక్షసుని చంపినవాడు. मधुं तन्नामानं असुरं सूदयति नाशयतीति | ఈ నామ స్మరణ ఫలం శబ్ద రత్నాకరంలో ఈ విధముగా ఇచ్చుట జరిగినది: तस्य स्मरणफलम् । “महाविपत्तौ संसारे यः स्मरेन्मधुसूदनम् । विपत्तौ तस्य सम्पत्तिर्भवेदित्याह शङ्करः || మహా విపత్సమయాలలో ఎవరు మధుసూదన నామాన్ని స్మరిస్తారో వారికి ఆవిపత్తులే సంపత్తిగా మారుతాయని శంకర వచనం.

7. త్రివిక్రమః (530వ నామం) త్రీణి పాదాని విచక్రమే - శ్రుతి వాక్యం. వామనుడు మూడు పదములతో త్రిలోకములందు వ్యాపించి త్రివిక్రముడైనాడు. అందుకే వామనునినుండి త్రివిక్రమునికి అధిరోహణము. మూడులోకములను క్రమములో ఆక్రమించుట వలన త్రివిక్రముడు (वि + क्रमं).
మిగిలినది తరువాత.....
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-4

8. వామనః (152,351 నామములు) - వామన అనే పదానికి హ్రస్వ, సూక్ష్మ అని అర్థములు ఉన్నాయి. జీవులయందు సూక్ష్మరూపుడై ఉండు పరమాత్మ అని వామన పదానికి అర్థం చెప్పవచ్చును. వామనావతార గాధ తెలిసినదే. దేవతలను స్థానభ్రంశముచేసి త్రిలోకాధిపత్యము వహించిన బలిచక్రవర్తిని వంచించుటకై అదితి ప్రార్థనకు ఫలముగా ఉపేంద్రునిగా ఆవిర్భవించిన హరి అవతారము వామనుడు.
9. శ్రీధరః (610 నామం) - ఈ నామము శ్రీతో ఆరంభమయే అనేక నామాలలో ఒకటి. శ్రీ ధర - సిరులు ధరించిన వాడు, శ్రీ వాస - శ్రీకి నివాస స్థానము, శ్రీపతి - సముద్రమంథన సమయమున ప్రభవించిన శ్రీదేవికి పతి అయినవాడు, 
  శ్రీమతాంవర - శ్రీమంతులలో వరిష్ఠుడు అనగాశ్రేష్టుడు లేక గొప్పవాడు. శ్రీద - సిరులు ఇచ్చువాడు, శ్రీశ - లక్ష్మీదేవికి ఈశ్వరుడు, శ్రీనివాస - లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడు. శ్రీనిధి - సకల ఐశ్వర్యములకు నిధి, శ్రీకర – సంపదల నిచ్చువాడు. శ్రీమాన్ - లక్ష్మిని కలిగియున్నవాడు. మిగిలినవారందరు లక్ష్మిని సంపాదించేవారే. సిరులను ధరించి భక్తులకిచ్చువాడు శ్రీధరుడు.
10. హృషీకేశ (47 నామము) - హృషీక అంటే ఇంద్రియములు, వానికి అధిపతి అని సామాన్యార్థము. "హృష్యంతి అనేన ఇతి హృషీక" - హృషీకములు ఆనందస్థానములు. జీవుడు నిత్యము ఇంద్రియ సుఖములకు పరితపించి సుఖదుఃఖములను పొందినప్పుడు అవిద్యారూపునిగను, అంతర్యామిగా శుద్ధ ఆత్మవిద్యారూపుడై ఆనంద స్వరూపునిగను, ఉండువాడు హృషీకేశుడు.
11. పద్మనాభః (48, 196, 346 నామాలు) - తన నాభియందు ఉద్భవించిన పద్మమును బ్రహ్మలోకముగా చేసిన వాడు. సృష్టి కారణమును తన దేహ మధ్యమున ధరించిన వాడు. నాభియందే కాక హృదయ పద్మమందు భాసిల్లువాడు అనుకూడా చెప్పుకోవచ్చు. అందుకని ధ్యానం చేసేటప్పుడు శ్రీమన్నారాయణుని హృదయమందు నిలుపుకోవాలి. पद्मस्य नाभौ स्थिता
అనికూడా అర్థంచెప్పుకోవచ్చు. అంటే హృదయకమలంయొక్క నాభియందుండే కర్ణికయందుండువాడు. "స బ్రహ్మ సశివ స్సహరి స్సేంద్ర స్సోక్షర పరమ స్వరాట్" ఆయనయే బ్రహ్మ,శివుడు, హరి, ఇంద్రుడు, అక్షరుడు.
12. దామోదరః (367 నామం) - दमादिसाधनेनोदारा उत्कृष्टा मतिर्या तया गम्यते इति दामोदरः దమాది సాధనేనోదారా ఉత్కృష్టా మతిర్యా తయా గమ్యతే - ఇతి దామోదరః. యోగికి శమదమాది లక్షణములు విధిగా ఉండాలి. శమము అంటే శాంతి, దమము అంటే ఇంద్రియనిగ్రహము. దమాది సాధనములచేత కలిగే ఉదారబుద్ధికి గమ్యమైన వాడు దామోదరుడు. దమ అంటే పద్మము. పద్మమును ఉదరమందు కలవాడు. అంతర్ముఖుడైన యోగి అక్కడనుండే ఊర్ధ్వలోకములను దర్శించే అవకాశము వస్తుంది. జీవాత్మ ఒక్కొక్క లోకాన్ని దర్శిస్తూ ఒక్కొక్క విభూతిని పొందుతూ ఆనందంతో ఊర్ధ్వగతిలో వెడుతుంది. ఈ శక్తినే స్త్రీ రూపంలో హేమమాలిని అని, పద్మమాలిని అని  పురుషరూపంలో దామోదరుడని చెబుతాం. ఈ షట్చక్రముల సమూహమునే లలితా సహస్రంలో కులమని చెబుతారు. కులాంగన, కుల సంకేత  పాలిని, కులయోగిని అని అమ్మవారిని వర్ణిస్తారు.  దామోదరుడు = కృష్ణుఁడు. యశోద బాల్యమునందు ఇతని నడుమున త్రాడువేసి రోటితో కట్టెను కనుక ఇతనికి ఈనామము కలిగెను అని కూడా అన్వయము.
13. సంకర్షణః (552 నామము) – సంకర్షణ మూర్తి స్వరూపయో   అసావాదిత్యయో పరమపురుషో స ఏవ రుద్రోదేవతాః అంటే అర్థంఏమిటి? సంకర్షణ మూర్తి ఉపాసకుణ్ణి తన దగ్గర చేర్చుకొని ఆమోక్షార్థిని ఉద్ధరించి తనలో శాశ్వతంగా చేర్చుకుంటాడు. ఇది  రుద్రతత్త్వంతో సమన్వయమౌతుంది. రుద్రుడుకూడా ఉపసంహారకర్తయేకదా! విష్ణువుకు రుద్రునికి కూడా సంకర్షణమూర్తి అనే  పేరున్నది. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - అని రుద్రమంత్రము.

మిగిలినది మరొకసారి……….
చతుర్వింశతి కేశవ నామములు(24 కేశవ నామాలు)-5 (చివరి భాగము)

14. వాసుదేవ (332, 695, 709 నామాలు) - వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడని కృష్ణుని వ్యవహరిస్తాము. విష్ణువు అర్థంలో సర్వత్రా వసించేవాడు వాసుదేవుడు. ఇదే భారతంలో "వాసవః సర్వ భూతానాం" అని చెప్పబడినది. సమస్త భూతజాలమునకు, జగత్తుకు నివాసమైన వాడు వాసుదేవుడు. దేవ శబ్దమునకు ఆరులక్షణాలు ఉంటాయి - విజిగీష (జయేచ్ఛ) వ్యవహార (వివాదం) ద్యుతి (తేజస్సు) స్థితి, గతి, చ్యుతి. ద్వాదశాక్షర మంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ - చేత ప్రతిపాదించబడిన సాక్షాన్నారాయణుడు. సూర్యుని వలె జగత్తును అచ్ఛాదించుటచేత వాసుడు, దేవుడు కూడా.
15. ప్రద్యుమ్న (640 నామము) – प्रद्युम्नः, (प्रकृष्टं द्युम्नं बलं यस्य ।) అపరిమితమైన ధనము, బలము కలిగిన వాడు అని అర్థము. సృష్టి, లక్ష్మీ (శ్రీ) అన్నీ కలిగిన వాడు ఆయనేకదా. రుక్మిణీ కృష్ణుల పుత్రుడు. మన్మధుని అవతారం.
“अनिरुद्धः स्वयं ब्रह्मा प्रद्युम्नः काम एव च ।
वलदेवः स्वयं शेषः कृष्णश्च प्रकृतेः परः ॥”
इति ब्रह्मवैवर्त्ते श्रीकृष्णजन्मखण्डे ११६ अध्यायः ॥బ్రహ్మవైవర్త పురాణము ప్రకారము అనిరుద్ధుడు బ్రహ్మ, ప్రద్యుమ్నుడు మన్మథుడు, బలదేవుడు శేషుడు, కృష్ణుడు పరా, ప్రకృతులే (శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః)
16. అనిరుద్ధ (185, 638 నామాలు) - ఆయన ఎదురులేని వాడు. ఆయనను నిరోధింపగలిగిన వ్యక్తి కాని వస్తువుకాని ఈసృష్టిలో లేదు. ఆయనపై విరోధించిన రాక్షసులు ఆయన చేతిలో హతులైనారు. ఆయనను ఎదుర్కొని ఎవరూ జీవించలేరు. ఆయన తనను ద్వేషించినవారిని కూడా తనలోకి తీసుకుంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే సతాంగతి. అంటే ఎవరైతే అలాంటి సాధనయందు సత్పురుషులై ఉన్నారో వాళ్ళ గతిని నిరోధించనివాడు ఆయన. ఆయన వారికి రక్షకుడు. "యోగక్షేమం వహామ్యహాం" అనే గీతావాక్యం అనిరుద్ధమూర్తికి వర్తిస్తుంది.
సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మూర్తులను పాంచరాత్ర, వైఖానసాది వైష్ణవాగమములలో చతుర్వ్యూహాలుగా చెబుతారు. సహస్రనామాలలో "ఓం చతుర్వ్యూహాయ నమః" 138వ నామము. విష్ణుదేవాలయమును నిర్మాణం చేసినప్పుడు అహిర్బుధ్న్య సంహిత వంటి పాంచరాత్రాగమ గ్రంధాలను ఉపయోగిస్తారు.ఈ నాలుగు మూర్తులతో విష్వక్సేనుడు కూడా ఉంటాడు. ఈ వ్యూహ సిద్ధాంతం శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ప్రాతిపదిక. "ఓం చతుర్వ్యూహాయ నమః" 767 వ నామము కూడా. 
17. పురుషోత్తమ (పద్మం శంఖం గద చక్రం ) 
విష్ణు సహస్రనామము మొదలైన 3వ శ్లోకములోనే  24వ ప్నామముగా ఈ పేరు వస్తుంది.
అసలు విష్ణువు శరీరపురుష, ఛందోపురుష, వేదపురుష, మహాపురుష గా  చెప్పుకోవచ్చును.
పైగా దేహగత జీవులు క్షరములు. అనగా నశించునవి. స్త్రీ పురష భేదము  లేని అవ్యయుని పురుషుడు అంటారు.ఈయన అవ్యయుడు, అనంతుడు మరియు ఆది పురుషుడు. ఆయన శ్రీహరి. లక్ష్మీ దేవిని అక్షర పురుష  అంటారు. క్షరము లరనిది అనగా నాశము లేని దానిని అక్షరము అంటారు. ఈ అక్షర పురుషను హరించి హృదయములో బదాచుకొని ఆయన శ్రీహరి అయినాడు. ఈయన అక్షరపురుషా సమాన్వితుడైన పురుషుడు. అందుకే ఈయన  అందుకే ఆయన పురుషోత్తముడు. 
18. అధోక్షజ (415 నామము) - अधोक्षजः, (अधः ज्ञातृत्वाभावात् हीनम् अक्षजं प्रत्यक्षज्ञानं यस्य सः) విశ్వం గురించి, భగవంతుని గురించి యథార్థ జ్ఞానము తెలుసుకోవడానికి న్యాయశాస్త్రం నాలుగు ప్రమాణాలను గురించి చెబుతున్నది. వీనిలో ఉత్తమమైనది ప్రత్యక్షజ్ఞానం. జ్ఞానేంద్రియాలచేత తెలుసుకోగలిగినది. అక్షజం అంటే కంటితో చూచుటవలన కలిగినజ్ఞానం. దేవుని సామాన్య నేత్రాలతో చూడలేం. ఈశ్వరుని అనుమాన ప్రమాణంద్వారా తెలుసుకోవాలి. ధూమం ఉండడం వలన అగ్ని ఉన్నదని తెలుసుకోవడం. ఇదే హేతువాదం. మూడవది శబ్ద ప్రమాణం (ఆప్త వాక్యం ద్వారానో, వేద వాక్కు ద్వారానో తెలుసుకోవాలి). తరువాతది ఉపమానం. ఆకాశంలో సూర్యుని వలే హృదయాకాశంలోని పరమాత్మను అంతర్ముఖుడై చూడడం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఒక చోట " అధో న క్షీయతే జాతః యస్మాత్తస్మాత్దధోక్షజ " అని పేర్కొన బడినది. యస్మాత్తస్మాత్ అని వాడబట్టి క్షీణత లేనివాడు, సతతము ఊర్ధ్వరూపుడు, సంసార ధర్మ స్పర్శరహితుడై ఉండేవాడు కాబట్టి అధోక్షజుడు. అధోక్షజాయనమః = జ్ఞాతత్వాభావాన్ హీనం ప్రత్యక్షజ్ఞానం యస్య సః ఇంద్రియాగోచరత్వాత్ పంచ మహాభౌతికేంద్రియాగమ్య ఇత్యర్థః,
సమస్తేంద్రియములచేఁ దెలిసికొనఁబడని వస్తువు కొఱకు నమస్కారము. అధోక్షజ నామం యొక్క అన్వయం యోగశాస్త్ర సంబంధం. మనశరీరములో మూలాధారము నుండి సహస్రారము వరకు ఉన్న పద్మాలన్నీ అధోముఖంగా ఉంటాయి. యోగసాధకుడు భూసంబంధమైన మూలాధార స్థితుడైన గణపతిని ధ్యానిస్తూ కుండలిని జాగరణ చేసి ఊర్ధ్వలోకములను దర్శిస్తాడు. క్రమముగా ఈ పద్మములు తిరుగబడి ఊర్థ్వ ముఖంగా విచ్చుకుంటాయి. దేహాత్మ భావన కలవానిలో పద్మములు అధోముఖంగా ఉంటాయి. అది
కల్పించినవాడు అధోక్షజుడు. మాంసనేత్రాలతో బాహ్యవస్తువులను చూస్తున్నాము. అంతర్దృష్టితో ఆత్మను, అదే పరమాత్మను చూస్తున్నాం. ఇలా ధ్యాన గమ్యుడైన పరమాత్మయే అధోక్షజుడు.
19. నారసింహ (21వ నామము, ఓం నారసింహ వపుషేనమః (వపు = శరీరము)) - నరః, సింహః, నరసింహః మూడు నామాలు ఆయనవే. నామము 200, ఓం సింహాయనమః, నామము 246 ఓం నరాయ నమః. సింహవాహిని పరాశక్తి. ఆమెను ధ్యానిస్తే యోగసాధనలో ప్రాణశక్తి చిత్రిణీ నాడిలో సులభముగా ప్రవహిస్తుంది. నారసింహవపు - నరశరీరము, సింహ శరీరము ఏక కాలమున ధరించినవాడు. మానవ జాతిలోని దోషములు సంహరింప దగినవి. ఒక తపస్వి,పండితుడు ఐన హిరణ్యకశిపుని దోషనివారణకై ఆయన తనపై సగభాగమును సింహ రూపమున ప్రకటించుకొని, నిరాయుధుడై, వాని మూఢత్వమును,దానికి ఆశ్రయమైన ఆసురీ సంపత్తిని దానిని పోషించి పెంచిన అతని తపస్సును అతన దేహమును చీల్చి పెగలించినాడు. ప్రకృతి, పురుషుడు తానే అగుటవలన ఆ ఆసురీశక్తిని తనలో విలీనం చేసుకున్నాడు. 245, 246 లలో నారాయణ, నర నామములు వరుసగా వస్తాయి. కృష్ణార్జునులు నారాయణ -నర మహర్షులే. తెలియబడే నారాయణుడు, తెసుకునే నరుడు విష్ణురూపములే.
20. అచ్యుత – (100, 318,552 నామాలు) అచ్యుత అంటే నాశనములేని వాడు, చ్యుతి లేనివాడు. ఒక పదవినుండి పడిపోవడంగాని, పోగొట్టుకొనడం కాని, దానిని నష్టపోవడం కాని, ఏదీ అయిపోవడంగాని, ఖర్చుకావడం కాని లేనివాడు, నిత్యుడు, స్థిరుడు. "శాశ్వతం శివమచ్యుతం" అని మంత్రపుష్పం లో చెప్పుకుంటాం. न च्यवते स्वरूपतो न गच्छति यः नित्य इति यावत् | ఆయనకు షడ్భావ వికారములు ఏమీలేవు. స్వస్వరూప నాశనమై, రూపాంతరము పొందడము వికారము. ఉదాహరణకు పాలు పెరుగుగా, మట్టిముద్ద కుండగా మారుట. ఈ వికారములు లేకపోవడానికి కారణము ఆయనలోనున్న అనంతమైన ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమ్మేళనమే. ఆయనకు చ్యుతి కలిగించే శక్తి సృష్టిలోనే లేదు. అందుకే ఆయన అచ్యుతుడైనాడు.
21. జనార్దన (126 నామం) - సర్వజనులచేత కోరబడేవాడు. రక్షించుటకై దుష్ట సంహారం చేసేవాడు. जनं जन्म अर्द्दयति हन्ति भक्तस्य मुक्तिदत्वादिति जनार्द्दनः । किंवा जनान् लोकान् अर्द्दति हररूपेण संहारकत्वादिति जनार्द्दनः । జనోత్పాదనకు సృష్టికర్త బ్రహ్మ వలె, భక్తులకు ముక్తి ప్రదాత ఐన విష్ణువువలె, సంహార శక్తి, లయకర్త ఐన హరుని వలె ఉండువాడు. (శబ్దకల్పద్రుమం)
22. ఉపేంద్ర (151 నామము) - ఇంద్రునకు సోదరుడై శాసించు వాడు कश्यपादृषेः अदितौ वामनावतारे इन्द्रस्यानन्तरं जातत्वात् तथात्वम् | వామనావతార సమయంలో అదితి కశ్యపులకు ఇంద్రుని అనంతరం జననము పొంది ఉపేంద్రుడైన వాడు.
23. హరి (650 నామము) - సమూలముగా సంసార దుఃఖమును (సంసారము అనెడు దుఃఖమును) హరించు వాడు హరి. అందుకే ఆయన పరమాత్మ. అందుచేత हरति पापानीति | (హరతి పాపానీతి .) పాపములను హరించువాడు హరి. అసలు నిఘంటువులో హరి శబ్దమునకు లేని అర్థము లేదు. అదే ఆయన విశ్వరూపమును తెలియజేయుచున్నది.
24. శ్రీకృష్ణ (57,550 నామములు) - కృష్ణ నామానికి నల్లనివాడు అని సామాన్యార్థం. అనంత ఆకాశములో అనంతకోటి కాంతిపుంజములు, నక్షత్రములు ఉన్నాయి. దానికి కోటి గుణితమైన అంధకారం ఆకాశాన్ని నీలంచేసింది. కృష్ణుడు ఆ అనంత ఆకాశ స్వరూపుడు. అనంతాకాశానికే విష్ణుపదం అనేపేరుకూడా ఉంది. రామ, కృష్ణ నామములకు శ్రీ చేర్చడమే ఉచితం. శ్రీతో చేరిన కృష్ణుడే ఉపాస్యమూర్తి. కృష్ణ నామానికి కృష్ణ ద్వైపాయనుడు, వ్యాసుడని కూడా అర్థము చెప్పుకోవచ్చును. వ్యాసుడు కూడా విష్ణువు అవతారమే. భారత భాగవతాల ద్వారా శ్రీకృష్ణుని చరిత్రను అందించినది ఆయనే. "వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం" అన్నట్లు భగవద్గీతను మనకు అందించినది కూడా ఆయనే. విష్ణుసహస్ర స్తోత్ర మహామంత్రానికి ఋషి వేద వ్యాసుడే. కృష్ణతత్త్వ విశేషాలను పూర్తిగా తెలుసుకోవడానికి ఒక జీవితకాలం కూడా చాలదు.
‘కాయేన వాచా మనసేన్ద్రియాణాం
బుధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యః శకలం పరస్మై
నారాయాణాయ ఇతి సమర్పయామి.

స్వస్తి.



Thursday, 30 April 2020

పిల్లలు - తలిదండ్రులు

                             పిల్లలు – తల్లిదండ్రులు

ఋజు మార్గములో నడిచే పిల్లల మరియు తల్లిదండ్రుల గూర్చి నేను ప్రస్తావించుటలేదు. అట్లు కాని కొన్ని  వాస్తవాలను గమనించుదాము. 
పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితేఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.

ఇది చాలా తప్పయిన విషయము . పిల్లలలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. వాళ్ళు గమనించినది ఆ వయసులో వ్యక్తపరచ లేకున్నా వయసు వచ్చిన తరువాత తమ జ్ఞాపకాలకు రెక్కలు సమకూర్చుకొంటారు. ఇంకొక జంట తరచూ పోట్లాడుకొంటూ

వుంటారు. అది కూడా ఆ శిశువు మనసులో నెలవైపోతుంది. పెరిగేకొద్దీ తాను విపరీతమైన 'అహం' తో సాటి వారితో తగవులాడుతాడు.

అదే ఒక గుడికి పోయినపుడు తల్లిదండ్రులు కాకుండా శిశువుతో 3,4 ధర్మాలు భిక్షగాళ్ళకు చేసే విధముగా చూడండి. పెద్దయితే వారిలో ఎక్కడ లేని దయ జాలి ఉంచుకొంటారు. సాటి మనిషికి సాయపడగలుగుతారు. ఆడపిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయించిన తరువాత మరులా క్రాపులు కటింగులు లేకుండా చూడండి. పిల్లలకు చిన్న యసులోనే పరికిణీలు కట్టించండి. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్త్నానము చేయించి మీకు తెలిసిన శ్లోకాలో పద్యాలో ఒక్కొక్కటిగా చెప్పించండి. ప్రతిచెట్టు అటు బీజము వల్లనైనా ఇటు గాలికో, ఎటూ గాకుంటే కాకి పిచ్చుకల ద్వారానో మొక్కగా మొలుస్తుంది. మొలిచిన తరువాత మనకు పరిశీలించే సమయము వుంటే మొక్క మంచిదా కాదా అని తెలుసుకొని దానిని వుంచటమో వూడపీకడమో చేస్తాము . మరి గమనించక పోతే ఏదోఒకరోజు ఆ చెట్టు గొడ్డలికెరగాక తప్పదు. మొక్క వంగుతుందికానీ మాను వంగదు కదా!

పిల్లలకు చిన్న వయసు లో తప్పక రామాయణ భారత నీతిచంద్రిక కథలు చెప్పండి, పెద్దలను ఇంటిలో వుంచుకొనేవాళ్ళు వారితో చెప్పించండి. ఇవికాక సమయస్పూర్తి, హాస్యము , మొదలగు గుణముల కాలవాలమైన కాళీదాసు, తెనాలి రామకృష్ణ కథలు తెలియజేయండి. ఈ కాలము పిల్లలకు అక్షర వ్యత్యాసాలే తెలియదు. మన భాష లోని అక్షరాలలో ప్రాణ మహా ప్రాణాలను గూర్చి పిల్లలకు ఈ కాలములో చెప్పేటప్పటికి చెప్పే వారి ప్రాణాలు పోతాయి. భాష నాశనమౌతుందన్న చింత రవ్వంత కూడా లేకుండా ఎంతో కాలము నుండి వస్తున్న భాషను కేవలము తమ పేరు ప్రతిష్ఠ కోసమే పాటుబడి, వున్న అక్షరాలలో కొన్ని తీసివేసియును, వాడుక భాష అన్న పేరుతోను, చనిపోయిన మహనీయులు చనిపోయి కూడా మనలను మన పిల్లలను చంపుచున్నారు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రుల మీద పడింది. తప్పక పిల్లలకు 'అమరము' ఆంధ్ర నామ సంగ్రహము' నేర్పించండి.ముఖ్యము గా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆధునిక కవులైన 'శ్రీ శ్రీ' 'దేవరకొండ బాలగంగాధర తిలక్' లాంటివారి కవితల లోని కొన్ని పదాలు నిఘంటువును ఆశ్రయించనిదే అర్థము చేసుకోలేరు. దిగంబర కవితలు నగ్న కవితలు ఎందుటాకులైపోయినాయి. పచ్చగా ఎప్పటికీ ఉండేది కళ్యాణ సాహిత్యమే.

తండ్రి పిల్లలకు సినిమా కథానాయకుడు. అతనే ఆదర్శము. మరి ఆతండ్రి పిల్లలను పెళ్ళాన్ని పార్టీలని పబ్బులని, ఫంగ్షన్లని తీసుకు పోతున్నాడు. అవి చూసి పిల్లలు ఏమి నేర్చుకొంటారు అనే ఆలోచన వారికి ఉందా! సినిమా మంచిదయితేనే పిల్లలతో కూడా వెళ్ళండి. చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకోవద్దు.ఒక కొడుకు ఈ విధంగా తండ్రి తో అంటున్నాడు.

పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు

"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి

నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు

కలిగియున్న దడుగ గలుగుదనెను

ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది.

కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' సహవాస దోషయా పాప గుణాభవంతు’ అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు.

నీతి శాస్త్రము ఈ విధముగా చెబుతూ ఉంది:

రాజవత్ పంచవర్షాణి దశ వర్షాణి  తాడవత్ l

ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదాచరేత్ ll

పుట్టినది మొదలు 5 సంవత్సరముల వరకు, అమ్మాయి గానీ అబ్బాయి గానీ రాజు వలె లేక రాణి వలె చూచుకోవాలి. తరువాత 10 సంవత్సరములు అదుపాజ్ఞలలో, అవసరమైతే కొట్టియైనా సరే, ఉంచుకోవాలి. ఆపై మాత్రము తల్లిదండ్రులు వారి సంతానముతో ప్రాణ స్నేహితుల వలె మెలగాలి. శాసించేది శాస్త్రము. ‘Science  ‘Subject to Change’. అందుకే పాశ్చాత్యులది ‘Moral Science’ , మనది ‘నీతి శాస్త్రము’.

ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా? అట్లని అసలు బయట తిండి తిననే వద్దు అనుటలేదు. ఎప్పుడో  ఒకసారి అంటే పరవాలేదు. ఎప్పుడూ అంటేనే వస్తుంది చిక్కు.
గతములో నేను వ్రాసిన పద్యము సందర్భోచితముగా దలచి మీముందు ఉంచుచున్నాను:

ఈ నాటి భోజనపు అలవాట్లను గూర్చి నేను వ్రాసిన పద్యము సందర్భోచితమని దలచి  మీ ముందుంచుచున్నాను. ఒకసారి గమనించండి.

పిజ్జాలు బర్గర్లు ప్రియ భోజనమ్మాయె 

మంచిజొన్నల రొట్టె మరుగు పడియె

నూడుల్సు ఫాస్తాలు నోరూరగా జేసె

సద్దియంబళులెల్ల సమసి పోయె 

చాక్లెట్లు కేకులు చాల ఇష్టమ్మాయె

వేరుశెనగలుండ వెగటుగలిగె

కెంటకీ చికెనేమొ కీర్తనీయంబాయె 

వంట ఇంటిన వంట మంట గలిసె 


వైను బ్రాందీల విస్కీల వరద మునిగి

స్టారు హోటళ్ళ కేగేటి సరళి పెరిగి 

పనికిమాలిన యలవాట్ల ఫలితమంది

ఆసుపత్రుల పాలైరి అధిక యువత 

 పిల్లలలో అతి తక్కువగా తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది.

ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది.

వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నమని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యమును ఎట్లు ఏలగలవు' అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు.

మంత్రి రెండవ రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే .

ఇంకా వ్రాయవచ్చు గానీ ఇదే ఎక్కువైనదని ఈ పద్యము తో విరమిస్తున్నాను.

పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు

ప్రతిభ గలిగినట్టి ప్రభుత మనది

నన్నయ తిక్కన్న నాణెంపు కవితల

కాలాన గలిపేటి ఘనత మనది

శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము

పడనీక కాపాడు పాట మనది

అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత

యనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు

స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది

విల్వలకు వల్వలెల్లను విప్పివేసి

గంతులేయించు చున్నట్టి గరిత మనది

మనదు సాస్కృతి నంతయు మరచి పోయి

నాగారీకమ్ము కౌగిట నలిగిపోయి

తాతలను వారి చేతల త్రవ్వి గోయి

పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె

స్వస్తి.

 

5 సంవత్సరముల క్రితము వ్రాసిన ఈ వ్యాసముపై స్పందన ఈ దిగువ పొందుపరచినాను.
పూర్ణ చంద్ర రావు మంత్రాల
పూర్ణ చంద్ర రావు మంత్రాల kaani ee rojullo puttina 6 va nelalone crushlo cherchi thalli thandri office ki velthunnaru inka pillalaki thalli thandrulameeda  gouravam gaani peddalu cheppe maata vinaalani ela anpisthundhi

Ranga Prasadarao చాల చాల మంచి విషయాలు చక్కగా   వివరించారు...గురువుగారు శ్రీ గరికపాటి గారు చెబుతున్నట్లు.....పిల్లలందరికీ ఈ వేసవి సెలవల్లో భాస్కర సుమతి దాశరధి శతకాలు ప్రతి పదార్ధం వివరించి బట్టీ పట్టేలా చేస్తే కూడా బాగుంటుందని అనుకుంటాను... 

 Rama Devi Cheruku Ramamohanrao గారు మంచి విషయాన్ని పంచినందుకు, ధన్యవాదాలండి... కాని ఆచరించే వారు తక్కువ.. ఎవరిని తప్పు పట్టాలని కాదండీ... ఆరోగ్యమైన సంస్కారవంత మైన ఇంకో తరం కోసం ఎవరు ఆలోచించడం లేదు.. పిల్లలకి కావలసినవి ఇవ్వడం అంటే డబ్బుతో చేసేవే ఎక్కువ అదే వారికి సులువు.. మీరు చెప్పినవి చేయడానికి సమయం కావాలి.... అదే మా దగ్గర లేదు అనేవాళ్ళు కోకొల్లలు.... ఇదివరకు డబ్బు మాత్రమే సమస్య.. ఇపుడు మాత్రం డబ్బు కంటే సమయము లేకపోవడమే (లేదు అనడమే ) పెద్ద సమస్య..
Cheruku Ramamohanrao అమ్మా డబ్బు సమయాన్ని హరించుతూవుంది. కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి ఆవైపు మరలదు .
దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. 'నా' నుండి 'మన' చేరవలేనంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరము .కష్టనష్టాలు వుంటాయి కానీ కడకు సంస్కృతి నిలిపిన సంతృప్తి మిగులుతుంది.
Krishna Murthy చాలా మంచి సందేశం ...వీటితో పాటూ వీలైతే ఏదైనా ఒక శతకం నుండి ఒక పద్యం కూడా అందిస్తే బాగుంటుందని నా కోరిక...నమస్సులు...
B V Narasimha Rao Ittanam Batti chettandi babu, Manchi toraga yekkadandi. Anta America vallu yekkuvai poyarandi. Machi Nearchu Kontea Manchidea.
శ్రీ లు పగిడి Good chala baaga chepparu.

Mohan Sandya Mana samskruti sampradayalu gurinchi chala bagachepparu. Pillalanu ela terchi diddali annavisayalu chala baga chepparu neti balale repati pavurulu. Andaru mella alochiste mana bharata mata garvapade navataram munu mundu chudagalamni cheputunna. Mee lanti valla bodanalu chala avasaram. Marinni manchi vakyalu telupagalarani korukuntunna.

Thursday, 9 April 2020

కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్

       కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్
https://cherukuramamohan.blogspot.com/2020/04/blog-post_9.html
పైశీర్షికలోని విషయములగూర్చిచర్చించుటకుముందు నా ఈ పద్యమును చదవండి.
అంధుల చేతి దీపము మహా బధిరాళి వినంగతూర్యముల్
బంధుర వేద శాస్త్ర ఘన పాఠము మూగ వచింప బూనుటన్
బంధమునెంచనట్టి బహు బంధు సమూహపు సాయమందుటన్
కంధిన మంచినీరు మన కల్పననైన గనంగ సాధ్యమే!
పైన తెలిపిన శీర్షికకు ఈ పద్యానికి గల సంబంధమేమిటి అన్నది మన మనసులో వెనువెంటనే ఉద్భవించే సందేహము. అయినా సంబంధము లేని విషయముతో ఎవరూ ప్రారంభించరు కదా! ఇల్లు అన్నతరువాత నీభార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు అన్న ఒకప్రత్యేక అనుబంధముంటుంది, అది సహజము. అదేవిధముగా అపూర్వవిజ్ఞాన ఖని, అనంత వేదరాశిని గల్గిన మన సనాతన ధర్మమును చిన్నచూపు చూస్తే, తల్లిచన్ను గుడిచి తల్లి రొమ్మును గుద్దినట్లే! ఈ వాస్తవమును ఒకసారి గమనించండి. ఎంతటి ఘోరములు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయెడువారు కొందరయితే సర్వమత సామరస్య ప్రబోధకులు కొందరు. ఒకచేయి కదిలిస్తే శబ్దము రాదు, రెండు చేతులు తగు శక్తితో కలిస్తేనే శబ్దము. ఈ మాట ఇంచుమించు 2,000, మరియు 1500 సంవత్సరముల నాడు ప్రభవించిన అన్యమతముల విషయములో వాస్తవము. ఈ విషయమును గమనించండి.
   మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ్ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం అన్న పాటను వారు రచించి ఒక బాణీ కట్టి మనచే పాడింఛినట్లు మనము విని ఉంటాము. మరి ఈ పాటలో అల్లా కూడా ఉన్నాడు కదా! ఎపుడైనా ముస్లిం ఎవరైనా పాడగా విన్నారా! లేక ఈ పాటను పూజ్య బాపూజీ మనకోసమేఅంటే హిందువుల కోసమే వ్రాసినారా! ఆపాట యొక్క వాస్తవ రూపమును గమనించండి:
 రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారుకానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట నేను వినుట జరుగలేదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.
అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.
రఘుపతి రాఘవ రాజారాం -  పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం -  గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం - భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం - జయ జయ రాఘవ రాజారాం 
మన నాయకులు,కరోనా మనలను కరవక ముందే, హిందువులను  ఈ విధమయిన  క్వారంటైన్ లు సృష్టించి అందులోనే కలకాలము ఉండజేయ తలచినారు. జరుగవలసిన అన్యాము ఇంత అంత అని చెప్పలేనంత జరిగిపోయినది. మన భారత ప్రప్రథమ ప్రదానియగు జవహర్లాల్ గారి మంత్రివర్గములో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు విద్యా శాక్ల్హమంత్రి. ఆయన ఎంతో జాగరూకత వహించి ముస్లీముల దౌష్ట్యమును కప్పిపుచ్చి, హిందూ రాజుల శౌర్య సాహసాలను హిందూ మహాసముద్రములో ముంచి, ముస్లిం ఓట్లు ఇప్పటికీ కుహనా లౌకిక వాదముతో మనలను మభ్యపెట్టుటకు మన వెంట ప్రచ్ఛన్నముగా ఎందఱో మహనీయులు ఉన్నారు. అయినా ఇప్పుడిప్పుడు ఆ బంధనమునుండి కొద్దికొద్దిగా విముక్తులమగుచున్నాము. ఇకనయినా మనము అన్నది మనసులో నిలుపుకోకుంటే మనకు 
మనది అన్నది ఏదీ ఉండదు. కావున ఆత్మస్థితుడయిన ఆ పరమాత్మను సాక్షిగానెంచి మనము మన ధర్మాచార నిబద్ధత కలిగియుందాము.
మిగిలినది రేపు .............
    కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-2
ఇక అసలు విషయానికి వద్దాము. అసలు తబ్లిఘీ అంటే ఏమిటి అన్నది మొదట తెలుసుకొందాము. నిఘంటువు ప్రకారము తబ్లిఘీ అంటే దైవ వాక్కును ప్రచారము చేయుట (Preaching Gods dictums) అని అర్థము. దీనికి సంబంధించిన కట్టడము తత్సంబంధమైన మసీదు దిల్లీ లోని నిజాముద్దీన్ లో ఉంది. దీనిని నిజాముద్దీన మర్కజ్ అంటారు. అంటే తబ్లిఘీల నిజాముద్దీన్ కేంద్రము(Markaz=Center కేంద్రము) అని అర్థము. ఇక్కడ జరిగిన సమావేశమునే ఉర్దూ లో  జమాత్ (Jamaat=Congregation, సమావేశము) అంటారు. तबलीग करना मतलब मुसलमानों को कुरान-हदीस की बातें बताना। అన్న ఈమాట Markaz Nizamuddin
@nizamuddinmarkazdelhi (सलमानों को कुरान-हदीस की बातें बताना।) నుండిగ్రహింపబడినది. తబ్లిఘి జమాత్ అనధికారిక సంస్థాగత నిర్మాణాన్ని అనుసరిస్తుంది మరియు సంస్థాగత అంతర్ముఖ సమాచార అచ్ఛాదనమును పాటించుతుంది (introvert institutional profile). దీనిని "వంశానుక్రమఅధినాయకత్వ నిర్ణయ విధానాలపై తక్కువగా ఆధారపడే స్వేచ్ఛామత ఉద్యమము" గా వర్ణించబడినది. ఇది ప్రజాబాహుళ్య వార్తారంగములకు   దూరము  ఉంటుంది.  దాని కార్యకలాపాలు మరియు సభ్యత్వ వివరాలనుప్రకటించదు.  ఒక సంస్థగాతబ్లిఘీ జమాత్ విరాళాలు కోరదు మరియు ఎవరికీ నిధులు ఇవ్వదు. వాస్తవానికి సభ్యులు తమ ఖర్చులను సొంతముగానే  భరించాలి. అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేనందున మరియు అధికారిక సభ్యత్వ గణన తీసుకోబడలేదు కాబట్టిఖచ్చితమైన సభ్యత్వ గణాంకాలు తెలిసే అవకాశమే లేదు.  ఈ ఉద్యమపెద్దలు  పత్రికా సమావేశాములయందు పాల్గొనదు.  అధికారికంగా గ్రంథాలను ఎప్పుడూ విడుదల చేయలేదుఅయినప్పటికీ ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రచురణలు ఉన్నాయి (సాధారణంగా దీనిని తబ్లిఘి నిసాబ్ [తబ్లిఘి పాఠ్యక్రమము] అని పిలుస్తారు. పుస్తక అభ్యాసానికన్నా ఎప్పుడూ
వ్యక్తిగత సంభాషణలకు ప్రాధాన్యత నిస్తారు. వీరి అతి ముఖ్యమయిన 6 సూత్రములను ఈ క్రింద పొందుపరచుచున్నాను.
1.కలీమా: త్రికరణ శుద్ధిగా(Conviction)  అల్లాను నమ్మి మరియు ఖురాన్ చెప్పిన జీవనశైలిని అవలంబించండి.
2.నమాజ్: నిర్దేశించిన ప్రార్థనలు క్రమము తప్పక చేయటం.
3. ల్లిమ్ మరియు జిక్ర్‌: దైవ చింతనతో కలిసిమెలిసి జీవించడము. ఒక  అవగాహనదగ్గరితనంఒక అనుబంధము,మరియు దేవుని యొక్క మారిఫా అనగా జ్ఞానము అనగా దేవుని గూర్చిన అవగాహన సాధన..
4.ఇక్రమ్ అల్-ముస్లిం [ముస్లింలను గౌరవించడం]: ప్రేమకరుణగౌరవంఔదార్యం మరియు గౌరవము అన్న ముఖ్యాంశములు కలిగి సాటి ముస్లిములను గౌరవించుట.
5.సాహిహ్ నియాహ్ / ఇఖ్లా [దేవునికి మాత్రమే]:  చిత్తశుద్ధితో దేవునిమంచివైపునకుస్వీయ పరివర్తన కోరుతూ (ముఖ్యంగా ఇబాదా ముమలాత్) ప్రార్థనల ద్వారా ఒకరి జీవితాన్ని సంస్కరించడం ".
6. దావా తబ్లిగ్ / తబ్లిగ్-ఇ-వక్త్ [ఆహ్వానం మరియు రాకపోకలు]: పండితులను (మౌల్వీలు)ఆహ్వానించడం మరియు వారి ప్రవచనానుసారము నడచుకొనడము, - ఆ విశ్వాసము ఆధారంగా జీవితాన్ని గడపడానికి మరియు దాని సద్గుణాలను నేర్చుకోవడానికిముహమ్మద్ అడుగుజాడలను అనుసరించి మరియు అతని సందేశాన్ని ఆచరించడాన్ని, (A) రోజూ వరకు మానవజాతి అంతా ఆరు లక్షణాలలో మొదటి ఐదు సూత్రములను పాటింప నిర్దేశించుతూ వుంది. (B) మానవాళి అంతా ఆ విధముగా ఆచరించి మోక్షాన్ని పొందిస్వర్గాన్ని సాధించడం ద్వారా నరకము లోని దావానలము నుండి  రక్షించబడతారు.
(ఇంగ్లిష్ Wiki కి నా తెలుగు అనువాదము)
ఇక పైన తెలిపిన విషయముల గూర్చి విశ్లేషించుకొందాము.
ప్రప్రథమముగా నేను తెలుసుకొన్న మేరకు ఖురాన్ లో జమాత్ లను ప్రారభించమని లేదు. మరి అదే లేనపుడు ఇమామ్ లు  ఎక్కడనుండివస్తారు.
ఇక పైన చెప్పిన 6 విషయములను లేక సూత్రములను ఖురానే చెబుతుంది. మరి అవే సూత్రములను గూర్చి వీరు చెప్పవలసినది ఏముంది. 
1వ సూత్రము అల్లాను నమ్మి ఖురాను చెప్పిన జీవనశైలిని అనుసరించమని ఉంది. ఖురాను దాదాపు 1500 సంవత్సరము నాటి మత గ్రంధము. అందు ఇజ్రాయిల్ పాలస్తీనా, అరబ్ దేశముల నాగరికత, నైసర్గికము అగుపించుతాయి కానీ మన రీతి రివాజును గూర్చిన ప్రస్తాపన అందు లేదు. వారి మడమల వరకు దుస్తులు కూడా ఇసుక తూఫాన్ నుండి రక్షించుకొనుటకే ప్రత్యేకముగా తయారు చేయబడినవి. కానీ మన దేశస్థులను మార్చుటకు వారు ఎంతో క్రూరమయిన విధానములు అవలంబించినారు అన్న మాటకు చరిత్రయే సాక్ష్యము. ముస్లింలలో భట్, రాజ, మొదలగు పేర్లకు చివరన ఉండే ఆ ఉపనామములు వారి పూర్వులు హిందువులలో ఏ తెగవారు అన్న విషయాన్ని తెలుపుతాయి. అసలు వారిలోని 90% శాతము తమ పేర్లకు చివర అరబిక్ పేర్లను తగిలించుకొంటారు గానీ హిందుస్తానీ అని తగిలించుకొంటారా! మరి వీరి తండ్రులు అక్కడి వారేనా! ఈ రోజుకు కూడా తాజమహల్, చార్మినార్ మొదలయిన కట్టడములను వారుహమారాహై అనే చెబుతారు. తైమూర్, ఇబ్రహీం లొదీ, బాబరు, ఔరంగజేబు, అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దుశ్చర్యలు మాటల కందనివి. ఈ సందర్భములో, ఈ మట్టిలో పుట్టి ఈ తల్లి భిక్ష తింటూ తమ కుమారునికి, క్రూరాతి క్రూరుడై లక్షలమంది హిందువులను కిరాతకముగా చంపి, ఎందఱో స్త్రీలను మానభంగము గావించిన, తైమూరు పేరు పెట్టుకొనుట ఎంతవరకు సమంజసము. చన్నుగుడిచిన తల్లి రొమ్మును గుద్దుట కాదా!  పైన తెలిపిన ప్రతి ముస్లిం పాలకుడూ అత్యంత కిరాతకుడు. చివరి ముఘల్ క్రూర పాలకుడగు ఔరంగజేబు, 17 మార్లు దండయాత్రలు జరిగిన సోమనాథ దేవాలయముపై చివరి సారిగా దండయాత్రను జరిపి నాశనము చేసిన నిర్దయుడే కాక, శివాజీ కుమారుడు మహా పరాక్రమశాలియగు శంభాజీని  మోసముతో బంధించి ఆ మహానుభావుని శరీరమును తలక్రిందులుగా సమాంతరముగా నడుచు రెండు ఒంటెలకు తలక్రిందులుగా కట్టి ఆ ఒంటెలను నడిపించుచూ ఆ మహానీయునిపై మానవ మూత్రమును చల్లించిన చరిత్ర కలిగినవాడు. ఇట్టి నీతిమాలిన చర్యలను ఖురాన్ ప్రోత్సహించిందా! అట్లు ప్రోత్సహించియుంటే దానికి పవిత్రత నెవరయినా ఆపాదించగలరా! అట్లు కాక ఖురాన్ ను  కాదని పైన తెలిపిన మహానుభావులు ఇష్టానుసారముగా వ్యవహరించియుంటే వారు ముస్లీములు అన్న పదమునకు అర్హులౌతారా!   

ఇక రెండవ సూత్రమును గూర్చి ముచ్చటించుదాము. నమాజ్ అన్న పదము నమస్ అన్న సంస్కృత దజన్యము. 
మిగిలినది మరొకమారు.........
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-3
ఇది తబ్లీఘీలకు మాత్రమే పరిమితము కాదు.
ముస్లీములందరూ పాటించవలసిన బాధ్యత. అసలు ముస్లీములలో షియా సున్నీలు ప్రధాన తెగలు. ప్రపంచ ముస్లిం జనాభాలో 70% సున్నీలు 20% షియాలు 10% మిగతవారు. సున్నీలలో 4 తెగలు. అవి హనఫీషాఫయీమాలికీ హంబలీ షియాలలో జాయిదీనిజారి ఇష్మాయిలీహఫీజితయ్యబి,అన్నవేకాక సూఫీ కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కలిగియుంది. ఇక నమాజుచేయుటకు మసీదులో పురుషులకు మాత్రమే ప్రవేశము. స్త్రీలకూ లేదు. మొన్న జరిగిన తబ్లిఘీ సమావేశములకు వచ్చిన వారంతా మగవారే! మరి ఈ నిబంధన ఖురాన్ లో ఉంటే అది సమంసమా! ఒకవేళ లేకుంటే మరి ఖురాన్ ను అతిక్రమించినట్లు కాదా!
మూడవది ల్లిం మరియు జిక్ర్ అంటే దైవ చింతనతో కలిసిమెలిసి జీవించడము, దగ్గరితనము కలిగియుండటము మొదలగునవి. రాశిగా బిరియానీ వండి ఒక చాప పైన పరచి ఉమ్మడిగా తినుట ఇందు ఒక భాగము. నిజానికి ఇది పాటించదగిన ఆరోగ్య సూత్రమేనా! దీనివల్ల అంటురోగములు వ్యాపించే అవకాశము లేదా!
   మనము నిశితముగా గమనించితే 4వ సూత్రమగు ఇక్రం-అల్-ముస్లిం, ముస్లిములను గౌరవించమని చెబుతుంది. కాఫిర్లను గౌరవించమని ఖురాన్ లో లేదు. కాఫిర్ అంటే ముస్లిం కాని వాడు. మరి కాఫిర్ మానవుడు కాదా! సాటి మానవుని గౌరవించక పోవుటయే కాక, బందీలుగా దొరకిన హిందూ రాజులను, చిత్రహింసల పాలు చేసిన ఔరంగజేబు తైమూరు వంటి నరరూప రాక్షసులను ఖురాను సాక్షిగా నిజమయిన ముస్లిములని అనగలమా! ముస్లిములు కాని వారితో ఆవిధముగానే వ్యవహరించవలెనని ఉంటే అమానుషమగు ఆదేశములనిచ్చిన ఆ గ్రంధము యొక్క వాస్తవముల గూర్చి పరిశోధించనవసరము లేదా!
ఐదవది సాహిహ్ నియాహ్ / ఇఖ్లా [దేవునికి మాత్రమే]. ఈ విషయమును ఏ మతమైనా బలపరుచుతుంది. ఇందులో స్వపర భేదములు ఉండరాదు.
ఇక ఆరవది, దావా తబ్లిగ్ / తబ్లిగ్-ఇ-వక్త్ [ఆహ్వానం మరియు రాకపోకలు]: పండితులను (మౌల్వీలు)ఆహ్వానించడం మరియు వారి ప్రవచనానుసారము నడచుకొనడము. మరి ఇటువంటి సభలను బహిరంగముగా కాక, మసీదులలో రహస్యముగా ఏర్పాటు చేసుకొనవలసిన అవసరమేమి?
ఇవన్నీ కాకుండా ఈ తమ్ముని పైజామా అన్న కుర్తా, మీసాలు లేకుండా గడ్డము మాత్రము అడ్డదిద్దముగా పెంచుకోవడము, ఇక్కడ అక్కడ అనకుండా ఎక్కడంటే అక్కడ ఉమ్మడము చేయమన్న నిర్దేశము ఏమయినా ఉన్నదా!
ఇక మనదేశము గొప్పదనమును ఒకసారి చూద్దాము.

దాదాపు ముస్లీములు 800 సంవత్సరములుమనలను ఏలినా, మనతో ఎంతో క్రూరముగా వ్యవహరించినా మనము మన ధర్మమును కాపాడుకొన్న ఏకైక దేశము మనది.
కర్బలా యుద్ధములో హిందూ సారస్వత బ్రాహ్మణుడైన రహిబ్ సిద్ధ దత్ హుస్సేన్ కు శత్రువగు యాజిద్ తో పాయిరుసల్పి తన ౭గురు కుమారులను పోగొట్టుకొన్నాడు. ఆకారనంగానే హుసేన్ బ్రాహ్మణులు అన్న పేరు ప్రచారములోనికి వచ్చింది.
సిరియాలో ఇప్పటికీ కఫ్ర్ హింద్ అనే ప్రాంతము ఉన్నది. వారు చంద్రగుప్త మౌర్యుని పనుపున హుసేన్ ను చంపినా యాజ్ద్ మరియు అతని ముఖ్య అనుచరులపై పగతీర్చుకొనుటకు వెళ్లి, పగ తీర్చుకొని అక్కడే ఉండిపోయినారని చెబుతారు.
  మోసపూరితమైన కర్బలా యుద్ధములో ఇమాం హుస్సేన్ మరణించిన తరువాతఆయన కుటుంబమునకు శరణు నొసగినది భారతదేశములోని సింధ్ ప్రాంతమును పరిపాలించుచుండిన రాజా దాహిర్. ఆ కృతజ్ఞత అరబ్బుల మనసులో ఉండియుంటే మనపై వారు దండెత్తేవారే కారు.
కేరళ రాష్ట్రములోనిభారత దేశములో అత్యంత ప్రాచీనమైన చేరమాన్ జుమ్మా మసీదుత్రిషూర్ జిల్లాకొడుంగల్లూర్ తాలూకామేతాలా లో 629A.D. లో నిర్మింపబడినదిఅప్పటి రాజుయొక్క అనుమతితో. కానీ పోర్చుగీసు వారు 1504 లో దానిని సమూలముగా నాశనము చేసినారు.
ఈ విధముగా చెబుతూపోతే ఇంకా ఎన్నో ఉదంతములు మనకు తెలియవస్తాయి. కానీ మనము పొందిన ప్రతిఫలము, దారుణ మారణ హోమము, నిర్దాక్షిణ్యముగా స్త్రీల శీలాపహరణ, లక్క్కక్షాల కోట్ల సంపదలను కొల్లగొట్టటము.
ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతమంతా మనతో నాడు ముస్లిములు మన సహాయమునకు ప్రతిఫలముగా ఎట్లు వ్యవహరించినారు అన్న విషయమును వెలుగులోనికి తెచ్చుట నా ఉద్దేశ్యము.

ఇప్పుడు ఇక ముల్లా మొహమ్మద్ సాద్ మరియు తబ్లిఘీలను గూర్చి తెలుసుకొందాము.
మౌలానా సాద్ పూర్తి పేరు మౌలానా మొహ‌మ్మ‌ద్ సాద్ ఖంద‌ల్వి.  త‌బ్లిగీ జ‌మాత్ వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ ఇలియాస్ ఖంద‌ల్వి మునిమ‌న‌వ‌డే మౌలానా సాద్‌. భార‌తీయ ఉప‌ఖండంలో సున్నీ ముస్లింలకు చెందిన అతిపెద్ద మ‌త సంస్థ ఇది. 1927లో మౌలానా ఇలియాస్ ఖంద‌ల్వి త‌బ్లిగీ జ‌మాత్‌ను ప్రారంభించినారు.  యూపీలోని షామ్లీ జిల్లాలోని ఖాంద్లాలో ఇలియాస్ పుట్టారు. దాంటో ఆయ‌న పేరు చివ‌ర్లో ఖంద‌ల్వి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.
ఈ తబ్లీఘీ జమాత్ బ్రిటీషు వారి కాలములో వారి ఆశీర్వాదముతో మొదలయ్యింది. నేటికి కూడా అది రిజిస్ట్రేషన్ కాలేదు. 1927 కు ముందునుండి కార్యకలాపాలు సాగిస్తున్నా బ్రిటీషు ప్రభుత్వమూ ఆ సంస్థను తమయొక్క అభిమతమునకు అనుగుణమైన సంస్థగా భావించి దాని స్థాపనకు తల ఊపినారు. వారు ఈ సంస్థనుచాపక్రింద నీటిలా ప్రాకుతూ హిందువులను ప్రభావితముచేసి ముస్లీములుగా మార్చుటయేగాకతమపాలనకు వ్యతిరేకముగా పనిచేయదు అని అర్థము చేసుకొని  మన సనాతన ధర్మమునకు వ్యతిరేకముగా ఒక బలమైన విషబీజమును తబ్లిఘి పేరుతో నాటినారు.

అసలు ఏ నిజాముద్దీన్ పేరుతో డిల్లీలో ఈ మర్కజ్, రైల్వే స్టేషన్ మొదలయినవి ఉన్నాయో, ఆతడు హిందువులు కాఫిర్లని బోధచేసి వేలాదిమందిని చంపించినాడు. ఈ నిజాముద్దీన్ కు అత్యంత ప్రియతమ శిష్యుడు మరియు తబలా, ఖవ్వాలీ మొదలగునవి కనిపెట్టి భారతీయ సంగీతమునకు ఎంతో సేవచేసిన వానిగా మనచేత పాఠ్యాంశములలో చదివించబడిన అమీర్ ఖుస్రో ఎందఱో హిందువుల ప్రాణములను తీయుటయేగాక హిందువులను చంపిన సుల్తానుల ఘనతను ఎంతగానో పొగుడుతూ గానము చేసినాడు.
మిగిలినది మరొకసారి.....
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-4
ఇంతటి చరిత్ర కలిగిన ఈ తబ్లీఘీ లో 2015 నవంబరు16 న 13 మంది సభ్యులు ఉండవలసిన  షూరా(Board of Members) లో కొందరు సభ్యులు వయోభారముతో సహజ మరణము పొందుటవలన వారికి ప్రత్యామ్నాయముగా క్రొత్త సభ్యులను ఎన్నుకొనుటకు ఏర్పాటు చేసిన సమావేశములో సాద్ మిగతా సభ్యుల అభిమతమునకు విరుద్ధముగా అనను తబ్లీఘీ కి అమీర్ గా ప్రకటించుకొనిపగ్గములను అందుకొన్నాడు. ఇంచుమించుగా ఇతనికి 214 దేశములకు చెందిన 100కోట్ల అనుచరులున్నారన్నది అంచనా.
పెద్ద పెద్ద ముస్లీములంతా ఈ సంఘ సభ్యులు. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళగు షహీద్ ఆఫ్రీదియుసూఫ్ యోహన్న( తబ్లిఘి ఆకర్షణ వల్లనే క్రిస్టియానిటి వదలి ఇస్లాం పుచ్చుకొని మొహమ్మద్ యూసుఫ్ అయినాడు) సక్లైన్ ముస్తాక్ఇంజమాముల్ హక్ ఈ విధముగా ఎందఱో దీని సభ్యులు. మౌలానా మొహమ్మద్ సాద్ నేడు అపారమైన ధనవంతుడు. ఆయనపై చట్టపరముగా కేసులు కూడా ప్రభుత్వ శాఖలే కోర్టులో వేసినాయి. ఇప్పుడు కదిలించిన ఈతీగ,ఈ లాకౌట్ ముగిసిన తరువాత డొంకను కదిలించబోతుంది.
మార్చి నెల 10-15 తేదీల నడుమ ఈ తబ్లిఘీ  సమావేశము ఏర్పాటు చేయబడినది. ఇంచుమించు 250 విదేశములనుండి సభుయులు ఈ సమావేశామునకు వచ్చినారని అంచనా.
దాదాపు 2000 సభ్యులవరకు దేశవిదేశములనుండి వచ్చినారని అంచనా. ఇంకా ఎక్కువమంది కూడా వచ్చియుండవచ్చునని ప్రచార సాధనాల భోగట్టా. ఆ సందర్భమున మౌలానా సాద్ ఈ విధమగు ప్రకటనలు ఇచ్చినట్లు క్రింద కనబరచిన ప్రచార మాధ్యమాలు తెలుపుచున్నవి. దానితోబాటు ఆయన యొక్క నడవడికను కూడా OUTLOOK తెలిపిన విషయములను యథాతథముగా ఆంగ్లములోనే ఉంచుచున్నాను. మొదట ఆయన ఆదేశమును నాకు తెలిసిన, YOUTUBE లో నేను విన్న మేరకు, నా పరిమిత పరిజ్ఞానముతో ఆయన ఉపదేశామును తెలుగుల్కో తెలియజేయుచున్నాను.
మసీదులో సమావేశమగుటవల్ల కరోనా వ్యాప్తి చెందదు. ఒకవేళ ఎంతో నమ్మకస్తుడైన గొప్ప వైద్యుడే చెప్పినా మసీదు వదలనవసరము లేదు. ఈ మహమ్మారి కారణముగా మసీదు వదిలే ఆలోచనే మనసులోనికి రానివ్వవద్దు. ఒకవేళ ఈ వ్యాధితో మరణమే ఎదురైనా మసీదుకు మించిన మంచిస్థలము దొరుకదు. 18 వ తేదీన మసీదులో సమావేశమయిన వారిని మసీదు వదిలి పోకుండా నిలిపినాడు. మౌలానా మొహమ్మద్ సాద్ ను గూర్చిన మరికొన్ని వివరాలు తెలుసుకోండి. వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు దేశాలనుండి వచ్చిన సభ్యులను మర్కజ్ లోనే వదిలి, మార్చ్29 న పోలీసులు మర్కజ్ తనిఖీకి వచ్చేసమయానికి తాను అంతర్ధానమైనాడు.
ఆయన వృత్తి దేవుని ప్రబోధమును వ్యాపింప జేయుట. ఎంతో సాధారణమైన జీవితమును అటువంటివారు గడుప వలసి ఉంటుంది. ఈయన విలాసవంతమగు జీవితమును చూస్అతె విస్తుపోతాము. ఆయనకు డిల్లీలో రేడు పెద్ద భవనాలు మరియు విలాసవంతమైన క్షేత్ర ప్రసాదము(Farm House) కలిగియున్ఆడుతయే గాక అత్యంత ఆధునికమగు, విశాలమైన ఈత కొలను మెర్సిడిస్ బెంజ్ వంటి అనేకమైన బారులు తీరిన కారులు కలిగియున్నాడు. మౌలానా అన్న పదమును అసలు ప్రపంచ దేశాలలోని ఎవరూ తమ పేరుకు తగిలించుకోరు. ఎందుకంటే వారి భాషలో 'మౌలానా' అన్న పదము అరబ్బీలో వ్రాయబడిన ఖురాన్ లో 'అల్లాకు మాత్రమే వాడబడింది. అదికూడా రెండుమార్లేనట. 'నా' అంటే మాయోక్క అని అర్థమట. మరి ఎవ్వరూ ఇవ్వకుండా పేరుకు ఇంత పవిత్రమైన బిరుదులు తగిలించుకొనవచ్చునా!

మిగిలినది మరొకరోజు.....
కరోన-నిజాముద్దీన్ మర్కజ్-తబ్లిఘీ జమాత్-5
ప్రసారమాధ్యమములనుండి గ్రహించిన వార్తలను యథాతథముగా చదువండి.
The Markaz chief Saad had allegedly in his sermon urged Muslims to defy lockdown and come out to pray together to break the COVID-19 curse. He termed the pandemic as a 'conspiracy to separate Muslims and make them untouchable' but also added that those who have been detected with Coronavirus have to be quarantined.
republicworld.com d.Aprl2, 2020

Deemed as one of the most influential movement in Muslim world, Tablighi Jamaat was established by Maulana Muhammed Ilyas Khandlawi, the great grandfather of Maulana Saad. Tablighi Jamaat was an offshoot of Deoband movement and aims at revival of the true Islam as perceived by the Prophet Mohammed.

Bypassing rituals and regulations of Tablighi Jamaat, Maulana Saad ignored all orders of Shura (central council) of Jamaat, and declared himself the Amir to capture the coveted seat at the Markaz Nizamuddin in November 2015 as he turned 50.

"He insulted the elders, scholars and the members of the Shura. The Amir is elected on the advice of the Shura but he (Maulana Saad) did not pay heed to any orders of the supreme council and decided on his own to take over the Jamaat," said Maulana Idris of Shamli.
Well known Islamic university Darul Uloom Deoband, the seat of Sunni Deoband movement, is also not happy with Maulana Saad's style of functioning including his teachings for the past three years. Darul Uloom went to the extent of issuing a fatwa against Maulana Saad for his controversial interpretation of verses of holy Quran. Some leading Maulanas of the Sunni sect also seem to be unhappy with Maulana Saad's provocative statements. In a leaked audio tape of Maulana Saad which went viral on social media recently, some portions of his speech are highly objectionable.
OUTLOOK THE NEWS SCROLL01 APRIL 2020 Last Updated at 11:42 PM | SOURCE: IANS
On March 13, two weeks after the group held a meeting in Malaysia that emerged as a source of hundreds of coronavirus cases across Southeast Asia, Tablighi Jamaats members gathered in New Delhi, including nearly 200 Indonesians and Malaysians, according to two top Tablighi leaders interviewed by Reuters.
WORLD NEWSAPRIL 3, 2020 / 4:43 AM / 5 DAYS AGO
ఈ సదస్సు ముగిసిన తరువాత విదేశీయులు భారతదేశములోని వివిధ ముఖ్యమగు అంటే ముస్లిం జనాభా ఉన్న ప్రాంతములకు వెళ్లి సమావేశములు ఏర్పరచి పాల్గొన్నారని భోగట్టా. ఈ సమావేశాములకు స్థానికులు ఎందఱో శ్రోతలుగా వచ్చినారట. వాస్తవానికి ఇది విసా చట్టమును అతిక్రమించడమే!
ఈ సభకు దిల్లీలో సమావేశమయిన వారిలో 6గురు తెలంగాణా వాసులు తమిళనాడు కర్నాటక, జమ్మూ కాశ్మీరు కు చెందిన ఒక్కొక్క వ్యక్తి ఈ సభలవల్ల కరోనాకు ఆహుతి కావడము జరిగినది.
ఈ దేశమునకు వచ్చిన 19 మంది విదేశీ ప్రతినిధులలో ఫిలిప్పీన్స్ కు చెందిన ఒక వ్యక్తి మరణించినట్లు Times of India పత్రికకు అందిన సమాచారము.
అదేసమయములో దిల్లీ లో బహిర్గతమైన కోవిద్-19 కి సంబంధించిన 25 మంది వ్యాదిగ్రస్తులలో 19 మంది ఈ నిజాముద్దీన్ సమావేశము వారే!
మార్చ్ 30, సోమవారము నాడు, తమిళనాడులో  కొత్తగా బయటపడిన ఉదంతములు 38. ఆ రాష్ట్రము నుండి వెళ్ళిన వ్యక్తుల సంఖ్య980.
దేశములోని వివిధ జనాభా ఎక్కువగల ముస్లిం ప్రాంతములలో తెలంగాణాలోని కరీం నగర్ ఒకటి. ఇండొనీషియ నుండి వచ్చిన బృందసభ్యునికి అక్కడ పరీక్ష చేయగా ఆతను కరోనా కౌగిట చేరియుండినాడు. ఇది మార్చ్ 14న జరిగిన ఉదంతము.
TIMES OF INDIA.COM Mar 31, 20200, 10.05 IST
ఢిల్లీ క్వారంటైన్ లో తబ్లికి జమాత్ సభ్యులు రెచ్చిపోయారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న క్వారంటైన్ కు వచ్చిన 167 మంది జమాత్ సభ్యులు డాక్టర్  లపై ఉమ్మివేస్తూ వారిని భయపెడుతున్నారు. నిన్నటి నుండి వారి ప్రవర్తన అలానే ఉంది. వారి ప్రవర్తన తో విసిగిపోయిన డాక్టర్లు మరియు  ఆస్పత్రి సిబ్బంది తమకు సెక్యూరిటీ కావాలని వేడుకుంటున్నారు.ఇక గాంధీలోను  ఢిల్లీ  ప్రార్థనలకు హాజరైన ఓ కరోనా పేషంట్   వైద్యులపై దాడి చేసాడు. అంతే కాకుండా అక్క ఫర్నిచర్ ను ధ్వంసం చేసాడు. దీంతో గాంధీలో కూడా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందిచించిన ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లపై సిబ్బంది పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.
By Umakanth Rao (TV9 తెలుగు)   Posted April 15, 2020  12:36 pm IST
నిజాముద్దీన్ మార్కాజ్ యొక్క అమిర్ మౌలానా సాద్ యొక్క ఫామ్ హౌస్ ఒక ప్యాలెస్ కంటే తక్కువ కాదు.
అల్లాహ్, ఖురాన్ మరియు హదీసులను ఇతరులకు తెలియజేసే సమూహం తబ్లిఘి జమాత్, దాని అతిపెద్ద మర్కజ్ నిజాముద్దీన్ . ఈ మార్కజ్ యొక్క ప్రధాన ప్రవక్త ధనవంతుడైన అమీర్ మౌలానా సాద్ కంధల్వి వార్తల్లో ఉన్నారు. దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుండి దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనా సోకిన వారి సంఖ్యను మూడు రెట్లు పెంచి, నిజాముద్దీన్ మర్కజ్ మరియు అమీర్ మౌలానా సాద్ లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఎఫ్ఐఆర్ జరిగింది, దిల్లీ క్రైమ్ బ్రాంచ్ మౌలానా సాద్ కోసం వెతుకుతోంది. కరోనాను ఓడించడానికి ప్రారంభించిన ప్రచారానికి ఇది కొత్త సవాళ్లను జోడించింది. మౌలానా సాద్‌తో చాలా వివాదాలు ఉన్నాయి. అతనికి దారుల్ ఉలూమ్ డియోబంద్‌తో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ, అతని మద్దతుదారులు కూడా తక్కువ కాదు. పరిస్థితి మరియు జమాత్ గురించి ప్రత్యేక నివేదిక ... మరింత చదవండి-
NTV వార్తలు
గతమార్చి 28 నుంచి మౌలానా పరారీలో ఉన్నాడు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులని కూడా పలు సందర్భాల్లో వార్తలు అందాయి. కాగా-తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తూ ఉన్నారు.
నిజాముద్దీన్ మర్కజ్, తబ్లీఘీ జమాత్, మౌలానా మొహమ్మద్ సాద్ లను గూర్చి పదుగురికి తెలియవలేనాను తలంపుతో నాకు తెలిసిన మేరకు మీముందు ఉంచినాను. ఇకపై జరిగే విషయముల పత్రికలూ దూరదర్శనులు. చరవానుల ద్వారా తెలుసుకొనగలరు. ప్రతి పాతకుడు మనసులో ఉంచుకోవలసిన విషయము ఏమిటంటే మీ ప్రక్కన కరోనా వైరస్; కన్నా భయంకరమైన నిలువెల్లా విషము కలిగిన దూర్తులు ఉన్నారు. జాగరూకత వహించండి. దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడండి.
ధర్మో రక్షతి రక్షితః

స్వస్తి.
Narasimha Reddy “Idam braahmyam idam kshathram” anna mata Bramhana veerulake varthisthundi kadandi, kavuna vare poradali; memantha venuka jayajaya dhvanalu chesukuntu vostham!
బ్రాహ్మణ వర్ణము సత్వగుణము అధికముగా కలిగియుంటుంది. అది రాను రానూ నియమనిష్ఠలలో శ్రద్ధ చూపకపోయినా, సత్వమును అలసత్వముగా అలవరచుకొన్నారు. నెత్తిన పిడుగు పడుతూ వున్నా నామీదకాదులే అన్న ఆలోచన వారిలో ప్రబలి పోయింది.
పై పెచ్చు వారిలో ఎవరికయినా ఒకవేళ జాగృతి కలిగితే వారు తప్పక మీవంటి సాహసవంతులను సమకూర్చుకోకుండా అడుగు ముందుకువేయలేరు. ఇది మన ధర్మమును నిలుపుకోనవలసిన ఒక యాగము. దీనికి చాతుర్వర్ణములూ సహకరించితేనే కార్యసిద్ధి కలుగుతుంది. కానీ ఆలోచన చెప్పుటకు వారు ముందువరుసలో ఉంటారు. ఎవరయినా  నిదుర లేపవలసి వచ్చినపుడు, నిదురపోయే వారిని లేపుతారు కానీ, ముందే మేల్కొన్నవారిని లేపరు.
ఇక రెడ్డి అన్న పదము రేనాటి రాజులనుండి వచ్చినది. రేనాటి రాజులు రాను రాను రట్టడులై రెడ్లు అన్న పేరు సంతరించుకొన్నది. ఆ మాటకొస్తే కాపులు (బలిజ) కమ్మ, వెలమ వారు కూడా రాజ్యాలు ఎలినవారే. అసలు రాయలసీమ ప్రాంతములో రెడ్లను కాపులు అనే అంటారు.
బ్రాహ్మణులను గూర్చి పైన చెప్పినదానికనా అతి ముఖ్యమయిన విషయము ‘బ్రాహ్మం’ అంటే బ్రాహ్మణ వర్ణము కాదు. బ్రహ్మత్వను పొందుట. ఆ విధముగా బ్రహ్మత్వము పొందినవారిలో  భక్త నందనుడు మాలవాడు, తిన్నడు చెంచు, కుంభారుడు కుమ్మరి, మొల్ల, సిరియాళుడు ఈ విధముగా ఎందఱో వివిధ వర్ణములవారు వున్నారు. నేను వాడిన ఆ శాస్త్రోక్తి అందరికీ సంబంధించినది కానీ, కుత్సితమైన మనస్సుతో వాడినది కాదు.
రాయి రాయి కలిస్తేనే కొండ తయారౌతుంది. ఇటుక ఇటుక కలిస్తేనే ఇల్లు తయారౌతుంది. మనిషి మనిషి కలిస్తేనే మన ధర్మం నిలుస్తుంది.
నేను నా రచనలలో ధర్మ పరిరక్షణను తప్పించి అన్యథా తెలుపను. అసలు నా మనసులోని  మాట  ప్రారంభములోనే ఉపోద్ఘాతముగా పద్యరూపములో తెలుపుకొన్నాను.

మరియొకసారి నేను తెలిపిన మాటను తప్పుగా తలువవద్దని తెలుపుచున్నాను.